కరోనా లక్షణాలయిన తీవ్ర జ్వరం, జలుబు, దగ్గు, శ్వాస సంబంధ ఇబ్బందులు ఉన్న వారు మాత్రమే కరోనా పరీక్షలకు వెళ్లాలని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. దీని మూలంగా తీవ్ర వ్యాధి తో బాధపడుతున్న రోగుల అందరికీ తక్షణ వైద్యం అందుతుందన్నారు. సోమవారం వుడా చిల్డ్రన్స్ ఎరీనా లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైద్యులు పోలీసులు ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు బాధ్యతతో పాటు మానవతా దృక్పథంతో ప్రజలకు సేవలు అందిస్తున్నారని అభినందించారు. కరోనా ని కట్టడి చేయాలంటే ముఖ్యంగా ప్రజల అందరికీ అవగాహన కల్పించాలన్నారు. ప్రతివారు మాస్కు, శానిటేషన్, సామాజిక దూరం తప్పక పాటించాలన్నారు. రానున్న కాలంలో కరోనా తీవ్రతను అంచనా వేస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నామన్నారు. కరోనా లక్షణాలతో ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి వారికి వెంటనే తగిన చికిత్స అందించినట్లయితే మరణాలు తగ్గించవచ్చు అన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి సహకారంతో జిల్లాలో ఖాళీగా ఉన్న వైద్యాధికారుల పోస్టుల భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ప్రతి పౌరునికి సకాలంలో సరిఅయిన చికిత్స అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కరోనా చికిత్స కొరకు రోజుకు రూ. 5 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. విశాఖ నగరంలో ప్రతి వార్డు లోనూ టెస్టులు చేసేందుకు ఏర్పాటు చేశామని, గ్రామీణ ప్రాంతంలో పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. వార్డులలో మండలాలలో వైద్యులు అధికారులు తో కూడిన కమిటీ రోగి పరిస్థితిని బట్టి తక్షణ చర్యలు తీసుకుంటుందన్నారు.
జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ మాట్లాడుతూ కరోనా పాజిటివ్ వచ్చిన రోగులను ఐసోలేషన్ లో ఉంచి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. లక్షణాలు లేని వారిని హోమ్ కారం టైంలోనే ఉంచి చికిత్స అందజేస్తున్నారని, వారిని ప్రతిరోజు ఏఎన్ఎం పరీక్ష చేస్తారని చెప్పారు. జిల్లాలో ఆక్సిజన్ కు ఎటువంటి కొరత లేదని ఎన్ఆర్ఐ, గీతం ఆసుపత్రులలో 30 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకులను ఏర్పాటు చేశామన్నారు. అవసరాలకు వాడే ఆక్సిజన్ కూడా మెడికల్ ఆక్సిజన్ గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఐసోలేషన్ లో ప్రస్తుతం 4411 పడకలు ఉన్నాయని వీటిని ఏడు వేలకు పెంచుతున్నట్లు చెప్పారు., జిల్లాలో 22 జిల్లా కోవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నామని, ఇవి 'ఏ' కేటగిరి ఆసుపత్రుల ని చెప్పారు. వీటిలో ఎనిమిది ప్రభుత్వ ఆసుపత్రులు కాగా 14 ప్రైవేటు ఆసుపత్రులని, ఇవి పూర్తిగా కోవిడ్ కే కేటాయిస్తున్నట్లు తెలిపారు. మరో 17 కోవిడ్ నాన్ కోవిడ్ ఆసుపత్రి లను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. జివి ఎం సి పరిధిలోని 74 వార్డులలో ప్రత్యేక కోవిడ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి వార్డు లో అంబులెన్స్ తో పాటు మూడు ప్రత్యేక వాహనాలు కూడా ఉంటాయన్నారు. అవసరమైతే ఆర్టీసీ బస్సులను కూడా ఉపయోగిస్తారని చెప్పారు. గ్రామీణ ప్రాంతంలో 89 పీహెచ్సీలో కూడా ఆధునిక వైద్య పరికరాలను అందుబాటులో ఉంచామని, తీవ్ర కోవిడ్ లక్షణాలు ఉన్న వారిని ఆసుపత్రులకు పంపించేందుకు ఆర్డిఓ తాసిల్దారు ఎండివోలతో కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. కేజీహెచ్లో అంకాలజీ విభాగాన్ని 500 పడకలతో పూర్తిగా కరోనా రోగుల కొరకు రూ.4 కోట్లతో ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. ఆర్ సి డి ఆసుపత్రి రీజనల్ కంటి ఆస్పత్రి ఈ ఎన్ టి ఆసుపత్రి మెంటల్ కేర్ ఆసుపత్రిలో సైకాలజీ విభాగాలలో కరోనా పరీక్షలు నిర్వహిస్తారని, అయితే పూర్తి లక్షణాలు ఉన్నా వారికి మాత్రమే రెండవ సారి నిర్వహిస్తారని తెలిపారు. కరోనా బారిన పడిన తమ వారి సమాచారం తెలుసుకునేందుకు హెల్త్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఐసోలేషన్ కోరంటైన్ లలో ఉన్న వారికి నాణ్యమైన ఆహారం అందించేందుకు ప్రతి సెంటర్కు ఒక కాంట్రాక్టర్ ని ఏర్పాటు చేశామని చెప్పారు. త్వరలో డిజిటల్ ఎక్స్ రే సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో పార్లమెంటు సభ్యురాలు బి వి సత్యవతి, పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, జీవీఎంసీ కమిషనర్ జి సృజన, జాయింట్ కలెక్టర్ పి.అరుణ్ బాబు కరణం ధర్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.
విశాఖపట్నం జిల్లాలో కోవిడ్ 19 కేసులు పెరుగుతున్న సందర్భంగా, వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి గాను జిల్లాలోని బ్యాంకుల యూనియన్ రిప్రెజెంటషన్ పరిశీలించిన పిదప, జిల్లాలోని అన్ని బ్యాంకుల బిజినెస్ కార్యకలాపాలు ఉ. 9 నుండి మ. 1. వరకు మరియు ఆఫీసు పని వేళలు మధ్యాహ్నం 1 నుండి 2 వరకు నిర్ణయిస్తూ జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని ఆగష్టు 31 వరకు గాని లేదా తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఇవే పనివేళలు కొనసాగుతాయి. బ్యాంకు సేవలకు అనుగుణంగా ప్రజలు తమ అవసరాలు చూసుకోవాలన్నారు. అవసరం ఉంటే తప్పా ఎవరూ బయటకు రాకూడదన్నారు. ప్రతీఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా ధరించడంతోపాటు, తరచుగా సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు. చిన్నపిల్లలు, ముసలి వారికి వ్యాధి నిరోధక శక్తి తగ్గకుండా బలవర్ధక ఆహారాన్ని అందించాలని కలెక్టర్ సూచించారు.
రాష్ట్రంలో ప్రతి పౌరునికి మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. కోవిడ్-19 పై విఎంఆర్డిఎ చిల్ట్రన్స్ ఎరీనాలో ఏర్పాటుచేసిన టాస్క్ ఫోర్స్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాబోయే రోజుల్లో కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగే అవకాశం ఉన్నందు వలన ఆసుపత్రుల్లో పడకల సంఖ్య మరిన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్-19 తో సీరియస్ గా ఉన్న వారి ప్రాణాలను ముందుగా కాపాడడానికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలని వైద్యులను కోరారు. మరణాల రేటును తగ్గించేందుకు కృషిచేయాలని పేర్కొన్నారు. వైద్య సిబ్బందిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. పాజిటివ్ కేసులు తరలించేందుకు ఏ విధమైన సమస్యలు లేకుండా చూడాలన్నారు. ఆంబులెన్స్ లు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు ఒక లక్షా 32 కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా ఇప్పటి వరకు 7390 పాజిటివ్ కేసులు వచ్చాయని చెప్పారు. చిన్న చిన్న లక్షణాలు ఉన్న వారికి, ఏ లక్షణాలు కనిపించకుండా పాజిటివ్ ఉన్నవారిని హోం ఐసోలేషన్ లో ఉంచుతున్నట్లు ఆయన వివరించారు. కోవిడ్-19 తీవ్రంగా ఉన్నవారిని ఆసుపత్రులకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. 