1 ENS Live Breaking News

ప్రధాని మోడీ అంటే ఢిల్లీ ప్రజలకు తిరుగులేని నమ్మకం - డా.కంచర్ల

ప్రధాని నరేంద్ర మోడీ అంటే ఢిల్లీ ప్రజలకు తిరుగులేని నమ్మకమనే విషయం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే ప్రధాన ఉదాహరణ అని ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, టిడిపి నాయకులు, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ యూనియన్(ఏపీజేయూ) గౌరవాధ్యక్షలు డా.కంచర్ల అచ్యుత రావు పేర్కొన్నారు. ఢిల్లీలో ఎన్నికల ఫలితాల సందర్భంగా ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ ఎన్నికల్లో మిత్రపక్ష బీజేపీ విజ యం ప్రధాని మోడీ  పాలన పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసానికి, నమ్మకానికి తిరుగులేని సంకేతమన్నారు. అంతేకాకుండా అవినీతి, కుంభకోణా ల్లో కూరుకుపోయిన ఆప్ అధినేత కేజ్రీవాల్ సైతం ఓటమి చెందడం ఆ పార్టీపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకతకు చెంపపెట్టని అభివర్ణించా రు. ఢిల్లీ వాసులు ఆప్ పరిపాలనపై ఎంత విసుగు చెందారో చెప్పడానికి వచ్చిన ఫలితాలేనని చెప్పుకొన్నారు. దానికితోడు ఢిల్లీలో తెలుగు ప్రజ లున్న ప్రాంతాల్లో ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు ప్రచారం అద్భుతమైన ఫలితానిచ్చిందనడానికి ఇంతకు మించి ప్రధాన ఉదా హరణ మరొక్కటి ఉండదన్నారు. 2025 కూటటి విజయాల పరంపర డిల్లీ వరకూ పాకిందన్నారు. ఇదే ఊపుతో అన్ని రాష్ట్రాల్లో కూటమి విజ య దుందుబి మోగిస్తుందనే ఆశాభాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిల్లీలో బీజేపీ మిత్రపక్ష విజయం పట్ల డా. కంచర్ల హర్షం వ్యక్తం చేశా రు. 

visakhapatnam

2025-02-08 16:54:06

కరక రంగురాళ్ల క్వారీపై రాజస్థాన్ రిపోర్ట్..?!

గొలుగొండ మండంలోని కరక రంగు రాళ్ల క్వారీలో లభ్యమవుతున్న అలెక్స్ సిసలైన పచ్చవైడూర్యం మామూలు రాయి కాదు.. దేశంలోనే అత్యంత విలువైన రాయి.. ఈ రాయిని మిషన్ పై కోతవేసి రూపు రాళ్లకి మరింత గిరాకీ.. ఇక్కడ సంపదను వెలికి తీస్తే భారత దేశం అగ్రరా జ్యం అమెరికాను మించిపోతుంది.. అత్యంత సంపన్నమైన దేశంలా మారుతుంది.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు సాక్షాత్తూ.. కరక రంగు రాళ్ల క్వారీలోని రంగురాయిని నవరత్నాల ల్యాబులో పరిశీలించిన నిపుణులు.. ఏకంగా రూ.25 లక్షలు ఖర్చు చేసి మరీ రాయి నాణ్య తను పరిశీలన చేయించారట.. దానితో కరక ప్రాంతం మొత్తం వసమైతే రాత్రి రాత్రికి దేశంలోని అత్యంత సంపన్నులు అయిపో వాలనేది వ్యాపా రుల లక్ష్యం.. అంతే రంగంలోకి గనులు భూగర్భ శాఖ అధికారులను రంగంలోకి దించారు.. విషయం ఏంటంటే సుమారు 20 హెక్టార్ల కొండ ప్రాంతాన్ని పదేళ్లకు లీజుకి తీసుకోవడానికి.. కట్ చేస్తే సీన్ రివర్స్ అయ్యింది.. రంగురాయి వ్యవహారం బగ్గుమంది..?!

అనకాపల్లి జిల్లా, గొలుగొండ మండలంలోని కరక రంగురాళ్ల క్వారానీ ఎలాగైనా లీజుకి అధికారికంగా కాజేయాలనే రంగురాళ్ల వ్యాపారుల ప్రయత్నం బెడిసి కొట్టింది. దేశంలోనే అత్యంత విలువైన రంగురాళ్లు లభ్యమయ్యే రంగురాళ్ల క్వారీని కొందరు ప్రజాప్రతినిధుల అండతో లీజు రూపంలో కొట్టేయాలని చూసిన ప్రయత్నం వెనుక వేల కోట్ల రూపాయల ప్లాన్ దాగి వుందంటే అతిశయోక్తి కాదేమో. అవును మీరు చదువుతున్నది అక్షరాలా నిజం. కరక రంగు రాళ్ల క్వారీ కోసం తెలియని దేశం లేదు.. ఇక్కడ దొరికే అత్యంత విలువైన రంగురాళ్లని కొనని రంగురాళ్ల వ్యాపారీ లేడు. అంతెందుకు ఇక్కడ వ్యపారం చేసిన గేదెలను కాసే రైతు నర్సీపట్నంలో కోటీశ్వరుడయ్యాడు.. టీ షాపు నిర్వహించే ఛాయ్ వాలా సూపర్ మార్కెట్ ఓనర్ అయ్యాడు.. ఇపుడు ఏకంగా అంతకుమించి ఆదాయం మళ్లీ అదే రంగు రాయి నుంచి వస్తుంటే ఎవరు మాత్రం వదిలేస్తారు చెప్పండి.

