1 ENS Live Breaking News

తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఆదివారం అర్ధరాత్రి వరకూ 81,700 మంది దర్శించుకున్నారు. హుండీ కాను కల ద్వారా రూ.4.20 కోట్లు వచ్చింది.27,982 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. సుదీర్ఘ లైనులో భక్తులు స్వామి దర్శ నాలు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతున్నది.  9 కంపార్ట్ మెంట్లలో స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirupati

2023-03-20 07:52:28

గిరిజను నిరసన కార్యక్రమంలో సాయుధ మావోయిస్టులు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా బస్తర్‌లో బస చేయడాన్ని నిరసిస్తూ గ్రామస్థులు పెద్ద ఎత్తున సభ నిర్వహించారు.  తీవ్ర నక్సల్స్ ప్రభావం ఉన్న సుక్మా జిల్లాలోని ఎట్రాజ్‌పాడ్ ప్రాంతంలో భారీ సమావేశాన్ని గ్రామస్తులు నిర్వహించారు. ఈ సమావేశానికి ముందు  గ్రామస్తులు ర్యాలీ పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. కాగా గిరిజనులు నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో అదే సంఖ్యలో సాయుధ మావోయిస్టులు కూడా పాల్గొన్నారు. సంఘటనా స్థలంలో  మావోయిస్టులు ఆటోమేటిక్ ఆయుధాలతో ఆయుధాలు ధరించిన దృశ్యాలు సమావేశానికి సంబంధించిన వీడియోలో కనిపిస్తున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా బస్తర్‌కు వలసలు , వైమానిక బాంబు దాడులను వ్యతిరేకిస్తూ పెద్ద సంఖ్యలో గ్రామస్తులు దిష్టిబొమ్మలను కూడా తగుల బెట్టారు. అక్కడి గిరిజనులు చేపట్టిన కార్యక్రమానికి మావోయిస్టుల సహకరించడం వలనే పెద్ద ఎత్తు నేరుగా గిరిజనులతో కలిసి పాల్గొన్నట్టు తెలిసింది. కాగా వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Chhattisgarh

2023-03-19 13:49:43

మార్చి 21, 22వ తేదీల్లో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమల శ్రీ‌వారి ఆలయంలో మార్చి 21న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మార్చి 22న ఉగాది ఆస్థానం నిర్వ‌హించ‌నున్నారు. ఈ సందర్భం గా మార్చి 21, 22వ తేదీల్లో విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాలను టిటిడి ర‌ద్ధు చేసింది.  ఉగాది పర్వదినాన్ని పురస్క‌రించుకొని మార్చి 22వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని టిటిడి రద్దు చేసింది. ఈ కారణంగా మార్చి 20, 21వ తేదీల్లో విఐపి బ్రేక్‌ దర్శనాల‌కు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. కావున  భక్తులు ఈ విషయాన్ని గమనించి  సహకరించాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.

Tirumala

2023-03-19 11:09:27

తిరుమల శ్రీవారి దర్శనానికి 36 గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని శనివారం అర్ధరాత్రి వరకూ 75,452 మంది దర్శించుకున్నారు. హుండీ కాను కల ద్వారా రూ.4.05 కోట్లు వచ్చింది. 39,262 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. సుదీర్ఘ లైనులో భక్తులు స్వామి దర్శనాలు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి 36 గంటల సమయం పడుతున్నది.  అన్ని కంపార్ట్ మెంట్లలో స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామి వారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-03-19 02:44:11

తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని శుక్రవారం అర్ధరాత్రి వరకూ 62,938 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.3.24 కోట్లు వచ్చింది. 30,751 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. సుదీర్ఘ లైనులో భక్తులు స్వామి దర్శనాలు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి 24  గంటల సమయం పడుతున్నది.  18కంపార్ట్ మెంట్లలో స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-03-18 05:52:26

తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని గురువారం అర్ధరాత్రి వరకూ 59,776 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.3.72 కోట్లు వచ్చింది. 24,349 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. సుదీర్ఘ లైనులో భక్తులు స్వామి దర్శ నాలు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి 24  గంటల సమయం పడుతున్నది.  19కంపార్ట్ మెంట్లలో స్వామివారి దర్శనం కోసం భక్తు లు వేచి ఉన్నారు. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-03-17 05:00:20

ఏప్రిల్ 6న తిరుమలలో తుంబురుతీర్థ ముక్కోటి

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి ఏడున్నర మైళ్ల దూరంలో వెలసివున్న శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం ఏప్రిల్ 6న జరుగనుంది.  పురాణప్రాశస్త్యం ప్రకారం తిరుమలలోని శేషగిరులలో 3 కోట్ల 50 లక్షల పుణ్యతీర్థాలు ఉన్నాయని ప్రతీతి. ఈ తీర్థాలలో ధర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్య, ముక్తిప్రదాలు కలిగించేవి 7 తీర్థాలు. అవి స్వామివారి పుష్కరిణి, కుమారధార, తుంబురు, రామకృష్ణ, ఆకాశగంగ, పాపవినా శనం మరియు పాండవ తీర్థాలు. ఈ తీర్థాలలో ఆయా పుణ్యఘడియల్లో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగి ముక్తి సమకూరుతుందని పురాణ వైశిష్ట్యం.

ఫాల్గుణ మాసంలో ఉత్తరఫల్గుణీ నక్షత్రంతో కూడిన పౌర్ణమినాడు తుంబురు తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. ఈ పర్వదినాన తీర్థస్నానమాచరించి, దానధర్మాలు చేసి స్వామివారిని భక్తులు దర్శించుకుంటారు. ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే తుంబురు తీర్థ ముక్కోటిని దర్శించి, స్నానమాచరించడం ఒక ప్రత్యేక అనుభూతిగా భావిస్తారు. ఈ ముక్కోటిలో టిటిడి అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.