22 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను కోవిడ్-19 సేవలకు ఏర్పాటు చేయడమైనదని, ఇందులో ప్రభుత్వ ఆసుపత్రులు 8, ప్రైవేట్ ఆసుపత్రులు 14 ఉన్నాయని, ఈ ఆసుపత్రుల్లో 7 వేల పడకలు సిద్దం చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం వైద్యులు, సిబ్బంది కొరతగా ఉందని, ఈ కొరతను తీర్చడానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) నుండి వైద్యులతో ఇప్పటికే మాట్లాడడమైనదని, వారు విధులలో చేరేందుకు సుమఖం వ్యక్తం చేసినట్లు చెప్పారు. కోవిడ్ లక్షణాలు లేకుండా పరీక్షలు చేయించుకోవద్దని, అలా చేయించుకోవాలనుకొనే వారు ప్రైవేట్ ల్యాబ్స్ లో చేయించుకోవాలని, అందులో పరీక్షకు రూ.750/-లని చెప్పారు. జివియంసి పరిధిలోని వార్డుల్లో ప్రత్యేక అధికారులు, వైద్యులను నియమించడమైనదని, జివియంసి (వార్డుల్లో) పరిధిలో ఆంబులెన్స్ లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతంలో ఆంబులెన్స్ లు, 104 వాహనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. డిజిటల్ ఎక్స్ రే లు వస్తున్నాయని చెప్పారు. అనకాపల్లి పార్లమెంటు సభ్యులు బి.వి. సత్యవతి మాట్లాడుతూ పరీక్షలు చేసే కెపాసిటి పెంచాలని తెలిపారు. నగర పోలీసు కమీషనర్ రాజీవ్ కుమార్ మీనా, జివియంసి కమీషనర్ జి. సృజన, తదితరులు మాట్లాడారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు, విఎంఆర్డిఎ అదనపు కమీషనర్ మునజీర్ జిలానీ సమూన్, డి.సి.పి. ఐశ్వర్య రస్తోగి, జిల్లా జాయింట్ కలెక్ట్-3 గోవిందరావు, ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా. పి.వి. సుధాకర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు.
శంఖవరం లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే వస్తున్నాయి. సోమవారం గ్రామసచివాలయ ఉద్యోగినికి తాజాగా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. పరీక్ష చేసిన వారం రోజుల తర్వాత రిజల్ట్ రావడంతో ఈ లోపుగా ఎంతమందికి దగ్గరికి సదరు ఉద్యోగిని విధి నిర్వహణ నిమిత్తం ఉవెళ్ళారో అని గ్రామస్తులు, సిబ్బంది భయాందోళన చెందుతున్నారు. ఇపుడు సదరు ఉద్యోగిని ప్రైమరీ కాంటాక్ట్ లను గుర్తిస్తున్నారు. వెంటనే సచివాలయ ప్రాంతాన్ని శానిటేషన్ చేశారు. దీనితో సచివాలయంలో ఇద్దరికి కరోనా సోకినట్టు అయ్యింది. అందులో మరొకరు సానిటేషన్ విభాగంలో పనిచేసే వ్యక్తి కావడం విశేషం. దీంతో శంఖవరం గ్రామంలోనే 24 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు అయ్యింది. పాజిటివ్ వచ్చిన వారి ప్రైమరీ కాంటాక్ట్ వారికి పరీక్షలు, ఫలితాలు ఆలస్యం కావడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది..
అన్నవరంలో సోమవారం మరో 7గురుకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. బిసికాలనీలో ఇద్దరికీ, చలమయ్య నగర్ లో ఇద్దరికి, మరో ఇద్దరు నాయీ బ్రాహ్మణులకి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. బిసి కాలనీకి చెందిన ఒక వ్రత పురోహితుడు, ఆయన కోడలికి కరోనా సోకింది. దీంతో ఈ ప్రాంత వాసులంతా ఆందోళన చెందుతున్నారు. తక్షణమే ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా మార్చి ప్రత్యేక శానిటేషన్ పనులు చెపడుతున్నట్టు కార్యదర్శి శ్రీనివాసరావు చెప్పారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రజలు అత్యవసర పనులకు తప్పా మిగిలిన పనులకు బయటకు రాకూడదని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా రెడ్ జోన్ పరిధిలో ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. లేదంటే కేసులు మరిన్ని పెరిగే ప్రమాదం ముంచుకొస్తుందని సచివాలయ అధికారులు హెచ్చరిస్తున్నారు.
