1 ENS Live Breaking News

శ్రీవారి ఆర్జిత సేవల రిఫండ్ అవకాశం..

లాక్‌డౌన్ కార‌ణంగా మార్చి 13 నుండి జూన్ 30వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్(tirupatibalaji.ap.gov.in) ద్వారాగానీ, పోస్టాఫీసు, ఇ-ద‌ర్శ‌న్ మరియు ఎపి ఆన్ లైన్ కౌంట‌ర్ల ద్వారా గానీ శ్రీ‌వారి ఆర్జిత సేవ‌లు, రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్లు, వ‌స‌తి గదులను బుక్ చేసుకున్న భ‌క్తులు వాటిని రద్దు చేసుకుంటే ఆ మొత్తాన్ని రీఫండ్ పొందేందుకు డిసెంబరు 31వ తేదీ వరకు టిటిడి మరో అవకాశం కల్పించింది. ఈ మేర‌కు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న భక్తులకు వాటిని ఆన్‌లైన్‌లోనే రద్దు చేసుకునే అవకాశం కల్పించారు. పోస్టాఫీసు, ఈ-దర్శన్ కౌంటర్లు మరియు ఎపి ఆన్ లైన్ కౌంట‌ర్ల ద్వారా బుక్ చేసుకున్న భ‌క్తులు సంబంధిత టికెట్ వివ‌రాల‌తోపాటు, బ్యాంకు ఖాతా నంబ‌రు, ఐఎఫ్ఎస్‌సి కోడ్ వివ‌రాల‌ను excel టెక్ట్స్ లో‌ టైపు చేసి  refunddesk_1@tirumala.org మెయిల్ ఐడికి పంపాల‌ని టిటిడి కోరుతోంది. మెయిల్ వివ‌రాల ఖ‌చ్చిత‌త్వాన్ని ప‌రిశీలించిన అనంత‌రం రీఫండ్ మొత్తాన్ని నేరుగా భ‌క్తుల ఖాతాల్లోకి జ‌మ చేస్తారు. టికెట్లు రద్దు చేసుకుని రీఫండ్ పొందడానికి ఇష్టపడని భక్తులు డిసెంబరు 31వ తేదీలోపు వారికి అనువైన తేదీల్లో ఆ టికెట్లు చూపి శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. ఈ రెండు అవకాశాల్లో ఒకదాన్ని భక్తులు వినియోగించుకోవాలని టిటిడి కోరుతోంది.

Tirumala

2020-10-28 19:08:33

2020-10-28 16:53:52

నవంబరు 3నుంచి 6వ విడత పారాయణం..

కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై నవంబరు 3వ తేదీ మంగళవారం  6వ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయణం నిర్వహించనున్నారు. ఉద‌యం 7 గంటల నుంచి సుందరకాండలోని 20వ సర్గ నుంచి 24వ సర్గ వరకు ఉన్న 185 శ్లోకాలను పారాయణం చేస్తారు.  తిరుమల ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం, తిరుప‌తిలోని వేద విశ్వవిద్యాలయం, సంస్కృత విశ్వవిద్యాలయం, వేదపారాయణదారులతో పాటు సుమారు 200 మంది ఈ అఖండ పారాయ‌ణంలో పాల్గొంటారు. శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది. ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా శ్రీ‌వారి భ‌క్తులు త‌మ ఇళ్ల‌లోనే ఈ పారాయ‌ణంలో పాల్గొని స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని టిటిడి కోరుతుంది. కోవిడ్ ను ద్రుష్టిలో ఉంచుకునే, ఈ కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేసినట్టుగా కూడా టిటిడి పేర్కొంది. తిరుమలలో నిర్వహించే ఈ పారాయణంకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది..

