1 ENS Live Breaking News

ens liveలో ఇకపై పోటీపరీక్షల మెటీరియల్

భారతదేశపు తొలితెలుగు డిజిటల్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈరోజు న్యూస్ సర్వీస్ (ఈఎన్ఎస్).. ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు..!  అధికారిక మొబైల్ న్యూస్ యాప్ Ens Live అరచేతిలో విశ్వవార్తల సమాహారం.. మరియు www.enslive.net న్యూస్ వెబ్ సైట్ ద్వారా ఇకపై ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్ధుల కోసం స్టడీ మెటీరియల్, డైలీ కరెంట్ అఫైర్స్, ఎస్సే రైటింగ్స్ కి సంబంధించిన మెటీరియల్, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చేపట్టే సంక్షేమ ప్రభుత్వ పథకాలు, అధికారిక కార్యక్రమాలన్నీ ప్రతీరోజూ అందించాలని సంకల్పించాం. దాని కోసం సబ్జెక్టుల వారీగా మెటీరియల్ ను నిరుద్యోగ యువత కోసం ఉచితంగానే మీ ముందుకి తీసుకువస్తున్నాం. ఈ సదుపాయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవడానికి Google Play Store నుంచి ens live యాప్ ని డౌన్ లోడ్ చేసుకోవడమే. అలా యాప్ ని డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా మీరు ఎప్పుడైనా..ఎక్కడైనా ఏ ప్రాంతంలోనైనా మేము అందించే ఉచిత పోటీపరీక్షల మెటీరియల్ ను తెలుసుకోవడానికి, చూసి నోట్సు రాసుకోవడానికి ఎంతో భాగా ఉపయోగపడుతుంది.

సివిల్ సర్వీస్(యూపీఎస్సీ), గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 మరియు ఇతర అన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన సమస్త సమాచారంతోపాటు, పరీక్షల సరళి, మార్పులు, చేర్పులు, సిలబస్, గతంలో ఏ విధంగా పేవర్లు వచ్చాయి..ఈ సారి ఏవిధంగా పేపర్లు రాబోతున్నాయి.. తదితర అంశాలను కూడా ఎప్పటికప్పుడు మీ ముందుకి తీసురాబోతున్నాం. తెలుగు రాష్ట్రాల్లోని యువత అత్యధిక సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈ ఉచిత స్టడీమెటీరియల్ సదుపాయాన్ని పేద, మధ్య తరగతి నిరుద్యోగ యువత కోసం తీసుకువస్తున్నాం. మీరు మీ మొబైల్ లో ఎన్నో రకాల యాప్స్ వినియోగించే కంటే మీకు పనిచేసే మంచి యాప్స్ ని మొబైల్స్ లలో ఇనిస్టాల్ చేసుకోవడం ద్వారా మీ బంగారు భవిష్యత్తుకు మీరే బాటలు వేసుకోవడానికి ఆస్కారం వుంటుంది. అంతేకాకుండా తాజా వార్తలు, జాబ్ నోటిఫికేషన్లును కూడా తెలుసుకోవడానికి వీలుపడుతుంది. నిరుద్యోగ అభ్యర్ధుల కోసం ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అందిస్తున్న ఈ ఉచిత స్టడీ మెటీరియల్ సదుపాయాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం..ఆల్ ది బెస్ట్..!


New Delhi

2022-09-02 03:09:31

ఆంధ్రప్రదేశ్ కి రూ.948.35 కోట్లు విడుదల

కేంద్రప్రభుత్వం 15వ ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు ఆంధ్రప్రదేశ్ కు రూ.948.35 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులు నేరుగా గ్రామపంచాయతీల ఖాతాలకు వెళ్లనున్నాయి. పంచాయతీల్లో త్రాగునీరు, పారిశుధ్యం,  ఇతర అభివ్రుద్ధి పనుల నిమిత్తం ఈ నిధులను వినియోగించనున్నారు. గతంలో రాష్ట్రప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే నిధులను ఆయా పనులకు వినియోగించేది. ఇటీవలే కేంద్రం అన్ని గ్రామ పంచాయతీలకు ప్రత్యేక బ్యాంకు ఖాతాలు తెరవాలని ఆదేశాలు జారీ చేయడంతో కేంద్రం నుంచి వచ్చే నిధులన్నీ నేరుగా పంచాయతీల ఖాతాల్లోకే రానున్నాయి. వాటిని పంచాయతీ బోర్డు సభ్యులు తీర్మానించి గ్రామాల్లో మౌళిక సదుపాయాలకు ఖర్చు చేస్తారు. చాలా కాలం తరువాత కేంద్రం నుంచి నిధులు విడుదల కావడంతో ఇటు రాష్ట్రవ్యాప్తంగా వున్న అన్ని గ్రామపంచాయతీల సర్పంచ్ లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకూ పంచాయతీల్లో ఏ కార్యక్రమం చేపట్టాలన్నా సర్పంచ్ లచేతి నుంచే డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తున్నది. ఈ నిధులు రాకతో మళ్లీ పంచాయతీల్లో పనలు అభివ్రుద్ధి పనులు ప్రారంభం కానున్నాయి.