పచ్చమీడియా చూపించే మోసపూరిత కధనాలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని విశాఖ మహానగర వైఎస్సార్సీపీ అధ్యక్షులు సీహెచ్ వంశీక్రిష్ణ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం మద్దెలపాలెం పార్టీ కార్యాయలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశాఖలో పరిపాలనా రాజధానిని ఏర్పాటును ప్రకటించిన దగ్గర నుంచి ప్రజలను తప్పుదోవపట్టించేందుకు పనిగట్టుకొని పచ్చమీడియా పనిచేస్తుందన్నారు. సీఎం వైఎస్ జగన్ కు ప్రజలు బ్రహ్మరధం పడుతుంటే దానిని ప్రజల్లో తప్పుగా చూపించే ప్రయత్నం చేయడమే టిడిపి, వారి అనుకూల మీడియా పనిచేస్తుందన్నారు. ఎన్నో ప్రక్రుతి వైపరిత్యాలు వచ్చినపుడు నోరు మెదపని భజన మీడియా ఇపుడు కరోనా వైరస్ సమయంలో మ్రుతులను సైతం బూతద్ధంలో చూపించే ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రజలు బుద్దిచెప్పినా కనీసం తెలుసుకోకపోవడం సిగ్గుచేటన్నారు.
శంఖవరం మండలంలో కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకూ గ్రామంలో 23 పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో ఇద్దరు మరణించారు. దీంతో పాజిటివ్ కేసులు వచ్చిన చోట రెడ్ జోన్లుగా ప్రకటించి అక్కడ సచివాలయ అధికారులు ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాలు చేపడుతున్నారు. కరోనా వైరస్ అధికంగా విస్తరిస్తున్నందున అత్యవసర సమయాల్లో తప్పా ఎవరూ బయటకు రాకూడదని శంఖవరం పీహెచ్సీ డాక్టర్ ఆర్వీవి సత్యన్నారాయణ తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకూ మండపంలో 4, శ్రుంగవరంలో 8, చామమవరంలో 1 కేసులు నమోదు అయ్యాయన్నారు. బయటకు వచ్చేవారు మాస్కును ఖచ్చితంగా వినియోగించాలని కోరుతున్నారు. అంతేకాకుండా తరచుగా చేతులు, కాళ్లూ సబ్బుతో కడుకొని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోవాలని, తరచుగా వేడినీరు కూడా సేవించాలని చెబుతున్నారు. ప్రజలు సహకరించకపోతే కేసులు మరిన్ని పెరిగే ప్రమాదముందని కూడా డాక్టర్ హెచ్చరిస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్న వేళ కూడా ప్రభుత్వ కార్యాలయాలు, వార్డు, గ్రామ సచివాలయాల్లో బయోమెట్రిక్ అటెండెన్సు విధానాన్ని కొనసాగిస్తున్నారు. కత్తిపూడి, బెండపూడి గ్రామసచివాలయాల్లోని సిబ్బందికి కరోనా సోకిన తరువాత కూడా బయోమెట్రిక్ విధాన్ని అమలు చేయడంపై జిల్లా అధికారుల పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రభుత్వ శాఖల్లో మాత్రం సాధారణ హాజరు మాత్రమే ఉద్యోగులకు నమోదు చేస్తున్నారు. దీంతో ఎప్పుడు ఎవరికి బయోమెట్రిక్ కారణంగా కరోనా ముప్పు వస్తుందోనని జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు భయపడుతున్నారు. వివిధజిల్లా శాఖల అధికారుల సమన్వయ లోపమే దీనికి కారణమని చెబుతున్నారు. అధికారుల ఆదేశాలతో తప్పక బయోమెట్రిక్ అటెండెన్సు వేస్తున్నామని సిబ్బంది చెబుతున్నారు.