Tirumala

2020-10-28 16:01:47

మళ్లీ మిగిలిపోనున్న ఆపోస్టులు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామసచివాలయ వ్యవస్థలో రెండు విభాగాల్లో పోస్టులు ఆది నుంచి భర్తీకాకుండా అలా మిగిలిపోతున్నాయి. రెండోవసారి సచివాలయ ఉద్యోగాల కోసం నిర్వహించిన ఉద్యోగ ప్రవేశ పరీక్షలో కూడా సెరీకల్చర్, యానిమల్ హజ్బంజడరీ సహాయకుల పోస్టులు మిగిలిపోయే పరిస్థితి కనిపిసోస్తోంది. దానికి కారణం ఆ విద్య చదివిన వారు తక్కువ గా ఉండటమే. తొలుత తీసిన ఉద్యోగాలు అత్యంత తక్కువగా మార్కులు వచ్చినప్పటికీ ఆ ఉద్యోగాలను భర్తీచేసిన ప్రభుత్వం ఈ సారి భర్తీచేయకపోవచ్చునని చెబుతున్నారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో అయితే ఏకంగా  ఆ ఉద్యోగాలకు దరఖాస్తులు కూడా రాకపోవడం విశేషం. వాస్తవానికి గ్రామస్థాయిలో పశుసంవర్ధక సహాయకుల పోస్టులు భర్తీచేయడం వలన చాలా ఉపయోగాలు, సేవలు ప్రజలకు అందుతాయి. కానీ ఆ చదువు చదివిన వారు తక్కువగా ఉండం వలన ఆపోస్టులు భర్తీకావడం లేదు. కొన్ని ఫిషరీష్ అసిస్టెంట్ పోస్టులు కూడా భర్తీ కాకపోవడం విశేషం. ఈ సారి గ్రామసచివాలయాల ఉద్యోగాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్షల్లో ర్యాంకింగ్ విధానం ప్రవేశ పెట్టడంతో ఎంత మంది ఉద్యోగాలొస్తాయో తెలియని పరిస్తితి నెలకొంది. అదే జరిగితే ర్యాకుంలో మార్కులు తక్కువ వచ్చిన వారికి వేలల్లో వస్తాయి...అనుకున్నట్టుగా ఆ శాఖల సిబ్బంది భర్తీ కాకపోవచ్చునని అధికారులు భావిస్తున్నారు..

Amaravati

2020-10-28 15:26:36

ఎన్ఎంసీ ద్రుష్టికి గీతం భూ దురాక్రమణలు..

విశాఖలోని గీతం టుబీ డీమ్డ్ యూనివర్శిటీ ప్రభుత్వానికి చెందిన 43.50 ఎకరాల భూమిని అక్రమంగా ఖబ్జాచేసి అందులో కొంతభాగంలో మెడికల్ కాలేజీ, ఆసుప త్రులు, అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మించిన విషయం ఇపుడు నేషనల్ మెడికల్ కమిషన్ ద్రుష్టికి వెళ్లినట్టు సమాచారం. వాస్తవంగా దేశవ్యాప్తంగా నేషనల్ మెడికల్ కమిషన్ మెడికల్ కాలేజీలు, మెడికల్ యూనివర్శిటీలకు కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అనుసరించి అనుమతులు, సీట్ల కేటాయింపు చేస్తుంటుంది. అలాంటి గీతం టుబీ డీమ్డ్ యూనివర్శిటీతోపాటు మెడికల్ కాలేజీ భూములన్నీ సక్రమం కాదు, అక్రమమని తెలిస్తే మెడికల్ కాలేజి గుర్తింపు రద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు నేరుగా రాష్ట్రప్రభుత్వమే కొలతలు వేసి, నోటీసులు కూడా ఇచ్చి ఈ ప్రభుత్వ భూమి గీతం ఆక్రమించిందని నోటిఫై చేసిన తరువాత ఈ విషయం మరింత ముదిరి పాకాన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గీతం విషయంలో సిబిఐకి ఫిర్యాలు వెళ్లడం, కోర్టు నుంచి ఉత్తర్వులు తేవడం వంటి విషయాలు గీతంను చక్రబంధం చేసేటట్టు కనిపిస్తున్నాయి. అక్రమాల గీతంలో భూ ఆక్రమణల విషయం రాష్ట్రంలో హాట్ టాపిక్ అవుతుతున్న తరుణంలో గీతం మెడికల్ కాలేజీ గుర్తింపును రద్దు చేయాలంటూ ఎన్ఎంసీకి ఫిర్యాదులు వెళ్లినట్టు ప్రచారం జరుగుతుంది. అదీ ప్రభుత్వంలోని పెద్దలు ఈ ఫిర్యాదులు చేసివుంటే...ఖచ్చితంగా నేషనల్ మెడికల్ కమిషన్ విచారణ చేపట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. అలా గీతంపై ఎన్ఎంసీ విచారణ చేస్తే...గతంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆంధ్రా మెడికల్ కాలేజీ విషయంలోనే సదుపాయాలు, వసతి సక్రమంగా లేవని సీట్లలో కోత విధించిన ఎన్ఎంసీ, ఇపుడు ఏకంగా గీతం పూర్తి అక్రమ భూ కబ్జా మెడికల్ కాలేజీ అని తేలితే ఖచ్చితంగా చర్యలు తీవ్రంగా వుంటాయని తెలుస్తుంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి..

గీతం విద్యాసంస్థలు

2020-10-27 18:06:00

జనవరి నాటికి పూర్తిస్థాయిలో సచివాలయ సిబ్బంది..