న్యూఢిల్లీ

2022-09-01 13:06:44

రైల్వే ప్రయాణీకులపై జిఎస్టీ బాదుడు

భారతీయ రైల్వే ప్రయాణీకుల పై వీర బాదుడు బాదటానికి సిద్ధమైపోయింది. ఇకపై ప్రయాణించే రైల్వే టిక్కెట్టు రద్దు చేసుకుంటే రైల్వేరద్దు ఛార్జీలతోపాటు దానిపై జిఎస్టీ కూడా వసూలు చేయనుంది. ఈ మేరకు భారతీయ రైల్వే ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు అదేరోజు నుంచి అమల్లోకి వస్తాయని కూడా పేర్కొంది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ వ్యవహారం మరింత ఖరీదుగా మారి ప్రయాణీకులకు భారంగా పరిణమించనుంది. ఎందుకంటే రద్దు చేసుకున్నందుకు చెల్లించే రుసుముపై ఇకపై అదనంగా ‘వస్తు సేవల పన్ను (GST)’ కూడా కట్టాల్సి రావడంతో ప్రయాణీకులు ఖచ్చితంగా ప్రయాణం చేసుకోవాల్సి వుంటుంది. అత్యవసర సమయంలో రద్దు చేసుకుంటే ఆ మొత్తం తిరిగి పొందే పరిస్థితి లేకుండా పోయినట్టు అయ్యింది. అంతే కాకుండా రైలు టికెట్లతో పాటు హోటల్‌ బుకింగ్‌లను రద్దు చేసుకున్నా బుకింగ్ చేసిన దానిపై జీఎస్‌టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇక సెకండ్‌ క్లాస్‌ స్లీపర్‌ టికెట్‌ను రద్దు చేసుకుంటే మాత్రం ఎలాంటి జీఎస్‌టీ ఉండదని కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

New Delhi

2022-08-29 15:25:37

ens న్యూస్ ఏజెన్సీకి ఫ్రీలాన్సర్లు కావలెను

భారతదేశపు తొలితెలుగు డిజిటల్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈరోజు న్యూస్ సర్వీస్ (ఈఎన్ఎస్).. ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు..!  అధికారిక మొబైల్ న్యూస్ యాప్ EnsLive అరచేతిలో విశ్వవార్తల సమాహారం.. మరియు www.enslive.net న్యూస్ వెబ్ సైట్, త్వరలో రానున్న దినపత్రికకు ఫ్రీలాన్స్ జర్నలిస్టులు, ఫ్రీలాన్స్ ఫోటో గ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు కావలెను, అభ్యర్ధులు కనీసం డిగ్రీ చదివి ఉండి.. అన్ని రకాల అంశాలను ఫ్రీలాన్స్ ఆర్టికల్స్, ఎడిట్ పేజి ఆర్టికల్స్ రూపంలోనూ, ఆకర్షణీమైన ఫోటోలు, వీడియోలు తీయడంలోనూ, ప్రత్యేక కధనాలు రాయడంలో అనుభవం ఉండాలి. అభ్యర్ధులు కనీసం డిగ్రీ పాసై ఉండాలి..జర్నలిజం చదివి, గతంలో మీడియాలో పనిచేసిన వారికి  ప్రాధాన్యత ఇవ్వబడును.  ఆశక్తి ఉన్నవారు 9490280270, 9390280270లో వెంటనే సంప్రదించగలరు. ఎంపికైన వారికి గుర్తింపు కార్డు, ఆకర్షణమైన జీతం ఇవ్వబడును.

