1 ENS Live Breaking News

కలం బంధం సేవచేసింది.. కెమెరా బంధం పాడే మోసింది..!

విశాఖలో జర్నలిస్టు లక్ష్మణ్ అంతిమ యాత్ర హోరు వానలోనూ  కలంగ కార్మికులతో ముందుకి సాగింది.. జర్నలిస్టు మిత్రుల అశృనయనాల మధ్య జర్నలిస్టు పార్ధీవ దేశం ఖర్మభూమికి చేరింది. కలం నిన్ను మరిచిపోదు మిత్రమా.. కెమెరా కన్ను నిన్న వీడదు.. నువ్వు దూరమైనా..నీతో గడిపి క్షణాలు.. నీతో కలిసి రాసిన వార్తలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయి..! భువిని వీడిన  నీకోసం స్వర్గద్వారం తలుపు తెరిచుకుంది. జర్నలిస్టు బ్రతికున్నా వార్తలే.. మరణించినా వార్తలే.. మాతో ఉన్నంత కాలం భూలోకంలో రిపోర్టింగ్ చేసిన నువ్వు.. కాలంచేసి ఇపుడు పైలోకానికి పయనం అయ్యావు.. నాకు తెలిసీ అక్కడా నీ సహచర జర్నలిస్టులతో కలిసే పనిచేస్తావు.. పై లోకపు వార్తలన్నీ నువ్వే రాస్తావు.. నీ కెమెరా కంటితోనే చిత్రస్తావు.. జర్నలిస్టులమైన మేము.. నీకుజర్నలిజం పరిభాషలోనే అంతిమ వీడ్కోలు పలుకుతున్నాం.. కన్నీటి కలంతో.. దిగమింగిన బాధతో.. విశాఖ జర్నలిస్టులు..!

-అండగా నిలబడిన నగరంలో నేడు
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖలో కేవలం జర్నలిస్టుతో నడపబడుతున్న గ్రూపు ‘నగరంలో నేడు’. ఈ గ్రూపు జర్నలిస్టులకి ఒక వసుదైక కుటుంబం. ఎక్కడైనా జర్నలిస్టుల గ్రూపులంటే పీడిఎఫ్ పేపర్లు, వెబ్ సైట్ లింకులు,  న్యూస్ యాప్ పేజీలు.. పనికిమాలిన సొల్లు మెసేజ్ లు దర్శనమిస్తాయి. కానీ ఈ గ్రూపులో ఆరోగ్యకరమైన చర్చజరగుతుంది.. అందరికీ పనికొచ్చే తాజా వార్తలు దొరుకుతాయి.. ప్రముఖుల ఫోన్ నెంబర్లు..ఇతరత్రా మీడియాకి పనికొచ్చే సమాచారం.. ఒకటేంటి అని జర్నలిస్టులకి పనికొచ్చేవి మాత్రమే దొరుకుతాయి.. ఆత్మీయతకు ప్రాధాన్యం.. అనసర వ్యవహారాలకు తిరస్కారాలూ గట్టిగానే ఉంటాయి.  అంతకంటే ముఖ్యంగా  రిజిస్ట్రేషన్ లేని స్వచ్చంద సంస్థలా జర్నలిస్టుల కోసం స్వచ్చందంగా పనిచేస్తుంది ఈ గ్రూపు.. అదేంటి అనే అనుమానం మీకు రావొచ్చు.. అవును మీరు చదువుతున్నది నిజమే.. ఇది కేవలం వాట్సప్ గ్రూపే కాదు.. వర్కింగ్ జర్నలిస్టుల పాలిట కామధేనువు కూడా.  ఈగ్రూపులో ఎవరికైనా ఆపద అని ఒక్క మెసేజ్ పెడితే ఈ గ్రూపులో ఉన్న జర్నలిస్టులు, కెమెరామెన్ లు, సబ్ ఎడిటర్లు, మరికొందరు పీఆర్వోలు, స్వచ్చంద సంస్థల నిర్వాహకులు స్పందించే తీరు మాటల్లో చెప్పలేం. అనుకున్నదే తడవుగా ఆర్ధిక సహాయం చేయడానికి ముందుకొస్తారు. మేమున్నామంటూ దైర్యం చెబుతారు. అభిమానంతో ఆదరిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే నగరంలో నేడు కేరాఫ్ రియల్ హెల్ప్.. జర్నలిస్టు లక్ష్మణ్ విషయంలో నగరంలో నేడు గ్రూపు ద్వారా జర్నలిస్టులు స్పందించిన తీరు నభూతో నభష్యత్..!

-కంచర్ల అచ్యుతరావు...ఈయన మనిషి కాదు దేవుడు
ఎవరైనా ఐదు రూపాయలు సహాయం చేసి 100 రూపాయల పబ్లిసిటీ పొందుతారు. ఈయన మాత్రం కుడిచేత్తో చేసిన సహాయాన్ని ఎడమచేతికి తెలియనీయరు. నిండైన మనసుతో..మదినిండా అభిమానంతో ఈయన అందించే ఆపన్న హస్తం అందుకున్నవారిని లెక్కించడం కూడా కష్టమే. అలాంటి వ్యక్తి నగరంలో నేడు గ్రూపులో ఒక సభ్యుడు. బహుసా మానవత్వ పరిమళం ఎలా ఉంటుందని అడిగితే ఈయన ఫోటోని చూపిస్తే సరిపోతుంది. అంతటి నిర్వార్ధ సేవకులు ఈయన. అందరివాడుగా.. అపద్భాంవుడిగా.. సేవకుడిగా.. సినీ నిర్మాతగా.. చారిటబుల్ ట్రస్టు నిర్వాహకునిగా ఈయన చేసే సహాయం అంతా ఇంతా కాదు. అలాంటి మంచి వ్యక్తి గ్రూపులో ఉంటూ ఎప్పటికప్పుడు జర్నలిస్టుల కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటూ చేయూత  నందిస్తారు. పక్కవాడికి రూ.10 పెట్టి టీ, కాఫీ ఇప్పించడానికి లెక్కలు వేసే ఈ రోజుల్లో ఆయన చేసే సహాయం మాటల్లో చెప్పలేం. జర్నలిస్టులంటే ఈయనకుండే గౌరవం, మర్యాద, అభిమానం, ప్రేమ బహుసా ఏ స్వచ్చంద సంస్థల నిర్వాహకులకు ఉండవని ఘంటా పథంగా చెప్పొచ్చు. అంతలా ఆయన జర్నలిస్టులను చేరదిస్తారు. అదే స్థాయిలో సేవలూ అందిస్తారు. జర్నలిస్టు లక్ష్మణ్ విషయంలో ఈయన చేసిన ఆర్ధిక సహాయం మరువలేనిది. ఒకటి కాదు రెండు కాదు మూడు పదులు దాటిన వేలకి పైగా ఆర్ధిక సహాయం చేశారు.

-ప్రతీ చోటా నగరంలో నేడు లాంటి గ్రూపులంటే జర్నలిస్టులు ఒంటవారవరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జర్నలిస్టులకు ఎలాంటి ప్రభుత్వ పథకాలు రావు.. కనీసం ప్రెస్ అక్రిడిటేషన్ కూడా గత ప్రభుత్వాలంటివి అధికారంలో ఉంటే స్థానిక పత్రికలు కూడా కనుమరుగైపోతాయి. పరిస్థితులు ఎలా ఉన్నా..ఏ పార్టీ అధికారంలో ఉన్నా నగరంలో నేడు లాంటి గ్రూపులు ప్రతీ ప్రాంతానికి ఉంటే ఆర్ధికంగా ఏ తోడ్పాటు లేని జర్నలిస్టులు ఒంటరివారవరు ఇదైతే పక్కా. అంతటి ప్రాచుర్యం, ప్రాముఖ్యత కలిగిన గ్రూపుగా నగరంలో నేడు నేడు అన్ని చోట్ల ప్రశంసలు అందుకుంటోంది. ఆపదలో ఉన్న జర్నలిస్టులకు ఇనిస్టెంట్ సహాయం అందించే ఏకైక గ్రూపు ఇదే కావడం విశేషం. మహావిశాఖపట్నంలోని అన్ని ప్రముఖ మీడియా సంస్థల రిపోర్టర్లూ ఈ గ్రూపులో సభ్యులు గా ఉంటారు. వున్నవారంతా జర్నలిస్టులకు తోడ్పాటు అందించేందుకు ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటారు. అలాంటి వారి మధ్యలో కంచర్ల అచ్చుతరావులాంటి మహానుభావులు కూడా జర్నలిస్టులకు, చక్కటి ఇలాంటి గ్రూపులకు తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు.

-నేనొక నిమిత్త మతృడిని మాత్రమే సహకారం అంతా జర్నలిస్టులదే..ఎమ్మెస్సార్ ప్రసాద్
నగరంలో నేడు గ్రూపు నిర్వహణ మాత్రమే  చూస్తుంటాను. అందరిలో నేను ఒకడిని కానీ ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా స్పందించడానికి మా గ్రూపులో చాలామంది జర్నలిస్టులు, నిశ్వార్ధసేవకు ముందుకి వస్తారు. వెంటనే స్పందిస్తారు. గ్రూపు ఇంత చక్కగా నడవటానికి మేము తీసుకునే కఠిన నిర్ణయాలు, పీడిఎఫ్, యూట్యుబ్ లింక్స్ పెట్టకుండా కేవలం వార్తా సమాచారం మాత్రమే పెడుతూ అందరం ఇందులో భాగస్వాములుగా ఉంటాం. జర్నలిస్టులకు ఎలాంటి ఆపద వచ్చినా అందరం స్పందించడానికి నగరంలో నేడు గ్రూపు ఒక చక్కటి కుటుంబ వేదిక.

-జర్నలిస్టులకు సహాయం అందించే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం..కంచర్ల అచ్యుతరావు
సమాజంలో నాల్గవ స్థంబంగా ఉన్న మీడియా..అందులో పనిచేసే నా తమ్ముళ్లైన జర్నలిస్టులకు సేవ చేసుకునే భాగ్యం దక్కడం నాఅదృష్టం. నన్ను అంతా ఏదేదో తారాస్థాయికి ఎత్తేస్తారు కానీ.. అవేమీ నాకు గిట్టవు.. నచ్చవు..  నావంతుగా ఎంత సేవ చేశాననేది మాత్రమే నేను చూసుకుంటాను. అందులో విశాఖలోని జర్నలిస్టులతో నాకున్న బంధం వేరు. బంధం అనే కంటే వారంతా నా కుటంభంగా భావించి అందరిలో నేను ఒకటిగా ఉంటాను. మీడియా అన్నా..అందులో పనిచేసే జర్నలిస్టులన్నా నాకు ఎంతో గౌరవం అభిమానం బహుసా అదే నన్ను వారికి దగ్గర చేసిందేమో.. అదే నాతో సేవచేయిస్తుందేమో అనిపిస్తుంటుంది ఏ జర్నలిస్టుని చూసినా. ఏ జర్నలిస్టు ఆపదలో ముందుకి వచ్చి సహాయం అందించినా.. మీడియాని ప్రభుత్వాలు, ప్రజలు, స్వచ్చంద సేవకులు అంతా గుర్తించినపుడే మనవంతుగా మీడియాకి సహాయం చేయడానికి వీలుపడుతుంది. బాహ్యప్రపంచంలో జరిగే విషయాలన్నీ అందరికీ తెలుస్తాయి.. జర్నలిస్టులు ఆర్ధికంగా అభివృద్ధి చెందాలన్నదే నా అభిమతం.

visakhapatnam

2024-07-22 13:22:45

మహా తిరుగుబాటు..!