పరవాడ ఫార్మా సిటీ లోని సాయినార్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో జూన్ 29 వ తేదీన జరిగిన హైడ్రోజన్ సల్ఫైట్ గ్యాస్ లీకేజీ ఘటన లో మరణించిన మహంతి గౌరీ శంకర్ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన ఎక్స్ గ్రేషియా రూ.15.00 లక్షల మొత్తానికి చెక్కు ను ఆయన భార్య కోట్ల వెంకట లక్ష్మి కి శనివారం నాడు తన నివాసంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అందజేశారు. అలాగే సాయినార్ కంపెనీ తరపున ఇస్తున్న ఎక్స్ గ్రేషియా రూ. 35.00 లక్షల మొత్తానికి సంబంధించి ఆయన భార్య కోట్ల వెంకట లక్ష్మి కి రూ. 10.00 లక్షల చెక్ ను, తండ్రి మహంతి లక్ష్ము నాయుడు కు రూ. 12.50 లక్షల చెక్ ను, తల్లి మహంతి అప్పల నరసింహ కు రూ. 12.50 చెక్ లను కూడా మంత్రి చేతుల మీదుగా అందజేశారు.
పచ్చ పత్రికలు భూకంపాలన్నా, డర్టీయెస్ట్ పొలిటీషియన్ దడపుట్టించాలనుకున్నా, ఎల్లో వైరస్ సునామీలు సృష్టించాలనుకున్నా ప్రజలకు సమాచారం రకరకాల సోర్సెస్ నుంచి అందుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ అన్నారు. శనివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సముద్రాన్ని అడ్డంపెట్టుకుని విషప్రచారం నడవదన్నారు. పైగా సముద్రం అంటే కోట్లాదిమందికి ఒక తల్లి, ప్రధాన ఆదాయవనరు అన్నారు. అదో అడ్వాంటేజ్ కూడా. 2004లో సునామీవచ్చి ప్రపంచ వ్యాప్తంగా రెండున్నర లక్షల మంది చనిపోయినప్పుడు సముద్రం ఒక్క అడుగైనా ముందుకు వచ్చిందా? అన్నారు. డాక్ యార్డ్ లోని ఒక్క నౌకైనా తల్లకిందులయ్యిందా?. పెట్టని కోటల్లాంటి కొండలు, సముద్రమట్టానికి నగరం ఎత్తుగా ఉంటే సునామీలు ఎలావస్తాయి అన్నారు. ఇప్పటికైనా విశాఖపై విషం చిమ్మే ఎల్లోమీడియాల వస్తవాలను తెలుసుకోవాలని రాజీవ్ సూచించారు.
మద్యం రహిత సమాజ నిర్మాణానికి సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం మేరకు, విశాఖ జిల్లా అధికారులు అందరూ దృఢ సంకల్పంతో ఉన్నామని తెలిపేరు. "నషా ముక్త్ భారత్" కి తగిన సహకారాలను అందిస్తామనీ, సంపూర్ణ మద్య నిషేధం దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపేరు. మధ్య దుకాణాల రద్దీ నియంత్రించేందుకు కరోనా మహమ్మారి నేపధ్యం లో మొండికేస్తున్న మందు బాబులను నిబంధన ప్రకారమే మద్యం కొనుగోలు చేసేలా ఏర్పాటు చేసేమని అన్నారు. పాజిటివ్ కేసుల సంఖ్య ప్రతి రోజూ పెరుగు తున్నందున తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్ని మద్యం షాపు ల దగ్గర ప్రత్యేకంగా బారికేడ్లను నిర్మించి వీలైనంత తొందరగా దుకాణం నుంచి మధు ప్రియులను పంపించే ఏర్పాట్లను చేసేమని అన్నారు. ఈ కౌంటర్ల వ్యవస్థ రాష్ట్రం లోనే మొదటి సారిగా విశాఖ లో అమలు పరిచినట్టు తెలిపేరు. నగర పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా, GVMC, ఎక్సైజ్, డాక్టర్ల బృందంతో, కరోనా కట్టిడికై, 24/7 జిల్లా యంత్రాంగము కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్య క్రమంలో మద్య విమోచన ప్రచార కర్తలు సురేష్ బేతా, సైకాలజిస్ట్ డాక్టర్. జయలక్ష్మీ దిట్టకవి, చరిత్ పాల్గొన్నారు.
