1 ENS Live Breaking News

తేడా కులపి(జర్నలి)స్టులు..!

జర్నలిస్టులా వాళ్లెక్కడున్నారు వైజాగ్ లో..!? మహా అయితే ఐదో పదో మంది ఉంటారు.. నిజంగా పనిచేసే జర్నలిస్టులు..? మిగిలిన వారంతా కులపిస్టులే కదా.. అవును మీరు విన్నది..చదువున్న ఈ స్టోరీ కూడా నిజమే.. అధికారపార్టీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష పార్టీలోని మాజీ మంత్రి దగ్గరకు ఎలక్షన్ ప్యాకేజీ కోసం వెళ్లినపుడు ఈరోజుకి ఎదురైన వింత అనుభం ఇది. మాకూ ఉన్నారండి కులపిస్టులు..ఛీ ఛీ జర్నలిస్టులు.. ఆ పదం వాడి వాడి అలవాటైపోనాది.. అదేంటి ఇదేదో తేడా లేదూ..పక్కా తేడాగానే అనిపిం చింది మాకు కూడా. మా కులపోళ్లే చాలా మంది ఉన్నారండీ..వాళ్లకే ప్యాకేజీలు సరిపెట్టలేకపోతున్నాం.. ఇక బయట జర్నలిస్టులు, మీడియా సంస్థలకు ఏమివ్వగలం.. అందులోనూ మా కులపోళ్ల మీడియా, పార్టీ మీడియా అంటే ఏ సమయంలోనైనా సపోర్టు చేస్తారు.. మిగిలినవారంతా వాళ్లకిష్టం ఉంటేనే చేస్తారు లేదంటే లేదు. అలాంట పుడు మా కులపిస్టులను మేము బాగా చూసుకుంటే..వాళ్లు మమ్మల్ని బాగా చూపిస్తారు.. మాకోసం మరింత బాగా రాస్తారు.. ఏదో మీరంటే మాకు బాగా పరిచియం అని మాత్రమే వాస్తవం మాట్లాడాను.. అలాగని మీకేం అన్యాయం చేయను లేండి..మీరు అనుకున్నంత కాకపోయినా ఎంతో కొంత ఇచ్చే ఏర్పాటు చేస్తాను.. కానీ మీరేమను కున్నా మా కులపోళ్లు మా కులపోళ్లే..అయినా సిటీలో కూడా మా కులపోళ్లే ఎక్కువగా ఉన్నారట  కదూ.. అని కట్ చేశారా ఇద్దరు ప్రజాప్రతినిధులు. ఒక్కసారిగా ఏం మాట్లాడాలో అర్ధం కాని పరిస్థితి అయిపోయింది. ఆ ఇద్దరి దగ్గరకు వెళ్లినపు కూడా. ఎన్నికల ప్యాకేజీ మాట దేవుడెరుగు.. ఇలాంటి వాళ్ల దగ్గరకెళ్లి ప్యాకేజీలు తీసుకుంటే నన్నూ అలాగే అంటకాగిస్తారని చెప్పి..మీ అభిమానానికి చాలా తేంక్స్ అండీ.. మీ ప్యాకేజీ ముఖ్యం కాదు మీరు మాకు ముఖ్యమని అక్కడి నుంచి బయటకు వచ్చే స్తుంటే.. మొదట రాసిన మాటలు వినిపించాయి..ఐదో పదో మంది జర్నలిస్టులన్నారనే మాట.. అపుడు అనిపించింది నిజంగానే జర్నలిస్టులు కాస్తా కులపిస్టులు అయి పోయారని..?!

  అవువు విశాఖలో కులపిస్టులు(పేరుకి జర్నలిస్టులు) రాజ్యమేలుతున్నారు. అందునా చాలా మంది ఇలాంటి వారికి ప్రజాప్రతినిధులు కూడా పక్కగా సపోర్టు చేయడంతో నిజమైన జర్నలిస్టులు, బ్యాలెన్స్ గా ఉన్న మీడియా సంస్థలు మనుగడ సాధించలేకపోతున్నాయి. ఆవిషయం 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాస్తో కూస్తో ఆదాయం వస్తుందనుకొని న్యూస్, యాడ్స్ ప్యాకేజీల కోసం తిరిగినపుడు మాకు చాలా స్పష్టంగా అర్ధమైంది. పలానా ఛానల్ మా కులపోళ్లదే.. ఈ పేపర్ లో మన కులపిస్టే పనిచేస్తు న్నాడు.. అదిగో ఆ యూట్యూబ్ ఛానల్ కూడా మనకులపోళ్లే కమర్షియల్ గా స్టార్ట్ చేశారు. మనంవాళ్లని చూసుకుంటే చాలు మిగిలిన వారందిరికీ ఏదో సాకు చెప్పి పంపేయవచ్చు అనే దీమా వచ్చేసింది. ప్రజాప్రతినిధులే కాదు వాళ్ల దగ్గర పనిచేసే పీఏలు, మేనేజర్లు కూడా వాళ్ల కులపోళ్లే ఉండటం, జర్నలిస్టులను, జర్నలి స్టులగా కాకుండా కులపిస్టులుగా చూస్తూ వారి స్వరూపాన్నే మార్చేయడం కొత్త పోడకలకు తావిస్తున్నది. వాడు పనిచేసే ఛానల్ ఏ కేబుల్  నెట్వర్క్ లో ప్రశారం అవుతుందో తెలీదు..? వీడు వీడి కులప నాయకుడి దగ్గర తీసుకున్న వాయిస్ బైట్ ఏ అర్ధరాత్రి ప్రసారం అవుతుందో అంతకంటే తెలీదు.. కానీ తెల్లవారేపాటికి సదరు కులపోళ్ల ఛానల్ లోగోతో వీడియో క్లిప్పింగ్ మాత్రం కులప నేతల వాట్సప్ కి వెళుతుంది. అంతే వెంటనే చూశారా మా కులపిస్టు మనకిచ్చిన పబ్లిసిటీ అంటూ ఆ కులప ప్రజాప్రతినిధి తెగ ఫీలపైపోయి ఆకలని కూడా మరిచిపోయినంతగా ఆనంద పడిపోతాడు.

 ఇంతకీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే మా కులపిస్టు అనుకున్న జర్నలిస్టు వాడి ఛానల్ లో ప్రసారం కాని వీడియోని బయట ఎడిటింగ్ చేయించి సదరు ప్రజాప్రతినిధి, వాళ్ల కులప నాయకులను బొక్కబోర్లా పడేలా మోసం చేయగలుగుతున్నాడు. అయినా కూడా తినే అన్నం కంటే.. వచ్చిన పేరుకంటే.. ప్రస్తుతం ఉన్న స్థానం కంటే కులాభిమానికే విలువనిచ్చే సదరు ప్రజాప్రతినిధి దీనినే నిజమని నమ్మేస్తున్నాడు. అందరినీ నమ్మిస్తున్నాడు. అలాగనీ అందరు కులపిస్టులు బయట వీడియో ఎడిటింగ్ చేయించనవే ఉండవు లేండి అప్పడప్పుడు సదరు కులప ఛానల్స్ లో వార్తల్లో కూడా వస్తుంటాయి. అందువలన వీరు చేసే మోసాలు వారికి అర్ధం కావం లేదు. ఇదంతా ఎప్పనుంచో నడుస్తుంది కదా.. మళ్లీ ఇప్పుడు మీకెందుకు గుర్తొచ్చింది..మళ్లీ ఎందుకు ఈ స్టోరీ రూపంలో రాస్తున్నారూ..? అంటే.. అదే కులపిస్టులు చేస్తున్న మోసాన్ని అదే కులప నేతలు ఆ ఇద్దరికే చెప్పి..(ఒకటి అడిగిన వారికి..రెండూ అడగని వారికి) గొల్లుమంటున్నారు. అయినా వెధవది కులాభిమానం అడ్డొచ్చి మళ్లీ వీరినే నమ్ము తున్నారు.. గొర్రె కసాయివాడిని నమ్మినట్టుగా.. ఇక్కడ ఏ జర్నలిస్టునూ, కులపిసిస్టునూ, శంఖించడానికో, వాళ్ల తెరవెనుక వ్యాపారాన్ని అడ్డుకోవడానికో, పేరు పెద్ద ఛానల్, పేపర్ అయినా వీరంతా వేసే వేషాలను, ఇతర కులపోళ్లు వీళ్లని చూసి సిగ్గుతెచ్చుకోనందుకో ఈ స్టోరీ రాయడం లేదు..? విషయం అందరికీ తెలుస్తుందని మాత్రమే ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాం.

 జరుగుతున్న, చేస్తున్న, చేపడుతున్న, ఆర్ధిక లాభం పొందుతున్న కులపిస్టుల సంగతి మేమూ ఆ ఇద్దరికే..(ఒకటి అడిగిన వారికి..రెండూ అడగని వారికి) చెప్పాలని చిన్న తాపత్రయం. ఇదంతా ఎపుడో ఉంది మీకు ఇపుడే తెలిసినట్టుంది అనుకున్నవారు లైట్ తీసుకోవచ్చు. కానీ జర్నలిస్టుని జర్నలిస్టుగానే చూడాలని, బ్రోకర్ ను బ్రోకర్ గానే చూడాలని, కులపిస్టుని కులపిస్టుగానే చూడాలని, కానీ ఎవరైనా మీకు పనిచేస్తేనే మీరు విలువ ఇవ్వాలని, మరొకడి పొట్ట కొట్టే ప్రయత్నాలు చేస్తే మీ కులపోడైనా పక్కనపెట్టాని తెలియజేయడానికి, ఆ సూచన చేయడానికి మాత్రమే ఈ స్టోరీ మళ్లీ మీ ముందుకి తీసుకు రావాల్సి వచ్చింది. అందరు జర్నలిస్టులు కులపోళ్లు అయి పోరు.. అందరు కులపోళ్లు జర్నలిస్టులు అయిపోరు.. కానీ కులప రాజకీయనేతలు మాత్రం వారి కులపోళ్లనే చూస్తారు.. కనీసం ఇతర కులపోళ్లైనా.. ఈ కులప రాజకీ యాన్ని వంటపట్టించుకుంటే.. అన్ని కులాల్లోని, సామాజికవర్గాల్లోని మీడియా సంస్థలు, కులపిస్టులు బాగు పడటానికి అవకాశం వుంటుందనేది గుర్తెరగాలని మాత్రం ఖచ్చితంగా సూచించాల్సిన సమయం వచ్చిందని చెప్పగలం. జై మన కులపోడు..జై జై మనకులపిస్టులు.. కాదు కాదు నిజమైన జర్నలిస్టుకి జై.. వాస్తవం కాని కుల పిస్టుకి నై జై.. ఈ విషయాన్ని నిజంగా పనిచేసే జర్నలిస్టులు అర్ధం చేసుకుంటే చాలు.. జర్నలిజం వర్ధిల్లాలి.. కులపిజం నశించాలి..!

visakhapatnam

2024-04-23 06:36:02

అనకాపల్లిలో నేల టిక్కెట్టు రాజకీయాలు..!

అనకాపల్లిలో నేల టిక్కెట్టు రాజకీయాలు మొదలయ్యాయి.. అదీ ఎంతలా అంటే ఎన్నికల్లో ఎలాగైనా గెలవడం కోసం మీడియాను కూడా మరీ చులకన చేసి ముష్టివేసి.. అడ్డదారిలో పేరు ప్రతిష్టలు పొందేసి.. ఆపైన గెలిచేసి డైరెక్టుగా అనకాపల్లి నుంచి డైరెక్టుగా ఢిల్లీ పార్లమెంటుకి వెళ్లిపోదామనుకుంటున్నారు నేతలు. ఏంటి ఇదేదో కాస్త తేడా ఉంది కదూ అనుకుంటున్నారా..? ఎస్ పక్కా తేడా..! ఒక పార్టీ నాయకుడు చేసిన చవకబారు పని ఏకంగా ఆ వ్యక్తి పేరునే మార్చేసేలా చేసింది. కాదు కాదు ఆ విధంగా మీడియావాళ్లూ, ఆ పార్టీలోని వారే ఆ నేతకు ఆ పేరు పెట్టేశారు.. నేల టిక్కెట్టుగాడు అని..! అసలు విషయం తెలుసుకుంటే మరీ రంజుగా వుంటుంది. మీరూ చదివేసేయండి మరి..!  అనకాపల్లి నుంచి ఎంపీగా గెలిచేయాలని తెగ బిల్డప్పులిచ్చేసిన ఒక రాజకీయపార్టీ నేత అనాకపల్లిలో మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు. దానికంటే ముందు అసలు జిల్లాలో ఎంతమంది విలేఖరులున్నారు.. ఎన్ని పేపర్లు ఉన్నాయి.. మరెన్ని ఛానళ్లు ఉన్నాయి.. ఇంకెన్ని కేబుల్ టీవి నెట్వర్కులున్నాయి..? ఎన్ని నియోజకవర్గాలున్నాయి..? జిల్లా కేంద్రంలో ఎంతమంది పనిచేస్తున్నారు..? లిస్టులిస్తే వారందరికీ మంచి ప్యాకేజీలిచ్చి ప్రజల్లోకి వెళదామని ముఖ్య కార్యకర్తలు, 
మీడియా మేనేజ్ మెంట్ చేసే వారి వద్ద బాహాటం ప్రకటించారు. దానితో కేడర్ మొత్తం ఉబ్బి తబ్బిబై పోయి. మా సార్ అంటే మామూలు వ్యక్తి కాదు.. మేము ముందే అనుకున్నాం. ఎంతమందినైనా సింగిల్ గా మడతెట్టేస్తారని.. ఇక పార్టీకి, నాయకులకూ మంచి రోజులు వచ్చినట్టేనని, మీడియాకే అంత గౌరవం ఇస్తే.. ఇక నాయకులు, కేడర్ గా ఇంత విలువనిస్తారో.. అనుకొని వెంటనే మీడియాకి కబురు పెట్టేశారు. ఏమనీయ అంటే.. అనకాపల్లిలోని మీడియాలో పనిచేసేవా రు, యూని యన్లు, లీడర్లు అందరివి లిస్టులు ఇమ్మన్నారని..వెంటనే పెట్టేస్తే మీటింగ్ కూడా అంతే వేగంగా ఏర్పాటు చేసేస్తామన్నారు మా సారు అన్నాడు మధ్య వర్తి.. దానితో నిజంగానే కనీసం కొద్దో గొప్పో ప్యాకేజీ ఇస్తారు.. మనం కూడా బాగా పబ్లిసిటీ చేయడంతోపాటు, మన కుటుంబాల ఓట్లు కూడా ఆయనకే గుద్దించేద్దామనుకొని పేర్లు, వివరాలతో కూడిన లిస్టులు ఇచ్చేశారు పనిచేసే విలేఖరులు, పనిచేయని విలేఖరులు, ప్రెస్ ఐడెంటిటీ కార్డుతో యాక్టింగ్ చేసేవారూ వగైరాలంతా.. పైగా మీడియా అని చెప్పి తిరిగే వారంతా టిప్పుటాపుగా రెడీ అయి అంతటి ఎండలోనూ సెంటుకొట్టుని మరీ వెళ్లిపోయారు.

 తీరా అక్కడికి వెళ్లిన తరువాత..విలేఖరులందరూ వరుసలో రండి..మీ నెంబర్లు పిలుస్తారు వచ్చి తీసుకోండని ముందుగా ప్రకటించారు అక్కడి సమావేశానికి  నిర్వాహ కులు. ఎన్నికలంటే మీడియాకి పండగ, అప్పుడే కొద్దో గొప్పో ఆదాయం వస్తుంది. వారు పనిచేసే సంస్థకి ఆదాయం తెచ్చిపెడితే వారికీ గౌరవం దక్కుతుందని తెగ ఆనంద పడిపోయారు. అందరితోనూ పిచ్చాపాటిగా మాట్లాడేసి.. మనోళ్లు ఇస్తారు తీసేసుకోండని చెప్పి ఆ నాయకుడు సమావేశం నుంచి వెళ్లిపోయారు. తరువాత కవర్లలో పెట్టిన ప్యాకేజీలు మొత్తం ఇచ్చేయాలి కదా.. అందరినీ లైన్లో రమ్మన్నారు..ఒక్కొక్కరికీ ఒక్కో కవరు చేతిలో పెట్టారు. తీరా అందులో చూస్తే.. రూ.500 నోటు. అదీ ఆ బడానేత మీడియాకి ఇచ్చిన పబ్లిసిటీ ప్యాకేజీ. సాధారణ ఓటరుకి ఎన్నికల సమయంలో ఇచ్చే డబ్బులకంటే నాలుగోవంతు. అంటే మీడియాని ఎంత చులకన చేశారో అర్ధమైందా. ఆ మాత్రం దానికి ఆ రాజకీయ నాయకుడు జిల్లాకి వచ్చే సమయంలో ఇదే మీడియా, విలేఖరులంతా ఆహా.. ఓహో.. ఆయనొస్తే ఆకాశానికి.. కన్నం.. భూమికి బొక్క పడిపోద్ది.. ఆయనకి ఎవరూ ఎదురెళ్లలేరు. అంటూ తెగ ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చేశారు. ఏదేదో ఊహించుకుని. కానీ తీరా మీడియా ప్యాకేజీలిస్తామని చెప్పి రూ.500 నోటు చేతిలో పెట్టేసరికి వెళ్లిన వారందరికీ దిమ్మ తిరిగి బొమ్మ కనిపించి పోయింది. కాస్తో కూస్తూ విలువలకు కట్టుబడే జర్నలిస్టులు మాత్రం ఆనోటుని తిరస్కరించారు. మిగిలిన వారు పెట్రోలు ఖర్చుల కైనా వస్తాయని చెప్పి మడతెట్టి జేబులోపెట్టుకొని బయటకు వస్తూనే.. సరైన నేల టిక్కెట్టు నాయకుడు అనకాపల్లికి వచ్చారంటూ కామెంట్లు చేయడంతో..సార్ ఏమీ అనుకోవద్దు..మేమూ అలాగే అనుకున్నాం మా తొక్కలో సారు ఇలా ఈ విధంగా ఇంత చండాలంగా.. చవకబారుగా వ్యవహరిస్తారని అనుకోలేదంటూ చోటా నాయకులు కూడా సిగ్గుతో లోనికి వెళ్లిపోయారు.

మీడియా అంటే మీడియానే కదా.. బయటకొచ్చిన వీరంతా అసలైన పబ్లిసిటీ మొదలెట్టారు.. ఇద్దరికే చెప్పడం ప్రారంభించారు.. ఒకటి అడగని వారికి..రెండు అడిగిన వారికి.. అంటే దీనర్ధం ఏంటో మీకు ఈపాటికే తెలిసిపోయే వుంటుంది. జరిగిందా చెబుతూ..సరైన నేలటిక్కెట్టు నేత ప్రెస్ మీట్ కి వెళ్లాం.. వాడిచ్చిన ప్యాకేజీ తీసుకున్న తరువాత ఏం చేసుకోవాలో అర్ధం కాలేదంటూ ప్రచారం మొదలెట్టారు. అది కాస్తా జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు పాకింది. ఓహో ఆ నేత కోసమేనేంటి మీరంతా ఆహా ఓహో అని తెగ రాసేశారు. ఇప్పుడు తెలిసిందనుకుంటా..మీకు వాడు మీకంటే తేడాగాడని.. సిసలైన నేల టిక్కెట్టుగాడని.. విషయం తెలుసుకున్న వారంతా కామెంట్లు చేయడం ఉమ్మడి విశాఖజిల్లా అంతా దావానంలా పాకుతోంది. అయినా ఏమైనా అంటే ఇలాంటి నేల టిక్కెట్టు నేతలు ఓ.. తెగ ఫీలైపోతారు గానీ.. మీడియాని పిలిచినపుడు ఆర్ధిక పరిస్థితి బాగుంటే ప్యాకేజీలు ఇవ్వాలి.. లేదంటే చక్కగా భోజనం పెట్టి పంపేయాలి.. ఇంకా ఏదైనా గౌరవం చేయాలంటే ఏ బహుతిలాంటిదో ఇవ్వాలి కానీ.. మరీ దారుణంగా కాస్ట్లీ బెగ్గర్ కి ముష్టి  వేసినట్టు ఇలా రూ.500 నోటు చేతిలో పెట్టి ఇదే మీ ప్యాకేజీ అని చెప్పి వెళ్లిపోమనడం దేనికి సంకేతమో ఈ వ్యవహారం చదివిన తరువాత ప్రతీ ఒక్కరూ ఆలోచించాలి. వాస్తవానికి ఆ నేత ఎవరో మేము పేరు రాసేయొచ్చు. కానీ నేలటిక్కెట్టు రాజకీయాలు చేసేవారి పేర్లు రాసి మేమూ దిగజార కూడదని మాత్రమే రాయలేదు. మీడియా ఎప్పుడూ ఏ నాయకుడూ చులకనా చూడకూడదు..మీడియా కూడా ఏ నేత దగ్గరరా ఒంగి ఒంగి దండాలు 
పెట్టకూడదు..జై జర్నలిజం.. జై జై జర్నలిజం..!

anakapalli

2024-04-19 08:16:36

విశాఖలో ఎన్ని ‘కుల’ మీడియా బ్రోకర్లు..!