మహ విశాఖ నగరపాలక సంస్థలోని కార్పోరేటర్లు వైఎస్సార్సీపికి చావు దెబ్బ కొట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటరు ఓటుతో కొడితే..వీళ్లంతా నమ్మ కం తో కొట్టారు. పార్టీకోసం పనిచేసిన మాకు ఏం గుర్తింపు ఇచ్చారని..కనీసం ఒక్క పనైనా చేశారా అని ఓ దులుపు దులిపేసి మరీ హేండిచ్చే శారు. ప్రస్తుతానికి ఏడుగురు వైఎస్సార్పీపీ కార్పోరేటర్లు టిడిపిలోకి జంప్‌ చేయగా మరో ఐదుగురు జనసేనలోకి వెళ్లిపోవడానికి తమ మద్దతుని తెలియజేశారు. అధికారంలో ఉండగా కార్పోరేటర్ల ప్రభుత్వం సహాయ పడిఉండి ఉంటే నిజంగా ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. చాలా పథకా లు ఇచ్చేశాం..మరో పదేళ్లు మనమే అధికారంలో ఉండిపోతామనే ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో చేసిన పనులన్నీ ఎన్నికల తరువాత ఒక్కొక్కటిగా తిరిగి కొట్టే స్తున్నాయి. ఫలితంగా నేడు విశాఖలోని మేయర్‌ పీఠం వైఎస్సార్సీపి కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురైంది. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి గెలిచిన దగ్గర నుంచి జివిఎంసీ మేయర్‌ పీఠం వదులుకోక తప్పదని ఎమ్మెల్యే వంశీక్రిష్ణ చేసి హెచ్చరిక కు నేటి కార్పోరేటర్ల జంపింగ్‌ తో క్లారిటీ వచ్చేసింది.

వాస్తవానికి వంశీని మేయర్‌ నిచేస్తామని చెప్పి కార్పోరేటర్‌ గా నిలబెట్టి ఆఖరి సమయంలో రాజకీయం చేసి అదే సామాజిక వర్గానికి చెందిన హరివెంకటకుమారికి కట్టబెట్టింది వైఎస్సార్సీపి. ఆ తరువాత ఎమ్మెల్సీ ఇచ్చినా..దానిని వదిలేసి మరీ దక్షిణంలో పోటీచేసి తన సత్తాను నిరూపించుకున్నారు వంశీ. తరువాత వైఎస్సార్సీపి ఘోరంగా ఓడిపోవడంతో అంతర్మధనంలో పడిన కార్పోరేటర్లు. అనుకున్నట్టుగానే హేండిచ్చేశారు. కూటమి మేయర్‌ పీఠానికి సరిపడ కార్పోరేటర్లంతా వచ్చేయడానికి రంగం సిద్దం అయిపోయింది. ప్రస్తుతానికి లెక్క 12మీద ఉన్నా ఆ సంఖ్య భారీగా పెరగడానికే అవకాశాలున్నాయి. వైఎస్సార్సీపీ కార్పోరేటర్ల మహా తిరుగుబాటు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగలగా అదంతా పార్టీలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల వలనే వచ్చిందని..వాళ్లంతా తమకు కనీసం గౌరవం ఇవ్వలేదని.. ఏఒక్క పనికూడా చేసుకోలేకపోయిన కారణంగా పార్టీని వీడాల్సి వస్తుందని తాజా మాజీల మొహం మీద చెప్పేసి మరీ బయటకు వచ్చేయడం చర్చనీయాంశం అవుతోంది.అసలు టిడిపి పార్టీ భూ స్థాపితం అయిపోతుందని ప్రగల్బాలు పలికిన వైఎస్సార్సీపి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకి కార్పోరేట్లు మహా తిరుగుబాటుతో దిమ్మతిరి మైండ్‌ బ్లాంక్‌ అయ్యేలా చేసింది.

visakhapatnam

2024-07-22 03:47:22

అన్నవరంలో అపచారం..!

అన్నవరం రత్నగిరి క్షేత్రంలో కొలువైన శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారే సాక్షత్తూ ఇక్కడి అధికారులు చేసిన తప్పులకు ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది.. అపచారం జరిగినా.. దానిని అధికారులు క్షణాల్లో మసిపూసి మారేడుకాయ చేసేసినా..ఏం తెలియని వాడిలా ఆ సత్యదేవుడు కూడా మౌనం వహించాల్సి వచ్చింది. కనీస జాగ్రత్తలు పాటించకుండా పురుగు మందులను విచక్షణా రహితంగా వెదజల్లే సమయంలో ఆ విషపూరిత వాసనకు తీవ్ర అస్శస్థకు గురైన వేద పాఠశాల విద్యార్దులు..చావు తప్పి కన్నులొట్టబోయి బ్రతికి బయటపడ్డారు. ఆ పురుగు మందుల వాసన మరింత కొద్దిసేపు వస్తే జరగకూడని దారుణం జరిగిపోయేది. అయినా..దానిని దేవస్థానం అధికారులు ఏకంగా డయేరియా సీజన్ కావడంతో వేద విద్యార్ధులు కలుషిత ఆహారం తిని డయోరియా భారిన పడ్డారని చెప్పేశారు. ఇదంతా యూట్యూబ్ వీడియోలు, అధికారులు, వైద్యులు, ఆపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారే స్వయంగా తిమ్మిని బమ్మిని చేసి చెబితే ఆ తేడా వీడియోలను కూడా సత్యదేవుడు ఖర్మ ఖర్మ..నా ఆలయంలో ఇంతటి ఘోరాలు జరగడమా..అంటూ కామ్ గా ఉండాల్సి వచ్చింది. 

 ఇంతకీ ఏం జరిగిందంటే.. బుధవారం వేదపాఠశాలకు కాస్త చేరువలో మొక్కలకు పురుగు మందులను సిబ్బంది, ఓ రిటైర్డ్ అధికారి ఆధ్వర్యంలో స్ర్పే చేయిస్తున్నారు. అలాంటి సందర్భంలో స్ర్పేయింగ్ చేసేవారితో పాటు, చుట్టుప్రక్కల ఎవరూ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ పక్కనే వేద పాఠశాల ఉన్నప్పటికీ ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా విచక్షణా రహితంగా స్ప్రేయింగ్ చేయడంతో వాటి వాసకు వేదపాఠశాలలో ఉన్న ఆరుగురు విద్యార్ధులు తీవ్రఅస్వస్థతకు గురయ్యారు. కానీ జరిగిన తప్పుని ఏకంగా ఇక్కడి అధికారులు, వైద్యులు, జిల్లా వైద్యాధికారితో సహా డయేరియా క్రింద చిత్రించేశారు. పోనీ డయేరియానే అనుకుంటే అంతటి తేడా పరిస్థితుల మధ్య 36 మందికి వేద పాఠశాల ఎలా నిర్వహిస్తారు..? ఎందుకు హానకరమైన ప్రదేశం ప్రక్కన ఉంచాల్సి వచ్చింది..? పురుగు మందుల అవశేషాలు ఆహారంపై న పడి వాటిని విద్యార్ధులు తింటే వారి పరిస్థితి ఏంటి అంటే మాత్రం ఆ ఒక్కటీ అడక్కు అంటున్నారు దేవస్థాన అధికారులు.

తమ పిల్లలు తీవ్ర అస్వస్థకు గురయ్యారని భయాందోళకు గురైన తల్లిదండ్రులకు దేవస్థాన అధికారుల నుంచి బెదిరింపులు వెళ్లినట్టు కూడా సమాచారం అందుతుంది. అక్కడ పురుగుమందుల స్ప్రేయింగ్ వలన కాకుండా డయేరియా వలనే విద్యార్ధులకు అస్వస్థకు గురయ్యారని చెప్పించినట్టు తెలిసింది. అలా చెప్పకపోతే వేద పాఠశాల నుంచి విద్యార్ధులను తొలగిస్తామని చెప్పడంతో ఆ భయంతోనే దేవస్థాన అధికారులు, వైద్య సిబ్బంది చెప్పమన్నట్టు విద్యార్ధుల తల్లిదండ్రులు కూడా చెప్పినట్టు తెలిసింది. అన్నవరం దేవస్థానంలో వేద పాఠశాలోని విద్యార్ధులకు అస్వస్థతకు గురయ్యారనే విషయంపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశిస్తే ఎక్కడ ఇబ్బందులు వస్తాయోనని ఏకంగా అన్నవరం కొండపై ఉన్న ఓ వర్గం మీడియాతో అధికారులు యూట్యూబ్ వీడియోల ద్వారా జరిగినదానికి భిన్నంగా వీడియోలు రిలీజ్ చేయడం కూడా పలు అనుమానాలకు తావిస్తున్నది. ఎన్ని అనుమానాలున్నా..వేద పాఠశాల వద్ద కెమికల్ స్ప్రెయింగ్, పురుగు మందుల డబ్బాలు స్ప్రేయింగ్ పై ఏ ఒక్క అధికారి మాట్లాకపోవడం విశేషం. పైగా విద్యార్ధులంతా బాగానే ఉన్నారు.. మీడియా మాత్రం ఇంత చిన్న విషయాన్ని రాద్దాంతం చేస్తుందని వైద్యాధికారుల దగ్గర నుంచి దేవస్థాన అధికారులంతా చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి విశ్వప్రయత్నాలు చేశారని విద్యార్ధుల తల్లిదండ్రుల్లో కొందరు ఆరోపిస్తున్నారు. 

అలా అస్వస్థతకు గురైన సమయంలో జరగకూడదని ఏదైనా జరిగితే దానికి ఎవరు జవాబు దారీ అంటూ గొల్లుమంటున్నారు. ఆ భయంతోనే విద్యార్ధులు వైద్యం పొందుతున్న ఆసుపత్రివద్దకు వెళ్లిన వారికి సిబ్బంది ద్వారా బెదిరింపులు వచ్చినట్టు కొందరు బయటకి వచ్చి చెప్పడంతో విషయం కాస్త గుప్పుమంది. వైద్యాధికారులు, దేవస్థాన సిబ్బంది తప్పుచేసిన ప్రజాప్రతినిధికి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాల్లో అధికారులు, వైద్యులు పై చేయి సాధించారు. కానీ ఇంత జరిగిన తరువాత డయేరియా అని ఏదైతే అధికారులు, వైద్యులు ప్రచారంలోకి అసలు విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారో దానిపై జిల్లా కలెక్టర్ విచారణ చేపడితే  కలుషిత ఆహారంపై అయినా అసలు విషయాలు వెలుగుచూసే అవకాశం వుంటుంది. అదే సమయంలో ఇలాంటి తేడా వ్యవహారాలు మరోసారి జరగకుండా ఉంటాయి. దేవస్థాన అధికారులు వేద పాఠశాల విద్యార్ధుల విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యహరించడం ఇది ఎన్నోసారో ఆ సత్యదేవుడికే తెలియాలి. ఇలాంటి అంశాల్లో జిల్లా కలెక్టర్ దృష్టి సారించకపోతే తీవ్ర అస్వస్థకు గురైన విద్యార్ధుల్లో ఏ ఒక్కరు మృతిచెందినా దానికి మొత్తం వైద్యులు, అధికారులు, జిల్లాను పరిపాలించే జిల్లా కలెక్టర్ సైతం సమాధానం చెప్పాల్సి వచ్చేది. సత్యదేవుకే కళ్ల మసి రాసి జరిగిన దాన్ని దాచిపెట్టిన తేడా అధికారులు, సిబ్బందిని వదలకూడదని తీవ్ర భయాందోళనకు గురైన విద్యార్ధుల తల్లిదండ్రులు, భక్తులు ముక్త కంఠంతో కోరుతున్నారు.

annavaram

2024-07-04 08:08:11

అరకు చుట్టూ ‘చెట్టి’అవినీతి ఆక్రమణలే..!

