1 ENS Live Breaking News

తిరుపతి-తిరుమల రోప్ వేపై అధ్యయనం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శీ వేంకటేశ్వరస్వామివారిని చేరుకోవడానికి భక్తులకు ఇప్పటి వరకూ రోడ్డు మార్గమే వుంది. కాగా ఇపుడు రోప్ వే ద్వారా మార్గాన్ని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే విషయంపై త్వరలో అధ్యయనం జరగనుంది. ఈ మేరకు నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సంస్థను ఆదేశించినట్టు ఎంపీ గురుమూర్తి ఓ ప్రకటనలో తెలిపారు. సంస్థ అధ్యయనం చేసి డీపీఆర్ ఇస్తే తొలుత నాలుగు కిలోమీటర్లు మేర రోప్ వే వేయాలని తరువాత.. మిగిలిన ప్రాంతాన్ని రెండవ భాగంలో నిర్మించాలని భావిస్తున్నారట. ఈ రోప్ వే నిర్మాణం కార్యరూపం దాలిస్తే శ్రీవారి దర్శించడానికి వెళ్లే సమయంలో ఏడు కొండలను స్వయంగా భక్తులు తిలకించడానికి, ప్రకృతి అందాలను ఆశ్వాదించడానికి ఆస్కారం వుంటుంది.

Tirumala

2023-01-05 15:29:00

కశ్మీర్ ను మైరపించే లంబసింగి అందాలు

ఆ గ్రామం సముద్ర మట్టానికి సుమారు 4వేల అడుగుల ఎత్తులో ఉంది.. అక్కడ ఉష్ణోగ్రతలు చలికాలంలో 1-3కి పడిపోతాయ్ ..మంచు అయితే వర్షంలా కురుస్తుంది...ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఆంధ్రాలో ఉన్నామా..కాశ్మీర్ లో ఉన్నామా అనే భావన కలుగుతుంది..అతి తక్కువ సమయంలో జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించింది ఆ గ్రామం.. అదే ఆంధ్రా ఊటీ లంబసింది..అదేంటి ఆంధ్రా ఊటి అరకు కదా అనుకుంటున్నారు కదా.. ఆ పేటెంట్ నేమ్ ఇపుడు లంబసింగి సొంతమైంది. అవునండీ మీరు చదువుతున్నది నిజమే..లంబసింగి టూరిజం స్పాట్ గా తయారైన తరువాత 70శాతం పర్యాటకులు కేవలం లంబసింగిలోని అత్యల్పంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు..ఆ మంచులో లేలేత భానుడి అందాలు...అకాశంలో తేలియాడేటట్టు కనిపించే మబ్బు తెరలను చూడటానికి వెళుతున్నారంటే అతిశయోక్తి కాదు. విశాఖ మన్యంలోని ఇపుడు ప్రముఖ పర్యాటక కేంద్రంగా పేరుగాంచింది ఈ లంబసింగి ప్రాంతం..  ఇక్కడ విశేషం ఏంటంటే ఏడాది పొడవునా ఈ ప్రాంతం శీతలంగానే ఉంటుంది. అక్టోబరు మొదలుకుని ఫిబ్రవరి వరకు మంచు వర్షంలా కురుస్తూనే వుంటుంది. 

ఉదయం 10 గంటలకైనా మంచు నీడ వీడ కుండా ఎదుటి వ్యక్తి కూడా కనబడనంగా వాతావరణం మారిపోతుంది. శీతల గాలులు వీస్తూ పర్యాటకులకు ఎంతో ఆహ్లాదం పంచుతూ రారమ్మని ఆహ్వానిస్తుంది. ఒకప్పుడు ఈ గ్రామంలో ఉండే 250మంది ఇపుడు 2500గా మారారంటే దానికి కారణం ఈ గ్రామం ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మారడమే. అయితే ఇక్కడ రాత్రి బస చేయడానికి ప్రత్యేక వసతులు ఉంటే మాత్రం మరింత మంది పర్యాటకులు వచ్చే పరిస్థితి వుండేది. ప్రతి ఏడాది ఏదో ఒక సమయంలో 1-5 నుంచి 1- 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదైన సంఘటనలు అధికంగా వుంటాయి. అలాంటి ఉష్ణోగ్రతలు అతిశీతల వాతావరణం కాశ్మీర్ లోనూ, కొడైకెనాల్ లోనూ, ఊటీలో మాత్రమే కనిపిస్తాయి.. కానీ ఇపుడు విశాఖజిల్లా, చింతపల్లి మండలం, లంబసింగిలో అదే స్థాయిలో నేచర్ బ్యూటీ ఉండటంతో పర్యాటకులు అధిక సంఖ్యలో క్యూ కడుతుండటం విశేషం.  ఇక్కడికి వచ్చిన వారంతా ఈ వాతావరణానికి మంత్రముగ్ధులు అవుతుంటారు. వచ్చిన వారు కేవలం ఇద్దరికే ఈ ప్రాంతం అందం కోసం చెబుతారు(అడిగిన వారికి, అడగని వారికి) అంతలా ప్రాముఖ్యతను సంపాదించింది ఈ పర్యాటక ప్రాంతం. 