వాళ్లకి సిగ్గూ.. శరం.. చీమూ నెత్తురూ.. పరువు.. మర్యాద ఏమీ ఉండవు.. ఏ ప్రెస్ లోనూ, మీడియాలో లైవ్ లో ఉండరు.. రిపోర్టర్లుగా పనిచేయరు.. కానీ మీడియా మే నేజ్ మెం ట్ పేరుతో ప్రధాన పార్టీల దగ్గర కులం కార్డుతో చేరి.. ప్రధాన మీడియా సంస్థల్లో పనిచేస్తున్నట్టు కలరింగ్ ఇచ్చి ప్యాకేజీలను అడ్డంగా బొక్కుతారు.. మీడియా మేనేజ్ మెంట్ బ్రోకర్లుగా మారి అందర్నీ మేనేజ్ చేస్తుంటారు.. వాస్తవానికి సింగిల్ కాలమ్ వార్త రాయమన్నా.. యాంటీ వార్తలు రాయమన్నా.. పాజిటివ్ వార్తలు రాయమన్నా.. ఈరోజు మంగళవారమండీ(అసలు విషయం ఏంటంటే ఓ చిన్న వార్తరాయలంటే వీడికి ముచ్చెమటలు పడతాయి..రాయడం వస్తేనే కదా) మా ఇంటా వంటా లేదు.. మంగళవారం పూట ఆ తరహా వార్తలు రాయము అని చెబుతారు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధుల వద్ద..ఇదంతా నిజమే అనుకుంటారు ఆ వెర్రి పుష్ఫరాజులు.. కానీ పక్కోడితో రాయిస్తానని చెబుతారు.. పోనీలే నీకు మంగళవారం కదా.. ఏ బుధవారం గాడితోనైనా రాయించు.. లేదంటే మన కులపోళ్లతోనైనా రాయించు.. అవకాశం ఉంటే టీవీల్లో చూపించు.. దానికి అయితే ఒకే అంటాడు ఈ తేడా మీడియా బ్రోకర్.. నిజానికి రాజకీయపార్టీల నేతలకు కావాల్సింది కూడా అదే వారి కులపోళ్లైతే కాస్త వారి కోసం ఆలోచిస్తారనే గుడ్డి నమ్మకం.. ఈక్రమంలో వీడు ఏం గడ్డితిన్నా పర్లేదు.. మనకి పబ్లిసిటీ రావాలి..? నిజంగా పబ్లిసిటీ ఇచ్చేవాడు బలైపోయినా మనకి అనవసరం అంటారు.. అలా విశాఖలో మీడియా బ్రోకర్లను ప్రధాన రాజకీయపార్టీల నేతలే పెంచి పోషిస్తున్నారు. నిజంగా అభ్యర్ధుల కోసం పనిచేసే, రాసే జర్నలిస్టులను చూసే మనసున్న ప్రజాప్రతినిధులూ ఉన్న ఉమ్మడి విశాఖజిల్లాలోని ఎన్నికుల మీడియాపై ఈరోజు ప్రత్యేక కథనం..!

ఒక రాజకీయనేత కంటిలో పడాలంటే ఈరోజుల్లో ఏ మీడియా సంస్థలోనూ యాక్టివ్ గా పనిచేయాల్సిన పనిలేదు. ప్రధాన పత్రికలు, టివి ఛానళ్లు, లోకల్ కేబుల్ టీవలు, రాజకీయపార్టీ మీడియాలో పనిచేస్తున్నట్టు ఐడి కార్డు ఉంటే చాలు. అవే ప్రధాన రాజకీయపార్టీల నేతలకు ఐడెంటీ నువ్వు పలానా ఛానల్ కదా.. నువ్వు ఆ మీడియా కదా.. మీరు ఈ పేపర్ కదా అని వాళ్లే సంబోధిస్తారు. ఇక అవతలి మీడియా ప్రతినిధి వారి కులపోడే అయితే ఇక చెప్పాల్సిన పనేలేదు. ఎక్కడ పడితే అక్కడ తెగ నాకేసీ..గీకేసీ..గోకేసి..తోమేసుకుంటారు. ఇంకా చెప్పాలంటే రాజకీయనేలందరూ ఈ తేడా మీడియాగాళ్లను గుర్తించాలంటే సరిగ్గా ఎన్నికలకు ఓ రెండు నెలల ముందు వీరందరికీ ప్రత్యేకంగా ఆఫీసులు ఓపెన్ చేస్తారు.. ఒక గదిలో టివి ఛానల్ సెటప్, మరో గదిలో పేపర్ పబ్లిసిటీ సెటప్, ఇంకో గదిలో పనిచేసే సిబ్బంది హడావిడి..ఓ మూడు నెలలకు అద్దెకు తెచ్చుకున్న కారు. రాజకీయనేతలు ఈ మీడియా బ్రోకర్ ని గుర్తించడానికి వీడి దగ్గరే ఇద్దరు అసిస్టెంట్లు.. సార్ వస్తున్నారంటూ వేరే లెవల్ బిల్డప్.. ఈ వ్యవహారం అంతా మామూలుగా ఉండుదు. ఇదంతా చూసిన ఆ ఆ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధి ఓహో వీడెవడో చాలా పెద్ద విలేఖరిలా ఉన్నాడు.. వీడిని పట్టుకుంటే ఈ ఎన్నికల్లో మనం పూర్తిస్థాయిలో ప్రచారం చక్కగా చేయించుకోవచ్చు. డబ్బులు పోయినా పర్లేదు. ఇలాంటి నెట్వర్క్, కాస్త గట్టివాడైతే చాలు అని వాళ్లంతట వాళ్లే నిర్ణయానికి వచ్చేసేలా నమ్మిస్తారు ఈ మీడియా బ్రోకర్లు. బొక్కబోర్లా పడి వారికే మీడియా మేనేజ్ మెంట్ అంతా అప్పగిస్తారు. అలా అప్పగించే సమయంలోనే నేతలు కూడా ఎంక్వైరీ చేస్తారు..పలానా రిపోర్టర్ కి ఏ కులపోడు అని..? అడిగేది పోటీలో ఉన్న అభ్యర్ధి కదా..వాడు వెంటనే మనకులపోడే సార్ అంటాడు. దానికి ఈ పొలిటికల్ కేండిడేట్ బుబ్బి తబ్బిబ్బు అయిపోయి...సరే అయితే మన మీడియా మేనేజ్ మెంట్ అంతా నువ్వే చూసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఉంటుంది అసలైన తేడా వ్యవహారం. వీడొక వాట్సప్ వాడి సొంత వాట్సప్ గ్రూపు పెడతాడు. అందులో వాడికి కావాల్సిన వాళ్లనే చేరుస్తాడు. మూడో కంటికి తెలియకుండా ప్యాకేజీలు మాట్లాడతాడు. అక్కడ కూడా కమిషన్లు తీసుకుంటాడు వాడు ప్రధాన మీడియా అయి ఉంటే చాలు. అందులో పనిచేస్తే చాలు. అంతే నిజంగా వాడు వీడు నియమించిన వాడికి పబ్లిసిటీ ఇస్తున్నాడా...మంచి వార్తలు రాస్తున్నాడా లేదా అనేది చూడు. ఈ క్రమంలోనే ఎవరైనా చక్కగా వార్తలు రాస్తే మాత్రం ఈ వార్త మనం రాసిందే.. నేనే కావాలని ఆ పేపర్ లో పెట్టించానని చెప్పి.  ఆ స్టోరీ క్లిప్పింగ్ సదరు ఎమ్మెల్యే, ఎంపీ క్యాండిట్ కి చూపించి మరికొంత నొక్కేస్తాడు. ఇక్కడ టార్గెట్ మొత్తం అంతా కూడా 
నొక్కేయడంలోనూ.. మరికొందరైతే ప్రధాన ఛానళ్ల లోగోలు పెట్టించి వీడియోలు క్రియేట్‌ చేయించి మరీ అభ్యర్ధులను అత్యంత దారుణంగా మోసం చేస్తున్నారు. 