విశాఖపట్నంలో మరిన్ని పడకలు కోవిడ్ బాధితుల కోసం సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ వైద్యులను ఆదేశించారు. కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు తగిన చర్యలు తీసుకొనేందుకు తగిన చర్యలు నిమిత్తం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వైద్యులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో కోవిడ్-19 సేవలు అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఎఎంసి ప్రిన్సిపల్ డా. పి.వి. సుధాకర్ ను ఆదేశించారు. కోవిడ్-19 ను ఎదుర్కొనేందుకు నిదులు సమస్య లేదని, స్పెషలిస్టులు, వైద్యులు అందరూ సహకరించి కోవిడ్ ఎదుర్కొనేందుకు సహకరించాలని కోరారు. జిల్లాలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఇలాంటి సమయంలో వైద్యులు తమవంతు సహకారం అందించాలని ఐ.ఎం.ఎ., వైజాగ్ చాప్టర్ లను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్-2 పి. అరుణ్ బాబు, ఎఎంసి ప్రిన్సిపల్ డా. పి.వి. సుధాకర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తిరుపతిరావు, ఆరోగ్య శ్రీ జిల్లా కో ఆర్డినేటర్ దవళ భాస్కరరావు, ఐ.ఎం.ఎ., చాప్టర్, వైజాగ్ నుండి కోవిడ్-19 జిల్లా కో ఆర్డినేటర్ డా. బి. గోవిందరాజు, ఐఎంఎ కార్యదర్శి డా. కె. ఫణీందర్, తదితరులు పాల్గొన్నారు.
ఎండీ జనరల్ మెడిసిన్ విభాగంలో అత్యంత ప్రతిభ కనబరిచిన డా.మౌనికను గోల్డ్ మెడల్ వరిచింది. ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ పివిసుధాకర్ 2020 సంవత్సరానికి క్లినికల్ న్యూరాలజీలో ప్రతిష్టాత్మక డాక్టర్ ఎన్ టి సుబ్రహ్మణ్యం బంగారు పతకాన్ని ఫైనల్ ఇయర్ ఎండి జనరల్ మెడిసిన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్ చింతాడా మౌనికాకు శుక్రవారం జరిగిన కార్యక్రమంలో అందజేశారు. డాక్టర్ ఎన్.టి.సుబ్రమణ్యం ప్రఖ్యాత వైద్యుడు, జనరల్ మెడిసిన్ ఎంచుకోవడానికి అనేక మంది యువకులను ప్రేరేపించడంలో మార్గదర్శిగా నిలిచారు. దివంగత డాక్టర్ ఎన్.టి.సుబ్రమణ్యం AMC మరియు KGH కి చేసిన సేవలను మెడిసిన్ హోడ్ డా. ఎస్ శ్రీనివాస్ ప్రశంసించారు. డా. జ్ఞానసుందర రాజు, డా.రాధా కృష్ణన్, డా.ఎస్ఎన్ఆర్ నవీన్ , జనరల్ మెడిసిన్ యొక్క ఇతర అధ్యాపకులు ,పోస్ట్ గ్రాడ్యుయేట్లు పాల్గొన్నారు.
చిట్టివలస జ్యూట్ కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు యాజమాన్యాన్ని ఆదేశిం చారు.చిట్టివలస జ్యూట్ మిల్లు, యాజమాన్యం, కార్మికులతో మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. చిట్టివలస జ్యూట్ మిల్లు అగ్రిమెంటు చేసి సంవత్సరకాలం నిన్నటితో పూరైందు వలన మంత్రి సమావేశం నిర్వహించారు. కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలు యాజమాన్యం పూర్తిగా చెల్లించాలని, ప్రతికార్మికునికి శాశ్వత, ప్రత్యేక బదిలి, బదిలి, కొత్తగా బదిలి, కార్మీకులకు రూ.27,500/-లు చొప్పున మరియు అప్రంటిసు కార్మికులకు రూ.10,000/-లు చొప్పున ఇస్తానని యజమాన్యం ఒప్పుకున్న ప్రకారం తక్షణమే కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలన్ని వెంటనే చెల్లించాలని జ్యూట్ మిల్లు యజమాని కె.కె. బజోరి యాను మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో యజమాన్యం ప్రతినిధిలు జోషి, రామ్ కుమార్, ఐక్య కార్యాచరణ కమిటి కార్మిక నాయకులు కె.వరహాలరాజు, చిల్ల వెంకటరమణ, జీరు, వెంకటరెడ్డి, వలనకాల ఆదినారాయణరెడ్డి, దల్లి అప్పలరెడ్డి, పడాలరమణ, కొండపు ఈశ్వరరావు, రామ్ ప్తెడియ్య, మద్దెల దేవుళ్లు, నరవ రామరావు, తదితరులు పాల్గొన్నారు.