గిరిజన ఎమ్మెల్యే అయిండి..గిరిజనుల భూములనే ఆక్రమించాడు.. అడిగినందుకు చంటిపిల్లల తల్లిని 72రోజులు జైలు పాలు చేశారు.. అధికారం అడ్డం పెట్టుకొని భారీ అవినీతికి పాల్పడ్డాడు.. గిరిజనులకు న్యాయం చేయపోగా అన్యాయంగా కేసులు పెట్టే ఎమ్మెల్యే, వారి కుటుంబం మాకొద్దంటూ అరకు సిట్టింగ్ ఎమ్మెల్యే చెట్టిపాల్గునపై బాధిత గిరిజనులు(భగతా సామాజిక వర్గం) చేస్తున్న వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఇదిగో చెట్టి అవినీతి చిట్టా అంటూ ఆదివాసీ జేఏసి ఒక పెద్ద కరపత్రాన్నే అరకు అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, మండలాల్లో ప్రచార అస్త్రానికి దించింది. సాధారణంగా గిరిజన ప్రాంతంలో ప్రజాప్రతినిధులంటే గిరిజనులకు మేలు చేసి, గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చెస్తారు..కానీ తమను దోచుకోవడానికే చెట్టి పాల్గున ఎమ్మెల్యే అయ్యారని  చొక్కా పట్టుకొని అడంగండంటూ గిరిజనులు ఎమ్మెల్యేని గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో గెరావ్ చేసిన వీడియోలను ఇప్పుడు బాధిత గిరిజనులు అన్ని గ్రామాల ప్రజలకు బాధితులే వెళ్లి స్వయంగా వీడియోలను చూపించి గిరిజనులను చైతనపరుస్తున్నారట. ఐ ప్యాక్ సర్వే అంటూ గ్రౌండ్ లెవల్ రిపోర్టులు తీసుకొని మరీ టిక్కెట్లు ఇచ్చిన వైఎస్సార్సీపీకి ఇపుడు వైరల్ అవుతున్న వీడియోలు పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి. 

దీనితో అరకు ఎంపీగా , ఎమ్మెల్యేలుగా టిక్కెట్లు ఆశించి బంగపడిన పాడేరు సిట్టింగ్ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, గొడ్డేటి మాధవిలు సైతం ఈ ప్రచారాలను అడ్డుకోవడం లేదని, కనీసం అరకు ఎమ్మెల్యే వెనుక వున్న క్యాడర్ సైతం తిప్పికొట్టడం లేదని చెబుతున్నారు. మరోప్రక్క పార్టీ అధిష్టానం రేగం మత్స్యలింగానికి అరకు ఎమ్మెల్యే అభ్యర్ధిగా ప్రకటించినప్పికీ పార్టీలోని సిట్టింగ్ ఎమ్మెల్యే జరుగుతున్న ప్రచారాలను తిప్పికొట్టకపోవడంతో ఇదంతా నిజమేనని గిరిజనులు భావించే పరిస్థితికి వచ్చారు. దగా పడ్డ గిరిజన కుటుంబాలు పనిగట్టుకొని మరీ చెట్టి పాల్గున కుటుంబానికి మద్దతు ఇవ్వొద్దని, ఇపుడు తమను జైలుపాలు చేసినట్టు మిగిలిన గిరిజనులను కూడా జైలు పాలు చేసి.. విలువైన భూములు ఆక్రమించేసుకుంటారని ఒక బృందంగా ఏర్పడి ఇంటింటికీ వెళ్లి మరీ తమకు జరిగిన అన్యాయంపై గిరిజనులు( మొత్తం అరకు పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్లో సుమారుగా ఉన్న 1.20 లక్షల మంది ఓటర్లు) చైతన్యం తీసుకు వస్తున్నారనే ప్రచారం ఇపుడు గుప్పుమంటున్నది. అందులోనూ టిక్కెట్టు ఆశించిన వారికి టిక్కెట్టు రాకపోగా..పార్టీ అభ్యర్ధి గెలవడానికి పనిచేసిన వారందికీ ఈ ఐదేళ్ల కాలంలో న్యాయం జరగకపోవడానికి కారణంగా కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేనంటూ పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది.

 అయితే ఇదంతా తమకుటుంబంపై గిట్టనివారు అసత్య ప్రచారం చేస్తున్నారని, మీడియా కూడా తప్పుగానే చూపిస్తుందని దానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అనే బేధం లేకుండా అందరూ తనపై అసత్య వార్తా కథనాలే ప్రచారం చేస్తున్నారని.. ఈ వీడియోలనే ఇపుడు కొందరు గిరిజనులు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారంటూ చెట్టి పాల్గొన కొట్టి పారేస్తున్నారు. అయితే తమ కుటుంబాన్ని జైలు పాలు చేశారంటూ బాధిత గిరిజనులు చెప్పిన మాటలు ఫేక్ అంటారా..? గిరిజనులను జైలు పాలు చేయలేదంటారా..? వారి భూములను ఆక్రమించుకోలేదంటారా..? ఆదివాసీ సంఘాల జేఏపి ఆరోపిస్తున్నట్టు కరపత్రంలో ముద్రించిన అంశాలు ఏ ఒక్కటీ నిజం కాదంటారా అంటే అవేమీ తనకు తెలీదు..తాను మాత్రం సత్యహరిశ్చంద్రవంశానికి చెందిన వాడినని..అందుకే సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పిలిచిమరీ మా కోడలు డా.గుమ్మ తనూజారాణికి పార్లమెంటు అభ్యర్ధిగా సీటు ఇచ్చారని ధీమా చెబుతున్నారు. పార్టీ చేసిన, ప్రస్తుతం చేయిస్తున్న సర్వేల్లో కూడా వాస్తవం ఉంటే తెలియాలికదా.. చాలా చోట్ల అభ్యర్ధులను మార్చినట్టుగా మమ్మల్నీ కూడా మార్చాలి కదా..? ఎందుకు మార్చడంలేదూ అంటే తమపై వచ్చిన్న ఆరోపణలన్నీ నిరాదారమైనవేనని అందుకే పార్టీ వాటిని కనీసం పట్టించుకోలేదని తనకు అనుకూలంగా ఉన్న క్యాడర్ కి గీతోపదేశం చేయడంతోపాటు ఇదే విషయాన్ని గిరిజనులకు తెలియజేయాలని, వారిని చైతన్య పరచాలని చెప్పిపంపిస్తున్నారట. 

ఇంత జరిగిన తరువాత..ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాల్లో చెట్టి అవినీతి ఆరోపణలపై పెద్ద ఎత్తున దుమారం రేగుతున్న తరుణంలో ప్రస్తుతం సర్వేలు చేస్తున్న ఐప్యాక్ టీమ్ బృందం దృష్టికి ఇలాంటి అవినీతి ఆరోపణలు, టీవల్లో వచ్చిన వార్తా కధనాలు, పత్రిలకల్లో వచ్చిన వార్తలు, బాధితులే స్వయంగా మీడియా ముందుకి వచ్చి వీడియో ముఖం చెప్పిన అంశాలను పరిణగోలనికి రాకపోవడం ఇపుడు చర్చనీయాంశం అవుతున్నది. తొలుత అరకు ఎమ్మెల్యే అభ్యర్ధిగా గొడ్డేటి మాధవిని ప్రకటించి తరువాత దానిని రేగం మత్స్య లింగానికి ఇవ్వడం, ఆ తరువాత ఈయన విషయంలోనూ చెట్టి పాల్గొ వర్గం దూరం దూరంగా ఉండటం కూడా ప్రస్తుతం ఏజెన్సీలోని గిరిజనులను ఆయోమయ స్థితిని నెట్టేస్తున్నది. ఏజెన్సీలో రంగులు మారుతున్న రాజకీయం, ప్రస్తుత అభ్యర్ధులపై వైరల్ అవుతున్న అవినీతి ఆక్రమణల వీడియోలు బహుసా వైఎస్సార్సీపీ అధిష్టానం చూసి ఉండకపోవచ్చుననే వాదన కూడా వినిపిస్తుంది. లేదా చూసినా.. ముందుగా మాటిచ్చాం కనుక గిరిజనుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా అదేం పెద్ద మేటర్ కాదని, ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలే పార్టీ అభ్యర్ధులను ఖచ్చితంగా గెలిపిస్తాయనే దైర్యమూ కావొచ్చునని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎంత అవునన్నా.. మరెంత కాదన్నా నిప్పులేకుండా పొగరాదు.. అన్యాయానికి గురికి కాకపోతే అమాయక గిరిజనులు(భగతాలు) మీడియా ముందుకివచ్చి వారికి జరిగిన అన్యాయాన్ని పదే పదే చెప్పరు. ఇది కూడా ఫేక్, ఇంటెలి జెన్స్ కి దృష్టికి రాలేదంటే.. బాధిత గిరిజనులు, వీరికోసం తెలిసిన వేరే రకంగా ఖచ్చితంగా ఆలోచిస్తారనే ప్రచారమూ జరుగుతుంది. త్వరలోనే అభ్యర్ధులను ప్రకటించనున్న వైఎస్సార్సీపీ అధిష్టానం ప్రస్తుతం జరుగుతున్న అవినీతి ఆక్రమణల వ్యవహారాన్ని ఏవిధంగా స్వీకరించి అభ్యర్ధులను ప్రకటిస్తుందనేది ఆశక్తిగా మారింది..?!

araku vally

2024-04-12 02:46:38

మామ..కోడలు.. ఒక ఎంపీ సీటు..?!

అలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అనే నానుడి వెనకటిది.. కానీ ఇపుడు మామ.. కోడలు ..ఒక ఎంపీ సీటు అంటున్నారు మన్యం వాసులు.. అదేంటి ఈ రెండిటికీ తేడా ఉంది కదా అనుకోవచ్చు. నిజమే తేడా ఉంది.. గెలుపు గుర్రాలను కాదని ఇపుడు వెనుకంజలో ఉన్న అభ్యర్ధికి ఎంపీ సీటు కేటాయించడం పట్ల సొంత పార్టీలోనే ముసలం మొదలైంది. ఎక్కడికి వెళ్లినా తిరుగుబాటు ఎదురవుతుంది. అరకు ఎంపీ సీటు చుట్టూ రాజకీయం రక రకాలు గా తిరుగుతుందనే వాదన తెరపైకి వచ్చింది. దీనితో ఆఖరి నిమిషంలో.. అంటే బీ ఫారం ఇచ్చే లోగానైనా సరికొత్త పరిణామాలు చోటుచేసుకుంటాయని చెబుతున్నారు. దానికి ప్రస్తుతం మన్యంలోని అరకు పార్లమెంటు నియోజకవర్గం పరిధినిలోని అసెంబ్లీ స్థానిలు, వాటి మండలాల్లో అతి పెద్ద చర్చ మొదలైంది. దానికి తోడు అధికారపార్టీ అభ్యర్ధి, వారి కుటుంబపై పెరుగు తున్న నిరసన, వ్యతిరేకత కూడా తోడవుతోంది. మామని కాదని కోడలకి ఎంపీ టిక్కెట్టు కేటాయించడం, సిట్టింగ్ ఎంపీని కాదని కొత్తవారికి ఛాన్స్ ఇవ్వడం..ఇదే ప్రాంతంలో ఎంపీగా గెలవడానికి అత్యంత ఎక్కువ అవకాశాలు ఉన్న సమర్ధి భవాని పేరు చాలా స్ఫష్టంగా వినిపిస్తోంది. తొలుత అరకు ఎంపీ సీటు ఈమెకు ఖరారు అయిందని ప్రకటించే లోపే డా.గుమ్మతనూజారాణి వైఎస్సార్సీపీ ఖరారు చేసింది. 

అయితే అరకు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేపై గిరిజన సంఘాలు కారాలు మిరియాలూ నూరుతున్నారు. కనీసం గిరిజనుల కోసం ఏమీ చేయలేదని, పైగా 18 అవినీతి అంశాలతో కూడి కరపత్రం కూడా ఆదివాసీ సంఘాల జేఏసీ 2020లోనే ముద్రించి మన్యం అంతా పంచేసింది. నాటి నుంచి నేటి వరకూ చెట్టి కుటుంబాన్ని గిరిపుత్రులంతా దూరంగా పెడుతున్నారు. అయితే ఈసారి అధిష్టాం చెట్టి పాల్గుణను పక్కనపెట్టి ఆయన కోడలికి ఎంపీ సీటు కేటాయించడం  పట్ల గిరిజనుల నుంచి తీవ్ర వ్యతిరేక ఎదురవుతున్నది. ఒకే కుటుంబంలోని వారికే అన్ని పదవులూ ఇచ్చే పార్టీ కోసం శ్రమించిన వారికి, నాటి నుంచి నేటి వరకూ అత్యధిక మొత్తంలో ఖర్చులు పెట్టి జెండాలు మోసిన వారికి కనీసం ప్రాధాన్యత ఇవ్వడం లేదని గిరిజనులు తిరగబడుతున్నారు. ఈక్రమంలో ప్రచారానికి ఎక్కడికి వెళ్లినా మన్యంలో తిరుగుబాటు ఎదువుతుంది. ఏకంగా ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జి వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో గిరిజులు ఘెరావ్ చేశారు. అయినప్పటికీ నెట్వర్క్ పూర్తిస్థాయిలో నడపడంతో కోడలికి సీటు తెచ్చుకోవడంలో సఫలీకృతులు అయ్యారు. సమర్ధి భవానీ ఈమె కుటుంబం మొత్తం రాజకీయనేపథ్యం ఉన్నవారు కావడం, ఆర్దికంగా బలంగా ఉన్నవారైనప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో పార్టీలోని పెద్దలను మచ్చిక చేసుకొని ఎంపీసీటు తెచ్చుకోగలిగారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

 సీటు అంటే వచ్చింది తప్పితే గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయనే వాదన బలంగా వినిపిస్తున్నది. దానికి సిట్టింగ్ ఎంపీ గొడ్డేటి మాధవిని పక్కన పెట్టడం, ఈసారి ఎమ్మెల్యే కాకుండా ఎంపీ సీటు ఆశించిన కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి కూడా సీటు ఇవ్వకుండా ఒకే కుటుంబంలోని వారికి ఎంపీ సీటు కేటాయించడం వలన వారిద్దరి వర్గం, అనుచరులు వ్యతిరేకంగా చేస్తారని చెబుతున్నారు. దానితోపాటు ఇక్కడ గతంలో ఎంపీగా పనిచేసిన కొత్తపల్లి గీత కూడా ఈసారి ఎంపీ బరిలో ఉన్నారు. ఉమ్మడి అభ్యర్ధిగా బరిలో ఉన్నప్పటికీ ఆమె చుట్టూ కూడా పలు అవినీతి ఆరోపణలు ప్రదక్షిణలు చేస్తున్నాయి. దానితో ఆమె వాటికి  మీడియా ముఖంగా వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అటు టిడిపిలో కూడా సరైన అభ్యర్ధిని ఎంపీగా సీటు కేటాయించకపోవడంతో..అరకు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో బలంగా వున్న సమర్ధి భవానీ పేరు కూడా తెరపైకి వచ్చింది. చాలాకాలం నుంచి ఈమె పేరు ఎంపీ అభ్యర్ధిగా అధిష్టం వద్ద ప్రస్తావనలో వుంది. ఈమెకు రాజకీయ నేపథ్యంతోపాటు ఈమె సామాజిక వర్గం వాల్మీకిలు అరకు పార్లమెంటు పరిధిలో అత్యధికులు ఉన్నారు. అలాగైనా ఈమెకు ఓటు బ్యాంకు బలంగా కనిపిస్తుంది. అందులోనూ ఈమె కుటుంబం కూడా కాస్త ఆర్ధికంగా బలంగా వుండటం, పంతంతో జరుగుతున్న ఈసారి ఎన్నికల్లో బలమైన సామాజిక వర్గంగా గుర్తింపు కూడా ఉండటంతో గెలుపు గుర్రాలను కాదని సీటు ఒకే కుటుంబంలోని వారికి ఇస్తే కావాలని ఓడించే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.

 ఈ కుటుంబానికి కూడా పార్టీలోని అధిష్టానంలోని పెద్దలతో చాలా గట్టి పరిచయాలే ఉన్నాయట. అయితే వైఎస్సార్సీపీ అధిష్టానం సీటు కేటాయించకపోతే ఇంటిపెండెంట్ గా నైనా తమ సామాజిక వర్గం బరిలోకి దించాలని చూస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానాలు వచ్చినట్టు తెలిసింది. అదే జరిగితే జాతీయపార్టీలు సీటు భవానికీ కేటాయిస్తే అరకు పార్లమెంటు నియోజకవర్గానికి నిజమైన సమర్ధరాలు అన్నమాట బలంగా సామాజిక వర్గం, అక్కడి క్యాడర్ బాహాటంగానే ప్రకటిస్తున్నారు. అయితే పార్టీ గీసిన గీటు దాటకుండా ఉంటే గౌరవంగా ఉంటుందనే కోణంలో వీరి కుటుంబం ఎటూ ప్రకటన చేయకుండా స్థబ్దుగా ఉండిపోయింది. కానీ క్యాడర్ నుంచి, ఇతర అభిమానులు, కార్యకర్తల నుంచి వెంటనే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనే ఒత్తిడి అధికంగా ఉందట. చూడాలి గెలుపు గుర్రాల రేసులో తొలిస్థానంలో ఉన్న సమర్ధి భవాని కుటుంబం అరకు పార్లమెంటు సీటు విషయంలో ఎలాంటి అడుగులు వేయబోతున్నారనేది ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే పై అవినీతి ఆరోపణలు కూడా ప్రస్తుతం మీడియాలో ప్పుమంటున్నాయి. ఈ తరుణంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఒక వేళ వైఎస్సార్సీపీ అధిష్టానం మనసు మార్చుకోకపోతే వీరు వేరే పార్టీ ఆహ్వానం తీసుకుంటే వార్ వన్ సైడ్ అయిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు ఇక్కడి ఓటర్లు. చూడాలి అత్యంత ఉత్కంఠ రాజకీయ పరిణాలమాల మధ్య ఎలాంటి అడుగులు ముందుకు పడతాయనేది..?!


araku

2024-04-09 03:43:05

అరకు ‘గీత’ పైనే ఆశలు..!

అల్లూరి మన్యం వాసుల స్థితిగతులు మారాలంటే ఉన్నత చదువు, అపారమైన పరిపాలన అనుభవం, ప్రజల్లోకి చొచ్చుకుపోయే స్వభావం, అన్నింటికీ మించి గిరిపు పుత్రులను అక్కున చేర్చుకునే గుణం, కేంద్ర ప్రభుత్వంతో మంచి సత్సంబంధాలు కలిగి ఉండాలి. ప్రస్తుతం అవన్నీ ఇపుడు అరకు ఎంపీ అభ్యర్ధి కొత్తపల్లిగీతలో కనిపిస్తు న్నాయంటున్నారు ఏజెన్సీ వాసులు. విభజన జిల్లాల్లో మొత్తం గిరిప్రాంతంగా వున్న జిల్లా అభివృద్ధి చెందాలంటే దానికి కేంద్రప్రభుత్వ సహాయం ఎంతో అవసరం. అందునా ఐటీడిఏలు ఉన్న ప్రదేశం అయితే నిధుల సమీకరణకు కూడా మార్గం సుగమం అవుతుంది. ఇలాంటి సందర్భంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలతో మంచి పరిచియాలు ఉన్న వ్యక్తులైతేనే సరిగ్గా అరకు పార్లమెంట్ ప్రాంతం, అల్లూరి పాడేరు జిల్లా పూర్తిస్థాయిలో అభిృద్ధి చెందడానికి ఆస్కారం వుంటుంది. ఇప్పటికే ఈ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఒకసారి గెలిచి మరోసారి బరిలోకి దిగుతున్న కూటమి అభ్యర్ధి కొత్తపల్లి గీతపై మన్యం వాసులు చాలా ఆశలు పెట్టుకున్నారు ఈ ప్రాంతీయులు. సాధారణంగా పార్లమెంటు నియోజకవర్గంలో ఎంపీలుగా గెలిచిన వారంతా రాజకీయపార్టీలకు ప్రతినిధులుగా ఉన్నారు తప్పితే ఇక్కడ పరిష్కారం కాని సమస్యలను పరిష్కరించే స్థాయిలో పనిచేయలేదనే అంశాన్ని గిరిపుత్రులే గగ్గోలు పెట్టి మరీ చెబుతుంటారు. అలాంటి సందర్భంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతోనూ, నేరుగా ప్రధానమంత్రి నరేంద్రమోడీతోనూ మంచి సత్సంబంధాలు కలిగిన అభ్యర్ధి కొత్తపల్లి గీత. ఆమెను అరకు పార్లమెంటు స్థానం నుంచి ఢిల్లీకి పంపితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి, కొత్తజిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు కావడానికి మార్గం సుగమం అవుతుందనేది ఇపుడు తెరపైకి వచ్చిన అంశం. ఇప్పటి వరకూ అరకు పార్లమెంటు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన వారిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఇంత పెద్ద స్థాయిలో పరిచియాలు, సత్సంబంధాలు ఉన్నవారు ఎవరూ లేరు. ఆ విషయంలో కొత్తపల్లి గీతనే ప్రపధమంగా ముందు వరుసలో నిలుచున్నారు.