మరికొందరు సోషల్‌ మీడియాను కూడా అడ్డుపెట్టుకొని ఎన్నికల్లో టార్గెట్‌ పెట్టుకున్న మొత్తాన్ని చక్కగా నొక్కేస్తున్నారు. వాస్తవానికి ప్రధాన ఛానళ్లలో వార్తలు ఈ మధ్య కాలంలో రావడం లేదు. కానీ వచ్చినట్టుగా నమ్మించేస్తున్నారీ తేడా మీడియా కేటుగాళ్లు. కాకపోతే ప్రజాప్రతినిధులను అడ్డం పెట్టుకొని ఎన్నికల్లో టార్గెట్‌ పెట్టుకున్న కూడా నొక్కేయడంలోనూ.. బొక్కేయడంలోనూ మాత్రమే చూపిస్తున్నారు. బొక్కేయడంలోనూ మాత్రమే వుంటుంది. వాస్తవానికి డబ్బులు పోతున్నా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధులకు మాత్రం పబ్లిసిటీ రాదు. చివారఖురు.. మనం దెబ్బైపోయాం. మన కులపోడని పెట్టుకుంటే వాడు మనకి గొంతుకు వరకూ వచ్చేలే తోసేశాడని బాధపడతారు ప్రజాప్రతినిధులు. ఇక్కడ అప్పుడప్పుడూ వచ్చిన మంచి వార్తలు, పబ్లిసిటీ వార్తలు ఎవరివిరా అంటే చిన్న, మధ్య తరహా మీడియాలో వచ్చిన కథనాలు. వాటిని కూడా మేమే రాయించామని..మేమే చేయించామని చెప్పి మొత్తం ప్యాకేజీలను మడతెట్టేస్తారు ఈ తేడా మీడియా కేటుగాళ్లు. కానీ తమ అభ్యర్ధులు వచ్చినపుడు మాత్రం ప్రధాన మీడియాలో పనిచేసే వారందనికీ పనిగట్టుకొని మరీ పిలుస్తారు. అది మందు సిట్టింగలకు కావొచ్చు.. లంచ్ డిన్నర్ కి కావొచ్చు.. మనీ ప్యాకేజీలు ఇవ్వడానికి కావొచ్చు. ఇదే క్రమంలో మంచి వార్తలు రాసిన వారి పేర్లూ ఉంటాయి. కాకపోతే వారి పేరతో ఈ బ్రోకర్ గాడే మొత్తంగ మి(దె)ంగేస్తాడు. కాకపోతే ఎన్నికల సమయంలో ఇలా మీడియా బ్రోకరేజీ చేసేవారు నిజమైన జర్నలిస్టులా.. కాదా అనేది మాత్రం ఏ ప్రజాప్రతినిదీ చూడరు. వారికి కావాల్సింది పోటీలో విజయం, పతాక శీర్షిక పబ్లిసిటీ. కానీ ఏనాడూ ఈ తేడా మీడియా బ్రోకర్లని మాత్రం నిజమైన మీడియావారికి అన్యాయం చేయొద్దు..మోసం చేయొద్దు.. మనకోసం పనిచేసినవారిని మరిచిపోవద్దు అనే మాట మాత్రం మాట్లాడరు.

ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఇలాంటి పనులన్నీ చేసేది ప్రధాన మీడియాలో పనిచేసేవారు.. మరికొందరు ఆ ప్రధాన మీడియాలో పనిచేసి మానేసిన వారు.. మరికొందరు వాటి పేరు చెప్పుకొని వారి కుల నేతల వద్ద బతికేసేవారు. అయితే ఇక్కడ నిజమైన ప్రజాప్రతినిధి అయితే ఒక్కప్రశ్న వేయాలి..నువ్వు ఆ టివి ఛానల్ లో పనిచేస్తు న్నావు..? నీ ఉద్యోగం కాకుండా ఈ బ్రోకరేజీ చేయగలవా..? అందరికీ (అ)న్యాయం చేయగలవా అని అడగాలి. కానీ రాజకీయనేతలు గుడ్డిగా చూసేది వాడేమీడియాలో పనిచేస్తున్నాడు.. మనకులపోడా కాదా..? వాడికి మిగిలిన మీడియాతో సత్సంబంధాలు ఉన్నాయా లేదా అని.. కుక్కతోక వంకర పోదు.. రాజకీయనేతల ఆలోచనల్లో మార్పు రాదు.. తేడా మీడియాగాళ్లు ఒకడ్ని కొట్టి వారే బొక్కేయడమూ మానరు. కాకపోతే ఇలా జరుగుతుందనే విషయం ఒకరో ఇద్దరో మంచిగా ఆలోచించే ప్రజాప్రతి నిధుల వద్దకైనా వెళుతుందనే ఈ చిన్న ప్రత్యేక కథనం ఉద్దేశ్యం. ఈ వార్త మొత్తం చదివిన తరువాత..వార్నీ ఈ బాలు గాడు ఇండరైక్టుగా నాకోసమే రాశాడని.. తెగఫీలపైపోయి. ఫూలైపోయి.. గుక్కెట్టి ఏడ్చేసినా ఈ దేశానికి వచ్చిన నష్టం లేదే. ఇలాంటి తేడాగాళ్లను మీడియా బ్రోకర్లుగా పెట్టుకున్న వారికీ పోయేదీ ఏమీ ఉండదు. కాకపోతే నిజమైన జర్నలిస్టులు, మీడియాపై ఆధారపడి బ్రతికే చిన్న, స్థానిక, మద్యతరహా పత్రికల నిర్వాహకులు అధికారులు, ప్రజలు అర్ధం చేసుకుంటే అదే చాలు.. వాస్త వానికి ఈ వార్తలు రాసే సమయానికి తేడా మీడియా బ్రోకర్లు, వారి సంస్థలు, సదరు ప్రజాప్రతినిధు పేర్లూ పెట్టొచ్చు..ఎవడో ఏదో గడ్డి తిన్నాడని ఈ స్టోరీ రాసే నేనూ అలోచించడంలో అర్ధం లేదు.. మీడియాని బ్రతికించాలంటే నిజమైన మనసున్న ప్రజాప్రతినిధుల వల్లనే అవుతుంది. నిజంగా మీకోసం ప్రచారం చేసేవారికి, మీకోసం పనిచేసేవారికి న్యాయం చేయండి. అందరిపేరుతో ఒక్కడే బొక్కేసే తేడా మీడియా బ్రోకర్ గాళ్లను నమ్మకండి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి. నిజంగా పనిచేసే జర్నలిస్టు మాత్రమే మీకోసం రాస్తాడు..మిగిలినవాళ్లంతా మీ దగ్గర మేస్తారు..ఈ అక్షరాలన్నీ ప్రజా ప్రతినిధులను ఆలోచింపజేయడానికే..వాస్తం వర్ధిల్లాలి..నిజమైన జర్నలిస్టుకి గుర్తింపు రావాలి..అక్షరం జర్నలిస్టుకి అన్నం పెట్టాలి..జై జర్నలిజం..జై జై జర్నలిం..!

vizag

2024-04-15 08:05:59

ఏప్రిల్ 15 నుంచి 61 రోజులు చేపలవేట నిషేధం.. ఫిషరీష్ డిడి ఎన్.నిర్మలకుమారి

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రాదేశిక సముద్ర జలాలలో చేపలవేటను ఈనెల 15 నుంచి 61 రోజుల పాటు నిషేధిస్తున్నట్టు ప్రభుత్వ ఉత్వర్వులు జారీచేసిందని మత్స్యశాఖ ఉపసం చాలకులు ఎన్.నిర్మలకుమారి తెలియజేశారు. ఈ సందర్భంగా శనివారం ఆమె తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, చేపల వేటకు వినియోగించే యాంత్రిక పడవలు, మోటారు బోట్లు ద్వారా నిర్వహించే అన్ని రకాల చేపలు వేటను ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకూ నిషేధిస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వం(జి.ఓ ఆర్ టి సంఖ్య 81, పశు సంవర్ధక శాఖ, డైరీ డెవలప్ మెంట్ మరియు మత్స్య శాఖ తేది: 15.03.2024) జారీ చేసిందన్నారు. సముద్ర జలాలలో చేపల వేట నిషేధించడానికి గల కారణాలు వివిధ చేప, రొయ్యల జాతులు సంతానోత్పత్తి కాలములో తల్లి చేపలు,  రొయ్యలను సంరక్షించడం, వాటి సంతతి పెరుగుదలను ప్రోత్సహించడము, తద్వారా సముద్ర మత్స్య సంపద సుస్థిరతను సాధించడానికి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందన్నారు. ప్రభుత్వం నిషేదించిన ఉత్తర్వులను అనుసరించి మత్స్యకారులు సముద్ర జలాలలో యాంత్రిక పడవలు పై మత్స్యకారులు ఎటువంటి చేపలవేట చేయకుండా మత్స్య అభివృ ద్ధికి సహకరించాలని కోరారు.

అంతేకాకుండా నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించి చేపల వేట చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు ఆయా బోట్లు యజమా నులను ఆంధ్రప్రదేశ్ సముద్ర మత్స్య క్రమబద్ధీకరణ చట్టము ఏపిఎంఎఫ్ఆర్ యాక్టు 1994, సెక్షన్ (4) ను అనుసరించి చర్యలు తీసుకోవడంతోపాటు, జరిమానా, బోట్లు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని.. వారి బోట్లలో ఉండే మత్స్య సంపదను స్వాధీన పరుచుకోవడంతోపాటు, జరిమానా విధిస్తూ, డీజిల్ ఆయిల్ రాయితీ, ప్రభుత్వం అందించే అన్నీ రకముల రాయితీ సౌకర్యాలను నిలుపుదల చేస్తారని హెచ్చరించారు.  అంతేకాకుండా ఈ నిషేద కాలములో ఖచ్చితముగా ప్రభుత్వ ఉత్తర్వులు  అమలు చేయుటకై మత్స్య శాఖ, కోస్ట్ గార్డ్, కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు, నేవీ, రెవెన్యూ అధికారులతో గస్తీ ఏర్పాటు చేశారని..కావున మత్స్యకారులు అందరూ సహకరించవలసినదిగా  మత్స్యశాఖ ఉపసంచాలకులు ఎన్.నిర్మలకుమారి కోరారు.

vizianagaram

2024-04-06 14:48:51

కెజీహెచ్ పరీక్షల్లో స్పష్టత ఎంత..?