 దానికోసమే.. రంగురాళ్ల వ్యాపారులంతా సిండికేట్ గా ఏర్పడి కరక రంగు రాళ్ల కొండ కొట్టేయడానికి పక్కాగా ప్లాన్ వేశారు. గనులు భూగర్భ శాఖ ద్వారానే అధికారికంగా లీజు తీసుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే అంతా అఫిషియల్ గానే పావులు కదిపారు. దీనితో నిషేధిత అటవీ ప్రాంతంలోకి గనులు భూగర్భ శాఖ అధికారులు ఎంటర్ అయ్యారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు మోకాలు అడ్డుపెట్టారు. ప్రభుత్వ సమాచారం, అధికారిక లేఖ లేకుండా ఏవిధంగా రిజర్వు ఫారెస్టులోకి అడుగు పెడతారని.. 144 సెక్షన్ కూడా అమల్లో ఉన్న ప్రాంతంలో సర్వేలు ఎలా చేస్తారంటూ అనధికార వ్యవహారం నడుపుతున్న వారిని అదపులోకి తీసుకున్నారు. అయితే సాధారణ సర్వే అనే అందరికీ తెలిసినా విషయం విశాఖలోని ఓ ప్రైవేటు హోటల్ జరిగిన రంగు రాళ్ల వ్యాపారుల సమావేశం కాస్త బయటకి వచ్చేసింది. దీనితో పక్కా ప్లాన్ ప్రకారమే మైనింగ్ అధికారులు కరక రంగురాళ్ల కార్వీలోకి అడుగుపెట్టినట్టు తేలిపోయింది. 

అయినా రిజర్వు ఫారెస్ట్ లోకి వెళ్లాలంటే ముందుగా అటవీశాఖ అనుమతి తీసుకోవాలి. లేదంటే జిల్లా జాయింట్ కలెక్టర్ అనుమతి అయినా తప్పని సరి.. అవేవీ లేకుండా  నర్సీపట్నం భూగర్భ గనుల శాఖకు చెందిన రాయల్టీ ఇన్స్పెక్టర్ సత్యమూర్తి ని, ఆశాఖ ఉన్నతాధికారులు సర్వేకి వెళ్ళమని ఆదేశించారని.. ఇదే విషయాన్ని అటవీ శాఖ అధికారులకు ఇచ్చిన స్టేట్మెంట్లో పేర్కొనడం ఇపుడు చర్చనీయాంశం అవుతున్నది. ఎన్నికల ముందు జరిగిన రంగురాళ్ల వ్యాపారుల సిండికేట్ వ్యవహారం ప్రభుత్వం ఏర్పాటు కాగానే లీజు దక్కించుకునేందు తెరవెనుక ఉన్న వ్యాపారులు, ప్రజాప్రతినిధులు సీఎఓం స్థాయిలో పావులు కదుపుతున్నట్టు సమాచారం అందుతుంది. అయితే  మైనింగ్ అధికారులతో పాటు గతంలో రంగురాళ్ల స్మగ్లింగ్  కేసులు ఉన్న కొందరు వ్యక్తులు కూడా, రిజర్వ్ ఫారెస్ట్ లోకి ప్రవేశించడం ఇప్పుడు కొత్త అనుమానాలకు తెరతీస్తున్నది. 

మైనింగ్ అధికారి వెంట  మరో ఆరుగురు వ్యక్తులు  కరక కొండపైకి వెళ్లడం చర్చనీయాంశం అవుతున్నది. కాగా ఈ వ్యహారం నడిపించేందుకు కొందరు వ్యాపారులు రూ.35 లక్షలు ఖర్చుచేసి అధికారికంగా మైనింగ్ అధికారులను కరక క్వారీపై సర్వేకి పంపినట్టు తెలిసింది.  కరక కొండపై సుమారు 20 హెక్టార్లు  విస్తీర్ణంలో రంగురాళ్ల తవ్వకాల కోసం అనుమతులు తీసుకుంటామని, ముందుగా రంగురాళ్లు లభించే ప్రాంతం కోసం సర్వే చేయాలని వీరు మైనింగ్ అధికారులతో కలిసే రిజర్వ్ ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యారని తెలిసింది.  కరక రంగురాళ్ల క్వారీలో అక్రమంగా  కొన్ని ఏళ్ల క్రితం పెద్ద ఎత్తున తవ్వకాలు జరిగాయి. ఇక్కడ క్వారీలో జరిగిన ప్రమాదాల్లో  పలువురు చనిపోవడంతో ప్రభుత్వం అక్రమ తవ్వకాలను నిరోధించింది. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు రంగురాళ్ల వ్యాపారులు తెలివిగా మైనింగ్ అధికారులను రంగంలోకి దించారనే ఆరోపణలు ఉన్నాయి. అసలు దరఖాస్తు లేనప్పుడు మైనింగ్ అధికారులు సర్వేకి ఎలా వస్తారని అటవీశాఖ ప్రశ్నిస్తోంది.  