Tirumala

2023-03-16 11:36:27

తిరుమల శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని బుధవారం అర్ధరాత్రి వరకూ 63,535 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.3.96 కోట్లు వచ్చింది. 24,349 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. సుదీర్ఘ లైనులో భక్తులు స్వామి దర్శ నాలు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి 8  గంటల సమయం పడుతున్నది. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగు తున్నాయి. వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-03-16 01:44:32

లాకప్​రూముల్లో సీసీ కెమెరాలు పెట్టండి..సుప్రీం

పోలీస్​ స్టేషన్లలోని ఇంటరాగేషన్, లాకప్​ రూముల్లో సీసీ కెమెరాలు పెట్టాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. సీబీఐ, ఎన్ఐఏ, ఈడీ వంటి విచారణ సంస్థల ఆఫీసుల్లోనూ సెక్యూరిటీ కెమెరాలు పెట్టాలని పేర్కొంది. కస్టడీలో నిందితులపై హింసను అరికట్టేందుకు సీసీ కెమెరాలతో పాటు ఆడియో రికార్డింగ్​ కూడా చేయాలని సూచించింది. దేశంలోని అన్ని పోలీస్​ స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్​ప్లేసులతో పాటు లాకప్​ రూములు, కారిడార్, స్టేషన్​ రిసెప్షన్​ ఏరియా, సబ్​ ఇన్​స్పెక్టర్, ఇన్​స్పెక్టర్​ రూమ్​లు, వాష్​ రూమ్​ బయట సీసీ  కెమెరాలను అమర్చాలంది. ఈ ఏర్పాట్లకు అవసరమైన నిధులు కేటాయించాలని, నిర్ణీత సమయంలోపల సీసీటీవీ కెమెరాలను అమర్చాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం ఆదేశించింది. 

ఈ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి యాక్షన్​ ప్లాన్​ను ఆరు వారాల్లోగా కోర్టుకు సమర్పించాలని పేర్కొంది. ఈ కెమెరాల్లో రికార్డైన పుటేజ్​ను, ఆడియో రికార్డింగ్​ను 18 నెలల పాటు జాగ్రత్త చేయాలని, అవసరమైతే కోర్టులకు ఎవిడెన్స్​గా అందజేయాలని పేర్కొంది. పోలీస్​ స్టేషన్లలో విచారణ సందర్భంగా మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా ఇండిపెండెంట్​ ప్యానెల్​తో తరచూ సీసీటీవీ ఫుటేజ్​ చెకింగ్​ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ప్రతీ జిల్లాలో హ్యూమన్​ రైట్స్​ కోర్టులను ఏర్పాటు చేయాలని ఆర్డర్​ వేసింది. పంజాబ్​లో జరిగిన కస్టోడియల్​ డెత్​కు సంబంధించిన కేసు విచారణలో సుప్రీం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇంటరాగేషన్​ ఏరియాలలో కెమెరాల ఏర్పాటుకు 2018లోనే ఆదేశాలు జారీ చేసినా.. ఇప్పటి వరకూ అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఏర్పాట్ల సంబంధించిన వివరాలను వచ్చే నెల 27న పరిశీలిస్తామని కోర్టు తెలిపింది.

New Delhi

2023-03-14 09:13:50

ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ 1875 ఓట్ల రిజిస్ట్రేషన్

ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ద్వారా 1875 గ్రాడ్యుయేట్లతో ఓట్లను ఉచితంగా ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేయించింది. పట్టభద్రుల ఓటింగ్ శాతం పెరగాలనే సామాజికసేవా దృక్పదంతో ఈసేవను చేపట్టింది. రెండు కంప్యూటర్లు, ఒక ఇంటర్నెట్ డివైజ్, ఇద్దరు ఆపరేటర్లను విని యోగించి ఈఉచిత సేవచేసింది. ఓట్లు వెతుక్కోవడానికి ఇబ్బంది పడిన వారందరికీ 9490280270, 9390280270 నెంబర్ల ద్వారా ఓటును వెబ్ సైట్ లో వెతికి, వారికి పోలింగ్ స్టేషన్లు, బూత్ నెంబర్ల వివరాలను తెలియజేసింది. ఎన్నికల సంఘం వెబ్ సైట్ అడ్రస్ ను కూడా విశేషంగా ఈఎన్ఎస్ లైవ్ యాప్, www.enslive.net ద్వారా ప్రచారం చేసింది. ఈ విధానం ద్వారా సుమారు 4100 మందికి వారి యొక్క ఓట్లను ఎన్నికల సంఘం వెబ్ సైట్ ద్వారా వెతికి స్క్రీన్ షాట్ల రూపంలో పంపి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు తెలియజేయడంలో ప్రత్యేక భూమిక వహించి తనవంతు సేవను పట్టభద్రులకు విశేషంగా అందించింది.

vizag

2023-03-12 06:56:57

తిరుమల శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని మంగళవారం అర్ధరాత్రి వరకూ 59,392 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ. 4.14 కోట్లు వచ్చింది. 20,714 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. సుదీర్ఘ లైనులో భక్తులు స్వామి దర్శనాలు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి 12  గంటల సమయం పడుతున్నది. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-03-01 01:54:03

తిరుమల శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని సోమవారం అర్ధరాత్రి వరకూ 71,387 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ. 5.71 కోట్లు వచ్చింది. 24,701 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. సుదీర్ఘ లైనులో భక్తులు స్వామి దర్శ నాలు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి 18  గంటల సమయం పడుతున్నది. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసా గుతున్నాయి. భక్తులకు వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్న ట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-02-28 02:40:17