కింగ్ జార్జి హాస్పిటల్(కెజీహెచ్) అంటే నిరుపేదల ఆరోగ్య ప్రధాయిని..ఇది ఒకప్పటి మాట.. కానీ ఇపుడు కెజిహెచ్ అంటే(కమిషన్ జెనరేటెడ్ హాస్పిటిల్) అదీ ఎవరికి అనుకుంటున్నారా..ఇక్కడ పనిచేసే వైద్యులకేనండీ.. ఏంటి ఇదేదో కాస్త తేడాగా ఉంటే అనుకుంటున్నారా..? ఎస్..పక్కా తేడానే. నమ్మడానికి కాస్త కంగారుగా ఉన్నా ఇది నిజం. కెజిహెచ్ లో పనిచేసే కొందరు వైద్యులకు చెందిన ప్రైవేటు క్లినికల్ ల్యాబులు, మెడికల్ సెంటర్లు బయటవున్నాయి. దీనితో ప్రధాన రోగాలకు సంబంధించిన కొన్ని రకాల పరీక్షలు వైద్యులు పలానా మెడికల్ సెంటర్ కె వెళ్లి చేయించుకురావాలని సలహాలు కూడా ఇస్తుంటారు. కాదు కూడదని, వేరే మెడికల్ సెంటర్ లో పరీక్షలు చేయించుకొచ్చారే అనుకోండి..పేషెంట్ పరిస్థితి కాస్త సీరియస్ గా ఉంది..మేము ఎందుకు ఆ మెడికల్ సెంటర్ కే వెళ్లి రాసిచ్చిన పరీక్షలు చేయించుకు రావాలి, మందులు తేవాలని చెప్పామో మీకు తెలియడం లేదు..ఏదైనా జరగకూడదని జరిగితే మళ్లీ మమ్మల్ని అనొద్దు అంటూ ఒక సైక్లాజికల్ వార్నింగ్ కూడా ఇస్తారు. అదే అంత పెద్ద కెజిహెచ్ లో పూర్తిస్థాయి లేబరేటరీలు లేవా..? స్కానింగ్ సెంటర్లు లేవా..? కెజిహెచ్ కి మించిన పరీక్షలు బయట ప్రైవేటు మెడికల్ సెంటర్లో ఏం చేస్తారు..? అనే అనుమానం  రావచ్చు..కాదు కాదు ఖచ్చితంగా రావాలి కూడా. అలా రాకపోతే ఇక్కడ జరుగుతున్న తేడా వ్యవహారాలు అధికారులెవరికీ తెలియవు. గత కొద్ది రోజులు కెజిహెచ్ చుట్టు ప్రక్కల ఉన్న ప్రైవేటు మెడికల్ ల్యాబులకు కెజిహెచ్ నుంచి అత్యధికంగా క్లినికల్ టెస్టుల కోసం శాంపిల్స్ వస్తున్నాయి. 

రోగులకు అవసరమైన పరీక్షలు చేసే ల్యాబ్ లు కెజిహెచ్ లో ఉన్నప్పటికీ అక్కడ వచ్చే రిపోర్టులు లోన పనిచేసే వైద్యులకు నచ్చడం లేదట.. దానికి వాళ్లు చెప్పే సాకులేంటంటే మీరు బయట ల్యాబుల్లో చేయించుకొని వస్తే కాస్త రిపోర్టులు క్లియర్ గా వస్తాయి అపుడు మెరుగైన వైద్యం చేయించడానికి అస్కారం వుంటుందని చెబుతుండటంతో ప్రాణాలతో చెలగాటమాడం ఇష్టం లేని రోగి బంధులు చచ్చినట్టు ప్రైవేటు ల్యాబుల్లోనే పరీక్షలు చేయించుకొని వస్తున్నారు.
ఇటీవల కాలంటో ఒక హృద్రోగి విశాఖజిల్లా శివారు నుంచి వచ్చి కెజిహెచ్ లోకి చేరారు. అక్కడ వైద్యులు చికిత్సలు చేయడానికి ప్రతీరోజూ రక్తంలోని హెచ్ పర్శంటేజి టెస్టుల దగ్గర నుంచి ఇతర అన్ని రకాల పరీక్షలకు దగ్గర్లోని విజయ డయాగ్నస్టిక్ సెంటరుకి పంపారు. వాస్తవానికి కెజిహెచ్ లో పిపిపి విధానంలో నడుస్తున్న ల్యాబుల్లో కూడా పరీక్షలు చేయించవచ్చు. అలా చేయిస్తే స్పషలిస్టు వైద్యులకు కమిషన్లు ఎక్కడి నుంచి వస్తాయి..? అందుకే కమిషన్ల కోసం కక్కుర్తి పడే వైద్యులు వారు చూసే స్పెషాలిటీ వైద్యచికిత్సలకు ప్రైవేటు ల్యాబులు, మెడికల్ షాపుల ద్వారానే వ్యాపారాన్ని చక్కగా చేసుకుంటున్నారు. దానికి సంబంధించిన రిపోర్టులు కూడా బాధితులు ఈరోజు-ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీకి చూపించారు. ఆ రిపోర్టులు, దానికి అయిన ఖర్చుల వివరాలు కూడా బధ్రంగా ఉన్నాయి. 

అయితే అదే టెస్టులు కెజిహెచ్ లోనూ చేసినా వాటిని వైద్యం చేసే స్పెషాలిటీ వైద్యులు పరిగణలోనికి తీసుకోలేదు. పైగా సదరు రోగికి శస్త్రచికిత్స సమయంలో రక్తం అవసరం అని చెప్పి ముగ్గురు దాతల నుంచి రక్తం కూడా లాగేశారు. తీరా సదరు రోగికి రక్తం ఎక్కించకుండానే శస్త్రచికిత్సలు చేశారు. చేసే వైద్యం చేస్తున్నా.. కావాల్సిన మెడికల్ టెస్టులు చేస్తున్నా..ఎందుకనో కెజిహెచ్ లో చేసే మెడికల్ టెస్టులంటే స్పెషాలిటీ వైద్యులకే నమ్మసక్యంగా ఉండటం లేదు. పాపం దానితో వారి బినామీ పేర్లతో ఉన్న ల్యాబులకు మెడికల్ టెస్టుల కోసం పంపిస్తున్నారు. ఇదేమని ప్రశ్నించిన మీడియాకి కూడా మీకు రోగి ఆరోగ్యంగా బయటకు వెళ్లడం కావాలా..? లేదంటే మెడికల్ టెస్టులకి అయ్యే ఖర్చుల కోసం చూసుకుంటారా? అనే సమాధానాలొచ్చాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని కెజిహెచ్ సూపరింటెండెంట్ వద్దకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేసినా చరవాణి అందుబాటులోకి రాలేదు. అలాగని బయట మెడికల్ సెంటర్ లో ఉండే ఎక్విప్ మెంట్ కెజిహెచ్ లో ఏర్పాటు చేయాలంటే మాత్రం.. దాతలకు, సిఎస్ఆర్ నిధులు ఖర్చు చేసేవారితో నైనా కావాల్సిన ల్యాబ్ లను ఏర్పాటు చేయించడం లేదు కెజిహెచ్ యాజమాన్యం. అలా చేయించేసినా, కావాల్సిన ప్రధాన ల్యాబులు పెట్టిస్తే వారి ప్రైవేటు బిజినెస్ దెబ్బతినిపోతుందనే పక్కా ప్లాన్ తోనూ ఈ విధంగా వ్యాపారం చేస్తున్నట్టు కొట్టచ్చినట్టు కనిపిస్తున్నది. రోగుల ప్రాణాలతో వ్యాపారం చేసే వైద్యులు ఇప్పటికైనా మారాల్సిన అవసరం వుంది. స్పెషాలిటీ వైద్యానికి సరపడే పరీక్షలు చేయడానికి అవసరం అయ్యే పూర్తిైస్థాయి ల్యాబులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా కెజిహెచ్ యాజమాన్యం పై ఉంది...చూద్దాం ఆ దిశగా అడుగులు వేస్తారా..? లేదా అని..?!

vizag

2024-04-06 02:02:19

కెజీహెచ్ లో ర్యాగింగ్ రక్కసి..!

కెజీహెచ్(కింగ్ జార్జి ఆసుపత్రి) అంటే ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాయిని..ఎంతో గౌరవం, పేరున్న ఉన్న ఈ ఆసుపత్రి గౌరవాన్నిఇక్కడి నర్సింగ్ కళాశాల సిబ్బంది, ప్రిన్సిపాల్, ట్యూటర్లు చదువుకుంటున్న విద్యార్ధినిలను లైంగికంగా వేధించి రోడ్డున పడేస్తున్నారు. తిరగబడితే చదువు మధ్యలో ఆగిపోయేలా చేస్తారని భయం.. ఎదురు తిరిగితే ప్రాక్టికల్ మార్కులు తగ్గేంచేస్తారని ఆందోళన.. ప్రశ్నిస్తే సీనియర్ నర్సులు అన్నీ నైట్ డ్యూటీలే వేసేస్తారని ఆవేద.. ప్రతిగటించకపోతే వేధింపులు తాళలేక ఎక్కడ ఆత్మ హత్యచేసుకోవాల్సి వస్తుందోననే ఆలోచన.. ఇక్కడ సిబ్బందికి నచ్చినట్టుగా పనిచేయకపోయినా..ఊడిగం చేయకపోకపోయినా వీళ్లందరికీ మనిషికొచ్చేంద కోపాలూ వచ్చేస్తాయట.. దాంతో నువ్వెలా నర్శింగ్ పాసై బయటకి వెళతావో చూస్తాను అనే లక్ష్మణ రేఖతో అందరూ బెదిరింపులు, హెచ్చరికలు, శారీరక సుఖం కోసం వేధింపులు..ఒకటి కాదు రెండు కాదు ఇక్కడి నర్శింగ్ విద్యార్ధినిల బాధల వర్ణణాతీతం. ఎదురుగానే జిల్లా కలెక్టరేట్..అయినా కలెక్టర్ ఏనాడూ కన్నెత్తి కూడా కూడా ఇక్కడ చూసిన పాపాన పోలేదు. కాదు కాదు కలెక్టర్ దృష్టి కళాశాలలపై పడకుండా వారికి అనుకూలంగా ఉన్న విద్యార్ధినిలతో అంతా బాగా ఉన్నట్టు కలరింగ్ ఇస్తున్నారు ఇక్కడి వారంతా. మెజారిటీ విద్యార్ధినిలు ఇక్కడ చవిచూసే నరకం వారి మాటల్లో చెప్పేది కాదు. స్థానిక అధికారులతో తమకు న్యాయం జరగదని బావించిన విద్యార్ధినిలు ఏకంగా తమ గోడును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డికి విన్నవించుకున్నారు. ఆ కాపీని లోకల్ మీడియాకి కూడా పంపించారు. మీడియా కూడా ఇక్కడి అధికారులతో కలిసిపోయి తమ గోడుని, తాము పడుతున్న నరకయాతనను బయటపెట్టడదని తెలీసి కూడా మానవత్వం ఉన్నవారు ఎవరైనా స్పందించకపోతారా..? అనే ఒక్క ఆశతో మీడియాకి తమ గోడుని వినిపించారు.