ముఖ్యంగా వ్యూపాయింట్, హిల్ పాయింట్, హిల్ వాక్, స్నో ఫారెస్ట్, స్నో క్లౌడ్ పాయింట్ లు ఈ పర్యాటక ప్రాంతంలో చెప్పుకోదగ్గర ప్రాంతాలు. ఇక్కడకు వచ్చేవారంతా రాత్రి 12 నుంచి 1 గంట మధ్య కార్లు, బైకుల్లో వచ్చి. తెల్లవారు జాము నుంచి ఉదయం 9 లేదా పది గంటల వరకూ ఉండి ఈ ప్రాంతంలో అందాలను ఆశ్వాదించి వెళతారు. పర్యాటకులు  ఈ ప్రదేశాలకు వచ్చిన గుర్తుగా తమ కెమెరాల్లో ఇక్కడి అందాలను బంధించుకుంటారు. అలా బందీ అయిన ఫోటోలు గుగూల్ సెర్చ్ లో తొలి స్థానాన్ని దక్కించుకున్నాయంటే ఇక్కడి ప్రక్రుతి అందాలు ఏస్థాయిలో ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు. వీటితోపాటు లంబసింగి, చింతపల్లి, కొత్తపల్లి ప్రాంతాల్లో కూడా ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి.  ఈ ప్రాంతంలో పర్యటించే  ప్రతీఒక్కరినీ మైమరపిస్తాయి. ఈ ప్రాంతాలనికి వెళ్లే సమయంలో ఘాట్‌రోడ్డులో కాఫీ తోటలు విస్తారంగా ఉండటంతో అక్కడ కురుస్తున్న మంచు చూడటానికి ఎంతో చక్కగా కనిపిస్తుంది.. లంబసింగి చేరుకోగానే ముందు బోడకొండమ్మ గుడి కనిపిస్తుంది..ఇక్కడకి వచ్చిన వారంతా ముందుగా ఆ వన దేవతకు పూజలు చేసి తమ ప్రయాణం అంతా సరదాగా సాగాలని పూజలు చేసి అడవి ప్రాంతంలోకి అందాలను చూడ్డానికి వెళతారు. ఈ ప్రాంతానికి అర కిలోమీటరు దిగువన జలపాతం ఉంది.

 ఇక్కడ సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి నీరు పడుతుంటుంది. చూడటానికి ఈ ప్రాంతం చాలా అందంగా ఉండటంతో చాలా మంది ఇక్కడే జలకాలు కూడా అడుతుంటారు. అక్కడికి కొద్ది దూరంలో లంబసింగి గ్రామం ఉంటుంది. ఈ గ్రామంలో కొందరు యువకులు ఈ ప్రాంతాన్ని చూపించే గైడ్లుగా కూడా మారిపోయారు. సముద్ర మట్టానికి 1,210 మీటర్ల ఎత్తులోనున్న ఈ ప్రాంతంలో వేసవిలో కూడా అత్యంత చల్లగా వుంటుంది. ఎందుకంటే ఈ లంబసింగి ప్రాంతం మొత్ం కొండ ప్రాంతం కావడం వలన అధిక చల్లదనం ఉంటుంది. ఈ ప్రాంతంలో కొద్దిమేర మాత్రమే తినుబండారాలు దొరకడంతో నర్సీపట్నం నుంచే పర్యాటకులు అన్నీ కొనుగోలు చేసుకొని పట్టుకెళుతుంటారు. ఎక్కువ సంఖ్యలో పిక్నిక్ లు కూడా ఇక్కడే జరుగుతుండటం గుర్తించాల్సిన అంశం.  అన్నట్టు చెప్పడం మరిచిపోయా ఈ ప్రాంతానికి వెళ్లడానికి విశాఖపట్నం నుంచి నర్సీపట్నం వరకూ ఆర్టీసీ బస్సులు ఉంటాయి. 