రిజర్వ్ ఫారెస్ట్ లో అటవీశాఖ అనుమతి లేకుండా ప్రవేశించడం నిషిద్ధమని.. ఈ విషయాన్ని తాము అటవీశాఖ ముఖ్య అధికారులకు తెలియజేశామని చెబుతున్నారు.   గనుల శాఖ రాయల్టీ ఇన్స్పెక్టర్ సత్యమూర్తి తో పాటు గొలుగొండ మండలం సారిక మల్లవరం గ్రామానికి చెందిన రంగురాళ్ల వ్యాపారి కొల్లాన కొండలరావు, ఎల్లవరం గ్రామానికి ఆల్లు నూకరాజు రాజు , చోడవరం ప్రాంతానికి చెందిన పోతి శివకుమార్, కూర్మ దాసు అప్పలనాయుడు, ఒంటెద్దు వీర నాగేశ్వరరావు, రామచంద్రరావు అనేవారిని అదుపులోకి తీసుకొని స్టేట్మెంట్ రికార్డ్ చేశామని నర్సీపట్నం రేంజ్ ఆఫీసర్ లక్ష్మీ నర్సు చెప్పారు. రిజర్వ్ ఫారెస్ట్ లోకి అక్రమంగా ప్రవేశించిన ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నా మన్నారు. తేడాలు బయట పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని రేంజర్ చెప్పారు. కానీ.. తెరవెనుక జరిగిన వ్యవహారాన్ని మాత్రం ఇటు అటవీశాఖ అధికారులు కూడా దాచిపెడుతున్నట్టు తెలిసింది. గనులశాఖకు ముందుగా లక్షల్లో కమిషన్లు ఇచ్చారని.. అంటే చాలా పెద్ద స్థాయిలోనే కరక రంగురాళ్ల క్వారాని తిరిగి అధికారికంగా చేజిక్కించుకోవాలని చూస్తున్నారని తేలిపోయింది. చూడాలి..ఈ విషయంలో తెరవెనున్న ఉన్నవారిని ఏ ప్రభుత్వశాఖ బయటపెడుతుందో..?!

golugonda

2025-02-01 14:52:02

విశాఖలోని రుషికొండ పేలస్ లోపలా ఎలా ఉందో చూశారా..?

వైఎస్సార్సీపీ ప్రజాధనాన్ని వందల కోట్లలో వెచ్చించి మరీ నిర్మించిన రుషికొండ చాలా కాలం బయట ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడిం ది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దానిని బాహ్య ప్రపంచానికి తెలియజేసేందుకు మొత్తం రుషికొండ మొత్తం ప్రత్యే కంగా షూట్ చేయించింది. ఆ వీడియో కాస్త దేశవ్యాప్తంగా ఇపుడు వైరల్ అవుతున్నది.

visakhapatnam

2025-01-26 15:56:09

విశాఖలో రోడ్డెక్కిన సచివాలయ సిబ్బంది..

విశాఖలో వార్డు సచివాలయ సిబ్బంది రోడ్డెక్కారు. టిడిపికి చెందిన ఒక కార్పోరేటర్ అనుచితంగా చేసిన వ్యాఖ్యలకు నిరసన ఉద్యోగులంతా రోడ్డెక్కారు. జీవిఎంసి ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన ధర్నా చేపట్టారు. ప్రజాప్రతినిధులు తమపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలన్నారు. ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.

visakhapatnam

2025-01-26 15:53:03

అనకాపల్లిలో దాడి మౌనం దేనికి సంకేతం..?!

అనకాపల్లి రాజకీయాల్లో దాడివీరభద్రరావుది ప్రత్యేక స్థానం.. పాత్ర.. క్యాడర్ కు దిశా నిర్ధేశం.. చిటికెవేస్తే క్యాడర్ మొత్తం కళ్లముందుంటారు.. ఆదేశించిన పనిని ఐదునిమిషాల్లో చేయిస్తారు.. ప్రజల మనిషిగా.. పార్టీ నేతగా ఎంతో పేరు, హోదా, హుందా ఉన్న నేత ఇపుడు ఎందకనో మౌనం పాటిస్తున్నారు. కూటమి ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గంతోపాటు, ఇతర నియోజవర్గాల్లోనే దాడి పాచికలు ఎంతగానో పనిచేశాయి. క్యాడర్ కూడా గట్టిగా పనిచేశారు. మంచి విజయాన్ని సాధించారు. అపుడే అంతా దాడికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి వర్గంలోకి తీసుకుంటారని. కానీ ఆ ఊసే లేదు తెలుగుదేశం పార్టీలో. ప్రధాన కార్పోరేషన్ పదవులు.. చరిష్మా ఉన్న పదవులన్నీ చాలా మంది జూనియర్లకే కట్టబెట్టేస్తోంది టిడిపి. అపుడు కూడా దాడి ఊసుగానీ.. మాట గానీ లేదు. అలాగని పార్టీ అధికారిక కార్యక్రమాల్లో కూడా దాడి ప్రస్తావనే ఉండటం లేదు. చోట నాయకులు స్టేజీల మీద హుందా కనిపిస్తుంటే ఎంతో సీనియర్, పార్టీకోసం శ్రమించిన వ్యక్తి విషయంలో పార్టీ వెనకడుగువేస్తుందా.. లేదంటే కూటమి నేతలే ప్రక్కన పెట్టారా..? 