 ఏ చిన్న రోగమొచ్చినా నిరుపేదలు ఎవరైనా కెజీహెచ్ కి రావాల్సిందే..చాలా మంది వచ్చిన వ్యాధిని నయంచేసుకునే తిరిగి వెళతారు. వైద్యులు రోగులకు వచ్చే రోగాలకు శస్త్ర చికిత్సలు చేస్తే.. రోగులను ఎల్లవేళలా కంటికి కాపాడుతూ, వారికి సమయానికి మందులు ఇచ్చి, వైద్యులు రాసిచ్చిన కేస్ షీట్ ఆధారంగా వైద్య సేవలు చేసేది నర్శింగ్, పారామెడికల్ సిబ్బందే. ఒక రకంగా ప్రాణంపోసే వైద్యుడు పెద్ద దేవుడైతే.. ప్రాణం పోకుండా కాపాడేది మాత్రం పారామెడికల్ సిబ్బంది, నర్శింగ్ సిబ్బంది చిన్న దేవుళ్లతో సమానం. వైద్యులన్నా, నర్శింగ్ సిబ్బంది అన్నా రోగులకు, వారి బంధువులకు చాలా గౌరవ భావాలు కూడా ఉంటాయి. అలాంటి వారిలోనూ కర్కస సీనియర్ నర్శులు జూనియర్ నర్శులను ఎన్నో రకాలుగా వేధిస్తే వారి గోడు ఎవరికి చెప్పుకోవాలి..? సమస్యను పరిష్కరించాల్సిన కెజిహెచ్ సూపరింటెండెంట్, నర్శింగ్ కళాశాల ప్రిన్సిపాల్ కూడా మొత్తంగా కుమ్మక్కై నర్శింగ్ విద్య చదివే విద్యార్ధినిలనే అన్ని రకాలుగా వేధిస్తుంటే..మానసికంగా హింసిస్తుంటే కన్నీటి వేదన, ఎవరి ముందు వెళ్లగక్కాలి.. తమకు రాష్ట్ర ముఖ్యమంత్రి తప్పా..మరెవరూ న్యాయం చేయలేరని భావించిన నర్శింగ్ విద్యార్ధులు తాము ఎర్కొంటున్న వేధింపులపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇపుడు ఆ ఫిర్యాదు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. ఇక్కడి విద్యార్ధినిలు ఫిర్యాదు చేసిన 24 గంటల్లో జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున త్రిసభ్య విచారణ కమిటీ కూడా వేశారు. 

కెజిహెచ్ లో సీనియర్ నర్సులు, నర్శింగ్ కాలేజీ సిబ్బంది, ప్రిన్సిపాల్, ట్యూటర్లు కరాళ నృత్యం చేస్తూ..విద్యార్ధినిలను మానసికంగానూ, శారీరకంగానూ, లైంగికంగానూ వేధిస్తుంటే ఎవరు మాత్రం తట్టుకోగలరు చెప్పండి. వారి సహనం నశించి, కన్నీరు కట్టలు తెంచుకొని, తెగువకు దైర్యం వచ్చి ఇక్కడ జరుగుతున్న తంతు అంతా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు రూపంలో సీఎంకి  ఫిర్యాదు చేశారు. ఎవరైనా తమ పేర్లతో ఫిర్యాదు చేస్తే తమని.. టార్గెట్ చేసి మరీ వేధిస్తున్నారని ముందే పసిగట్టిని విద్యార్ధినిలు పేరు మార్చి కెజిహెచ్ లో జరుగుతున్న లైంగిక వేధింసులు, సీనియర్సుల బెదిరింపులు, ఒంగి ఒంగి ప్రతీ సారీ నమస్కారాలు పెట్టే తీరు దగ్గర నుంచి వీరికి పాఠ్యాంశాలు బోధించే విధానం వరకూ మొత్తం ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్యార్ధినిల శరీర ఆకృతులను చూసి..కసి తీరా తినేసేలా చూసే ట్యూటర్ల అవమానకర చూపులు, పెట్టే ఇబ్బందులు, వారికి మద్దతునిచ్చే ప్రిన్సిపాల్ ఆగడాలపై కూడా ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు. 

కమిటీ వేశారని తెలుసుకొని మరీ బెరింపులు, హెచ్చరికలు..?
కెజిహెచ్ లోని నర్శింగ్ విద్యార్ధినిల లైంగిక వేధింపులపై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలతో జిల్లా కలెక్టర్ ఎ.మల్లిఖార్జున త్రిసభ్య విచారణ కమిటీ వేసిన గంటలోనే కెజిహెచ్ లోని సీనియర్ నర్శింగ్ సిబ్బంది, యూనియన్ నేతలు, కళాశాల సిబ్బంది హుటా హుటీన రహస్య సమావేశం ఏర్పాటు చేసినట్టు సమాచారం. విద్యార్ధినిలు ఎంక్వైరీలో వాస్తవాలు చెబితే ఖచ్చితంగా దానికి కారణమైన సిబ్బందిపై వేటు పడటం ఖాయం అనుకున్నవారంతా విచారణ విషయంలో విద్యార్ధినిలంతా తమకు అనుకూలంగా చెప్పాలని నిర్ణయించి మరీ డ్యూటీల్లో ఉన్నవారికి వాట్సప్ కాల్స్ ద్వారా సమాచారం పంపారట. ఏ ఒక్కరు తేడాగా చెప్పినా..వారే ఇబ్బంది పడేలా మొత్తం తిరుగుబాటు చేయాలని..అవసరమైనే యూనియన్ నేతలను రంగంలోకి దింపాలని, రాష్ట్ర యూనియన్ కి కూడా అత్యవసర సమావేశ వివరాలను పంపినట్టుగా తెలిసింది. ప్రస్తుతం డ్యూటీలో ఉన్న నర్శింగ్ సిబ్బందికి, ట్రైనింగ్ నర్సులకు చెప్పండి..ఎవరైనా గీసిన గీటు దాటితే ఎవరెవరు తమకు వ్యతిరేకంగా చెప్పారో, చెప్పడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ల వివరాలన్నీ తమ దగ్గరున్నాయి. ఏ ఒక్కరూ నర్శింగ్ పాస్ అయి బయటకు వెళ్లరు. అంతేకాదు..చదివిన చదుని పనిచేయకుండా చేస్తాం(వీళ్లేం చేయగలరో, ఏమీ చేయలేరో నర్శింగ్ విద్యార్ధిని లకు తెలియదు కదా) అందరూ మాకు అనుకూలంగానే విచారణలో చెప్పాలని బెదిరింపులు, హెచ్చరికలు కూడా చేసినట్టు చెబుతున్నారు. ఈ విషయంలో నర్శింగ్ కాలేజీ సిబ్బంది, ట్యూటర్లు కూడా వత్తాసు పలికినట్టుగా తెలిసింది. సీఎం కార్యాలయానికి ఫిర్యాదు వెళ్లడం, మీడియాకి కూడా 
తెలిసిపోవడంతో వేధింపుల విషయం రచ్చ రచ్చ అయ్యే అవకాశం ఉందని..ఏది ఏమైనా ఎలాంటి విచారణనైనా ఎదుర్కోవడానికి, ఫిర్యాదు చేసిన విద్యార్ధినిల తోనే తిప్పికొట్టడానికి సిద్దంగా ఉండాలని కేజిహెచ్ లోని సీనియర్ నర్సులంతా ఏకమైపోయినట్టు సమాచారం అందుతుంది. కాగా ఈ విషయమై వివరణ కోరేందుకు  ప్రయత్నించగా నర్శింగ్ కళాశాల ప్రిన్సిపాల్ అందుబాటులో లేరు. కాకపోతే అధికారులకు ఇచ్చిన వివరణలో మాత్రం..నర్శింగ్ విద్యార్ధినిల పేరుతో చిరునా మాలేని ఫిర్యాదుపై వివరణ అంటూ రెండు పేజీల వివరణ ఇచ్చారు. వాస్తవానికి కెజిహెచ్ లోని సీనియర్ నర్శింగ్ సిబ్బంది, పారామెడికల్  స్టాఫ్ పై మీడియాకానీ, ఏ ఒక్కరూ ఫిర్యాదులు చేయడానికి వెనుకడుగు వేస్తారు. వాళ్లు తప్పుచేసినా..తమను లైంగికంగా వేధించారని ఎక్కడ ఫిర్యాదులు చేస్తారోనని..కానీ ఇపుడు నర్శింగ్  విద్యార్ధినిలే ఆ వేధింపులు గురవుతున్నప్పుడు ఇక్కడ తేడాగా వ్యవహరించేవారు తప్పించుకునే పరిస్థితి లేదు. వేధింపుల ఆరోపణలు చేసే విద్యార్ధినిలు నేరుగా ఏ దైర్యంతో ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తారనే కోణంలో విచారణ అధికారులు ఆలోచించాల్సి ఉంది. చూడాలి సీఎం కార్యాలయాలనికి వెళ్లిన ఫిర్యాదు..దానిపై కలెక్టర్ వేసిన త్రీమెన్ కమిటీ విచారణలో ఏ తరహా వాస్తవాలను నిగ్గుతేలుస్తుందో..లేదంటే అంతా ముందే అనుకున్నట్టుగా ఏమీ లేదని..మమ అనిపించేస్తారో?!

vizag

2024-04-03 17:52:19

ఆ నేతలందరికీ రాజకీయ సమాధి..!

