1 ENS Live Breaking News

ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణలో పార‌ద‌ర్శ‌క విధానాలు పాటించాలి

ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ‌లో పార‌ద‌ర్శ‌క విధానాలు అవ‌లంభించాల‌ని, ఎన్నిక‌ల క‌మిష‌న్ నిబంధ‌న‌లు తు.చ‌. త‌ప్ప‌కుండా పాటించాల‌ని రాష్ట్ర ఉన్న‌త విద్యాశాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ, విశాఖ‌ప‌ట్ట‌ణం జిల్లా ఓట‌ర్ల జాబితా ప‌రిశీల‌కులు (రోల్ అబ్జెర్వ‌ర్) జె.శ్యామ‌ల‌రావు ఆదేశించారు. ఉత్త‌రాంధ్ర జిల్లాల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా విమాన మార్గం ద్వారా సోమ‌వారం ఉదయం ఆయ‌న విశాఖ‌ప‌ట్ట‌ణం చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా గాజువాక‌, ప‌శ్చిమ‌, ఉత్త‌ర అసెంబ్లీ నియోజ‌వ‌ర్గాల ప‌రిధిలోని పోలింగ్ కేంద్రాల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. జాబితాల‌ను, సంబంధిత రికార్డుల‌ను క్షుణ్నంగా ప‌రిశీలించారు. మార్పులు చేర్పులు, తొల‌గింపు, నోటీసుల జారీ త‌దిత‌ర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఓట‌ర్లు, పోలింగ్ కేంద్రాల నిష్ప‌త్తి, కొత్త ఓట‌ర్ల చేరిక‌లపై ఆరా తీశారు. గాజువాక నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని అక్కిరెడ్డిపాలెంలో జ‌డ్పీ హైస్కూళ్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ముందుగా త‌నిఖీ చేశారు. అక్క‌డ ప‌రిస్థితుల‌ను అడిగి తెలుసుకున్నారు. 154 నుంచి 162 వ‌ర‌కు గ‌ల పోలింగ్ కేంద్రాల్లో ఓట‌ర్ల వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. చిన్న పొర‌పాట్లు కూడా జ‌ర‌గడానికి వీలులేద‌ని, జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని పేర్కొన్నారు. అనంత‌రం ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని మ‌ర్రిపాలెం సౌత్ రైల్వే ఎయిడెడ్ ఉన్న‌త పాఠ‌శాల‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని, ఉత్త‌ర నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని సీత‌మ్మ‌ధార పాలిటెక్నిక్ క‌ళాశాల‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని త‌నిఖీ చేశారు. ఓట‌ర్ల తొల‌గింపు విష‌యంలో జాగురూక‌త వ‌హించాల‌ని, డూప్లికేట్ ఓట్ల‌ను తొల‌గించే క్ర‌మంలో నోటీసులు జారీ చేయాల‌ని, సద‌రు ఓట‌రు అంగీకారం తీసుకున్న త‌ర్వాత మాత్ర‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పారు. నోటీసులు జారీ చేసి సంబంధిత ర‌శీద‌ను భ‌ద్రంగా ఉంచాల‌ని, రికార్డుల‌ను ప‌క్కా నిర్వ‌హించాల‌ని సూచించారు. ఎలాంటి వివాదాల‌కు తావివ్వ‌కుండా జాబితా స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ‌ను, పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హించాల‌ని ఆదేశించారు. అప్ర‌మ‌త్తంగా ఉంటూ విధులు నిర్వ‌హించాల‌ని చెప్పారు. ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న వెంట ఆర్డీవో హుస్సేన్ సాహెబ్, ప్ర‌త్యేక ఉప క‌లెక్ట‌ర్లు ల‌క్ష్మారెడ్డి, అఖిల‌, త‌హ‌శీల్దార్లు ఆనంద్ కుమార్, కె. జ‌య‌, శ్రీ‌వ‌ల్లీ, ఇత‌ర రెవెన్యూ అధికారులు త‌దిత‌రులు ఉన్నారు.

Visakhapatnam

2023-11-27 11:15:49

మత్సకారులకు అండగా ప్రభుత్వం- జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు

 మత్స్యకారులకు భారోసానిస్తూ ఎల్లపుడు ప్రభుత్వం అండగా నిలుస్తోందని   జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు తెలిపారు.  మత్స్య సంపదను పెంచడానికి, మత్స్యకారులకు మత్స్య  వ్యాపారాలను సజావుగా చేసుకొని ఆర్ధికంగా నిలదొక్కుకోడానికి అనేక పధకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.  ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకొని  మంగళవారం  రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మత్స్యకారులకు సందేశాన్ని అందించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ను కలెక్టరేట్ నుండి  జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు, సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్,  రాజాం శాసన సభ్యులు  కంబాల జోగులు, మత్స్య శాఖ డి డి నిర్మలా కుమారి, మత్స్యకార సంఘాల ప్రతినిధులు బర్రి చిన్నప్పన్న, ఇతర లబ్దిదారులు తిలకించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణ లో  32 మంది లబ్ది దారులకు  24 లక్షల విలువైన ద్వి చక్ర వాహనాలను  అందజేసారు. వీరిలో 6 గురు మహిళా లబ్దిదారులు ఉన్నారు. అదేవిధంగా ఎస్.సి వర్గానికి చెందిన ఇద్దరు లబ్దిదారులకు 33,29,798 లక్షల విలువైన రెండు  ఫిష్ సీడ్ ట్రాన్స్పోర్ట్ వాహనాలను    అందజేశారు.  అదే  విధంగా 20 లక్షల విలువైన్స్ ఇన్సులేటెడ్ వాహనాన్ని అందించారు.  ఈ మొత్తం వాహనాల విలువ 84 లక్షలు కాగా  అందులో లబ్దిదారుని వాటాగా 44,60,000   రూపాయలు , ప్రభుత్వ సబ్సిడీ గా 39,40, 000 లక్షల రూపాయలను చెల్లించడం జరిగిందన్నారు.   వాహనాలను లబ్దిదారులకు జిల్లా పరిషత్ చైర్మన్ , జే సి చేతుల మీదుగా అందజేసారు. 
అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు మీడియా తో మాట్లాడుతూ  మత్స్య  కార వృత్తి పైనే ఆధార పది, మత్స్య వ్యాపారాలు చేసే వారికి  ప్రభుత్వం అనేక రకాలుగా ఉపకరణాలను అందించడమే కాకుండా వేట నిషేద సమయం లో  ఒక్కో మత్స్యకార కుటుంభానికి 10 వేల రూపాయల చొప్పున ప్రభుత్వం  భ్రుతి కల్పిస్తుందని పేర్కొన్నారు.  ఫిష్ ఆంధ్ర పేరుతో లైవ్ ఫిష్ ను వినియోగదారులకు సరసమైన ధరలకు అందించడం  ద్వారా ఇటు వినియోగ దారునికి, అటు మత్స్యకారునికి  లబ్ది జరుగుతోందని తెలిపారు.  ఈ నెల్ 20 న విశాఖపట్నం  లో జరిగిన బోటు ప్రమాదం లో నష్ట పోయిన వారికీ 80 శాతం వరకు ప్రభుత్వమే ఇన్సురెన్సు ను భరిస్తోందని తెలిపారు.    మత్య్సకారులకు మెరుగైన జీవనోపాది, భద్రత కు భరోసా నివ్వడమే కాకుండా  మత్స్య రంగం లో ఎదుర్కొటున్న సమస్యలను కూడా పరిష్కరిస్తూ ఆదుకోవడం జరుగుతుందన్నారు.

Vizianagaram

2023-11-21 13:57:24

రాత్రి నిరాశ్రయకేంద్రాల నిర్వహణ భేష్..

మహావిశాఖ నగరంలో జివిఎంసి నిర్వహిస్తున్న నైట్షెల్టర్ల నిర్వహణను పరిశీలించిన ప్రైమ్ మినిస్టర్ అడిషనల్ సెక్రటరీ అతిష్ చంద్ర సంతృప్తిని వ్యక్తం చేసారు. శనివారం   మూడు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన ఆయన  జివిఎంసి నిర్వహిస్తున్న 8 నిరాశ్రయ కేంద్రాలలో టిఎస్ఆర్ కాంప్లెక్స్, భుపేష్ నగర్ లో నిర్వహిస్తున్న నిరాశ్రయ కేంద్రాలను ఎపియుఎఫ్ఐడిసి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, జివిఎంసి కమీషనర్ సిఎం.సాయికాంత్ వర్మతో కలసి పరిశీలించారు.ఈ సందర్భంగా నిరాశ్రయ కేంద్రాల నిర్వాహకులతో మాట్లాడుతూ, నైట్ షెల్టర్ లో ఎంత మంది నిరాశ్రయులు వున్నారు? వారికి కల్పిస్తున్న మౌలిక సదుపాయాలలో భాగంగా భోజనం, మరుగుదొడ్ల నిర్వహణ, వసతి, విద్యుత్, త్రాగునీటి సరఫరా, డార్మిటరి, వినోదం కొరకు టేలివిజన్, సి.సి.టివి తదితర వివరాలను అడిగి తెలుసుకోవడం తో పాటు స్వయంగా పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేసారు.

        అనంతరం జివిఎంసి కమీషనర్ మాట్లాడుతూ, విశాఖనగరం లో 2012 లో నిరాశ్రయ కేంద్రాలను ప్రారంభించారని, ప్రస్తుతం 8 నిరాశ్రయ కేంద్రాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. అన్ని కేంద్రాలలో మొత్తం  285 మంది మహిళలు, పురుషులు ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు. వీటి నిర్వహణకు ఏడాదికి జివిఎంసి సాధారణ నిధుల నుండి 52 లక్షల 12 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు కమీషనర్ ప్రైమ్ మినిస్టర్ అడిషనల్ సెక్రటరీకు వివరించారు. ఈ పరిశీలనలో జివిఎంసి అదనపు కమీషనర్ ఎస్.ఎస్.వర్మ, ప్రాజెక్ట్ డైరెక్టర్ (యుసిడి) పాపునాయుడు, డిపిఓ లక్ష్మి, నిర్వాహకులు ప్రగడ వాసు, తదితరులు పాల్గొన్నారు.