నర్సీపట్నం నుంచి చింతపల్లి వెళ్లడానికి కూడా ఆర్టీసీ బస్సుల ఉంటాయి. కాకపోతే రాత్రి 12 దాటిన తరువాత వెళ్లలాంటే మాత్రం మనమే సొంతంగా వాహనాలు బుక్ చేసుకొని వెళ్లాలి...దానికోసం అటు నర్సీపట్నం నుంచి ప్రత్యేక ట్రావెల్ కార్లు, జీపులు, మినీ బస్సులు అందుబాటులో ఉంటాయి. కొత్త వారు ఈ ప్రాంతానికి చేరుకోవడానికి గుగూల్ కూడా రూట్ మ్యాప్ ను ప్రత్యేకంగా తయారు చేసింది. ప్రపంచంలో ఏ మూల ఉన్నా గుగూల్ మ్యాప్ ను పట్టుకొని ఈ ఆంధ్రా కాశ్మీర్ లంబసింగి చేరుకోవచ్చు.. ఇన్ని విషయాలు తెలుసుకున్న తరువాత వెంటనే చూడాలని పిస్తుంది కదూ..ఇంకెందుకాలస్యం ఈ చలికాలంలో మీరూ ఒ ట్రిప్ లంబసింగి వెళ్లి వచ్చేయండి.. అక్కడి అందాలను తనివితీరా ఆశ్వాదించేయండి..!

Lambasingi

2022-07-28 05:50:27

తక్కువ పెట్టుబడితో ఎక్కువ ప్రచారం

EnsLive Appలో మీ వ్యాపార ప్రకటనలు ఇవ్వడం ద్వారా లక్షలాది పాఠకులకు, ప్రజలకు చేరువ అవ్వొచ్చు.. EnsLive Appతో పాటు www.enslive.net న్యూస్ వెబ్ సైట్ లో ఏక కాలంలో మీ ప్రకటన ప్రజలకు క్షణాల్లో చేరిపోతుంది. Whole salers, retailers, education, coaching centers, textiles, automobiles, interior developers ,real estate వ్యాపారం ఏదైనా మీరు ఆశించిన ఫలితాలు వచ్చేవరకు మీ ప్రకటనలను పాఠకుల దగ్గరకుతీసుకెళ్లడంతో మేము మీకు తోడుగా ఉంటాము. ప్రకటనలకు తక్కువ మొత్తం చెల్లించి అత్యంత ఎక్కువ ఫలితాలను పొంది. మీ వ్యాపారాలను మరింతగా వ్రుద్ధి చేసుకోండి.. ఇపుడే ఈఎన్ఎస్ లైవ్ యాప్ లో ప్రకటనల కోసం సంప్రదించండి..  మరిన్ని వివరాలకు: 9390280270లో సంప్రదించండి.

Visakhapatnam

2022-06-07 04:15:23

2021-09-12 12:09:47

అబ్బో..అబ్బబ్బో ఆ రైల్ బస్ ప్రయాణం..