స్వతహాగా గ్రూప్-1 అధికారిణిగా పనిచేసిన అనుభవం ఉన్నఈమెకు కేంద్రప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలపైనా, రాష్ట్రప్రభుత్వంలోని పరిపాలనపైనా విశేష అనుభ వం వుంది. రాజకీయంలో ప్రజాప్రతినిధిగా నిలబడాలంటే డబ్బుంటే పార్టీలు ఆధరిస్తాయి. కానీ ప్రభుత్వ అధికారులుగా, ఉన్నత చదువరిలుగా ఉన్నవారు కూడా రాజకీయాల్లో ఉంటూ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలతో మంచి పరిచియాలు పెట్టుకుంటే మాత్రం వారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలకు, జిల్లాను అభివృద్ధి 
చేయడానికి వీరికున్న మార్గాలు మరెవరకీ ఉండవు. అందులోనూ నేరుగా కేంద్రప్రభుత్వంతో మంచి పరిచియాలు, ఎలాంటి పనులనైనా నేరుగా కేంద్రప్రభుత్వం 
దగ్గరకు తీసుకెళ్లడంలో కొత్తపల్లి గీత ముందుంటారు. అంతేకాదు ఒక అధికారిగా తనకున్న అనుభవంతో సమస్యలు, అభివృద్ధి, ప్రభుత్వ సంస్థల అవసరంపై 
ప్రభుత్వానికి నివేదించడంలోనూ ఈమెది అందెవేసిన చేయి. రాజకీయ నాయకుల్లో అయితే డబ్బున్నవారు..లేదంటే సామాజిక బలం ఉన్నవారు ఎక్కువగా 
ఉంటారు. కానీ ఈమె విషయంలో సామాజిక బలం, ప్రభుత్వ అధికారిణిగా పనిచేసిన అనుభవం, పరిపాలనపై పట్టు, కేంద్రంలోని మంత్రులతో మంచి పరిచయాలు, 

ప్రభుత్వ పరిపాలన, సంక్షేమ పథకాలపై అవగాహన చాలా ఎక్కువగా ఉన్నాయి. అలా  ఉన్నవారు ప్రస్తుత రాజకీయ పార్టీల్లో వేళ్లపై లెక్కపెట్టేంత తక్కువగా 
ఉన్నారు. ప్రస్తుతం కొత్త జిల్లాలు అభివృద్ధి చెందాలన్నా, విభజన ఆంధ్రప్రదేశ్ సమస్యల పరిష్కారం జరగాలన్నా రాష్ట్రం నుంచి ఒక ఉన్నత చదువరి ఎంపీ ఒక్కరు 
ఉంటే వాటి ఫలితాలు కూడా వేగంగా వచ్చే అవకాశం చాలా వుంది.ప్రస్తుతం కొత్తపల్లి గీత అరకు పార్లమెంటు నియోజకవర్గంలో గెలిస్తే..ఒక్క తన పార్లమెంటు నియోజకవర్గానికే కాకుండా.. యావత్ రాష్ట్రానికే ఉపయోగపడే ఏకైక ఎంపీగా అవతరించనున్నారు. ఏపీలో విభజించిన కొత్త జిల్లాలకు రాష్ట్ర పతి ఆమోదాన్ని కూడా తేవడంలో ఈమె కీలకంగా వ్యహరించగలరంటే అతిశయోక్తి కాదు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే రాష్ట్రంలో 26 జిల్లాలు లెక్క. కానీ కేంద్ర ప్రభుత్వం దృష్టిలో విభజన ఆంధ్రప్రదేశ్ లో కేవలం 13 జిల్లాలు మాత్రమే. ఈ జిల్లాలను రాష్ట్రప్రభుత్వం 26 జిల్లాలు చేసి స్టేట్ గెజిట్ విడుదల చేసింది తప్పితే..కేంద్రం ఇంకా కొత్త జిల్లాలకు ఆమోదం తెలుపలేదు. ఎప్పుడైతే కేంద్రం కొత్త జిల్లాలకు ఆమోదం తెలుపుతుందో అప్పుడే కొత్త జిల్లాలకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వ సంస్థలు, అభివృద్ధి జరుగుతుంది.

ఇక్కడ మీకు అనుమానం రావొచ్చు.. రాష్ట్రప్రభుత్వ సహకారం లేకుండా, ప్రాతినిధ్యం లేకుండా ఒక ఎంపీ కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏం చేగలరని..? అవును..కేవలం ఎంపీలు.. అందునా కూటమి తరుపున గెలిచిన ఎంపీలు మాత్రమే కేంద్రం నుంచి పనులు చేయించడానికి అవసరం అవుతారు. అంతేకాదు విభజన రాష్ట్ర సమస్యలను పార్లమెంటులో గళమెత్తి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నా వీరే చేయాలి. చాలా రాజకీయపార్టీలు వారి పార్టీ తరపున ఎంపీలుగా డిల్లీకి ఎంపీలను పంపినా వారికి హిందీ రాక, ఇంగ్లీషు అంతకంటే రాక, అక్కడ మాట్లాడే బాష తెలీక చాలా మంది ఎంపీలు పార్లమెంటులో చక్కగా కునుకుతీసి బయటకి వచ్చేవారే అధికం. కాదూ 
కూడదు అనుకుంటే అప్పుడప్పుడూ పలు కేంద్రం మంత్రులకు మాత్రం వారి లెటర్ హెడ్ పై వినతులు మాత్రం అందిస్తుంటారు.  ఆంధ్రప్రదేశ్ లోనూ, వారు ప్రాతినిధ్యం వహించే పార్లమెంటు నియోజకవర్గాల సమస్యలను, జిల్లాల్లోని ఇబ్బందులను పార్లటులో లేవనెత్తలేని పరిస్థితి. ఇలా ఎలాంటి అవగాహనలేని ఎంపీలు ఉన్నచోట ఉన్నత చదువులు చదివిన వారు, పలు బాషలపై పట్టున్నవారు, గ్రూప్-1, ఐఏఎస్ అధికారులుగా పనిచేసిన వారు ఎంపీలుగా ఢిల్లీకి వెళితే వచ్చే ఫలితాలు వేరుగా ఉంటాయి.

ఖచ్చితంగా వీరికి పరిపాలనపై పట్టు వుంటుంది కాబట్టి కేంద్రానికి ఏ ఫార్మాట్ లో సదరు సమస్యను తెలియజేస్తే పనులు జరుగుతాయనేవిషయం ప్రభుత్వంలోని ఉన్నతాధికారులుగా పనిచేసిన వారికి తెలిసినట్టు మరెవరికీ తెలియదు.  కేంద్ర రాష్ట్రప్రభుత్వాల్లో మంచిపట్టు ఉంటే వారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలకు, రాష్ట్రాలకు కూడా ఎంతో మేలు జరగుతుంది అది పరిపాలనపై అనుభవం ఉన్నవారికి తప్పా మరెవరికీ తెలియదు. ఇపుదు అదే కోణంలో అరకు ఎంపీగా కొత్తపల్లి గీత కూడా మరోసారి అరకు పార్లమెంటు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇలాంటి అభ్యర్ధులను గెలిపించుకోవడం ద్వారా అటు కూటమి, ఇటు నియోజకవర్గానికి రాష్ట్రానికి కూడా ఎంతో మేలు జరుగుతుందనేది వేరేగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఇపుడు ఆరకు పార్లమెంటు నియోజకర్గం గిరిజనం అంతా గీతపైనే ఆశలు పెట్టుకున్నారు..!

araku

2024-04-02 19:06:44

అరకు ‘గీత’ పైనే ఆశలు..!

అల్లూరి మన్యం వాసుల స్థితిగతులు మారాలంటే ఉన్నత చదువు, అపారమైన పరిపాలన అనుభవం, ప్రజల్లోకి చొచ్చుకుపోయే స్వభావం, అన్నింటికీ మించి గిరిపు పుత్రులను అక్కున చేర్చుకునే గుణం, కేంద్ర ప్రభుత్వంతో మంచి సత్సంబంధాలు కలిగి ఉండాలి. ప్రస్తుతం అవన్నీ ఇపుడు అరకు ఎంపీ అభ్యర్ధి కొత్తపల్లిగీతలో కనిపిస్తు న్నాయంటున్నారు ఏజెన్సీ వాసులు. విభజన జిల్లాల్లో మొత్తం గిరిప్రాంతంగా వున్న జిల్లా అభివృద్ధి చెందాలంటే దానికి కేంద్రప్రభుత్వ సహాయం ఎంతో అవసరం. అందునా ఐటీడిఏలు ఉన్న ప్రదేశం అయితే నిధుల సమీకరణకు కూడా మార్గం సుగమం అవుతుంది. ఇలాంటి సందర్భంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలతో మంచి పరిచియాలు ఉన్న వ్యక్తులైతేనే సరిగ్గా అరకు పార్లమెంట్ ప్రాంతం, అల్లూరి పాడేరు జిల్లా పూర్తిస్థాయిలో అభిృద్ధి చెందడానికి ఆస్కారం వుంటుంది. ఇప్పటికే ఈ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఒకసారి గెలిచి మరోసారి బరిలోకి దిగుతున్న కూటమి అభ్యర్ధి కొత్తపల్లి గీతపై మన్యం వాసులు చాలా ఆశలు పెట్టుకున్నారు ఈ ప్రాంతీయులు. సాధారణంగా పార్లమెంటు నియోజకవర్గంలో ఎంపీలుగా గెలిచిన వారంతా రాజకీయపార్టీలకు ప్రతినిధులుగా ఉన్నారు తప్పితే ఇక్కడ పరిష్కారం కాని సమస్యలను పరిష్కరించే స్థాయిలో పనిచేయలేదనే అంశాన్ని గిరిపుత్రులే గగ్గోలు పెట్టి మరీ చెబుతుంటారు. అలాంటి సందర్భంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతోనూ, నేరుగా ప్రధానమంత్రి నరేంద్రమోడీతోనూ మంచి సత్సంబంధాలు కలిగిన అభ్యర్ధి కొత్తపల్లి గీత. ఆమెను అరకు పార్లమెంటు స్థానం నుంచి ఢిల్లీకి పంపితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి, కొత్తజిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు కావడానికి మార్గం సుగమం అవుతుందనేది ఇపుడు తెరపైకి వచ్చిన అంశం. ఇప్పటి వరకూ అరకు పార్లమెంటు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన వారిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఇంత పెద్ద స్థాయిలో పరిచియాలు, సత్సంబంధాలు ఉన్నవారు ఎవరూ లేరు. ఆ విషయంలో కొత్తపల్లి గీతనే ప్రపధమంగా ముందు వరుసలో నిలుచున్నారు.