 

Visakhapatnam

2023-11-20 15:55:11

కులగణనపై కలెక్టర్ కార్యాలయంలో ప్రజాభిప్రాయ సేకరణ

అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నేటి  మధ్యాహ్నం 2:30గంటల అభిప్రాయ సేకరణ జిల్లా కలెక్టర్ రవిపట్టన్ శెట్టి ఆధ్వర్యంలో చేపడుతున్నట్టు జిల్లా బి.సి., సంక్షేమ సాధికారత అధికారి కె. రాజేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. సామాజికంగా, విద్యాపరంగా సంక్షేమ పథకాలను మరింత మెరుగ్గా రూపొందించడంతో పాటు అమలు చేయడం, సామాజిక విద్యా ఆర్థిక జీవనోపాధి జనాభా అంశాలకు సంబంధించిన కుల ఆధారిత సమగ్ర గణనను చేపట్టడం అవసరమని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించినట్లు ఆమె తెలిపారు. ప్రతి కుల, వర్గ, సామాజిక, విద్య, ఆర్థిక, అభివృద్ధి వారి ప్రస్తుత స్థితిని తెలుసుకుంటామన్నారు. అణగారిన వ్యక్తుల లేదా ఆ వృత్తులను అనుసరిస్తున్న వారి సమస్యలను తెలుసుకుని వారి అభివృద్ధికి మెరుగైన విధానాల అమలు వ్యూహాలను రూపొందించేందుకు,  సున్నితమైన సమస్యలపై చర్చకు వీలు కల్పించనున్నట్టు పేర్కొన్నారు. 

సముచితమైన విధాన రూపకల్పన ద్వారా అట్టడుగు వర్గాల అభివృద్ధి అభ్యున్నతి కార్యక్రమాల ద్వారా ఏ కుల సమూహాలు ప్రయోజనం పొందాయో తెలుసుకుని వాటిపై దృష్టి పెట్టనున్నట్టు తెలియజేశారు. నిజమైన అర్హత కలిగి ఉండి సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందని వారిని గుర్తించి వారికి లబ్ధి చేకూర్చనున్నామన్నారు. సామాజిక న్యాయం ద్వారా సమ సమాజాన్ని సాధించేందుకు గ్రామ సచివాలయ వ్యవస్థను కులగణన కోసం వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణకు జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, తదితర ప్రజాప్రతినిధులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ తదితర సంఘాల నాయకులు, మేధావులు, విరివిగా పాల్గొని తమ అభిప్రాయాలను సలహాలు సూచనలను తెలియజేయాలని ఆమె కోరారు.

Anakapalle

2023-11-15 11:41:22

విశాఖ స్టీల్ ఉద్యమాన్ని దేశ రాజధానికి తీసుకు వెళదాం: ఆడారి కిషోర్ కుమార్

 విశాఖ పట్నం స్టీల్ ప్లాంట్ పైవేటీకరణ ఉద్యమాన్ని దేశ రాజధాని ఢిల్లీ వేదిక గా ఉద్యమించి కేంద్రానికి విశాఖ ఉక్కు సత్తా చాటుదామని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆడారి కిషోర్ కుమార్ పిలుపునిచ్చారు  

 విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమం 1000 రోజులు దాటిన సందర్భంగా బుధవారం విశాఖ స్టీల్ పోరాట శిబిరం వద్ద జరిగిన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో పాల్గొన్న ఆడారీ కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపి లు కచ్చితంగా ఉద్యమానికి అండగా నిలబడాలని ప్రకటించారు లేని పక్షంలో వాళ్లని ఏ ప్రాంతంలోకి అడుగుపెట్టనిచ్చేది లేదన్నారు ఉద్యమకారులకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని వారి ఉద్యమానికి అండగా నిలబడతామని తెలియజేశారు.

ఢిల్లీ లో  వైజాగ్ స్టీల్ ఉద్యమ పోరాటాన్ని ఉధృతం చేస్తే. కేంద్రానికి వేడి పడుతుందన్నారు. తెలుగు వారితో పాటు, ఉత్తర భారత దేశ వాసుల మద్దతు కూడా లభిస్తుందన్నారు.

ఈ సమావేశంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ లోని కార్మిక సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Visakhapatnam

2023-11-08 14:13:19

ఎంవిఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై భారీ అంచనాలు..!

ఎంవిఆర్(ముత్యాల వెంకటేశ్వర్రావు).. ఈ పేరు చెప్పగానే ఇపుడు అనకాపల్లి నుంచి అమెరికా వరకూ ఒకే రకమైన భారీ రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఈయన రాజకీయ రంగప్రవేశంపై ప్రచారం తారాస్థాయికి చేరింది. దీనితో అన్ని రాజకీయపార్టీల ప్రతినిధులు ఈయనను వారి వారి పార్టీల్లోకి రావాలని ఆహ్వానాలు పంపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఇంటెలి జెన్స్ నివేదికులు కూడా అన్ని రాజకీయపార్టీలకు చేరుతున్నాయి. దానికి కారణం ఒక్కటే అధికారం, ధనబలం, కులబలం,నెట్వర్క్ ఉన్న నేతలే ప్రజల కోసం ఆలోచి, ప్రజాప్రతినిధులు చేపట్టని సేవా కార్యక్రమాలు, ప్రజల్లోకి అతి తక్కువ కాలంలోనే వెళ్లిపోవడమే. తన సేవా కార్యక్రమాల కోసం ఏకంగా ఒక ట్రస్టునే ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వాటితోపాటు, ఆలయాల నిర్మాణం, గ్రామాల్లో జాతర నిర్వహణలకు సహకారం, యువతను క్రీడారంగంలో ప్రోత్సహించడానికి టోర్నమెంట్లు, స్పోర్ట్స్ కిట్లు అందజేయడం ఇలా చెప్పుకుంటూ పోతే ఈయన చేసే సేవాల కార్యక్రమాలు అన్నీ ఇన్నీ కావు. దానికితోడు కేంద్రంలోని ప్రభుత్వ పెద్దలు, ఇతర నేతలతో చాల సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ప్రతినిత్యం ఈయన ద్వారా సేవలు పొందే వారు అంటున్న మాట ఒక్కటే.. చాలా మందిని చూశాం..కానీ ఎలాంటి అధికార వ్యామోహం లేకుండా, నిరుపేదలను ఆదుకోవడం, ఆద్యాత్మిక కార్యక్రమాలకు ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తూ ప్రజల్లో నిలబడే వ్యక్తును చాలా తక్కువగా చూస్తున్నామని అంటున్నారు.