New Delhi

2022-08-29 05:11:53

ens న్యూస్ ఏజెన్సీ ద్వారా తాజా వార్తలు

భారతదేశపు తొలితెలుగు డిజిటల్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈరోజు న్యూస్ సర్వీస్ (ఈఎన్ఎస్)..ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు..! ఇపుడు మీడియాకి తాజా వార్తలు, మొబైల్ యాప్స్ కి  వార్తలు,ఫోటోలు, యూట్యూబ్ ఛానళ్లకు వీడియోలు, న్యూస్ వెబ్ సైట్లకు తక్కువ ధరకే న్యూస్ ఆర్టికల్స్ అందిస్తోంది. ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ద్వారా అనకాపల్లి నుంచి అమెరికా వరకూ అన్ని రకాల వార్తలు, ఫోటోలు, వీడియో మీరు చందాదారులుగా చేరడం ద్వారా పొందవచ్చు. చిన్న, మధ్య తరహా పత్రికలకు ప్రత్యేక రాయితీ కూడా ఇస్తున్నాం. తక్షణమే ఈఎన్ఎస్ ని సంప్రదించి మీకు కావాల్సిన వార్తలు చక్కనైన న్యూస్ ఫార్మాట్ లో పొందగలరు. మరిన్నివివరాలకు 9490280270, 9390280270లో సంప్రదించగలరు.

New Delhi

2022-08-27 08:08:37

గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి

నోడల్ గోశాలల నిర్వాహకులు తమ పరిధిలోని ఇతర గోశాలలను తరచూ సందర్శిస్తూ  రైతులు గో ఆధారిత వ్యవసాయం చేసేలా ప్రోత్సహించాలని టీటీడీ జెఈవో  వీరబ్రహ్మం పిలుపు నిచ్చారు.  టీటీడీ ఆధ్వర్యం లోని  ఎస్వీ  గోసంరక్షణ శాల ఆధ్వర్యంలో శ్వేతా లో నిర్వహించిన రెండు రోజుల శిక్షణా కార్యక్రమం శుక్రవారం సాయంత్రం ముగిసింది. ఈ సందర్బంగా వీర బ్రహ్మం నోడల్ గోశాలల నిర్వాహకులనుద్దేశించి మాట్లాడారు.  నోడల్  గో శాలలు  గో ఆధారిత పంచగవ్య ఉత్పత్తుల తయారీ మీద దృష్టి పెట్టాలని చెప్పారు. టీటీడీ పాలక మండలి చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఈవో  ఎవి ధర్మారెడ్డి  గో సంరక్షణ , గోశాలల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. గో ఆధారిత పంట ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.  గోవుల పోషణ ఇబ్బందిగా ఉన్న గోశాలల్లోని గోవులను టీటీడీ  గోశాలకు తరలించి , గో ఆధారిత వ్యవసాయం చేసే రైతులకు ఉచితంగా అందించేలా  కృషి చేయాలన్నారు . నోడల్ గోశాలల నిర్వాహకులతో ప్రతి నెల నేరుగా గానీ వర్చువల్ గా కానీ సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కార మార్గాలు ఆలోచిస్తామని  వీరబ్రహ్మం చెప్పారు.  పలువురు నోడల్ గోశాలల నిర్వాహకులు వారి సలహాలు సూచనలు సమస్యల గురించి మాట్లాడారు .  అనంతరం వీరికి  ఆయుర్వేద మందుల కిట్లు అందజేశారు. శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ కమిటీ సభ్యులు  రామ్ సునీల్ రెడ్డి , గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథ రెడ్డి  శ్వేతా డైరెక్టర్  ప్రశాంతి , పశువైద్య విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ వెంకట నాయుడు పాల్గొన్నారు. 

Tirupati

2022-08-26 16:31:50

శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా 1342 ఆల‌యాల నిర్మాణం

 శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా సనాతన హైంద‌వ‌ ధర్మ వ్యాప్తి, మత మార్పిడులను అరికట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మ‌రో 1342 ఆల‌యాలు నిర్మించేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా సమరసత సేవా ఫౌండేషన్‌తో ఒప్పందం చేసుకున్న‌ట్లు టీటీడీ ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుప‌తి శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి భ‌వ‌నంలోని స‌మావేశ మందిరంలో గురువారం సమరసత సేవా ఫౌండేషన్ తో ఎంవోయు చేసుకున్నారు.ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ , శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా సమరసత సేవా ఫౌండేషన్‌ సహకారంతో మొదటి విడతలో రూ.25 కోట్లతో రాష్ట్రంలో టీటీడీ 502 ఆలయాలు నిర్మించింద‌న్నారు. టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు మరో 1342 ఆలయాల నిర్మాణం కోసం సర్వే చేసి వివరాలు అందించడం జరిగింద‌ని చెప్పారు. 1342 ఆలయాల్లో మొదటగా 120 ఆలయాలను నిర్మించ‌నున్న‌ట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆలయాల జాబితా, స్థల సేకరణ, ఆలయ కమిటీ ఏర్పాటు చేయడం పూర్తయింద‌న్నారు.