స్వతహాగా గ్రూప్-1 అధికారిణిగా పనిచేసిన అనుభవం ఉన్నఈమెకు కేంద్రప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలపైనా, రాష్ట్రప్రభుత్వంలోని పరిపాలనపైనా విశేష అనుభ వం వుంది. రాజకీయంలో ప్రజాప్రతినిధిగా నిలబడాలంటే డబ్బుంటే పార్టీలు ఆధరిస్తాయి. కానీ ప్రభుత్వ అధికారులుగా, ఉన్నత చదువరిలుగా ఉన్నవారు కూడా రాజకీయాల్లో ఉంటూ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలతో మంచి పరిచియాలు పెట్టుకుంటే మాత్రం వారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలకు, జిల్లాను అభివృద్ధి 
చేయడానికి వీరికున్న మార్గాలు మరెవరకీ ఉండవు. అందులోనూ నేరుగా కేంద్రప్రభుత్వంతో మంచి పరిచియాలు, ఎలాంటి పనులనైనా నేరుగా కేంద్రప్రభుత్వం 
దగ్గరకు తీసుకెళ్లడంలో కొత్తపల్లి గీత ముందుంటారు. అంతేకాదు ఒక అధికారిగా తనకున్న అనుభవంతో సమస్యలు, అభివృద్ధి, ప్రభుత్వ సంస్థల అవసరంపై 
ప్రభుత్వానికి నివేదించడంలోనూ ఈమెది అందెవేసిన చేయి. రాజకీయ నాయకుల్లో అయితే డబ్బున్నవారు..లేదంటే సామాజిక బలం ఉన్నవారు ఎక్కువగా 
ఉంటారు. కానీ ఈమె విషయంలో సామాజిక బలం, ప్రభుత్వ అధికారిణిగా పనిచేసిన అనుభవం, పరిపాలనపై పట్టు, కేంద్రంలోని మంత్రులతో మంచి పరిచయాలు, 

ప్రభుత్వ పరిపాలన, సంక్షేమ పథకాలపై అవగాహన చాలా ఎక్కువగా ఉన్నాయి. అలా  ఉన్నవారు ప్రస్తుత రాజకీయ పార్టీల్లో వేళ్లపై లెక్కపెట్టేంత తక్కువగా 
ఉన్నారు. ప్రస్తుతం కొత్త జిల్లాలు అభివృద్ధి చెందాలన్నా, విభజన ఆంధ్రప్రదేశ్ సమస్యల పరిష్కారం జరగాలన్నా రాష్ట్రం నుంచి ఒక ఉన్నత చదువరి ఎంపీ ఒక్కరు 
ఉంటే వాటి ఫలితాలు కూడా వేగంగా వచ్చే అవకాశం చాలా వుంది.ప్రస్తుతం కొత్తపల్లి గీత అరకు పార్లమెంటు నియోజకవర్గంలో గెలిస్తే..ఒక్క తన పార్లమెంటు నియోజకవర్గానికే కాకుండా.. యావత్ రాష్ట్రానికే ఉపయోగపడే ఏకైక ఎంపీగా అవతరించనున్నారు. ఏపీలో విభజించిన కొత్త జిల్లాలకు రాష్ట్ర పతి ఆమోదాన్ని కూడా తేవడంలో ఈమె కీలకంగా వ్యహరించగలరంటే అతిశయోక్తి కాదు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే రాష్ట్రంలో 26 జిల్లాలు లెక్క. కానీ కేంద్ర ప్రభుత్వం దృష్టిలో విభజన ఆంధ్రప్రదేశ్ లో కేవలం 13 జిల్లాలు మాత్రమే. ఈ జిల్లాలను రాష్ట్రప్రభుత్వం 26 జిల్లాలు చేసి స్టేట్ గెజిట్ విడుదల చేసింది తప్పితే..కేంద్రం ఇంకా కొత్త జిల్లాలకు ఆమోదం తెలుపలేదు. ఎప్పుడైతే కేంద్రం కొత్త జిల్లాలకు ఆమోదం తెలుపుతుందో అప్పుడే కొత్త జిల్లాలకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వ సంస్థలు, అభివృద్ధి జరుగుతుంది.

ఇక్కడ మీకు అనుమానం రావొచ్చు.. రాష్ట్రప్రభుత్వ సహకారం లేకుండా, ప్రాతినిధ్యం లేకుండా ఒక ఎంపీ కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏం చేగలరని..? అవును..కేవలం ఎంపీలు.. అందునా కూటమి తరుపున గెలిచిన ఎంపీలు మాత్రమే కేంద్రం నుంచి పనులు చేయించడానికి అవసరం అవుతారు. అంతేకాదు విభజన రాష్ట్ర సమస్యలను పార్లమెంటులో గళమెత్తి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నా వీరే చేయాలి. చాలా రాజకీయపార్టీలు వారి పార్టీ తరపున ఎంపీలుగా డిల్లీకి ఎంపీలను పంపినా వారికి హిందీ రాక, ఇంగ్లీషు అంతకంటే రాక, అక్కడ మాట్లాడే బాష తెలీక చాలా మంది ఎంపీలు పార్లమెంటులో చక్కగా కునుకుతీసి బయటకి వచ్చేవారే అధికం. కాదూ 
కూడదు అనుకుంటే అప్పుడప్పుడూ పలు కేంద్రం మంత్రులకు మాత్రం వారి లెటర్ హెడ్ పై వినతులు మాత్రం అందిస్తుంటారు.  ఆంధ్రప్రదేశ్ లోనూ, వారు ప్రాతినిధ్యం వహించే పార్లమెంటు నియోజకవర్గాల సమస్యలను, జిల్లాల్లోని ఇబ్బందులను పార్లటులో లేవనెత్తలేని పరిస్థితి. ఇలా ఎలాంటి అవగాహనలేని ఎంపీలు ఉన్నచోట ఉన్నత చదువులు చదివిన వారు, పలు బాషలపై పట్టున్నవారు, గ్రూప్-1, ఐఏఎస్ అధికారులుగా పనిచేసిన వారు ఎంపీలుగా ఢిల్లీకి వెళితే వచ్చే ఫలితాలు వేరుగా ఉంటాయి.

ఖచ్చితంగా వీరికి పరిపాలనపై పట్టు వుంటుంది కాబట్టి కేంద్రానికి ఏ ఫార్మాట్ లో సదరు సమస్యను తెలియజేస్తే పనులు జరుగుతాయనేవిషయం ప్రభుత్వంలోని ఉన్నతాధికారులుగా పనిచేసిన వారికి తెలిసినట్టు మరెవరికీ తెలియదు.  కేంద్ర రాష్ట్రప్రభుత్వాల్లో మంచిపట్టు ఉంటే వారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలకు, రాష్ట్రాలకు కూడా ఎంతో మేలు జరగుతుంది అది పరిపాలనపై అనుభవం ఉన్నవారికి తప్పా మరెవరికీ తెలియదు. ఇపుదు అదే కోణంలో అరకు ఎంపీగా కొత్తపల్లి గీత కూడా మరోసారి అరకు పార్లమెంటు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇలాంటి అభ్యర్ధులను గెలిపించుకోవడం ద్వారా అటు కూటమి, ఇటు నియోజకవర్గానికి రాష్ట్రానికి కూడా ఎంతో మేలు జరుగుతుందనేది వేరేగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఇపుడు ఆరకు పార్లమెంటు నియోజకర్గం గిరిజనం అంతా గీతపైనే ఆశలు పెట్టుకున్నారు..!

araku

2024-04-02 19:06:40

మాడుగులలో బూడి కాకపోతే బూడిదే..!

అనకాపల్లి జిల్లాలో మొట్టమొదట గెలిచే సీటుగా వైఎస్సార్సీపీ మాడుగుల నియోజకవర్గంపై ఇపుడు నీలి నీడలు కమ్ముకున్నాయి. తొలుత డిప్యూటీ సీఎం బూడి ము త్యాల నాయుడుకి సీటు ఉంటే సునాయాసంగా గెలిచేవారని జిల్లా మొత్తం పెత్త ఎత్తున ప్రచారం జరిగింది. ఆ సీటు కాస్త ఇపుడు అధిష్టానం ఆయన కూతురు జెడ్పీ టీసీ అనూరాధకు  కేటాయించి, బూడిని అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి పంపడంతో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఏవిధమైన రాజకీయ అనుభవం లేని మహిళకు సీటు కేటాయిస్తే ఖచ్చితంగా సీటు కోల్పేయే ప్రమాదం ఉందని తెలిసి ఇపుడు కేడర్ మొత్తం మూగనోము పట్టారు. అంతేకాదు మాడుగులలో బూడి కాకపోతే సీటు బూడిదలో పోసిన పన్నీరేనని క్రింది స్థాయి నాయకత్వం మొత్తం పెదవి విరుస్తున్నారు. అందులోనూ, ఆమెకు నియోజకవర్గంలోని సర్పంచ్ లు, ఎంపీటిసీలు, జెడ్పీసీలతో పెద్దగా సత్సంబంధాలు లేవు. ఏదో మంత్రి కూతురు జెడ్పీటీసీ అంటే జెడ్పీటీగానే చూశారు తప్పితే మరో ఆలోచన ఆమెపై నేటి వరకూ క్యాడర్ కి లేదు. మళ్లీ ఆయన తనయుడు వెంకటేష్ తండ్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, నియోజకవర్గంతోపాటు జిల్లాల్లోనూ యువజన విభాగం, ఇతర అన్ని వర్గాల ప్రజలకు చాల దగ్గరగా ఉంటూ తండ్రి పదవికి, పార్టీకి మంచి పేరు తీసుకు వచ్చారు. ఒక దశలో సీటు వెంకటేష్ కే కేటాయించి, అనకాపల్లి ఎంపీ సీటుని తండ్రికి ఇస్తారని అంతా భావించారు. అంతలా పార్టీ కార్యక్రమాలు చేపడుతూ, క్యాడర్ కి కావాల్సిన పనులు చేయడంతో అందరికీ వెంకటేష్ తలలో నాలుకలా అయిపోయాడు. 

మంత్రి కొడుకు అనే కాకుండా.. పార్టీలో ఒక పేరున్న కార్యకర్తగా తన విధులు తాను నిర్వహించుకుంటూ పోతూ, అన్ని మండలాలు, గ్రామాల్లోనూ పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేశారు. అయితే మహిళా సెంటిమెంటు, జిల్లా పార్టీ మహిళా అధ్యక్షురాలు కావడంతో వైఎస్సార్పీపీ అనూరాధకు సీటు కేటాయించింది. అయితే అప్పటి నుంచి క్యాడర్ మొత్తం కినుక వహిస్తున్నారని మాడుగుల మొత్తం మారు మ్రోగిపోతున్నది. ఈ దశలో మాడుగుల సీటు పోయినా పోయే అవకాశాలు ఉన్నాయని కూడా అంతా బల్లగుద్ది చెబుతున్నారు. జెడ్పీటీసీ మొహం మండలం కేంద్రంలో తప్పితే మరెక్కడా తెలియదని, అదే బూడి తనయుడు వెంకటేష్ అయితే యువతతోపాటు, నాయకులకు కూడా సుపరిచితం కావడంతో పార్టీ సీటు కేటాయించినా ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా క్యాడర్ మొత్తం మంత్రి బూడి వద్ద ప్రస్తావించారట. అయితే తాను నిమిత్త మాత్రుడనని..పార్టీ అధిష్టానం ఏం చెబితే అది చేయాలని చెప్పినా క్యాడర్ వినకపోవడంతో ఇపుడు బూడి కూడా అంతర్మధనంలో పడినట్టుగా చెబుతున్నారు.