సాధారణ సేవకుడిగానే ఇంత ముందు చూపుతో ప్రజలకు ఉపయోగ పడే పనులు చేపడితే ఇక రాజకీయాల్లోకి అడుగు పెట్టినా, ఎమ్మెల్యేగానో, ఎంపీగానో గెలిస్తే మరిన్ని సేవలు ఎంవిఆర్ ద్వారా అందుతాయనే టాక్ ఇపుడు జిల్లాలో బలంగా నడుస్తుంది. ఎక్కడైనా ఎమ్మెల్యే, ఎంపి, మంత్రి వస్తున్నారంటే అధికారపార్టీ నేతలు, వారి అనుచరులు వారి దగ్గరకు పరుగుతు పెడతారు. కానీ ఏ ప్రాంతానికైనా ఎంవిఆర్ వస్తున్నారని తెలిస్తే స్వచ్చందంగా ప్రజలే ఆయనను కలుసుకోవడానికి వస్తున్నాంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం వయసు మళ్లిన మహిళలకు దైవ దర్శనాలు కల్పించడానికి ఎంవిఆర్ ట్రస్టు ద్వారా తీర్ధ యాత్రల సేవ చేస్తున్నారు ఎంవిఆర్. దానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నది. ఇవి కాకుండా జిల్లాలో ఏ గ్రామంలో కొత్తగా ఆలయాన్ని నిర్మిస్తున్నా, జాతరలు జరుగుతున్నా, క్రీడా పోటీలు జరుగుతున్నా.. ఈయన దగ్గర నుంచి పెద్ద మొత్తంలో ఆర్ధిక సహాయాలు కూడా అందుతున్నాయి. ఇలా అందరివాడిగా..ప్రజా నేతగా ఎంవిఆర్ అపుడే ప్రజాప్రతినిధి అయిపోయారంటే అతిశయోక్తి కాదేమో. ఇంతలా సేవచేస్తున్న వ్యక్తి ఎంపీగానో, ఎమ్మెల్యేగానో, మంత్రిగానో అయితే పరిస్థితి ఏ రకంగా ఉంటుందో వేరేగా చెప్పాల్సి పనిలేదు. ఈ నేపథ్యంలోనే ఈయన రాజకీయ రంగ ప్రవేశంపై అన్ని రాజకీయపార్టీలు విస్త్రుతంగా ఎంవిఆర్ కోసం చర్చిస్తున్నాయి. చూడాల త్వరలో రాజకీయ రంగప్రవేశం చేయబోతున్న ఎంవిఆర్ ఏ పార్టీ ద్వారా తన పొలిటికల్ ఎంట్రీ ఇస్తారనేది..! 

Anakapalle

2023-11-04 06:15:17

విశాఖలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై స్పందించిన సీఎం

 విశాఖలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ విశాఖ అక్రిడేటెడ్ వర్కింగ్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ కార్యవర్గ సభ్యులు ముఖ్యమంత్రి వైఎస్. జగన్ కు వినతి పత్రం అందజేశారు. విశాఖ వచ్చిన ముఖ్యమంత్రి ని గురువారం ఉదయం ఐటీ హిల్స్ హెలిప్యాడ్ వద్ద సొసైటీ గౌరవ అధ్యక్షులు కే.జి.రాఘవేందర్ రెడ్డి, అధ్యక్షులు బి . రవికాంత్ లు కలిసి తమ సొసైటీ ద్వారా రిజిస్టర్ అయిన అక్రిడేటెడ్ జర్నలిస్టుల వివరాలను ఆయనకు అందజేశారు. ఈ ఏడాది అక్రిడేషన్ ఉన్నజర్నలిస్టుల వివరాలు, 2006 నుంచి 2022 వరకు వివిధ సంవత్సరాల్లో అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టుల వివరాల జాబితాను ఆయనకు అందజేశారు. సుమారు 18 ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరారు.  దీనిపై ముఖ్యమంత్రి జగన్  సానుకూలంగా స్పందించారు.  జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించే విషయాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి ధనుంజయ రెడ్డి కి సూచించారు.  విశాఖలో ఉన్న అక్రిడేటెడ్ జర్నలిస్టులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ని కలిసిన వారిలో విశాఖ అక్రిడేటెడ్ వర్కింగ్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఉపాధ్యక్షుడు  కె.మురళీ కృష్ణ రెడ్డి తదితరులు ఉన్నారు.