      పురాత‌న హిందూ దేవాల‌యాలు, శిథిల‌మైపోతున్న‌ ఆల‌యాలను పునః నిర్మించ‌డం, ఆధునీక‌రించ‌డం కోసం శ్రీవాణి ట్రస్ట్‌ను టీటీడీ 2019వ సంవత్సరం ఏర్పాటు చేసిన‌ట్లు తెలియ‌జేశారు. ఇప్పటివరకు శ్రీవాణి ట్ర‌స్టుకు రూ.500 కోట్ల‌కు పైగా విరాళాలు అందాయ‌న్నారు. శ్రీవాణి ట్రస్టు విరాళాల ద్వారా ఆల‌యాల్లో అవ‌స‌ర‌మైన మ‌ర‌మ్మ‌త్తులు, ధూప దీప నైవేద్యాల‌కు ఆర్థిక స‌హాయం అందిస్తున్నామ‌న్నారు. సెప్టెంబరు 3వ తేదీన జరిగే శ్రీవాణి ట్రస్ట్ సమావేశంలో ఆల‌యాల నిర్మాణంపై విధివిధానాల రూపొందిస్తామ‌న్నారు.

       అనంతరం సమరసత సేవా ఫౌండేషన్ చైర్మన్  తాళ్ళూరు విష్ణు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 1342 ఆల‌యాలు నిర్మించేందుకు టీటీడీతో ఒప్పందం చేసుకున్నామ‌న్నారు. ఆరు నెల‌ల కాలంలో ఈ ఆల‌యాల నిర్మాణం పూర్తి చేయ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారు తమ సంస్థ ద్వారా ఆలయాలు నిర్మించే అవకాశం కల్పించడం తమ పూర్వజన్మ సుకృతమని అన్నారు.  ఈ స‌మావేశంలో టీటీడీ జేఈవో  వీర బ్రహ్మం, సమరసత సేవా ఫౌండేషన్ ప్ర‌తినిధి   త్రినాథ్ పాల్గొన్నారు.  

Tirumala

2022-08-25 12:31:28

శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల అక్టోబ‌రు నెల‌కు సంబంధించిన కోటాను ఆగ‌స్టు 24న బుధ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. అదేవిధంగా, అక్టోబ‌రు నెల‌కు సంబంధించి మ‌రికొన్ని ఆర్జిత‌సేవా టికెట్లకు ఆన్‌లైన్ ల‌క్కీడిప్ న‌మోదు ప్ర‌క్రియ ఆగ‌స్టు 24న మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు మొద‌ల‌వుతుంది. కాగా, అక్టోబ‌రు నెల‌కు సంబంధించి వ‌ర్చువ‌ల్ సేవ‌లైన క‌ల్యాణోత్స‌వం, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, స‌హ‌స్ర‌దీపాలంకార సేవా టికెట్ల కోటా, వాటికి సంబంధించిన ద‌ర్శ‌న టికెట్ల కోటా ఆగ‌స్టు 24న సాయంత్రం 4 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుద‌ల కానుంది. భ‌క్తులు ఈ విష‌యాల‌ను గుర్తించి శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల‌ను బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.

Tirumala

2022-08-22 13:25:17

జూ.ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీకి లైన్ క్లియర్..?