చుట్టూ మనస్సుని హత్తుకునే పచ్చిక బైర్లు.. నింగీనేలా కలిసివున్నట్టుగా కనిపించే ఆహ్లాదకర ఆకాశం.. అటూ ఇటూ పల్లెటూరి అందాలు.. ఆ మధ్య పట్టాలపై నెమ్మదిగా కదిలే రైల్ బస్ అలా వెళుతుంటే అబ్బో అబ్బబ్బో ఆ రైల్ బస్ ప్రయాణమే వేరండీ ..వినడానికే ఏదో సినిమా ఇంట్రోలా ఉంది కదా.. అవును నిజంగానే ఆ రైల్ బస్ జర్నీ అంతటి మంచి అనుభూతిని కలిగిస్తుంది.. ఏంటీ రైల్ బస్.. ఎక్కడుందీ ఈ రైల్ బస్  అనుకుంటున్నారా..అవునండీ మీరు చదువుతున్నది నిజమే.. మంచి పర్యాటక అందాలను పరిచియం చేసే  రైల్ బస్ నిజంగానే వుంది.. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా కోటి పల్లిలో ఉంది ఈ రైల్ బస్.. ఒకే బోగితో కాకినాడ నుంచి కోటి పల్లికి రోజూ తిరుగుతూ వుంటుంది. ఈ ప్రాంతానికి వచ్చేవారంతా ఇక్కడి అందాలను తనివితీరా చూడాలంటే మాత్రం ఖచ్చితంగా కోటి పల్లి నుంచి కాకినాడ గానీ, కాకినాడ నుంచి కోటి పల్లి గానీ అయితే ఉదయం కుదరక పోతే సాయంత్రం ఖచ్చితంగా ప్రయాణం చేస్తారు. అలా ఈ రైలు బస్ లో ప్రయాణం చేస్తేనే పైన పేర్కొన్న వర్ణన చదివిన అనుభూతి కలుగుతుంది. ఈ రైల బస్ కోసం ప్రత్యేకంగా రిజర్వేషన్లు అవసరం లేదు.. ప్రయాణ సమయంలోనే ఈ రైలుబస్సులోనే టిక్కెట్లు ఇస్తారు..నీట్ గా బస్సులో మాదిరిగానే సీట్లు కూడా ఉంటాయి. కాకినాడ నుంచి ఉదయం 9.30 బయలు దేరే ఈ రైలు మార్గం మధ్యలో మీకు  కొవ్వాడ, అర్తలకట్ట, కరప, వాకాడ, వేలంగి, నరసరావుపేట, రామచంద్రాపురం, ద్రాక్షారామం, కుండూరు, గంగవరం గ్రామాలు తగులుతాయ్..చివరిగా 11 గంటలకు కోటి పల్లి చేరుకుంటాం. ఈ మార్గ మధ్యలో చాలా గ్రామాల్లో కనిపించే అందాలు నిజంగానే మాటలకు అందవు. అప్పట్లో ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యం పల్లెటూర్లను కలుపుతూ సరిగా లేకపోవడంతో 2004లో ఈ రైలు బస్సు సౌకర్యాన్ని ప్రారంభించింది ప్రభుత్వం. అనాటి నుంచి ఈ నాటి వరకూ ఈ రైల్ బస్ సేవలు నిరాటంకం ప్రయాణీకులకు అందుతూ వస్తున్నాయి. చాలా మంది ఈ రైల్ బస్ కోసం ప్రసార మాద్యాలు, మీడియాలో ప్రత్యేక కధనాలుగా చదివిన వారు.. తూర్పుగోదావరి జిల్లాలో పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి వచ్చిన సమయంలో ఖచ్చితంగా ఈ రైలు బస్ ఎక్కి ఆ అనుభూతి పొందుతారంటే అతిశయోక్తి కాదు.. ఇంతటి అందాలను మీరు తనివితీరా ఆస్వాదించాలనుకుంటే ఒక్కసారి కోటిపల్లి-కాకినాడ రైల్ బస్ లో ఒక్క ట్రిప్పు వేస్తే సరి..ఇంకెందుకు ఆలస్యం తూర్పుగోదావరి జిల్లా పర్యాటకాన్ని చూసే సందర్భంలో ఈ ప్రాంతాన్ని కూడా యాడ్ చేసుకోండి...ఆ పల్లె వాతావరణపు ప్రక్రుతి అందాలను తిలకించండి అబ్బో..అబ్బబ్బో ఆ రైల్ బస్ ప్రయాణం అంటూ ఆల్ ది బెస్ట్..!

Kotipalli

2021-06-17 11:11:17

కరోనా వేక్సిన్ వేయించుకున్న సబ్ కలెక్టర్..

నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలోని కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ తోపాటు అందరూ కోవిడ్ టీకా వేయించుకోవాలని నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య అన్నారు. గురువారం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో  సూపరింటెండెంట్ డా. నీలవేణి పర్యవేక్షణ లో స్టాఫ్ నర్సు సి హెచ్ రామలక్ష్మి కోవిడ్ టీకాను సబ్ కలెక్టర్ కు వేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ టీకా ను అర్హులైన ప్రతీ ఒక్కరూ ఎటువంటి సందేహం లేకుండా  వేయించుకోవ డానికి ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. మూడవ దశ వాక్సినేషన్ లో భాగంగా కోవిషీల్డ్ టీకా ను వేయించుకోవడం జరిగిందని,ఎటువంటి అసౌకర్యం లేదని సబ్ కలెక్టర్ తెలిపారు. ఏరియా ఆసుపత్రి జనరల్ ఫిజీషియన్ డా నళిని,సబ్ స్టాఫ్ రత్నం తదితరులు పాల్గొన్నారు.

Narsipatnam

2021-03-04 22:26:24

కశ్మీర్ ను తలదన్నే లంబసింగి అందాలు..