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ముఖ చిత్రం మారుతోంది. రాజకీయపార్టీలు ప్రజా సేవ కంటే..అధికారం కోసం ఏమైనా చేయడానికి..ఎలాంటి పనులనైనా చేపట్టడానికి సిద్దపడి పోతున్నాయి. జెండాలు మోసి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ పార్టీని పటిష్టం చేసిన వారిని కాకుండా లాభీయింగ్ చేసే వారికి ప్రధాన్యత ఇస్తున్నాయి. గెలిస్తే పదవులు ఇవ్వాల్సి వస్తుందని ఎమ్మెల్యే నుంచి ఎంపీ స్థానానికి, మంత్రిగా అవకాశం కావాలనుకునే వారికి కాస్త డబ్బు దండిగా ఖర్చుపెట్టేవారికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి ఎన్నికల రంగంలోకి తించుతున్నాయి రాజకీయ పార్టీలు. ఉత్తరాంధ్రాలో ఒక ఎంపీ తాను మంత్రిని కావాలనుకుంటున్నానని.. దానికి తానేం ఇవ్వాలో చెబితే.. దానికి రెట్టింపు ఇవ్వడానికి సిద్ధమని ఒప్పుకోవడంతో ఆయనను ఎంపీ నుంచి పిలిచి మరీ ఎమ్మెల్యేగా పోటీచేయిస్తున్నాయని.. పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రాజకీయ పార్టీ లు నాలుగు కాలాలపాటు నిలబడాలన్నా..అధికారం చేజిక్కుంచుకోవాలన్నా..  స్థానిక సీయర్ నాయకుల రాజకీయ భవిష్యత్తుని సమాధి చేసి.. స్థానికేతర బడా నాయకులకు రాజకీయ ఉపాది చూపిస్తే తప్పా పరిస్థితి తమకి అనుకూలంగా మార్చుకునే పరిస్థితిలేదనే పరిస్థితికి వచ్చేశాయి.  ఇక వామ పక్షపార్టీలు తీరు ఆది నుంచి ఒకేలా కనిపస్తున్నా.. ఇపుడు సదరు పార్టీలోని నేతలు కూడా రిజర్వేషన్లు ఆధారంగా కమర్షియల్ పొలిటికల్ పార్టీల్లోకి జంపింగ్ లు చేస్తున్నారు. గతంలో రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలిచే వారికి, ప్రజల మద్దతు ఉన్నవారికి, సామాజిక బలం ఉన్నవారికి, ఆపై కాస్తో కూస్తో ఆర్ధిక బలం ఉన్నవారికి ప్రాధాన్యత ఇచ్చేవి. ఆ పరిస్థితి ఇపుడు పూర్తిగా మారిపోయింది. ఆర్ధికంగా బలంగా ఉంటే రాష్ట్రంలో ఏమూలనైనా, ఏ నియోజకవర్గంలోనైనా నిలబెట్టి గెలిపించేయొచ్చుననే లెక్కకు వచ్చేశాయి రాజకీయపార్టీలు. దీనితో పార్టీనే నమ్ముకున్న స్థానిక నేతలకు చిప్పచేతికి వచ్చేస్తున్నది. జిల్లాలో పుట్టి పెరిగి.. రాజకీ యపార్టీలకు ఊడిగం చేసేసరికే వారి బ్రతుకులు తెల్లారి పోతున్నాయి. ఈ క్రమంలో పార్టీలనే నమ్ముకున్న చాలా మంది నేతలకు రాజకీయ భవిష్యత్తుకి సమాధులు సిద్ధమైపోతున్నాయి. 

తాజాగా ఉత్తరాంధ్రాలో ఈ పరిస్థితి అన్ని రాజకీయ పార్టీల్లోనూ కనిస్తున్నది. పార్టీలు అధికారంలోకి రావడం కోసం సామాజిక వర్గాల్లోని నెట్వర్క్ ఉన్న యువతను, వాక్ చాతుర్యం ఉన్న యువతను పావులుగా వాడుకొని వారికి మొండి చేయి చూపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని 175 నియోజకవర్గాల్లో సుమారు 100 స్థానాల్లో ప్రస్తుతం ఉన్న పార్టీలు తమ అభ్యర్ధులను పూర్తిగా మార్చేసి..ఇప్పటి వరకూ పనిచేసిన వారికి పార్టీని నమ్ముకున్న వారికి పక్కన పెట్టేశాయంటే అధికార దాహం ఏ స్థాయిలో ఉండి జెండా మోసిన వారికి దండవేసేశారో అర్ధం చేసుకోవచ్చు. పైగా అలా దగాపడ్డ నేతలందరికీ సదరు రాజకీయపార్టీలు చెప్పే కాకమ్మ కథలేంటంటే.. మీకు సామాజిక బలం లేదు..? ఆర్ధిక బలం లేదు..? మీ పై ఇంటెలి జెన్స్ రిపోర్టులు వ్యతిరేకంగా ఉన్నాయి..? మీకు స్థానిక బలం అంతకంటే లేదు.. మీరు ఈసారికి పక్కనుండండి.. పార్ఠీ గెలిచిన తరువాత ఏదో ఒక నామినెటెడ్ పోస్టు ఇస్తాం..లేదంటే మీ ఇష్టమని తెగేసి చెబుతున్నాయి. కాస్త వాయిస్ ఉన్న నేతలు ఉండాలనుకుంటే పార్టీలో ఉంటున్నారు.. లేదంటే పక్కపార్టీల్లోకి జంప్ అయిపోతున్నారు. అలా జంప్ అయిపోయిన వారికి కూడా పక్కపార్టీలు పిలిచి మరీ సీట్లు ఇవ్వడంతో అప్పటి వరకూ తాను ఎమ్మెల్యే, ఎంపీ రేసులో ఉంటానని పార్టీ కార్యక్రమాల లక్షలాది రూపాయలు ఖర్చు చేసిన నేతలంతా తమ డబ్బంతా పార్టీ కార్యాలయాలకు సున్నానికి వాడినట్టు అయిపోయిందనే బావనకు వచ్చేస్తున్నారు. రాజకీయమంటే మరీ ఇంత దారుణంగా ఉంటుందా..? అధికారం కోసం, పదవుల కోసం పార్టీని నమ్ముకున్న సీనియర్లను ఎంతకైనా మడత పెట్టేస్తారా..? అని ఓ ప్రధాన పార్టీ నేత మీడియా ముందు వ్యాఖ్యానించారంటే ప్రస్తుత రాజకీయ పార్టీల అధికార పందేరం ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా కనిపిస్తున్నది.

ఇపుడున్న రాజకీయ వ్యూహంలో ఎంపీ స్థానానికి వంద నుంచి 200 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని..ఎమ్మెల్యేకి 100 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని..ఆ స్థాయి ఉంటేనే ఎన్నికల్లో నిలబడటానికి ముందు రావాలనే సంకేతం పార్టీలే స్వయంగా ఇచ్చేయడం కూడా చర్చనీయాంశం అవుతోంది. ప్రభుత్వానికి సమర్పించే అఫడివిట్ లలో చూపించే ఖర్చులకు, ఎన్నికల బరిలో నిలబడి అభ్యర్ధులు చేసే ఖర్చులకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. దీనితో రాజకీయ ఉపాది జీవితాంతం కావాలనుకుంటే పక్కనేతకు సమాధి కట్టడానికి మనం కూడా ఇసుక మోయాలి, ఇటుక పేర్చాలన్నట్టుగా మారిపోయిందని నేతలు బుర్రలు పీక్కుంటున్నారు. ప్రస్తుత పరిస్థితిలో ఎన్నికలకి బీ-ఫాం ఇచ్చే వరకూ ఏ రాజకీయ పార్టీలో ఎవరు ఎమ్మెల్యే అభ్యర్ధి, ఎవరు ఎంపీ అభ్యర్ధి, ఎవరు ఎమ్మెల్సీ అభ్యర్ధో తెలియని పరిస్థితి నెలకొంది. కులాల మధ్య చిచ్చుపెట్టి మా పార్టీ పేదల పార్టీ అని చెప్పుకుంటూనే ఎందరో నాయకుల రాజకీయ భవిష్యత్తులతో ఆట్లాడుకునే పార్టీల వ్యవహారాన్ని ఓటరు చాలా నిశితంగా పరిశీలిస్తున్నాడనే విషయం ఇప్పుడిప్పుడే పార్టీలకు అర్ధం అవుతున్నా.. కమర్షియల్ పొలిటికల్ బిజినెస్ లో అవేమీ పరిగణలోకి రావడం లేదు. గతంలో జరిగిన ఎన్నికలు, 2024లో జరిగే ఎన్నికలకు చాలా తేడాలున్నాయని.. ఈసారి ఏ నేత రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండనుంది..? ఏ సీనియర్ నేత రాజకీయ భవిష్యత్తు ఈ ఎన్నికలతో సమాధి కాబోతుందో త్వరలోనే తేలిపోనున్నది. మరే నేతకు రాజకీయ ఉపాది మరో ఐదేళ్లకు కుదురుతుందో లెక్కలు గడుతున్నాయి పార్టీలు. నిజమైన ఓటరు..తెలివైన ఓటరు ఈ రాజకీయపార్టీల చేసే వ్యాపారాన్ని పూర్తిస్థాయిలో అర్ధం చేసుకుంటే నిజం ప్రజల కోసం పనిచేసే నేతలను చట్టసభలకు పంపిస్థాడు. అది జరుగుతుందా..? లేదటే మళ్లీ యదా రాజా తదా ప్రజా అన్నట్టుగా రాజకీయపార్టీలే ఓటరుని నోటు దగ్గరకి తీసుకొచ్చి అధికారం కోసం ఏమైనా చేస్తాయా అనేది వేచి చూడాలి..!

vizag

2024-03-31 20:44:20

విశాఖపై విషం కక్కుతున్నారు..!?