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కుతోంది. ఇప్పటి వరకూ రాజకీయం అంటే అధికార వైఎస్సార్సీపీ, అటు తెలంగాణలో టీఆర్ఎస్ ఇటు ప్రతిపక్ష హోదా లేకపోయినా టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ లే అనుకున్నారు అంతా.. అయితే అది కొంత కాలమేనని కొత్త తరం రాజకీయాల్లోకి వస్తే ఆ పరిస్థితులు బాగా మారిపోతాయని.. దానికోసం జాతీయ పార్టీలకు చెందిన మంత్రులు వేసే ఎత్తుగడలు, కలయికలు రాజకీయంలో వేడిని మరింతగా రాజేస్తారనే విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ తో కేంద్రమంత్రి అమిత్ షా బేటీతో తెరపైకి వచ్చింది. తెలంగాణాలో బీజేపీ తరపున పార్టీ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన అమిత్ షా.. జూనియర్ ఎన్టీఆర్ డిన్నర్ మీట్ కి ఆహ్వానించడం..దానికి మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భాగస్వామ్యం కావడం ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త ఊహాగానాలకు తెరలేపినట్టు అయ్యింది. అమిత్ షా లాంటి కేంద్ర మంత్రి నేరుగా జూనియర్ ఎన్టీఆర్ ను కలవడం, త్రిపులార్ సినిమాలో కొమరం భీమ్ పాత్ర విషయంలో ఒదిగి యాక్టింగ్ చేసిన ఎన్టీఆర్ ను అభినందించడానికేనని చెప్పినా.. తెలుగు రాష్ట్రాల్లో వీరి కలయిక మాత్రం ఒక పెద్ద రాజకీయ చర్చకే దారి తీసిందనే విషయం ఇపుడు వైరల్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇపుడున్న రాజకీయపార్టీల్లోని నేతల కంటే భిన్నంగా కొత్త రక్తాన్ని, యువతరాన్ని తీసుకురావడం ద్వారా రాజకీయాలను ప్రభావితం చేయడం ప్రారంభించారనే ఊహాగానాలకు ఆద్యం పోసినట్టు అయ్యింది. అయితే అమిత్ షాను కలిసిన ఎన్టీఆర్ మాత్రం తన త్రిపులార్ సినిమా విషయంలోనే కలిసి మాట్లాడినట్టుగా చెప్పుకొచ్చారు. చూడాలి అమిత్ షా..జూనియర్ ఎన్టీఆర్ కలయికపై ఎలాంటి ఊహాగానాలు, రాజకీయాలు మొదలై జూ.ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ విషయంలో ఏం జరుగుతుందనేది..!

Hyderabad

2022-08-21 18:26:15

శ్రీవారి సేవలో కర్ణాటక సిఎం,మాజీ సిఎం


కర్ణాటక  ముఖ్యమంత్రి  బసవరాజ్  బొమ్మై , మాజీ  ముఖ్యమంత్రి  యద్యూరప్ప శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం ఎదుట  టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి , ఉప ముఖ్యమంత్రి  నారాయణ స్వామి వీరికి  స్వాగతం పలికారు . స్వామివారి దర్శనం అనంతరం. రంగనాయకుల మండపంలో  పండితులు వేద ఆశీర్వచనం చేశారు . అనంతరం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. సిఎం , మాజీ  సిఎం లకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించారు . టీటీడీ ఈవో   ఎ వి ధర్మారెడ్డి , సీవీఎస్వో   నరసింహ కిషోర్ ,ఆలయ డిప్యూటీ  ఈవో  రమేష్ బాబు పాల్గొన్నారు. 
శ్రీవారి  దర్శనం అనంతరం  తిరుమలలో  టీటీడీ నిర్మిస్తున్న కర్ణాటక సత్రాల భవనాల నిర్మాణం పనులను కర్ణాటక ముఖ్యమంత్రి ,మాజీ ముఖ్యమంత్రి పరిశీలించారు . ఈ సందర్బంగా టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ , కళ్యాణమండపం , మొదటి బ్లాక్ నిర్మాణాలను జనవరి ఆఖరుకు పూర్తి చేసి కర్ణాటక ప్రభుత్వానికి అప్పగిస్తామని తెలిపారు . ఇందుకోసం  కర్ణాటక ప్రభుత్వం టీటీడీ కి  రూ 200 కోట్లు చెల్లించిందన్నారు. టీటీడీ బోర్డు సభ్యులు  విశ్వనాథ రెడ్డి , కర్ణాటక దేవదాయ శాఖ కమిషనర్ కుమారి రోహిణి సింధూరి , టీటీడీ చీఫ్ ఇంజినీర్  నాగేశ్వరరావు , ఎస్ ఈ  జగదీశ్వర్ రెడ్డి , ఈ ఈ  జగన్మోహన్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.