 ఒక్క మాడుగుల సీటు మార్పు వలన ఇటు అసెంబ్లీ, అటు పార్లమెంటు కూడా దక్కే పరిస్థితి ఉందా అనే ప్రశ్నలు ఉద్బవిస్తున్నాయి. పార్ఠీ నిర్ణయం ఎలా ఉన్నా..కనీసం పరిశీలనలో ఉన్న వెంకటేష్ పేరుని తెరపైకి తీసుకురావడం ద్వారానైనా ప్రతిపక్షపార్టీలను ధీటుగా ఎదుర్కొని..తండ్రి  తరువాత తనయుడు ఉన్నాడని..ఉంటాడని..క్యాడర్ కూడా బలంగా నమ్ముతోంది. రసవత్తర రాజకీయం నడుమ వైఎస్సార్సీపీ మాడుగుల ఎమ్మెల్యే సీటు విషయంలో పునరాలోచించాలని కూడా క్యాడర్ మొత్తం డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే టిడిపి అభ్యర్ధి రామానాయుడికి సీటు కేటాయించాలని జరుగుతున్న రచ్చే ఇపుడు మళ్లీ వైఎస్సార్పీపీలో జరిగినా జరగొచ్చుననే వాదన కూడా తెరపైకి వస్తున్నది. ఈనేపథ్యంలో పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుంది..? మాడుగుల సీటుని తనయురాలికి కాకుండా తనయుడికి ఇచ్చి సీటు దక్కించుకుంటుందా..? లేదంటే బూడి లేకపోతే మిగిలే బూడిదతో సరిపెట్టుకుంటుందానే అనేది తేలాల్సి వుంది..!

madugula

2024-03-30 19:40:54

అనకాపల్లిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

స్థానిక  సత్యలక్ష్మి గ్రాండ్ ఫంక్షన్ హాల్ లో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.  ముఖ్య అతిథిగా  పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బీశెట్టి వెంకట సత్యవతి ,జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ భీశెట్టి వరాహ సత్యవతి, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గొర్లి సూరిబాబు , కె.కోటపాడు జెడ్పీటిసి అనురాధ, మహిళా శిశు సంక్షేమ శాఖ జేడీ చిన్మయి దేవి , ఏఎస్సై మణి కుమారి, నర్సీపట్నం జెడ్పీటీసీ కుసుమ, అనకాపల్లి జిల్లా ఐసిడిఎస్  ప్రాజెక్ట్ ల సిడిపిఓలు,  సూపర్వైజర్లు, అంగన్వాడి వర్కర్లు,  వివిధ గ్రామాల మహిళా సర్పంచులు, మహిళా సభ్యులు జెడ్పిటిసిలు, కె. అనంతలక్ష్మి ,పిడి మహిళా అభివృద్ధి , శిశు సంక్షేమ  శాఖ, ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.పిడి ఆఫీస్ సిబ్బంది, అనకాపల్లి జిల్లాలో గల బెస్ట్ వర్కర్స్ కు అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో అధికసంఖ్యలో  మహిళలు పాల్గొన్నారు.

anakapalli

2024-03-09 01:14:45

అనకాపల్లిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

స్థానిక  సత్యలక్ష్మి గ్రాండ్ ఫంక్షన్ హాల్ లో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.  ముఖ్య అతిథిగా  పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బీశెట్టి వెంకట సత్యవతి ,జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ భీశెట్టి వరాహ సత్యవతి, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గొర్లి సూరిబాబు , కె.కోటపాడు జెడ్పీటిసి అనురాధ, మహిళా శిశు సంక్షేమ శాఖ జేడీ చిన్మయి దేవి , ఏఎస్సై మణి కుమారి, నర్సీపట్నం జెడ్పీటీసీ కుసుమ, అనకాపల్లి జిల్లా ఐసిడిఎస్  ప్రాజెక్ట్ ల సిడిపిఓలు,  సూపర్వైజర్లు, అంగన్వాడి వర్కర్లు,  వివిధ గ్రామాల మహిళా సర్పంచులు, మహిళా సభ్యులు జెడ్పిటిసిలు, కె. అనంతలక్ష్మి ,పిడి మహిళా అభివృద్ధి , శిశు సంక్షేమ  శాఖ, ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.పిడి ఆఫీస్ సిబ్బంది, అనకాపల్లి జిల్లాలో గల బెస్ట్ వర్కర్స్ కు అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో అధికసంఖ్యలో  మహిళలు పాల్గొన్నారు.

anakapalli

2024-03-09 01:14:45

లంకెలపాలెం జంక్షన్.. నిత్యం నరకం..!

ఆ జంక్షన్ వచ్చిందంటే ద్విచక్ర వాహనాల దగ్గర నుంచి నాలుగు చక్రాల వాహన దారుల వరకూ కంగారు పడాల్సిందే. కళ్లముందు రోడ్డు మొత్తం అధ్వాన్నంగా మారి ఎత్తుపల్లాలు, అతుకులు బొతులుకులుగా ఉన్నా దీనిని పట్టించుకునే వారే కరువయ్యారు. అందునా సిగ్నల్ పాయింట్ కూడా కావడంతో వాహనాదారులు అస్థవ్యస్థంగా ఉన్న రోడ్డుతో నరకం చూడాల్సి వస్తుంది. లంకెలపాలెం జంక్షన్ నాలుగు రోడ్ల కూడలి అత్యంత దారుణంగా తయారైంది. ఈ జంక్షన్ నుంచి పరవాడ ఫార్మాసిటీ వెళ్లాలంటే సర్కస్ ఫీట్లు చేయాల్సిందే. దీనితో వాహనాలు మరమ్మత్తులకు గురవుతున్నాయి. ఫార్మాసిటీకి ఉద్యోగులు, స్థానికులు, వాహనదారులు నిత్యం తిరిగే పరిస్థితి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కనీసం రోడ్డు పడిగిలిపోయి పిక్క బయటకు తేలిన ప్రదేశాల్లో సైతం ప్చాచ్ వర్క్ చేయడం లేదంటే పరిస్థితి ఎంతలా ఉందో వేరే చెప్పాల్సిన పనిలేదు. నిత్యం ఈ రోడ్డులో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు రాకపోకలు సాగిస్తున్నా..ఈ రోడ్డుకి మాత్రం మోక్షం రాలేదు. అసలే రోడ్డు బాగాలేక ఇబ్బందులు పడుతుంటే.. ఎన్టీపీసీకి వెళ్లే భారీ వాహనముల (బొగ్గు, ప్లై యాష్) లారీల వలన దుమ్ము కాలుష్యం తో ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తక్షణమే ఎన్టీపీసీ యాజమాన్యం సిఎస్ఆర్ నిధులతో మరమ్మత్తులు చేయాలని లేదంటే ఆందోళన చేపడతామని లంకెలపాలెం ప్రజలు హెచ్చరిస్తున్నారు. జంక్షన్ రోడ్డంతా పాడైపోయినా ఎవరూ పట్టించుకోకపోవడం వలన వాహనాల దూళి మొత్తం ఇళ్లల్లోకి వస్తుందని ఆగ్రం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న వ్యాపార సముదాయాల్లో పెద్ద ఎత్తున దూళి రావడంతో తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. దూళి రేగ కుండా ప్రతిరోజు వాటర్ స్ప్రింగ్లింగ్ చేసేవారని ఇప్పుడు అది కూడా మానేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం నీరు చల్లితే దూళి ఎగరకుండా వుంటుందని..అలా చేయకపోవడం వలన గృహ సము దాయాలు సైతం దుమ్ముదూళితో నిండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీపీసి యాజమాన్యం కానీ, ఆర్అండ్బీ కానీ పట్టించుకోకపోతే ఈ మార్గంలో వాహనాలు తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.

lankelapalem

2024-03-06 11:01:34

వేడెక్కుతున్న విశాఖ రాజకీయం..!

విశాఖలో రాజకీయం వేడెక్కుతుంది..అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష టిడిపీలతోపాటు కాంగ్రెస్, బీజేపీలు, ఇతర వామపక్ష పార్టీలు సైతం ఇంకా అభ్యర్ధులను ఖరా రు చే యలేదు. అందరికీ పార్టీలు హామీలు మాత్రమే ఇచ్చాయి. వైఎస్సార్సీపీ అయితే ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో దఫదఫాలుగా అభ్యర్ధులను మారుస్తూ వస్తోంది. దీనితో ఎవరికి సీటు వస్తుందో..ఎవరి ఆశలు ఆవిరైపోతాయో..ఆ బాధతో ఎవరు ఏ పార్టీలోకి జంప్ అయిపోతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఆర్ధిక బలం, కులబలం, అండ బలం ఉన్న అభ్యర్ధులను, ఖచ్చితంగా గెలిచే వారిని మాత్రమే ఈసారి రంగంలోకి దించాలని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. దీనితో అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ పూర్తికాలేదు. ఉమ్మడి విశాఖజిల్లాలోని దాదాపుగా ఒకటి రెండు స్థానాలు తప్పితే మిగిలన అన్ని స్థానాలు, విశాఖనగరంలోని నాలుగు స్థానాలు, ఒక ఎంపీ పరిస్థితి కూడా సీటు తేలని అభ్యర్ధిత్వంగానే ఉండిపోయింది. సీట్లు ఆశిస్తున్నవారికి సీటు వస్తుందనే గ్యారెంటీ ఎక్కడా కనిపించడం లేదు. తెగించి వారు పోటీచేసే స్థానాల్లో కార్యక్రమాలు చేసుకుందామన్నా..ఆర్ధికంగా వెనుకబడిపోవడం తప్పితే మరేదీలేదని అభ్యర్ధులు కూడా వారి సీటుకి గ్యారెంటీ వచ్చిన తరువాత మాత్రమే ఖర్చుచేసుకోవాలని ధీమాగా ఉన్నారు. కొందరు ఆశావాహులు పార్టీ కేంద్ర కార్యాలచాల చుట్టూ సీటు కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. 