అసలు ఏం జరుగుతందని అనకాపల్లి నియోజకవర్గంలో దాడి మౌనంగా ఉంటున్నారనే విషయం ఒక్క అనకాపల్లి జిల్లాలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చలే జరుగుతున్నాయి. ఎన్ని జరుగుతున్నా.. ఏమవుతున్నా.. ఇటు దాడి వీరభద్రరావు సైతం మౌనాన్ని వీడి అసలు ఏం జరుగుతుంది.. ఎందుకు సైలెంట్ అవ్వాల్సి వచ్చిందనే విషయాన్ని క్యాడర్ తో కూడా చర్చించడం లేదు. దీనితో ఆయనకోసం, పార్టీ సూచించిన అభ్యర్ధుల గెలుపు కోసం పనిచేసి వారంతా ఇపుడు డీలా పడిపోతున్నారు. అధినేత యాక్టివ్ గా లేకపోవడంతో.. కూటమి నేతల కార్యక్రమాలకు కూడా కొందరు దూరంగానే వుంటున్నారు. తమ నాయకుడిని పార్టీ గుర్తించలేదన్నట్టుగానే క్యాడర్ మొత్తం నిరాశగా ఉన్నారు. పండుగలు, పబ్బాలు, ఎన్నికలే కాదు ఏ విషయంలోనైనా దాడి వీరభద్రరావుది జిల్లాలో ప్రత్యేక స్థానం.

 అలాంటిది ఎన్నికల్లో ఎంతో గట్టిగా పనిచేసిన ఈయన ఒక్కసారి తెరమరుగు అయిపోయినట్టుగా కనీసం ఎక్కడా కనిపించ కుండా తిరుగుతుండటం దేనికి సంకేతమో ఎవరీ అర్ధం కావడం లేదు. అలాగని పార్టీలో ఎంతో కీలకంగా పనిచేసిన దాడి ఇద్దరు తనయులు కూడా తండ్రి బాటలోనే నెమ్మదైపోయారు. ఎప్పుడూ మీడియా వేదికగా అన్ని విషయాలు చర్చించే దాడి కుటుంబం అధికారిక కార్యక్రమాలకు దూరమవడం, ప్రభుత్వం కూడా కీలకమై పదవుల్లో వీరిని గుర్తించి పదవులు కట్టబెట్టకపోవడం కూడా క్యాడర్ కి రుచించడం లేదు. ఎన్నికల ముందు బాహాటం వైఎస్సార్సీపీని కాదని సొంత పార్టీ టీడిపిలోకి వచ్చి. నియోజవకర్గంలో తన పట్టుని నిలబెట్టిమరీ కూటమి అభ్యర్ధుల గెలుపు విషయంలో ఎంతో ముందుచూపుతో వ్యవహరించారు. 

ఎన్నికల సమయంలో దాడి సహకారం కోరిన ఎమ్మెల్యే కొణతాల.. ఎంపీ సీఎం రమేష్ లు సైతం ఇపుడు ఎక్కడా ఎప్పుడూ దాడి ఊసెత్తకపోవడం కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతుంది. పార్టీలోని యాక్టివ్ గా పనిచేసే నాయకులు తటస్థంగా ఉన్నా.. మౌనంగా ఉన్నా.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నా పార్టీలో ఒక వ్యతిరేక సంకేతం వెళ్లే ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికే చాలా మంది క్యాడర్ కూడా దాడి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని వీళ్లు కూడా వెళ్లడం మానేస్తున్నారు. అలాగని నేతలు కూడా ఈయనను పట్టించుకోనట్టే వ్యవహరిస్తున్నారు. అంటే ఇక్కడ ఇదంతా పార్టీ ఆదేశమా..? లేదంటే కావాలని చేస్తున్నారా..? అదీ కూడదంటే పదవులు ఇవ్వాల్సి వస్తుందని ఈ రకంగా చేస్తున్నారో తెలియడం లేదుంటున్నారు నియోజకవర్గంలోని క్యాడర్. 

మాజీ మంత్రిగా ఎమ్మెల్సీగా అనకాపల్లి రాజకీయాలను శాసించిన దాడి ఇపుడు ఒక యోగిలా మౌనం వహించడం మాత్రం రానున్న రోజుల్లో పెను మార్పులకే సంకేతం అంటున్నారు విశ్లేషకులు. ఈ నేపథ్యంలో స్వయంగా దాడి గానీ.. లేదంటే టిడిపి.. అదీ కాదంటే కూటమి నేతలే ఈయన మౌనం వెనుక అసలు విషయాన్ని క్యాడర్ కి చెప్పాల్సిన సమయం ఆశన్నమైంది. లేదంటే ప్రస్తుతం ఉన్న క్యాడర్ కూడా పకి పనిచేస్తున్నట్టు నటించి.. తమ నేతను ప్రక్కన పెట్టేస్తే తామెందుకు పనిచేస్తామని అనుకుంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో దాని ఫలితాలు స్పష్టంగా కనిపించే అశకాశం ఉంది. చూడాలి రాజకీయ విశ్లేషకులకు కూడా అందని దాడి మౌనం వెనుక అసలు రహస్యం ఏమై వుంటుందనేది..!