Tirumala

2022-08-19 11:01:46

అక్టోబర్ నెల దర్శన టికెట్ల కోటా విడుదల

అక్టోబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఆగస్టు 18న ఉదయం 9 గంటలకు టిటిడి ఆన్‌లైన్లో విడుదల చేయనుంది.  అయితే, వార్షిక బ్రహ్మోత్సవాలలో సర్వదర్శనం మాత్రమే ఉంటుందని టిటిడి ముందుగా ప్రకటించినట్లుగా, అక్టోబర్‌లో బ్రహ్మోత్సవం తేదీల్లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.  భక్తులు ఈ విషయాన్ని గమనించి తదనుగుణంగా తమ దర్శనాన్ని బుక్ చేసుకోవాల్సిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు మీడియాకి విడుదల చేసిన ప్రకటన ద్వారా కోరుతున్నారు.

Tirumala

2022-08-16 15:08:58

IASల విషయంలో కేంద్రం సంచలన నిర్ణయం

భారతదేశంలో ప్రజలకు సత్వర పరిపాలన..ప్రజలకు సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలు కావాలంటే పరిపాలనా వ్యవస్థలో సీనియర్ ఐఏఎస్ ల పాత్ర చాలా కీలకం.  దానిని గుర్తించిన బీజేపీ ప్రభుత్వం ఇపుడు సరికొత్తగా ఆలోచన చేసింది. అదే సమయంలో ఐఏఎస్ ల కొరతను కూడా అధిగ మించడానికి కార్యాచరణ మొదలు పెట్టింది. దానికోసం కేంద్ర ప్రభుత్వంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో పనిచేస్తున్న ఐఏఎస్ లకు పదోన్నతి అడిషనల్ జాయింట్ సెక్రటరీ గా ఇవ్వాలని నిర్ణయించింది. తద్వారా దేశంలోని అన్ని కేంద్రప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లోనూ సెక్రటరీతోపాటు, అడిషనల్ జాయింట్ సెక్రటరీ పోస్టు కూడా వచ్చి చేరబోతుంది. ఈ విధంగా ఐఏఎస్ లకు పదోన్నతి కల్పించడం ద్వారా ప్రజలకు పరిపాలన, ప్రభుత్వ పథకాల అమలు, కేంద్ర లక్ష్యాన్ని అనుకున్న సమయానికి పూర్తిచేయాలనే సంకల్పం కూడా వుంది. కేంద్ర ప్రభుత్వంలో జాయింట్ సెక్రటరీ స్థాయి పదవులకు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారులను ఎంపిక చేసే విధానంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పెద్ద మార్పు చేసింది. 2 సంవత్సరాలు డైరెక్టర్ లేదా డిప్యూటీ సెక్రటరీగా పనిచేసిన ఐఏఎస్ అధికారి మాత్రమే జాయింట్ సెక్రటరీగా ఉండేలా ప్రభుత్వం తన ఎంప్యానెల్‌మెంట్ విధానాన్ని సవరించింది.


దేశంలో ఐఏఎస్ ల కొరత చాలా తీవ్రం..
భారతదేశంలో ప్రస్తుతం మంజూరైన ఐఏఎస్ పోస్టులు 6,789 మంది. కానీ ప్రస్తుతం వున్న ఐఏఎస్ అధికారులు 5317 మంది అంటే ఇంకా కావాల్సిన ఐఏఎస్ అధికారులు 1472 మంది. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు ఉండగా, 26 చోట్ల ఇండియన్ అడ్మిస్ట్రేటివ్ సర్వీసు(ఐఏఎస్)ల కొరత తీవ్రంగా వుంది. అదే సమయంలో కేంద్రంలోనూ ఐఏఎస్ ల కొరత వుంది. ప్రస్తుతం ఏటా కేంద్రప్రభుత్వం 2012 నుంచి 180 మంది ఐఏఎస్ అధికారులను డైరెక్టుగా నియమిస్తోంది. అయినప్పటికీ ఖాళీల కొరత తీవ్రంగా వుంది. 1455 మందిని స్టేట్ సివిల్ సర్వీస్ ద్వారా పదోన్నతులు కల్పించినా..ఖళీలు మాత్రం మిగిలిపోతూనే ఉన్నాయి. తద్వారా దేశ వ్యాప్తంగా పరిపాలన,సేవల్లో జాప్యం ఏర్పడుతుంది. కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల్లోని పనులు పూర్తికావాలన్నా, విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా ఖాళీగా ఉండిపోయిన 1472 ఐఏఎస్ పోస్టులు భర్తీకావాల్సి వుంది.

