22న శ్రీకాకుళంజిల్లాలో జాబ్ మేళా


Ens Balu
6
Srikakulam
2022-04-20 16:21:41

శ్రీకాకుళం జిల్లా ప్రధాన కేంద్రమైన శ్రీకాకుళం నగరంలో నిరుద్యోగ యువతకు ఈ నెల 22న జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి జి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన జారీచేసారు. శ్రీకాకుళంలో గల హోటల్ నాగావళి మరియు బిగ్ బాస్కెట్ టాటా ఎంటర్ ప్రైజెస్, విశాఖపట్నం వారి కంపెనీలలో గల వివిధ ఉద్యోగాల భర్తీకై జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. హెటల్ నాగావళి నందు 22 పోస్టులు, బిగ్ బాస్కెట్ నందు 55 పోస్టులు వెరశి 77 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. నాగావళిలో పనిచేయు అభ్యర్ధులకు 18 నుండి 30 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండాలని, బిగ్ బాస్కెట్ నందు పనిచేయు అభ్యర్ధులకు 18 నుండి 38 ఏళ్ల లోపు వయస్సు కలిగిన వారై ఉండాలని స్పష్టం చేసారు. బిగ్ బాస్కెట్ వాన్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 20, పేకర్స్/స్తేకర్స్ పోస్టులు 20 వెరశి 40 పోస్టులకు ఎస్.ఎస్.సి విద్యార్హత కలిగిన అభ్యర్ధులు అర్హులని వీరికి నెలకు రూ.12వేలు జీతం ఉంటుందన్నారు. అలాగే బైక్ డెలివరీ బాయ్స్ పోస్టులు 15 ఉన్నాయని ఎస్.ఎస్.సి విద్యార్హత కలిగిన అభ్యర్ధులు అర్హులని వీరికి ప్రతి ఆర్డరుకు రూ.40/-లు చొప్పున చెల్లించడం జరుగుతుందన్నారు. నాగావళి హోటల్ నందు మూడు ఎఫ్ అండ్ బి సర్వీస్ కెప్టన్/ఆర్డర్ టేకర్స్ పోస్టులు, రెండు కిచెన్ సూపర్ వైజర్స్ పోస్టులు ఉన్నాయని వీరికి నెలకు జీతం రూ.10 వేలు ఉంటుందన్నారు. 18 నుండి 30 ఏళ్ల వయస్సు లోపు గల అభ్యర్ధులు అర్హులని, డిగ్రీ విద్యార్హతతో పాటు తెలుగు,ఇంగ్లీష్, హిందీ భాషలు మాట్లాడగలిగిన వారై ఉండాలన్నారు. ఎలక్ట్రీషియన్ /ప్లంబర్ పోస్టులు రెండు ఉన్నాయని వీరికి నెలకు రూ.10వేలు జీతం ఉంటుందన్నారు. ఐటిఐ విద్యార్హతతో పాటు హిందీ, తెలుగు మాట్లాడగలిగి ఉండాలని చెప్పారు. హౌస్ కీపింగ్ బాయ్స్ పోస్టులు 5 ఉన్నాయని,పదవ తరగతి విద్యార్గత కలిగిన అభ్యర్ధులు అర్హులని వీరికి నెలకు రూ.9వేలు జీతం , ఎఫ్ అండ్ బి సర్వీస్ వైటర్స్ పోస్టులు 10 ఉన్నాయని, ఇంటర్ పాసై తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలు మాట్లాడిగలిగిన వ్యక్తులు అర్హులని వీరికి నెలకు రూ. 8వేలు జీతం చెల్లించడం జరుగుతుందని ఆయన ఆ ప్రకటనలో వివరించారు. అసక్తి గల అభ్యర్ధులు తమ విద్యార్హత,ఉద్యోగ అనుభవ వివరాలను www.ncs.ap.gov.in వెబ్ సైట్ నందు నమోదు చేసుకొని ఏప్రిల్ 22న ఉదయం 10.00గం.లకు జిల్లా ఉపాధి కార్యాలయం, గవర్నమెంట్ హాస్పిటల్ జంక్షన్ దగ్గర, శ్రీకాకుళం వద్దకు బయోడేటా, సర్టిఫికేట్లు, ఆధార్ కార్డు మరియు నాలుగు పాస్ పోర్ట్ సైజు ఫొటోలను తీసుకొని హాజరుకావాలని ఆయన ఆ ప్రకటనలో స్పష్టం చేసారు.