గ్రామసచివాలయాల్లో కొలువుల కోసం వేచిస్తున్నవారికి శుభవార్త. ఇటీవల నిర్వహించిన గ్రామసచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల ఫలితాలను సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, ప్రజలకు ఇంటి వద్దే సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో మిగిలిన 16208 ఉద్యోగాలను నేటి ఫలితాలతో భర్తీచేయనున్నామని అన్నారు.  అభ్యర్ధుల ఫలితాలు, వచ్చిన మార్కులు ఆధారంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్, తరువాత అపాయింట్ ప్రక్రియ మొదలవుతుందని అంతా కలిపి రెండు నెలల్లో ఈ ప్రక్రియ ముగించి వచ్చే జనవరి నాటికి పూర్తిస్థాయిలో సచివాలయాల్లో సిబ్బందిని భర్తీ చేస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. 13 శాఖల్లో మిగిలిపోయిన 16,208 పోస్టుల భర్తీకి గాను గత నెల 20 నుంచి 26వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. 19 రకాల పోస్టుల కోసం 14 రకాల పరీక్షలు జరిపారు. దాదాపు 7.69 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుయ్యారు. రికార్డు సమయంలో ఓఎంఆర్‌ సమాధాన పత్రాలను స్కాన్‌ చేశారు. 7,68,965 మంది అభ్యర్థుల ఓఎంఆర్‌ సమాధాన పత్రాలను గత నెల 21 నుంచి 27వ తేదీ వరకు అధికారులు స్కాన్‌ చేశారు. ఆ ఫలితాలను ఆ రంగంలో నిష్ణాతులైన గణాంకాల బృందం (స్టాటిస్టికల్‌ టీమ్‌) ద్వారా మరోసారి పరిశీలించి.. నేడు తుది ఫలితాలను విడుదల చేశారు అభ్యర్ధుల హాల్ టిక్కెట్ల ఆధారంగా వారికి వచ్చిన మార్కులను సరిచూసుకోవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , పంచాయితీరాజ్, మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

సీఎం క్యాంపు ఆఫీస్

2020-10-27 17:09:16

2020-10-27 16:57:24

జర్నలిస్టులూ డిసెంబరు వరకూ జాగ్రత్త..

కరోనా వైరస్ రెండవ దశ విజ్రుంభించే ప్రమాదం ఉన్నందున రాష్ట్రవ్యాప్తంగా వున్న జర్నలిస్టులు వచ్చే రెండు నెలల పాటు అత్యంత జాగ్రత్తగా ఉండాలని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు కోరారు. విశాఖలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)చేసిన హెచ్చరికల నేపథ్యంలో జర్నలిస్టులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తొలుతు 45 రోజుల్లో కరోనా వైరస్ నీరసిస్తుందని భావించినా దాని ప్రభావం ఇపుడే అధికంగా కనిపిస్తుందని ప్రభుత్వం హెచ్చరించిందన్నారు. వైద్యులు, పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని హెచ్చరిస్తున్న తరుణంలో జర్నలిస్టులు తగు జాగ్రత్తలు వహించాలన్నారు. విధినిర్వహణలో బయటకు వెళ్లే ప్రతీ జర్నలిస్టూ విధిగా మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ లాక్ 5.0 నిబంధనలు సులభరతరం చేసినా, వార్తా సేకరణలో మాత్రం జర్నలిస్టులు మరో నెల రోజులు ముఖ్యమైన వాటికి మాత్రమే బయటకు రావాలన్నారు. మీమీద ఆధారపడి కుటుంబాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తించాలని గంట్ల శ్రీనుబాబు గుర్తు చేశారు.

Visakhapatnam

2020-10-27 15:55:55

50.47 లక్షల రైతులు..రూ. 1,115 కోట్ల సహాయం..

వైయస్ఆర్ రైతుభరోసా 2వ విడత సాయాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమవారతిలోని తన కార్యాలయంలో మంగళవారం ప్రారంభించారు.  50.47 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 1,115 కోట్ల నగదును కంప్యూటర్ లో నొక్కి బదిలీ చేశారు. తొలిసారిగా ఖరీఫ్‌లో నష్టపోయిన 1.66 లక్షల మంది రైతులకు ఖరీఫ్ లోనే ఇన్‌పుట్ సబ్సిడీ రూ. 135.7 కోట్లు చెల్లిస్తున్నామని పేర్కొన్న సీఎం వైఎస్ జగన్ లక్ష మంది గిరిజన రైతులకు రూ. 11,500 చొప్పున రూ.104 కోట్ల పెట్టుబడి సాయం అందిస్తున్నామని చెప్పారు. రబీ సీజన్‌కు గాను భూ యజమానులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులకు, దేవాదాయ, అటవీ భూములు సాగు చేసుకుంటున్న (ROFR) రైతులకూ రైతు భరోసా సాయం అందుతుందని తెలిపారు. తమ ప్రభుత్వం రైతుల పక్షాన ఉందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముందని, రైతులను సాయమందించడం గర్వంగా ఉందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ 90శాతం నెరవేర్చామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎస్ నీలం సాహ్నితోపాటు వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శిలు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Velagapudi

2020-10-27 15:19:45

2020-10-27 15:09:24

2020-10-27 14:51:19

నవంబరులో శ్రీవారికి విశేష ఉత్సవాలు..