పదోన్నతినితో పరిపాలన సులువు..
సీనియర్ ఐఏఎస్ లకు అడిషనల్ జాయింట్ సెక్రటరీలుగా పదోన్నతి కల్పించడం ద్వారా పరిపాలన గాడిలోపడుతుంది. సేవల్లో ఎలాంటి అంతరాయం లేకుండా ప్రభుత్వ పథకాలు అమలు కావడానికి ఆస్కారం వుంటుంది. అంతేకాకుండా కేంద్రంలోని అన్ని మంత్రిత్వ శాఖలకు ఎంతమందిని అడిషనల్ జాయింట్ సెక్రటరీలుగా పదోన్నతులు కల్పిస్తే..అంతే మొత్తంలో నూతన ఐఏఎస్ ల నియామకం, స్టేట్ సివిల్ సర్వీస్ నుంచి పదోన్నతులు కల్పించి ఖాళీలను భర్తీ చేయడానికి ఆస్కారం వుంటుంది. ఇంతకుముందు, అధికారులు తమ రాష్ట్ర కేడర్ నుండి నేరుగా వచ్చి కేంద్ర ప్రభుత్వంలో జాయింట్ సెక్రటరీలుగా పనిచేసే వారు. కానీ కేంద్రంలోని జాయింట్ సెక్రటరీ స్థాయిలో ఎంప్యానెల్‌మెంట్ కోసం సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్ కింద డిప్యూటీ సెక్రటరీ/డైరెక్టర్ స్థాయిలో 2 సంవత్సరాల కంటే తక్కువ అనుభవం ఉండకూడదని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. తద్వారా 2007 బ్యాచ్ ఐఏఎస్ లకు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వర్తించనుంది.  కానీ ఐఏఎస్ అధికారుల నుంచి మిశ్రమ స్పందన మాత్రమే వస్తోంది.

ఖాళీగా ఐఏఎస్ ల భర్తీకి ప్రత్యేక చర్యలు
దేశంలో ఖాళీగా వున్న ఐఏఎస్ అధికారుల ఖాళీలను భర్తీ చేయడానికి  యూపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయడంతో పాటు వివిధ రాష్ట్రాల సివిల్ సర్వీస్ ద్వారా పదోన్నతులు కల్పించి ఉన్నఖాళీలను నింపాలని కేంద్రం నిర్ణయించింది. దానికోసం ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లోని స్టేట్ సివిల్స్ ద్వారా కొంత మందిని భర్తీచేసింది. మిగిలిన వాటిని డైరెక్టగా తీసుకోవాలని భావిస్తుంది ఇప్పటి వరకూ ఏడాదికి 180 ఐఏఎస్ అధికారును నింపుతున్న కేంద్రం ఇపుడు ఆ సంఖ్య 200 నుంచి 225కి పెంచాలని కూడా యోచిస్తున్నది. అదే జరిగితే సివిల్స్ కి ప్రిపేర్ అయ్యేవారికి కూడా మంచి రోజులు వస్తాయనే చెప్పవచ్చు. ఏది ఏమైనా కేంద్రం అడిషల్ జాయింట్ సెక్రటరీ పదోన్నతి కల్పించడానికి మొదలు పెట్టిన కార్యాచరణ ద్వారా అనేక లాభాలు వచ్చే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి.