ఆ గ్రామం సముద్ర మట్టానికి సుమారు 4వేల అడుగుల ఎత్తులో ఉంది.. అక్కడ ఉష్ణోగ్రతలు చలికాలంలో 1-3కి పడిపోతాయ్ ..మంచు అయితే వర్షంలా కురుస్తుంది...ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఆంధ్రాలో ఉన్నామా..కాశ్మీర్ లో ఉన్నామా అనే భావన కలుగుతుంది..అతి తక్కువ సమయంలో జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించింది ఆ గ్రామం.. అదే ఆంధ్రా ఊటీ లంబసింది..అదేంటి ఆంధ్రా ఊటి అరకు కదా అనుకుంటున్నారు కదా.. ఆ పేటెంట్ నేమ్ ఇపుడు లంబసింగి సొంతమైంది. అవునండీ మీరు చదువుతున్నది నిజమే..లంబసింగి టూరిజం స్పాట్ గా తయారైన తరువాత 70శాతం పర్యాటకులు కేవలం లంబసింగిలోని అత్యల్పంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు..ఆ మంచులో లేలేత భానుడి అందాలు...అకాశంలో తేలియాడేటట్టు కనిపించే మబ్బు తెరలను చూడటానికి వెళుతున్నారంటే అతిశయోక్తి కాదు. విశాఖ మన్యంలోని ఇపుడు ప్రముఖ పర్యాటక కేంద్రంగా పేరుగాంచింది ఈ లంబసింగి ప్రాంతం..  ఇక్కడ విశేషం ఏంటంటే ఏడాది పొడవునా ఈ ప్రాంతం శీతలంగానే ఉంటుంది. అక్టోబరు మొదలుకుని ఫిబ్రవరి వరకు మంచు వర్షంలా కురుస్తూనే వుంటుంది. ఉదయం 10 గంటలకైనా మంచు నీడ వీడ కుండా ఎదుటి వ్యక్తి కూడా కనబడనంగా వాతావరణం మారిపోతుంది. శీతల గాలులు వీస్తూ పర్యాటకులకు ఎంతో ఆహ్లాదం పంచుతూ రారమ్మని ఆహ్వానిస్తుంది. ఒకప్పుడు ఈ గ్రామంలో ఉండే 250మంది ఇపుడు 2500గా మారారంటే దానికి కారణం ఈ గ్రామం ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మారడమే. అయితే ఇక్కడ రాత్రి బస చేయడానికి ప్రత్యేక వసతులు ఉంటే మాత్రం మరింత మంది పర్యాటకులు వచ్చే పరిస్థితి వుండేది. ప్రతి ఏడాది ఏదో ఒక సమయంలో 1-5 నుంచి 1- 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదైన సంఘటనలు అధికంగా వుంటాయి. అలాంటి ఉష్ణోగ్రతలు అతిశీతల వాతావరణం కాశ్మీర్ లోనూ, కొడైకెనాల్ లోనూ, ఊటీలో మాత్రమే కనిపిస్తాయి.. కానీ ఇపుడు విశాఖజిల్లా, చింతపల్లి మండలం, లంబసింగిలో అదే స్థాయిలో నేచర్ బ్యూటీ ఉండటంతో పర్యాటకులు అధిక సంఖ్యలో క్యూ కడుతుండటం విశేషం.  ఇక్కడికి వచ్చిన వారంతా ఈ వాతావరణానికి మంత్రముగ్ధులు అవుతుంటారు. వచ్చిన వారు కేవలం ఇద్దరికే ఈ ప్రాంతం అందం కోసం చెబుతారు(అడిగిన వారికి, అడగని వారికి) అంతలా ప్రాముఖ్యతను సంపాదించింది ఈ పర్యాటక ప్రాంతం. ముఖ్యంగా వ్యూపాయింట్, హిల్ పాయింట్, హిల్ వాక్, స్నో ఫారెస్ట్, స్నో క్లౌడ్ పాయింట్ లు ఈ పర్యాటక ప్రాంతంలో చెప్పుకోదగ్గర ప్రాంతాలు. ఇక్కడకు వచ్చేవారంతా రాత్రి 12 నుంచి 1 గంట మధ్య కార్లు, బైకుల్లో వచ్చి. తెల్లవారు జాము నుంచి ఉదయం 9 లేదా పది గంటల వరకూ ఉండి ఈ ప్రాంతంలో అందాలను ఆశ్వాదించి