తిరుమలలో నవంబరులో విశేష ఉత్సవాలు శ్రీవారికి జరపనున్నారు. వరుసగా నవంబరు 14 నుంచి 29వరకూ స్వామివారికి జరిపే ఉత్సవాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కోవిడ్ ను ద్రుష్టిలో ఉంచుకొని అన్నిఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీవారి విశేష ఉత్స‌వాలు కోసం తెలుసుకుంటే.. న‌వంబ‌రు 14న దీపావ‌ళి ఆస్థానం,  న‌వంబ‌రు 18న నాగుల చ‌వితి,  నవంబర్ 20న పుష్పయాగానికి అంకురార్పణ,  నవంబరు 21న తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవం,  నవంబరు 25న స్మార్త ఏకాదశి, - నవంబరు 26న మధ్వ ఏకాదశి, క్షీరాబ్ది ద్వాద‌శి, చాతుర్మాస వ్ర‌త స‌మాప్తి, చ‌క్ర‌తీర్థ ముక్కోటి,  నవంబరు 27న కైశిక ద్వాదశి ఆస్థానం,  నవంబరు 29న కార్తీక దీపం, తిరుమంగై ఆళ్వార్ శాత్తుమొర‌ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఒక్కో కార్యక్రమానికి సంబంధించిన రోజువారీ షెడ్యూల్ ను ముందుగానే అధికారులు ప్రకటించారు. ఆయా తేదీల వారీగా స్వామివారికి విశేష ఉత్సవాలు జరపనున్నామని తిరుమల జెఈఓ వివరించారు.

Tirumala

2020-10-27 14:10:49

స్టీల్ ప్లాంట్ పనులు మరింత ముమ్మరం చేయాలి..

డా.వైఎస్సార్ కడప జిల్లాలోని స్టీల్‌ప్లాంట్‌ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఈ మేరకు ఏపీఐఐసి, పరిశ్రమల శాఖ అధికారులు, మంత్రులు, చైర్మన్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ, కరువు పీడిత ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ది, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా స్టీల్‌ప్లాంట్‌ను తీసుకొస్తున్నామని, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పనులు ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.     కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి 7 ప్రఖ్యాత కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని.. వాటితో జరిపిన సంప్రదింపుల పురోగతిని సీఎంకు వివరించారు.  స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణంపై ఆయా కంపెనీల ప్రతిపాదనలు స్వీకరించి తదుపరి ఒక సంస్థను ఎంపిక చేయాలని సీఎం ఆదేశించారు. అందుకు కనీసం ఏడు వారాల సమయం పడుతుందని అధికారులు తెలియజేశారు. ఆ ప్రక్రియ పూర్తి కాగానే తదుపరి 3-4 వారాల్లో పనులు ప్రారంభిస్తామన్నారు. కంపెనీల ప్రతిపాదనల స్వీకరణకు ముందు ప్రభుత్వ పరంగా ఏమైనా పనులు మిగిలిఉంటే వాటిని నాలుగైదు రోజుల్లో పూర్తి చేయాలన్నారు. అనంతరం కడప నగరానికి సమీపంలో కొప్పర్తి వద్ద ఏర్పాటవుతున్న ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌పై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. క్లస్టర్‌ ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించారు. 300 కోట్ల రూపాయల పెట్టుబడితో ఉద్యోగాల కల్పనకు డిక్సన్‌ కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసిందని అధికారులు సీఎంకి వివరించారు. ఆ పెట్టుబడి మరింత పెంచే అవకాశం ఉందని తెలిపారు. డిక్సన్‌తో పాటు మరిన్ని కంపెనీలు కూడా పెట్టుబడికి సిద్ధంగా ఉన్నాయన్నారు. పెట్టుబడులను ఆకర్షించేలా చక్కటి ప్రమాణాలతో కొప్పర్తి ఈఎంసీని తీర్చిదిద్దాలని సీఎం జగన్‌ ఆదేశించారు. కొప్పర్తి ఈఎంసీ ద్వారా 30వేల మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, ఇండస్ట్రియల్‌ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవన్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Velagapudi

2020-10-26 21:20:41