న్యూఢిల్లీ

2022-08-05 07:21:57

గవర్నర్ ను కలిసిన నాకటక అకాడమీ మెంబర్

కేంద్ర సంగీత నాటక అకాడమి సభ్యురాలు  సోమవారం విజయవాడ రాజ్ భవన్ లో  ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిస్వ భూషణ్ హరిచందన్ ను కలిశారు. ఎస్పీ భారతి వాసవి కన్యకాపరమేశ్వరి చరితను దేశ నలుమూలల ప్రదర్శిస్తున్న నాట్య గురువు డాక్టర్ ఎస్పీ భారతి తాజాగా కేంద్ర సంగీత నాటక అకాడమి సభ్యురాలిగా ఎంపికయ్యారు. ఈ  సందర్భంగా సోమవారం ఆంధ్ర ప్రదేశ్  గవర్నర్ బిస్వ భూషణ్ హరిచందన్ ను కలిశారు.  ఈ సందర్భంగా ఆమె రాసిన పలు పుస్తకాలను గవర్నర్ బిస్వ భూషణ్ కు బహుకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ సమీపంలోని ఆచంట, తల్లిదండ్రులు శనగవరపు వెంకట సూర్యనారాయణ, వెంకటసుబ్బలక్ష్మి, తొమ్మిదేళ్ల ప్రాయం నుంచి సుమారు12 ఏళ్ల పాటు చింతారామమూర్తి వద్ద కూచిపూడి నృత్యాన్ని  అభ్యసించారు.  90 నిమిషాల నిడివి కలిగిన వాసవి నృత్య రూపకాన్ని పలు వేదికలపై ప్రదర్శిస్తూ కూచిపూడిలో ఎంఏతో పాటు ఎంపిల్, పీహెచీ పట్టా పొందారు.  కూచిపూడిలోని సిద్ధేంద్ర కళాక్షేత్రం తెలుగు విశ్వవిద్యాలయంలో అధ్యాపకురాలిగా పనిచేశారు. సుమారు 20 అంతర్జాతీయ సెమినార్లకు హాజరవడంతో పాటు తెలుగు విశ్వవిద్యాలయం సంగీత, నృత్య కళాశాలకు చీఫ్ ఎగ్జామినర్ గానూ  బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు మూడు వేల ప్రదర్శనలిచ్చారు. వందల సంఖ్యలో అవార్డులు, సత్కారాలు పొందారు. 2010లో అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య చేతుల మీదుగా ఉగాది పురస్కారంతో పాటు  2014లో తెలుగు అకాడమీ ద్వారా జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. "లేపాక్షి పెయింటింగ్స్ యాస్ ఏ సోర్సు ఆఫ్టూరిజం ఎట్రాక్షన్ ఇన్ ఏపీ" అనే ఆంగ్ల పుస్తకాన్ని, 'జ్యోతిర్మయం-ప్రణయ కావ్యం" అనే తెలుగు పుస్తకాన్ని రచించారు. కేంద్ర సంగీత నాటక అకాడమి సభ్యురాలిగా నియమితులు కావడంతో పలు సాంస్కృతిక సంస్థల  ఆధ్వర్యంలో ఇటీవల  సత్కారాలు  అందుకున్నారు.

Vijayawada

2022-08-01 14:49:56

ఆ సమయంలో ఆర్జిత సేవలన్నీ రద్దు

తిరుమల శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాల రోజుల్లో ఎక్కువ మంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌కు ప్ర‌త్యేక ద‌ర్శ‌నం, త‌దిత‌ర ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు ఈఓ ఏవీ.ధర్మారెడ్డి తెలియజేశారు. ఈ మేరకు బ్రహ్మోత్సవాలపై అధికారులతో సమీక్షా సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బ్రహ్మోత్సవాల్లో కేవలం స‌ర్వ‌దర్శనం మాత్రమే ఉంటుందని, రూ.300/- దర్శన టికెట్ల‌తోపాటు శ్రీవాణి ట్ర‌స్టు దాత‌ల‌కు, ఇత‌ర ట్ర‌స్టుల దాతలకు ద‌ర్శ‌న‌ టికెట్లు రద్దు చేశామ‌ని, ఆర్జిత సేవలు కూడా రద్దు చేశామ‌ని వివ‌రించారు. స్వ‌యంగా వ‌చ్చే ప్రొటోకాల్ విఐపిల‌కు మాత్ర‌మే బ్రేక్ ద‌ర్శ‌నం ఉంటుంద‌న్నారు. భక్తుల రద్దీకి తగ్గట్టు లడ్డూలు బ‌ఫ‌ర్ స్టాక్ ఉంచుకుంటామ‌న్నారు. భ‌ద్ర‌త ప‌రంగా భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసుల స‌మ‌న్వ‌యంతో బందోబ‌స్తు, ట్రాఫిక్ నియంత్ర‌ణ ఏర్పాట్లు చేప‌డ‌తామ‌ని ఈవో వెల్ల‌డించారు. రెండు రోజుల క్రితం టిటిడి సివిఎస్వో  న‌ర‌సింహ కిషోర్‌, తిరుప‌తి ఎస్పీ  ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి సంయుక్తంగా మాడ వీధుల్లో త‌నిఖీలు నిర్వ‌హించి చేప‌ట్టాల్సిన భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై చ‌ర్చించార‌ని చెప్పారు. భ‌ద్ర‌త అవ‌స‌రాల కోసం పోలీసు అధికారులు అడిగిన మేర‌కు మౌలిక స‌దుపాయాలు క‌ల్పిస్తామ‌న్నారు. 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామ‌ని, అన్ని ముఖ్య‌మైన ప్రాంతాల్లో సిసి కెమెరాల నిఘా ఉంటుంద‌ని చెప్పారు.

Tirumala

2022-07-28 10:43:20