వెళతారు. పర్యాటకులు  ఈ ప్రదేశాలకు వచ్చిన గుర్తుగా తమ కెమెరాల్లో ఇక్కడి అందాలను బంధించుకుంటారు. అలా బందీ అయిన ఫోటోలు గుగూల్ సెర్చ్ లో తొలి స్థానాన్ని దక్కించుకున్నాయంటే ఇక్కడి ప్రక్రుతి అందాలు ఏస్థాయిలో ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు. వీటితోపాటు లంబసింగి, చింతపల్లి, కొత్తపల్లి ప్రాంతాల్లో కూడా ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి.  ఈ ప్రాంతంలో పర్యటించే  ప్రతీఒక్కరినీ మైమరపిస్తాయి. ఈ ప్రాంతాలనికి వెళ్లే సమయంలో ఘాట్‌రోడ్డులో కాఫీ తోటలు విస్తారంగా ఉండటంతో అక్కడ కురుస్తున్న మంచు చూడటానికి ఎంతో చక్కగా కనిపిస్తుంది.. లంబసింగి చేరుకోగానే ముందు బోడకొండమ్మ గుడి కనిపిస్తుంది..ఇక్కడకి వచ్చిన వారంతా ముందుగా ఆ వన దేవతకు పూజలు చేసి తమ ప్రయాణం అంతా సరదాగా సాగాలని పూజలు చేసి అడవి ప్రాంతంలోకి అందాలను చూడ్డానికి వెళతారు. ఈ ప్రాంతానికి అర కిలోమీటరు దిగువన జలపాతం ఉంది. ఇక్కడ సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి నీరు పడుతుంటుంది. చూడటానికి ఈ ప్రాంతం చాలా అందంగా ఉండటంతో చాలా మంది ఇక్కడే జలకాలు కూడా అడుతుంటారు. అక్కడికి కొద్ది దూరంలో లంబసింగి గ్రామం ఉంటుంది. ఈ గ్రామంలో కొందరు యువకులు ఈ ప్రాంతాన్ని చూపించే గైడ్లుగా కూడా మారిపోయారు. సముద్ర మట్టానికి 1,210 మీటర్ల ఎత్తులోనున్న ఈ ప్రాంతంలో వేసవిలో కూడా అత్యంత చల్లగా వుంటుంది. ఎందుకంటే ఈ లంబసింగి ప్రాంతం మొత్ం కొండ ప్రాంతం కావడం వలన అధిక చల్లదనం ఉంటుంది. ఈ ప్రాంతంలో కొద్దిమేర మాత్రమే తినుబండారాలు దొరకడంతో నర్సీపట్నం నుంచే పర్యాటకులు అన్నీ కొనుగోలు చేసుకొని పట్టుకెళుతుంటారు. ఎక్కువ సంఖ్యలో పిక్నిక్ లు కూడా ఇక్కడే జరుగుతుండటం గుర్తించాల్సిన అంశం.  అన్నట్టు చెప్పడం మరిచిపోయా ఈ ప్రాంతానికి వెళ్లడానికి విశాఖపట్నం నుంచి నర్సీపట్నం వరకూ ఆర్టీసీ బస్సులు ఉంటాయి. నర్సీపట్నం నుంచి చింతపల్లి వెళ్లడానికి కూడా ఆర్టీసీ బస్సుల ఉంటాయి. కాకపోతే రాత్రి 12 దాటిన తరువాత వెళ్లలాంటే మాత్రం మనమే సొంతంగా వాహనాలు బుక్ చేసుకొని వెళ్లాలి...దానికోసం అటు నర్సీపట్నం నుంచి ప్రత్యేక ట్రావెల్ కార్లు, జీపులు, మినీ బస్సులు అందుబాటులో ఉంటాయి. కొత్త వారు ఈ ప్రాంతానికి చేరుకోవడానికి గుగూల్ కూడా రూట్ మ్యాప్ ను ప్రత్యేకంగా తయారు చేసింది. ప్రపంచంలో ఏ మూల ఉన్నా గుగూల్ మ్యాప్ ను పట్టుకొని ఈ ఆంధ్రా కాశ్మీర్ లంబసింగి చేరుకోవచ్చు.. ఇన్ని విషయాలు తెలుసుకున్న తరువాత వెంటనే చూడాలని పిస్తుంది కదూ..ఇంకెందుకాలస్యం ఈ చలికాలంలో మీరూ ఒ ట్రిప్ లంబసింగి వెళ్లి వచ్చేయండి.. అక్కడి అందాలను తనివితీరా ఆశ్వాదించేయండి..!

Lambasingi

2021-01-03 12:08:26