Visakhapatnam

2023-11-02 12:44:39

ఏలూరులో ప్రారంభమైన మేరీ మట్టి మేరీ దేష్ కలశయాత్ర

ప్రాణాలను పణంగా పెట్టి దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వీరుల త్యాగాలను స్మరించుకోవడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం మేరీ మట్టి మేరీ దేష్  అని డిఆర్వో వెంకేటశ్వ ర్లు పేర్కొన్నారు. శనివారం ఏలూరు జిల్లా నుంచి కలస యాత్రను ఆయన జండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  స్ఫూర్తిని కలిగిస్తూ..భావి తరాల వారిలో దేశభక్తి పెంపొందించడానికి ప్రధాన మంత్రి  నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస విశ్వనాథ్ మాట్లాడుతూ , జిల్లా కలెక్టర్  ప్రసన్న వెంకటేష్ ఆదేశాలతో మేరీ మట్టి మేరీ దేష్ కలశయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, జిల్లా నుండి 29 మంది వాలంటీర్లతో దేశ రాజధాని ఢిల్లీ పయనమైనట్టు తెలియజేశారు. 547 గ్రామ పంచాయతీల నుండి సేకరించిన మట్టితో మండల వారీగా ఏర్పాటు చేసిన కలశాలతో ఏలూరు జిల్లా నుంచి 36 మంది విజయవాడ నుంచి ప్రత్యేక ట్రైనులో వాలంటీర్లు ఢిల్లీ చేరుకుంటారన్నారు.  ఢిల్లీలో ఈ నెల అక్టోబర్ 30, 31న రెండు రోజులు జరుగే కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.  జిల్లా నుంచి బాషా సాంస్కృతిక శాఖ, యువజన శాఖ, పంచాయతీ రాజ్ సమన్వయంతో అమృత కలశ యాత్ర చేపట్టినట్టు వివరించారు. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా జిల్లా యువజన అధికారి కిషోర్, సెట్వెల్  సీఈఓ మహారాజ్ వ్యవహరించగా అమృత కలశ యాత్రలో డిపిఆర్సీ, సెట్వెల్, యువజన కేంద్రం, జిల్లా ప్రజా పరిషత్, జిల్లా పంచాయతీ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Eluru

2023-10-28 03:31:59

సామాజిక చైతన్యమే లక్ష్యంగా జగనన్న పాలన

జగనన్నమార్గదర్శకత్వంలో వైఎస్సార్ సీపీ నిర్వహిస్తున్న 'సామాజిక బస్సు యాత్ర' అన్ని వర్గాల ప్రజలనూ ఆప్యాయంగా కలుసుకునేందుకు నిర్వహిస్తు న్న కార్యక్ర మమని వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ వివరించారు. విజయదశమి సందర్భంగా తీసుకున్న భవానీ దీక్ష పూర్తయిన  అనంతరం శుక్రవారం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుపతి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ‌ఈ నెల 26 నుంచి ఉత్తరాంధ్రలో ప్రారంభమైన సామాజిక చైతన్య బస్సు యాత్ర లక్ష్యాన్ని ఎంపీ వివరించారు. తిరుపతిలో నిర్వహించే బస్సు యాత్రలో తాను పాల్గొనబోతున్నట్టు తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన ఈ ఏడున్నర దశాబ్దాల కాలంలో అణగారిన వర్గాలకు ఏ ప్రభుత్వం న్యాయం చేయలేదన్నారు. కేవలం వారిని ఓట్ల బ్యాంకుగా మాత్రమే వాడుకున్నారు తప్పిస్తే సామాజిక, రాజకీయ, ఆర్థికంగా వారిని చైతన్య పరిచే ఏ ఒక్క కార్యక్రమాలను పాలకులు చేయలేదన్నారు. 

ఎనభై శాతం ఓట్లున్న సామాజిక వర్గాన్ని వెనక్కి నెట్టేశారన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి సమ న్యాయాన్ని పాటిస్తూ పాలన దిస్తున్నారని తెలిపారు. జగనన్న సీఎం అయ్యాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జడ్పీ ఛైర్మన్లు ఉంటే వాటిలో 9 అణగారిన వర్గాలకే ఇచ్చారన్నారు.  బీసీ, ఎస్పీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు 67 శాతం మంత్రి వర్గంలో అవకాశం కల్పించడం, వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలా అవకాశాలు, సహాయం అందజేయడం జరుగుతోం దన్నారు. మహిళా బిల్లు మొన్ననే చట్టం కూడా అయిందని, దీనివల్ల మరింత చైతన్యం కలుగుతుందన్నారు. మరి ఇవన్నీ గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేదని ఎంపీ ప్రశ్నించారు. ఎంత సేపూ ప్రజాధనాన్ని దోచుకోవడం, దాచుకోవడం..అడ్డంగా బొక్కేయడం తప్పిస్తే సామాన్యుల స్థితిగతులపై, వారి జీవన విధానాన్ని మెరుగుపర్చే ఏ ఒక్క కార్యక్రమం చేపట్టలేదన్నారు. గతంలో సామాన్యులకు జరిగిన మోసాలు, దోపిడీని వివరిస్తూ వైఎస్సార్ సీపీ పాలనలో అన్ని వర్గాలకు చేసిన సామాజిక న్యాయాన్ని ఈ బస్సు యాత్రల ద్వారా వివరిస్తామని ఎంపీ భరత్ తెలిపారు.