anakapalli

2025-01-16 16:05:10

అంతర్ రాష్ట్ర దొంగలు తిరుగుతున్నారు జాగ్రత్త-ఎస్ఐ

అంతర్ రాష్ట్ర దొంగలు(నార్త్ ఇండియా గ్యాంగ్) గ్రామాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని క్రిష్ణదేవిపేట ఎస్ఐ తారకేశ్వర్రావు సూచించారు. ఈ మేరకు ఆయన నర్సీపట్నం డీఎస్పీ సూచనలు మీడియా ద్వారా తెలియజేశారు. ఈ నార్త్ ఇండియా గ్యాంగ్ రాత్రి సమయంతోపాటు పగటి పూట కూడా దొంగతనాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు. రాత్రి సమయాల్లో ప్రజలు, గ్రామాల్లోని యువత అప్ర మత్తంగా ఉండాలన్నారు. గ్రామానికి చెందిన వారు కాకపోయినా.. ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగినా వెంటనే పోలీసు స్టేషన్ కి సమాచా రం అందించాలన్నారు. గ్రామాల్లోని పెద్దలు ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అంతేకాకుండా రాత్రి సమయాల్లో ఇంట్లో పడుకునే సమ యం లో తలుపులు గట్టిగా వేసుకోవాలని హెచ్చరించారు.  ప్రయాణాలు చేసేవారు విలువైన వస్తువులు, సామాన్లు వెంటతీసుకు వెళ్లాలని ఎస్ఐ సూచించారు.

krishnadevipeta

2025-01-16 14:42:33

ప్రజా, పోలీసు సేవల్లో ఎల్లప్పుడూ ఉపకార్ ముందుంటుంది.. డా.కంచర్ల

మహావిశాఖలో ఉపకార్ ట్రస్ట్ నిరంతర సేవలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది.. అన్ని వర్గాల ప్రజలతోపాటు, ప్రభుత్వ, పోలీసుశాఖలకు కూడా తమవంతుగా అవసరమైన సామాగ్రిని అందిస్తూ.. అందని మన్ననలు పొందుతోంది.. కోరి కొలిచేవారికి కొంగుబంగారంగా.. ఆపద, సహా యం అన్నవారికి లేదనకుండా.. కాదనకుండా నిరాటంకంగా.. నిర్విరామంగా..నిశ్వార్ధంగా  సేవలు అందించే ఉపకార్ ట్రస్ట్ చైర్మన్, కళాభోజ, ప్రముఖ సినీ నిర్మాత, ఏపీ ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్, ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అధినేత డా.కంచర్ల అచ్యుతారావు పోలీసుల సేవలోనూ తరిస్తున్నారు.

 ప్రజలను పోలీసులు కంటికి రెప్పలా కాపాడుతుంటే.. వారికి కావాల్సిన వస్తు సామాగ్రిని ఇవ్వడానికి నేనున్నాంటూ ముందుకి వచ్చి అడిగిందే తడువుగా అన్ని సమకూరుస్తున్నారు.. అన్ని వర్గాల ప్రజలే కాదు.. పోలీసులు కూడా ఇపుడు డా.కంచర్ల అందిస్తున్న సేవలను కీర్తిస్తున్నారు. ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ సేవల్లో ప్రతినిధులనే సేవకులుగా మార్చి అడిగిన వస్తుసామాగ్రి అందిస్తూ.. అందరివాడిగా నిలుస్తున్నారు డా.కంచర్ల..!

సమాజంలో మూడో స్థంభంగా ఉన్న పోలీసుశాఖకు సేవ చేయడం ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు అందడానికి ఆస్కారం వుంటుందని ప్రముఖ సినీ నిర్మాత, ఏపీ ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్, ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అధినేత డా. కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు. గొడవలు, అల్లర్లు జరగకుండా ప్రజలు ప్రశాంత జీవనం సాగించడానికి పోలీసులు చేసే విధి నిర్వహణ సమాజానికి చాలా అవసరని చెప్పారు. ఆరిలోవ క్రైమ్ పోలీస్ స్టేషన్ అభ్యర్ధన మేరకు సుమారు రూ.60వేలు విలువచేసే కలర్ ప్రింటర్, కంప్యూటర్లను ఉపకార్ ట్రస్టు ద్వారా వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకి పోలీసుల రక్షణ చాలా అవసరమన్నారు. 

అలాంటి పోలీసులకు ఉపకార్ ట్రస్టు ద్వారా కోరిన సేవలు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని ప్రకటించారు. ఇప్పుడే కాకుండా ఎప్పుడు అవసరం వచ్చినా తమను సంప్రదించవచ్చునని కూడా భరోసా ఇచ్చారు. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులకు ఆడియో ఎక్విప్ మెంట్.. సిసి కెమెరాలను అందజేసిన డా. కంచర్ల ఇపుడు ఇపుడు ఖరీదైన ప్రింటర్, కంప్యూటర్లను కూడా అందించి పోలీసు సేవలో కూడా భాగస్వా మిగా నిలుస్తున్నారు. కాగా ఉపకార్ ట్రస్టు ద్వారా అందించే కంప్యూటర్,ప్రింటర్లను ఆరిలోపవ పోలీసులకు ఉపకార్ ట్రస్టు సిబ్బంది సుధీర్, రాజు, అందజేశారు.

 ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ, తమ ఉపకార్ ట్రస్టు చైర్మన్ గా కాకుండా అందరు మెచ్చే నిశ్వార్ధ సేవకుడి వద్ద సహాయకులుగా పనిచేయడం ఆనందంగా ఉందని.. ఆయన చేసే ప్రతీ సేవలో భాగస్వాములు కావడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు.  ఉపకార్ ఛారిట బుల్ ట్రస్టుని  ఎల్లప్పడూ సేవల్లో అగ్రగామిగా నిలబెట్టేందుకు జీవనదిలా తమ చైర్మన్  సేవలు చేస్తూనే ఉంటారని చెప్పుకొచ్చారు. ప్రజల తోపాటు, పోలీసులకు కూడా తమ ట్రస్టు ద్వారా అందిస్తున్న సేవలపట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది.

visakhapatnam

2024-12-31 05:39:52

అర్చకులు, పురోహితుల సమస్యల పరిష్కారానికి కృషి - మిలీనియం స్టార్ కంచర్ల ఉపేంద్ర బాబు

ప్రజల్లో ఆధ్యాత్మిక విలువలను పెంచే అర్చకులు, పురోహితుల సమస్యలు పరిష్కారం కావాలంటే సమిష్టిగా పనిచేస్తే సాధ్యపడుతుందని ప్రముఖ సినీ సంఘ సేవకులు, నటులు, మిలీనియం స్టార్  కంచర్ల ఉపేంద్ర బాబు అన్నారు. ఆదివారం బాలభాను పురోహిత, అర్చక సం ఘం ఆధ్వర్యంలో కంబాలకొండలో నిర్వహించిన వనమహోత్సవంలో హీరో ఉపేంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భం గా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హీరో  మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి అర్చకులు పురోహితులు ఏకతాటిపై రావాలన్నారు. వీరి సంక్షే మం కోసం ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు కృషి చేస్తుందని..అదేవిధంగా తానూ అండగా ఉంటానని భరోసాఇచ్చారు. 

సర్వేజనా సుఖినోభవంతు అంటూ అందరినీ మంచి మనసుతో ఆశీర్వదించే అర్చకుల సమస్యల పరిష్కారానికి  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని కోరారు. ఇప్పటికే తన తండ్రి.. ప్రముఖ నిర్మాత డా. కంచర్ల అచ్యుతరావు పురోహితుల సమస్యలను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకెళ్లారన్నారు. అదేవిధంగా రాష్ట్రప్రభుత్వం వద్దకు కూడా తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా సమ స్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అర్చకులు, పురోహితులు లోక కళ్యాణం కోసం చేసే కార్యక్రమాల్లో విశాఖ అభివృద్ధిని కాంక్షిస్తూ పూజ లు చేయాలని కోరారు. అంతేకాకుండా  సినిమాల్లో నటించాలనే ఉత్సాహం ఉన్న యువతీ యువకుల కోసం ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ కార్యాలయంలో  సంప్రదించాలని కోరారు. 

అర్చక సంఘం అధ్యక్షులు జ్యోషుల కామేశ్వర శర్మ మాట్లాడుతూ,  తమ సంఘానికి స్థలం కేటాయించి భవన నిర్మాణానికి సాయం అందించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. అనంతరం యువ హీరో కంచర్ల ఉపేంద్రబాబు అర్చక సంఘం ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బాలభాను అర్చక, పురోహిత సంఘం వ్యవస్థాపకులు పంతుల వెంకటరమణ , మావుడూరు కిషోర్ కుమార్ శర్మ తో పాటు సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Visakhapatnam

2024-12-29 10:20:48

విశాఖ జూ క్యూరేటర్ గా జి.మంగమ్మ బాధ్యతలు

విశాఖపట్నం ఇందిరాగాంధీ జులాజికల్ పార్కు క్యూరేటర్ గా జి. మంగమ్మ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అటవీశాఖ ముఖ్యకార్యదర్శి అధికారిక ఉత్తర్వుల నేపధ్యంలో ఆమె బాధ్యతలు చేపట్టారు. కాగా ఆమె అక్టోబర్ 7 నుంచి ఎఫ్ఏసి గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సంద ర్బంగా సిబ్బంది ఆమెను మర్యాదపూర్వకంగా కలిసిశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, జంతు ప్రదర్శన శాలలో ప్రజలకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించడంతోపాటు, అన్ని వర్గాల వారికి చేరువ చేస్తామని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు. 

visakhapatnam

2024-12-26 12:47:22

కూటమి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాం..సచివాలయ ఉద్యోగులు

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులమంతా కూటమి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేయడానికి, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆదేశాలను అమలు చేయడానికి సిద్దంగా ఉన్నామని సచివాలయ ఉద్యోగ సంఘాల జేఏసి పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్యే గణబాబుని కలిసి వినతి పత్రం సమర్పించి. అపరిష్క్రుతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగుల మాదిరిగానే ఖచ్చితమైన పనిగంటలు అమ లు చేయాలని, ప్రభుత్వం బకాయి ఉన్న 3 నోషనల్ ఇంక్రిమెంట్లు వెంటనే మంజూరు చేయాలని కోరారు. 

ప్రస్తుతం ఇస్తున్న రూ.30వేలు జీతం ఎక్కడా తమ కుటుంబాలకు సరిపోవడం లేదని.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జూనియర్ అసిస్టెంట్ పేస్కేలు అమలు చేయాలని, ప్రభుత్వం మంజూరు చేసిన సెలవులను మంజూరు చేయాలని, సెలవు రోజుల్లో ప్రత్యేక విధుల నుంచి తప్పించాలని, కార్యాలయంలో స్టేషనరీ, ఇతర ఖర్చులు భారం ఉద్యోగుల మోపకుండా ప్రభుత్వమే అన్నీ మంజూరు చేయాలని, తాము చేస్తున్న సేవలు గుర్తించాలని, నేటికీ అమలు చేయాలని సర్వీసులు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయాలని, అధికారుల వేధింపులు, సమావేశాల్లో చులకన చేసి మాట్లాడాన్ని నియంత్రించాలని, తదితర సమస్య లు పరిష్కరించాలని ఎమ్మెల్యేని కోరారు. 