2024 సాధరణ ఎన్నికలు ఈసారి అన్ని రాజకీయపార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, ప్రభుత్వం తీరును కూడా ప్రజలు కూడా పూర్తిగా అర్ధం చేసుకోవడంతో ఆచితూచి అభ్యర్ధులను ఎంపికలు చేస్తున్నారు. ఆర్ధిక బలం ఉన్నంత మాత్రాన సీటు వచ్చే పరిస్థితి పోయింది. ప్రస్తుతం కుల రాజకీయాలు బలంగా ఉన్నందున ఎక్కు ఓటు బ్యాంకు ఏ సామాజిక వర్గంలో అయితే ఉంటుందో అక్కడ అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను నిలబెట్టేందుకు రాజకీయపార్టీలు సమాలోచనలు చేస్తున్నాయి. ఇదే సమయంలో ఒక్క ఎమ్మెల్యే స్థానానికే 50 నుంచి 75 కోట్ల రూపాయలు ఖర్చు చేసే బడా బడా నేతలనే పార్టీలు కూడా ఎంపిక చేస్తున్నాయి. దానికి తోడు వివిధ సర్వే సంస్థలు, మీడియా సంస్థలు చేపట్టిన సర్వేల ఆధారంగా కూడా అభ్యర్ధుల ఎంపికలు జరుగుతున్నాయి. రాజకీయపార్టీల దగ్గర తమ బలాన్ని ప్రదర్శించి పార్టీలు మారిపోయినా..వారికున్న పలుకుబడి, పేరు ప్రఖ్యాతలు, ఆర్ధిక బలం ఆధారంగా మాత్రమే ఎమ్మెల్యే సీట్లు ఇచ్చే విషయంలో అధిష్టానాలు ఆలోచిస్తున్నాయి. దానికి అనుగుణంగానే పార్టీకోసం బాగా పనిచేసిన వారు, ఆపై అన్ని విధాలా పార్టీ పెట్టిన నియమ నిబంధనలు అనుసరించే వారినే ఎంపిక చేయాలని చూస్తున్నా..ప్రధాన పార్టీలు సీట్లు పంపకం మాత్రం ఇంకా ఒక కొలిక్కి రాలేదు.

గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఓటుకి రూ.500 రేటు పలికితే ఈసారి రూ.2వేల నుంచి 3వేలు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ స్థాయిలో ఓటు బ్యాంకుని బట్టి ఖర్చు భరించే నాయకులను కూడా పార్టీలు సమాయాత్తం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అవసరం అనుకుంటే ఓటుకి రూ.5వేలు ఇచ్చైనా అధికారంలోకి రావాలనే గట్టి పట్టుదలతో ప్రధాన పార్టీలు ఉన్నట్టుగా కనిపిస్తున్నది. దానికోసమే ప్రత్యేక కార్యాచరణలు కూడా చేసుకుంటున్నారనే వాదన బలంగా తెరమీదకు వస్తున్నది. ప్రభుత్వం అధికారికంగా కులగణన చేపట్టనప్పటికీ, ప్రభుత్వం అందచేసిన సంక్షేమ పథకాల ఆధారంగా, కుల సంఘాలను ఏర్పాటు చేసుకున్న సమావేశాలు, లెక్కింపును బట్టి ఖర్చు చేయాలని చూస్తున్నారని సమాచారం అందుతోంది. సామాజిక వర్గాన్ని బట్టి ఖర్చు చేయడానికి, వారికి అభివృద్ధి ఫలాలు అందించడానికి, నామినేటెడ్ పదువులు ఇవ్వడానికి, ఇతర సదుపాయాలు కల్పించడానికి అప్పుడే ఆఫర్లుకూడా ఇచ్చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. రాష్ట్రప్రభుత్వంలోని అన్ని శాఖలు, ఇతర ప్రధాన అంశాల్లో ఎన్ని నామినేటెడ్ పదవులుంటే అన్నింటినీ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న సామాజిక వర్గాలకు ఇవ్వడానికి కూడా ముందుగానే ఒప్పందాలు కుదిరాయని చెబుతున్నారు. ఎల్లప్పుడూ తాము పనిచేస్తే ఓట్లు వేయించుకొని మీరు అధికారం వెలగబెడితే మేము ఏమైపోవాలనే వాదన, స్థానికులను కాదని నాన్ లోకల్ వారిని తెరమీదకు తీసుకువచ్చి స్థానిక నాయకుల రాజకీయ భవిష్యత్తుకు మంగళం పాడే విధానాలను సైతం బలంగా తిప్పికొడుతున్నారు. పక్కా లోకల్ అనే వాయిస్ ని బలంగా తేవడంతో విశాఖజిల్లాతో టు నియోజకవర్గాల్లో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. అంతా అనుకూలిస్తే మార్చి 10వ తేదీలోపు సీట్లు సర్ధుబాటు అవుతుందని చెబుతున్నారు. చూడాలి విశాఖ రాజకీయ చట్రంలో సామాజిక, ఆర్ధిక, అండ బలంతో సీట్లు పొంది బరిలో నిలిచేదెవరో..!

vizag

2024-03-04 06:28:01

పార్కుల అభివృద్ధికి ప్రాధాన్యత - నగర మేయర్ గొలగాని

 ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించేందుకు జివిఎంసి పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. గురువారం ఆమె గాజువాక 87వ వార్డు పరిధిలోని అమరావతి, మదర్ థెరీసా, వాకర్స్, మహాత్మా గాంధీ పార్కులతోపాటు తిరుమల నగర్ చిల్డ్రన్ పార్కులను అభివృద్ధి పరిచేందుకు సుమారు రూ.50.70 లక్షల వ్యయంతో గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, వార్డు కార్పొరేటర్ బొండా జగన్నాథం, జోనల్ కమిషనర్ బంటు సన్యాసినాయుడు, గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త ఉరుకూటి చందు, వైయస్సార్సీపి వార్డ్ ఇంచార్జ్ శ్రీనులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నగర్ మేయర్ మాట్లాడు తూ ప్రతి వార్డులో ప్రజలకు ఆహ్లాదం కల్పించేందుకు పార్కులను జివిఎంసి అభివృద్ధి పరచడం జరుగుతుందని తెలిపారు. 

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో విశాఖ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశామని తెలిపారు. 87వ వార్డులో సుమారు 51 లక్షల రూపాయలతో తిరుమల నగర్, అమరావతి పార్కు, మదర్ థెరీసా పార్కు, వాకర్స్ పార్కు, మహాత్మా గాంధీ పార్కులను అభివృద్ధి తోపాటు సీసీ డ్రైన్లు, కల్వర్టుల నిర్మాణ పనులు చేపట్టేందుకు శంకుస్థాపన చేసామన్నారు. అనంతరం గాజువాక శాసనసభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో విశాఖ నగరం ఎంతో అభివృద్ధి సాధించిందని, గాజువాక ప్రాంతానికి కోట్లాది రూపాయలు వెచ్చించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. రానున్న రోజుల్లో గాజువాక అభివృద్ధికి మరిన్ని నిధులు వెచ్చించి ప్రతి వార్డును ఒక మోడల్ వార్డుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జివిఎంసి ఇంజనీరింగ్ అధికారులు, ఇతర వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2024-02-22 11:49:30

ప్రియదర్శిని స్టేడియం ను త్వరగా ఆధునీకరించండి

మహా విశాఖ నగరంలో గల ఇందిరా ప్రియదర్శిని స్టేడియంను అధునాతనంగా ఆధునీకరించి వినియోగంలోకి త్వరితగతిన తీసుకురావాలని జివిఎంసి కమీషనర్ సిఎం.సా యికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. గురువారం జివిఎంసి అధికారులతో కలసి ఇందిరా ప్రియదర్శిని స్టేడియం అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, ఇందిరా ప్రియదర్శిని స్టేడియం విశాఖ నగరంలో అతి పెద్దదని, ఈ స్టేడియం నందు అంతర్జాతీయ క్రీడలు జరిగి ఉన్నాయని, రానున్న రోజులలో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ క్రీడలు జరుగనున్నందున అందుకు సిద్దంగా ఈ స్టేడియంను మరింత అభివృద్ధి పరచి ఆధునీకరణతో తీర్చిదిద్ది వినియోగంలోనికి త్వరిత గతిన తీసుకురావాలని అధికారులకు సూచించారు. అనంతరం స్టేడియం లోపల జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి ఆడియన్స్ గేలరీ, విద్యుత్ స్తంబాలు, గ్రిల్ల్స్, స్కోర్ బోర్డు బిల్డింగ్, గార్డెనింగ్, పెయింటింగ్, లైటింగ్ మొదలగు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. ఆడియన్స్ ప్రధాన గేలరీకి ఆనుకొని వున్న హాల్స్, గదుల నందు ఇండోర్ గేమ్స్ ను ఏర్పాటు చేయాలన్నారు.  అనంతరం  స్టేడియం గేలరీల వెనుక భాగంలో గల ఖాళీ ప్రదేశాలలో టెన్నిస్, బాడ్మింటన్, వాలీ బాల్ తదితర క్రీడా సంబంధిత  కోర్ట్ లను, పార్కింగ్ స్తలం, కెఫెటేరియా, ల్యాండ్ స్కేపింగ్, చిల్ద్రెన్ ప్లే ఏరియా, జిమ్ పరికరాలు మొదలగు వాటిని ఏర్పాటు చేయుటకు ప్రణాలిక లను సిద్దం చేసి సమర్పించాలని పర్యవేక్షక ఇంజనీర్ సత్యనారాయణ రాజును కమీషనర్ ఆదేశించారు.

 స్టేడియం అంతటా పచ్చదనంతో ల్యాండ్ స్కేపింగ్, మినియేచర్స్, కూర్చునే బల్లలను ఏర్పాటు చేయాలని అసిస్టెంట్ డైరెక్టర్ అఫ్ హార్టికల్చర్ సురేష్ ను ఆదేశించారు. మార్చి నెల 15వ తేదీ నాటికి స్టేడియం నందు అన్ని పనులను పూర్తి చేసి అధునాతనంతో అందంగా తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం దొండపర్తి నుండి నేషనల్ హైవే వరకు అక్కయ్యపాలెం రోడ్డు విస్తరణ, ఫుట్ పాత్ లు, కాలువలు, జంక్షన్ అభివృద్ధి, సెంటర్ మీడియన్, లైటింగ్, తదితర పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని పర్యవేక్షక ఇంజనీర్ వేణుగోపాల్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక ఇంజనీర్లు సంతోషి, మత్సరాజు, ఎ.సి.పి. ఝాన్సీలక్ష్మి, ఎ.ఎం.ఒ.హెచ్. రాజేష్ తదితరులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2024-02-22 10:59:28

పారిశుద్ధ్యం, సుందరీకరణ పనులు త్వరగా పూర్తిచేయండి

సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి విశాఖ నగర పర్యటన సందర్భంగా పారిశుధ్యం, సుందరీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జీవీఎంసీ కమిషనర్ సీఎం.సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన సీఎం విశాఖ నగరానికి విచ్చేయుచున్న సందర్భంగా ఎన్టీఆర్ జంక్షన్ నుండి చిన్న ముసిడివాడ శారద పీఠం వరకు పారిశుద్ధ్య పనులను, సుందరీకరణ పనులను అదనపు కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ తో కలిసి  పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ముఖ్య మంత్రి పర్యటన సందర్భంగా పారిశుద్ధ్యం, సుందరీకరణ పనులతో పాటు రోడ్లు మరమ్మత్తులు పనులు, ఆకర్షణీయమైన మొక్కలతో సెంటర్ మీడియన్ లను ఆకర్షణీ యంగా తీర్చిదిద్దాలని, వీధి దీపాల నిర్వహణ, ఫుట్ పాత్ లు, పెయింటింగ్ పనులు వెంటనే చేపట్టి పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్ కుమార్, పట్టణ ప్రణాళిక అధికారి సురేష్ కుమార్, ఎస్.ఇ రామమోహన్ రావు, జోనల్ కమీషనర్ హేమావతి, డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ ఎం.దామోదరరావు పాల్గొన్నారు.

Visakhapatnam

2024-02-20 14:06:59