 సనాతన హైందవ ధర్మానికి ఏ మాత్రం చిన్నపాటి అవమానం జరిగినా విశేషంగా స్పందించే హిందూ ధర్మ పరిరక్షణ సంస్థలు, సంఘాలు‌ రాజమండ్రిలో టీడీపీ నిర్వహించిన కార్యక్రమంపై ఎందుకు స్పందచలేదని ఎంపీ భరత్ ప్రశ్నించారు.  హిందువుల  ఆరాధ్య దైవాలను రాక్షసులుగా చిత్రీకరిస్తూ 'జగనాసుర' వధ కార్యక్రమాన్ని టీడీపీ నిర్వహిస్తే వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్, హిందూ ధర్మ పరిరక్షణ సమితి.. ఇవన్నీ ఎందుకు నోరు మెదపలేదని‌ ఆయన సూటిగా ప్రశ్నించారు. జగన్నాధుడు అంటే విష్ణుమూర్తి అంశం, అలాగే కృష్ణభగవానుడు నామమని..అటువంటి హిందూ దైవాలని రాక్షసులుగా చిత్రీకరించడం భారతీయులంతా ముక్త కంఠంతో ఖండించాలన్నారు. హిందూ దైవాలను రాక్షసులుగా చిత్రీకరించిన ఎవ్వరినీ ఉపేక్షించకూడదని, ఈ విషయమై లోక్ సభలో కూడా ప్రధానంగా ప్రస్తావిస్తానని ఎంపీ స్పష్టం చేశారు.

Rajamahendravaram

2023-10-27 05:52:46

అసంబద్ధ కేసులతో నిజాయితీని అడ్డుకోలేరు..దువ్వారపు

అసంబద్ధ సత్తువ లేని కేసులతో చంద్ర బాబు నాయుడు ప్రభంజనాన్నిఅడ్డుకోలేరని ఎమ్మెల్సీ దువ్వా రపు రామారావు అన్నారు. శుక్రవారం విశాఖ లోని ఆడారి కిషోర్ కుమార్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం టిడిపి అధినేత చంద్రబాబు పై పెట్టిన కేసుల్లో సత్తువ లేదన్నారు.  పాలకులు చూపించిన పైత్యానికి అధికారులు నిబంధనలు తుంగలోకి తొక్కడం క్షమార్హం కాదన్నారు. త్వరలోనే ప్రజలు వీళ్ళకి బుద్ది చెప్తారన్నా రు. ఉత్తరాం ధ్ర ను అభివృద్ధి చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి 2 చీకటి జిఓలు విడుదల చేశారన్నారు.  తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆడారి కిషోర్ కుమార్ మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర ను వీళ్ళు కొత్తగా అభివృద్ధి చేయడం ఏంటని.. సహజ సిద్ధంగా వనరులున్న ఉన్న ఉత్తరాంధ్ర ను దోచుకోడానికి అధికార ఆర్ట్ వేసిన కుట్రగా అభివర్ణించారు.  విశాఖ రాజధాని వద్దు అనే నినాదం తో ఈ సభల్లో తీర్మానం చేస్తున్నారన్నారు. చంద్రబాబుపై జగన్ పెట్టిన అక్రమ కేసులు నేడు సుప్రీం కోర్టులో కొట్టి వేయడం ద్వారా  న్యాయం లభిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డెమోక్రసీ ఇన్ డేంజర్ పేరిట అఖిల పక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, విద్యావేత్తలతో  రౌండ్ టేబుల్ సమావేశం ర్వహిస్తు న్నామని చెప్పారు.  ఆదివారం అరకు, పాడేరు ల్లో సమావేశాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. గత నాలుగున్నర ఏళ్లుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని, అసుర పాలన తో పౌరుల నుంచి ప్రతిపక్షాల వరకూ అందరూ విసిగిపోయారన్నారు జనసేన మెడికల్  సెల్ ప్రతినిధి డా.బొడ్డేపల్లి రఘు మాట్లాడుతూ, జనసేన టీడీపీ సంయుక్తంగా పోటీ చేసి రానున్న ఎన్నికలలో ప్రభంజనం సృష్టిస్తుందన్నారు. గత నాలుగున్నర ఏళ్ళల్లో విశాఖ పై లేని ప్రేమ జగన్ మోహన్ రెడ్డికి ఎన్నికల ముందు పుట్టుకొచ్చిందా అని ప్రశ్నించారు.  ఈకార్యక్రమంలో కంచర పాలెం  తెలుగు దేశం వార్డ్ అధ్యక్షులు గోర్లే అప్పారావు, కుట్ట కార్తిక్ తదితరులు ల్గొన్నారు.