ఒక లక్షా 23 వేల పైచిలుకు ఉద్యోగులు వారి యొక్క కుటుంబాలతో సహా, అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తమకు మంచి చేస్తుందని వేయికళ్లతో ఎదురుచూస్తున్నామన్నారు.  ఉద్యోగుల సమస్యలు విన్న ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి సచివాలయ ఉద్యోగుల ఇబ్బందులను తీసుకెళతానని చెప్పారన్నారు. ఎమ్మెల్యేని కలిసిన వారిలో బండారు శ్రీనివాస్,శిష్టు నాగేశ్వరరావు, పార్ధసారది, సురేష్ కుమార్, సుమంత్ అబ్రహం,  భార్గవ్ సుతేజ్, వెస్లీ, ధనుంజయ్, వరప్రసాద్ ,రాధిక, ఇంద్రజ , కృష్ణవేణి, వెంకన్న పాత్రుడు,   తదితరులు పాల్గొన్నారు.

visakhapatnam

2024-12-20 19:09:07

ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కి ఉపకార్ ట్రస్ట్ సౌండ్ సిస్టమ్, సిసి కెమెరాలు వితరణ

విశాఖలోని ఆరిలోవ దరి హనుమంతువాక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉపకార్ ట్రస్టు అధినేత, సినీ నిర్మాత, కళాభోజ, నిశ్వార్ధ సేవకులు డా.కంచర్ల అచ్యుతరావు సిసి కెమెరాలు, నూతన సౌండ్ సిస్టమ్ ను శుక్రవారం సమకూర్చారు. ట్రస్టు కార్యాలయ సిబ్బంది నాగు ఆధ్వర్యంలో వాటిని పోలీసులకు అందజేశారు. ఇటీవల ఈ ప్రాంతంలో అవసరమైన సామాగ్రిని మార్పుచేయడానికి ట్రాఫిక్ పోలీసులు చేసిన అభ్యర్ధ మేరకు ఉపకార్ ట్రస్టు నుంచి వెంటనే వాటిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డా.కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజలకు నిరాటంకంగా సేవలందించేందుకు ఉపకార్ ట్రస్టు ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు.  ప్రజా, ప్రభుత్వ సేవలు ఇకపై కూడా కొనసాగుతా యన్నారు. 

అందునా ట్రాఫిక్ పోలీసులు ప్రయాణీకుల రక్షణ కోసం నిర్విరామంగా కృషి చేస్తూ విధులు నిర్వహిస్తారని కొనియాడారు.  వారికి ఎప్పుడు ఏవిధమైన సహాయ సహకారాలు కావాలన్నా అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. అదేవిధంగా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద పోలీసు హెచ్చరికలు ప్రతీ ఒక్కరూ పాటించాలని కోరారు. పోలీసులు హెచ్చరికలు పాటించడం ద్వారా సురక్షితంగా గమ్యం చేరడానికి ఆస్కారం వుంటుందన్నారు. తోటివారికి తమ వంతు సహాయం చేసే విషయంలో ప్రతీ ఒక్కరూ ముందు రావాలని ఈ సందర్భంగా డా.కంచర్ల అచ్యుతరావు పిలుపునిచ్చారు. 

Visakhapatnam

2024-12-20 13:38:25

ప్రమాద బాధితునికి ‘మేమున్నాం’టీమ్ ఆర్థిక చేయూత

 ఆపదలో ఉన్న వ్యక్తులను ఆదుకునేందుకు ‘మేమున్నాం టీం’ వ్యవస్థాపకుడు అనిశెట్టి చిరంజీవి శ్రీ లక్ష్మీ దంపతులు ఎల్లప్పుడూ ముం దుంటారు. కోవిడ్ సమయంలో బాధితులకు సహాయ సహకారాలు అందించేందుకు ఏర్పడిన మేమున్నాము టీం ప్రతినిధులు నాటి నుండి ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఎవరు ఆపదలో ఉన్నారని తెలుసుకున్న టీమ్ అధ్యక్షుడు చిరంజీవి తనకు చేతనైనంత సహాయ సహకారాలు అందిస్తూ ఆదుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొయ్యూరు మండలం డౌనూరు గ్రామానికి చెందిన యాళ్ల శ్రీను గత నెల 29న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో చిరంజీవి శ్రీ లక్ష్మీ దంపతులు తక్షణసాయంగా రూ. 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి వైద్య సేవలకు తోడ్పాటు అందించారు.

అనంతరం అతని పరిస్థితిని టీం సభ్యులు, స్నేహితులు శ్రేయోభిలాషులకు తెలియజేసి సేకరించిన 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని జిసిసి మాజీ చైర్మన్ ఎంవివి ప్రసాద్ ద్వారా బాధిత కుటుంబీకులకు అందజేసి మేమున్నాము అనే భరోసా కల్పించారు. అలాగే క్షతగాత్రుడు శ్రీను భార్య బాలింత కావడంతో అనిశెట్టి బ్రదర్స్ 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు కూరగాయలను అందజేశారు. ఆపద సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచి ఆదుకున్న చిరంజీవి శ్రీ లక్ష్మీ దంపతులతో పాటు మేమున్నాము టీం సభ్యులు తమకు సహాయ సహకా రాలు అందించిన అందరికీ బాధిత కుటుంబీకుల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన అభ్యర్థన మన్నించి బాధిత కుటుంబీకులకు సహాయ సహకారాలు అందించిన దాతలు శ్రేయోభిలాషులకు చిరంజీవి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొయ్యూరు సర్పంచ్ మాకాడ బాలరాజు, మాజీ ఎంపీటీసీ బి శివరామరాజు, టిడిపి నేతలు రొంగల గోవిందు చంద్రరావు కిముడు శ్రీరాములు కృష్ణ తదితర పలువురు పాల్గొన్నారు.