Visakhapatnam

2023-10-13 08:24:16

ఓటర్ల సవరణ జాబితా పకడ్బందీగా చేపట్టాలి

ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం చాలా జాగ్రత్తగా పకడ్బందీగా నిర్వహించాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి  నియోజకవర్గాల ఎన్నికల అధికారులను ఆదేశించారు.మంగళవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు నియోజకవర్గాల ఇఆర్వోలు, ప్రత్యేక అధికారులతో ఎన్నికల అంశాలపై సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా తొలగించిన  ఓట్లకు సంబంధించిన 3 రకాల రికార్డులను, ఓటర్ నోటీసులు, పంచనామా పత్రాల్లో అధికారుల సంతకాలు క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.  ప్రతి పోలింగ్ కేంద్రంలో 1400 ఓటర్లకు మించకుండా ఉండేలా చూడాలని సూచించారు. ప్రతి ఓటర్ ఇంటి నెంబర్ ఉండాలని,  ఏ ఇంటి  నంబరు ఏ పోలింగ్ కేంద్రంలో వస్తుందో పక్కాగా సమాచారం వుండాలని సూచించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల అనుసరించి ఓటర్ల జాబితాలో మూడు రకాలు అనగా మృతి చెందిన, శాశ్వతంగా వలస పోయిన, ఒకరికి ఒకటి కంటే ఎక్కువ ఉన్న ఓట్లకు సంబంధించి తొలగించిన ఓటర్ల  రికార్డులను పరిశీలించడం జరుగుతుందని, వాటి పరిశీలనకు సిద్ధం చేయాలన్నారు. 

తొలగించిన ఓటర్లకు సజావుగా నోటీసులు పంపించే ప్రక్రియ ముఖ్యంగా మృతి చెందిన ఓటర్లకు సంబంధించి సంబంధిత ధ్రువీకరణ పత్రాలను పొందడం లేదా పంచనామా నిర్వహించి ఓట్లను తొలగించడం పక్కగా చేయాలన్నారు. బూతు స్థాయి అధికారుల నుండి ఏఈఆర్వోలు, ఈఆర్ఓలు, ప్రత్యేక అధికారులు, పూర్తిగా పరిశీలన చేయాలనే, చివరగా జిల్లా ఎన్నికల అధికారి పరిశీలనకు సిద్ధంగా ఉంచాలన్నారు. నియోజకవర్గ పరిధిలో తొలగించిన ఓట్లలో ఓటర్ల నమోదు అధికారి ఈఆర్వో1000 ఓట్లను, యాదృచ్ఛికంగా వివిధ పోలింగ్ కేంద్రాల్లో పరిశీలించాలన్నారు. అలాగే ప్రత్యేక అధికారులు 500 ఓట్లను, జిల్లా ఎన్నికల అధికారిగా 100  తొలగించిన ఓట్లను ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు  పరిశీలించి సరైన పత్రాలతో దస్త్రాలు ఉన్నాయా లేదా గమనించడం జరుగుచున్నదని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి, నియోజకవర్గం ఇఆర్వోలు భీమవరం దాసిరాజు, ఆచంట ఎస్ టి వి రాజేశ్వరరావు, నరసాపురం కే కృష్ణవేణి, పాలకొల్లు కే సి హెచ్ అప్పారావు, ఉండి జీవీకే మల్లికార్జునరావు, తణుకు జెడ్ వెంకటేశ్వరరావు, ప్రత్యేక అధికారులు జాషువా, ఆశా కిరణ్, ఎలక్షన్ సూపరింటెండెంట్, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

Bhimavaram

2023-09-05 15:41:05

ప్రతి వ్యక్తి విజయానికి గురువే మూలం..కలెక్టర్

ఏ ఒక్కరి విజయంలోనైనా గురువే ప్రముఖంగా కనిపిస్తారనీ అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి అన్నారు.  మంగళవారం గుండాల వద్ద గల సచివాలయ సమావేశ మందిరంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా నిర్వహించిన  గురుపూజోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ఏ రంగంలోనైనా ఏ స్థాయిలోనైనా గురువుకు ప్రథమ స్థానం ఉంటుందన్నారు.  విద్యాభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. జిల్లాలో టీచర్లు బాధ్యతగా పనిచేస్తున్నారని ప్రశంసించారు అయితే అందరూ ఆధునిక పరిజ్ఞానంతో అప్డేట్ అవ్వాలన్నారు.  మారుతున్న ఆధునిక కాలంతోపాటు మనము సాంకేతికతను సొంతం చేసుకోవాలన్నారు.  పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బి.వి. సత్యవతి మాట్లాడుతూ ఏ రంగంలోనైనా అందరి మదిలో గురువుకు గౌరవ స్థానం ఉంటుందని చెప్పారు.  సమాజం యొక్క మూర్తిమత్వాన్ని తీర్చిదిద్దడం ఒక్క గురువు వల్లే సాధ్యమవుతుందన్నారు.  మన దేశ రెండవ రాష్ట్రపతి, ఆంధ్ర విశ్వవిద్యాలయం కులపతిగా చేసిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. అనంతరం జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 63 మందిని సన్మానించి జ్ఞాపికలు ప్రశంసా పత్రాలు అందజేశారు. అంతకుముందు బాలబాలికల ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ, వైసిపి గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు డాక్టర్ కె. విష్ణుమూర్తి,డిప్యూటీ డిఇఓ  వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2023-09-05 14:38:44