koyyuru

2024-12-20 13:30:27

సినిమా కార్మికులు ఆధార్ అప్డేషన్, ఈ-శ్రమ్ నమోదు చేయించుకోవాలి.. డా.కంచర్ల అచ్యుతరావు

ఆంధ్రప్రదేశ్ సినీ పరిశ్రమలోని కళాకారులు, ఉద్యోగులు, కార్మికులు ఆధార్ అప్డేడేషన్ తప్పని సరిగా చేయించుకోవాలని ఏపీ ఫిల్మ్ ఎంప్లా యిస్ ఫెడరేషన్ చైర్మన్, ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు అధినేత, ప్రముఖ సంఘసేవకులు, సినీ నిర్మాత డా. కంచర్ల అచ్యుతరావు కోరారు.  ఈ మేరకు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుడూ, భారత విశిష్ట ప్రాధికార సంస్థ (ఉడాయ్) మరో 6 నెలలు అంటే 2025 జూన్ 14 వరకూ గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నదన్నారు. ఈ నేపథ్యంలో సినీ కార్మికులు వారి ఆథార్ ను అప్డేట్ చేసుకోవడంతోపాటు, ఈ-శ్రమ్ కార్డులు కూడా పొందాలన్నారు. తద్వారా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కల్పించే ప్రయోజనాలు పొందడానికి ఆస్కారం వుంటుందన్నారు. తెలంగాణలో ఉండిపోయిన ఆంధ్రా కళాకారులు, కార్మికులు, ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఈ ఉచిత అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆధార్ లో వివరాలు నవీకరణ చేసుకోవాలన్నారు. 

తద్వారా ఆంధ్రప్రదేశ్ అడ్రస్, వివరాలు నమోదుకి అధికారికంగా అవకాశం కలుగుతుందన్నారు. ఇపుడు పాఠశాలలో అడ్మిషన్ మొదలు బ్యాంకు ఖాతా ఓపెన్ చేయడం వరకూ ప్రతి అంశంలోనూ ఆధార్ కార్డు తప్పనిసర అయిందని... ఒకసారి ఆధార్ నమోదు చేసుకున్న వారు ప్రతి పదేండ్లకోసారి అప్‌డేట్ చేసుకోవాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) సూచించిందని పేర్కొన్నారు.  అందుకు అనుగుణంగా ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు  ముగిసిపోగా.. అన్ని వర్గాల నుంచి వస్తున్న అభ్యర్ధనల ఈ నేపథ్యంలో భారత విశిష్ట ప్రాధికార సంస్థ (ఉడాయ్) మరో ఆరు నెలలు అంటే 2025 జూన్ 14 వరకూ గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నదని తెలియజేశారు.పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ వంటి అంశాల్లో మార్పులు చేసుకోవచ్చునన్నారు. వెంటనే ఆధార్ వివరాలను పెద్ద ఎత్తున సినీ కార్మికులు నవీకరణ చేయించుకోవాలన్నారు. 

ఇప్పటికే అన్నిజిల్లాలకు ఈ సమాచారాన్ని పంపించామని చెప్పారు.  ఆన్‌లైన్‌లో ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలంటే ముందు యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో లాగిన్ కావాలని... అటుపై మీ రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ నంబర్‌కు వచ్చే ఓటీపీతో లాగిన్ కాగానే, అప్పటికే ఉన్న మీ వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తాయన్నారు. అందులో ఉన్న వివరాలు సరిగ్గా ఉన్నాయా.. లేదా.. చెక్ చేసుకొని... వాటిని సవరించాల్సి వస్తే సవరించాలిని పేర్కొన్నారు. వాటిని ధృవీకరించుకుని నెక్ట్స్ ఆప్షన్ క్లిక్ చేయాలని... తర్వాత కనిపించే డ్రాప్ డౌన్ లిస్ట్ సాయంతో డాక్యుమెంట్లు ఎంచుకోవాలన్నారు. ఆయా డాక్యుమెంట్ల స్కాన్డ్ పత్రాలు అప్ లోడ్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేస్తే... 14 అంకెల అప్ డేట్ రిక్వెస్ట్ నంబర్ రావడంతో అప్ డేట్ స్టేటస్ ఎక్కడి వరకూ వచ్చిందో చెక్ చేసుకోవచ్చునని డా.కంచర్ల అచ్యుతరావు వివరించారు.  స్వచ్చంద సంస్థలు, విద్యాసంస్థలు, బాధ్యతగల మీడియా  ఉచిత ఆధార్ అప్డేట్ పై సమాచారాన్ని సామాజిక మాద్యమాల్లో షేర్ చేస్తూ అన్ని వర్గాలప్రజలను చైతన్య పరచాలని కోరారు. ఈ అవకాశాన్ని సినిమా కార్మికులంతా తప్పసరిగా సద్వినియోగం చేసుకోవాలని డా.కంచర్ల సూచించారు.

visakhapatnam

2024-12-17 12:50:34