ఉమ్మడి విశాఖలో 70 మందికి కారుణ్య నియామకాలు

ప్రభుత్వ ఉద్యోగులు నిజాయితీగా, నిస్వార్థంగా అంకితభావంతో ప్రజలకు సేవలందించాలని జిల్లా కలెక్టర్‌ డా.ఎ.మల్లికార్జున పేర్కొన్నారు. మంగళవారం విశాఖలోని వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తూ మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల ఉత్తర్వులను కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ‌అభ్యర్థులకు కలెక్టర్ అందజేశారు. ఉమ్మడి విశాఖపట్నం  జిల్లాలో సాధారణ కారుణ్య నియామకాలు క్రింద 70 మందికి, రెవెన్యూ శాఖ 9 మందికి, గ్రామ సచివాలయాలు 3 , ఆర్టీసీ 21 మంది , రెవెన్యూ శాఖలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు 43 మొత్తం 146 మందికి  నియామక పత్రాలు కలెక్టర్‌ అందజేశారు . ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈరోజు ఉద్యోగాలు పొందిన అభ్యర్థులతో కలిపి 436 మందికి నియామక పత్రాలు అందజేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఉద్యోగంలో చేరిన తరువాత కూడా ఉన్నత విద్యనభ్యసించాలని, నూతనంగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన వారందరూ నిస్వార్ధంగా, నిష్పక్షపాతంగా, నిజాయితీగా తమ విధులను నిర్వహించాలన్నారు. 

ఉద్యోగం పొందిన ప్రతి అభ్యర్థి చేసే పనిలో నైపుణ్యత, నాలెడ్జ్,  అవగాహన కలిగి ఉంటే ఉన్నత స్థితికి చేరుకోవచ్చు అని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతో మంది వేచి చూస్తున్నారని... క్లిష్ట సమయంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పర్చుకోవాలన్నారు. విధి నిర్వహణలో ఏ పని అప్పగించిన బాద్యత యుతంగా  పనిచేసి ఉన్నతాధికారుల గుర్తింపు పొందాలని కలెక్టర్ అన్నారు. కుటుంబ బాధ్యతలను కూడా సరిగా నిర్వర్తించాలని కలెక్టర్‌ సూచించారు. జాయింట్ కలెక్టర్ కె ఎస్ విశ్వనాథన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగం పొందినవారు ప్రజలకు సేవ చేయాలని అన్నారు. సమయ పాలన పాటిస్తూ నిబద్దత, అంకిత భావంతో విధులు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్వో ఎస్ శ్రీనివాసమూర్తి , ఆర్డీవో హుస్సేన్ సాహెబ్ , కలెక్టరేట్‌ కార్యాలయ పరిపాలన అధికారి ఈశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-09-05 14:10:15

నేక్ సంస్థ ద్వారా ఉచిత ఎలక్ట్రీషియన్ శిక్షణ

నేషనల్ అకాడమీ ఆఫ్ కనస్ట్రక్షన్ (నేక్) ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ  నిరుద్యోగ యువతకు ఉపాధి కొరకు ఎలక్ట్రీషియన్ కోర్సులో 'ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0' పథకం కింద ఎలక్ట్రీషియన్ కోర్స్ లో ఉచిత శిక్షణ, ఉపాధి నిమిత్తము నేరుగా దరఖాస్తులు కోరుతున్నట్లు నేక్ సహాయ సంచాలకులు రవికుమార్ తెలిపారు. అభ్యర్థులు 10 వ తరగతి పాసై 15 సం. నుండి 45 సం.ల వయసు కలవారే ఉండాలన్నారు. సుమారు 2 నెలలు శిక్షణా కాలం ఉంటుందని తెలిపారు. 60 మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.  మాకవరపాలెం "నేక్" శిక్షణా కేంద్రంలో శిక్షణ,  స్టేషనరీ ఉచితముగా అందజేయబడుతుందన్నారు. శిక్షణ  నాన్ రెసిడెన్షియల్ పద్ధతిలో వుంటుందని శిక్షణ పూర్తయిన తర్వాత సంబంధిత రంగంలో (ప్రైవేటు సెక్టారులలో) ఉపాధి కల్పిస్తారని పేర్కొన్నారు. ఈ శిక్షణకు ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదని వివరించారు.  ఆశక్తి గల అభ్యర్థులు 7780275922 లేదా 9394885164 ఫోన్ నెంబరులో  సంప్రదించాలన్నారు.

Anakapalle

2023-09-05 07:18:21

నిబద్దత, అంకిత భావంతో విధులు నిర్వహించండి

నిబద్దత, అంకిత భావంతో విధులు నిర్వహించండి జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కారుణ్య నియామక పత్రాలను జిల్లా కలెక్టర్ అందజేశారు. జిల్లాలో వివిధ శాఖల్లో పనిచేస్తూ ఉద్యోగులు కోవిడ్ తో మృతి చెందారని.. సదరు మృతి చెందిన కుటుంబ సభ్యులకు గ్రామ, వార్డు సచివాలయాలలో వివిధ శాఖల్లో కారుణ్య నియామకాల క్రింద ఉద్యోగాలను భర్తీచేస్తూ.. 4గురికి నియామక పత్రాలను అందజేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అందరూ సమయపాలన పాటిస్తూ విధులు నిర్వహించాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రభుత్వ కార్యక్రమాలను అన్ని వర్గాల ప్రజలకు చేరువ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, ట్రైనీ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఇంచార్జ్ డిఆర్ఓ మురళీ కృష్ణ, డిఆర్డిఎ పిడి విద్యాసాగర్,  తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2023-09-04 09:03:32