విశ్వవిఖ్యాత నగరంగా రూపాంతరం చెందుతున్న విశాఖ మహానగరంపై పనిగట్టుకొని విషం కక్కుతున్నారు.. ప్రశాతం వాతావరణాన్ని భయం గుప్పెట్లోకి నెట్టేస్తున్నారు.. చక్కటి సంస్క్రుతికి సున్నం రాసేస్తున్నారు.. ప్రైవేటు యూనివర్శిటీల వ్యాపారం కోసం ప్రభుత్వ యూనివర్శిటీల మనుగడ ప్రశ్నార్ధకమయ్యేలా దెయ్యం రంగు అంటగడు తున్నారు.. పథకం ప్రకారం పదవుల కోసం రాజకీయ రౌడీ ఇజం చేస్తున్నారు.. అభివృద్ధికి కలిసిరాని స్థానికేతరులు చిరస్థాయిగా విశాఖను ఏలడానికి అన్ని విధాలా ఖబ్జా చేస్తున్నారు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలూ వీరిని ఏమీ చేయలేకపోతున్నాయి.. దేశంలోనే సిటీ ఆఫ డెస్టినీగా పేరొందిన విశాఖను నేడు అంతర్జాతీయ డ్రగ్స్ రవాణాకి కేంద్ర బిందువుని చేసేశారు.. ఉంటే విశాఖలోనే ఉండాలనుకునే ఆశలకు శాస్వత సమాధి కట్టేస్తున్నారు..ఇక విశాఖను తాకనిది ఒక్క టెర్రరిస్టులు మాత్రమే.. విశాల విశాఖను విచ్చిన్నం చేసేందుకు జరుగుతున్న భారీ కుట్ర ఇపుడు అన్ని రంగాల వారిని ఉలిక్కి పడేలా చేస్తున్న వైనంపై ఈరోజు ప్రత్యేక కథనం..!

విశాఖ సిటీ అంటే ఒకప్పుడు అందాలకు, చక్కటి వాతావరణానికి పెట్టింది పేరు. కానీ నేడు ఆ పేరు పోయి మర్డర్ సిటీ, రౌడీ సిటీ, డ్రగ్ సిటీ, పొలిటికల్ సిటీ అనే స్థాయికి వచ్చేసింది. దేశంలోనే ప్రముఖంగా వినిపించే విశాఖను పూర్తిగా కబ్జా చేసేందుకు స్థానికేతరులు విశాఖ తీరంలో లంగరేసుకు పాతుకుపోతున్నారు. వీరి వలన ఎన్నాళ్ల నుంచో కష్టపడుతున్న రాజకీయనాయకులకు పదువులు పోతుంటే..స్థానికులకు ఎప్పుడు ఎక్కడ ఏ మర్ఢర్ జరుగుతోందోననే భయం పట్టుకుంది. రాజకీయం కోసం రౌడీయిజం చేసి..చదువుల కిల్లా విశాఖజిల్లాలోని  ప్రభుత్వ యూనివర్శిటీలకు సైతం దెయ్యం దెయ్యాల రంగు పులిమే వరకూ వచ్చింది. ముఖ్యంగా ఒక సామాజిక వర్గం పనిగట్టుకొని చేస్తున్న అరాచక మాఫియా వ్యాపారానికి విశాఖ మహానగరాన్ని కేరాఫ్ అడ్రస్ గా మార్చేలా చేసింది. వారి ప్రైవేటు యూనివర్శిటీల అభివృద్ధి కోసం ప్రభుత్వ యూనివర్శిటీలపై బురద చల్లుతూ.. వారి రాజకీయ పదవుల కోసం స్థానికులను డబ్బుకట్టలతో పార్టీలను ప్రశన్నం చేసుకొని ఇక్కడే పాతుకు పోతున్నారు. ప్రజలకు సేవ చేయాలనే రాజకీయ పదవులను వీరొచ్చిన తరువాత అది బహుళ వ్యాపారానికి లైసెన్స్ గా మార్చేశారు. కిడ్నాప్ లు, చోరీలు, గంజాయి, నేడు చివరకి డ్రగ్స్ దిగమతికి కేరాఫ్ అడ్రస్ గా మార్చేశారు. వీరి కబ్జా చర్యలతో విశాఖపై విషయం కక్కుతు వారు మాత్రం పక్కాగా పాతుకుపోతున్నారు. దౌర్భాగ్యం ఏంటంటే అలాంటి తేడాగాళ్లకే రాజకీయపార్టీలు కూడా కొమ్ము కాస్తూ పిలిచి మరీ వారి పార్టీలో సీట్లిచ్చి పదవులు కట్టబెడుతున్నాయి. అధికార మదంతో, డబ్బు దర్పంతో, కుల అండతో విశాఖ కీర్తిని కకావికలం చేస్తున్నారు.  వీరి ఆగడాలను అడ్డుకునే నాధుడే కరువయ్యాడు. అధికారం కోసం రాజకీయపార్టీలు ఆడుకున్న రాజకీయ క్రీడలో విశాఖను విచ్చిన్నం చేయడానికి తండోప తండాలు తరలి వచ్చేస్తున్న స్థానికేతరులు పదవులను అడ్డం పెట్టుకొని సువిశాల విశాఖను కకావికలం చేస్తున్నారు. దేశంలోనే అతి పెద్ద డ్రగ్ డీల్ కేంద్రంగా నగరాన్ని మార్చేయడానికి పన్నాగం వేసి అడ్డంగా దొరికిపోయారంటే ఏ స్థాయిలో నగరాన్ని నామరూపాలు లేకుండా చేయాలని ఎత్తుగడ వేశారో ఒక్కసారి ప్రతీ ఒక్కరూ ఆలోచించాల్సి వుంది.

నాటి విశాఖ..నేడు రాష్ట్ర రాజధాని కాబోతుందని అంతా కలలు కని..ఉద్యోగాలపై ఆశలు పెంచుకుంటున్నవేళ..డ్రగ్ మాఫియా అడ్డాగా, గంజాయి, డ్రగ్స్ కేపిటల్ గా చిత్రీకరించి నాగరాభివృద్ధికి శాస్వత అడ్డుకట్ట వేస్తున్నారు. ఒకప్పుడు విశాఖలో పెట్టుబడులు పెట్టడానికి తరలి వచ్చే కంపెనీలు, సంస్థలు నేటి తాజా డ్రగ్స్ మాఫియా చర్యలతో ఇక్కడి నుంచి బిచానా సర్దేసుకోవాలని నిర్ణయాయిని వచ్చాయి. త్వరలోనే ఇక్కడి ఐటి కంపెనీలు, కర్మాగారాలు భారీ స్థాయిలో తరలిపోవడానికి నేటి 25వేల కోట్ల డ్రగ్స్ డీల్ కారణం అయ్యిందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో వారికి .. జిల్లా నుంచి రాష్ట్రం..రాష్ట్రం నుంచి దేశం..దేశం నుంచి అంతర్జాతీయంగా ఎంతటి నెట్వర్క్ ఉందో కూడా అర్ధం చేసుకోవచ్చు. డ్రగ్స్ డంప్ ను కనుగొనడంతో ఉలిక్కిపడిన విశాఖ వాసులు రానున్న రోజుల్లో నగరానికి టెర్రరిస్టులు కూడా వచ్చినా రావొచ్చునని భయాం దోళన చెందుతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడుతున్న విశాఖలో నేడు డ్రగ్స్ కూడా అంతకంటే పెద్ద మొత్తంలో దిగుమతి అవుతున్నాయంటే స్థానిక యువత భవిష్యత్తు ఏంటోననే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కోట్లకు పడగలెత్తిన స్థానికేతరులు నగరంలో ఆస్తులను పెంచుకోవడంతోపాటు, వారి వికృత వ్యాపారానికి, యువతను నాశనం చేయడానికి ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ వ్యాపారానికి తెరలేపారంటేనే పరిస్థి చేదాటి పోయిందని తేలిపోయింది. ఇక విశాఖకు తరలి రావాలనుకుంటున్న కంపెనీల పరిస్థితి ఏంటి..? ఇదే పద్దతి కొనసాగితే స్థానికుల రాజకీయ భవిష్యత్తు ఏంటి..? అసలు విశాఖలో మనస్సాంతిగా జీవించగలమా..? ఉన్నత చదువుల కేంద్రం కాస్త..కరుడు గట్టిన డ్రగ్ డీల్ డెస్టినేషన్ గా మారిపోతే యువత పరిస్థితి ఏంటి..? స్థానికులు ఇక్కడ ఉండాలా..? లేదంటే నగరం విడిచి వెళ్లిపోవాలా..? ప్రస్తుతం సీబిఐ దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో నేడో రేపో ఎన్ఐఏ(నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ) కూడా రంగ ప్రవేశం చేస్తుందని చెబుతున్నారు.

యువత కలల ఆశల విశాఖ..ప్రస్తుత చర్యలతో డేంజర్ జోన్ లోకి వెళ్లిపోయింది. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి సంఘ విద్రోహ చర్యలను నియంత్రించాల్సిన ఆవశ్యకత తక్షణం ఏర్పడింది. అంతేకాకుండా స్థానికేతరులకు పదవులు ఇస్తే..స్థానికుల మనుగడ ప్రశ్నార్ధకమవుతుందనే విషయాన్ని కూడా రాజకీయపార్టీలు ఆలోచించాలి. లేదంటే వారి ధనార్జన కోసం వేలమంది విద్యార్ధులను ఉన్నత చదువుల్లో తీర్చి దిద్దుతున్న ప్రభుత్వ యూనివర్శిటీలు మూసేసుకోవాల్సిన అత్యవసర దుస్తితి కూడా రావొచ్చు. ఇప్పటికే పలు ప్రైవేటు యూనివర్శిటీలు కన్ను విశాఖపై పడి ఉన్న ఆంధ్రయూనివర్శిటీ కూడా అంధకారంగా మారిపోయినా మారిపోతుంది..? విశాఖలో జరగుతున్న వికృత చర్యలను, వినాశ ఘట్టాలను, మనుగడ ప్రశ్నార్ధకం చేసే వ్యవహారాలను ఉన్నత విద్యావంతులు మూకుమ్మడిగా తిప్పికొట్టాల్సిన ఆవశ్యక త ఏర్పడింది. స్థానికులు స్థానికేతురలపై తిరగబడకపోతే..ఉన్న గూడు కూడా కబ్జా అయిపోయి, మనల్నే వలస పంపే చర్యలు ప్రారంభమూ కావొచ్చు..విశాఖపై విషం కక్కుతున్న చర్యలను ఉత్తరాంధ్ర ఉక్కుపాదంతో అణగదొక్కాల్సి సమయం ఆశన్నమైంది. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో స్థానికుల బలం ఏంటో చూపించాలి.. లేదంటే మన మనుగడ స్థానికేతరుల చేతుల్లోకి వెళ్లిపోతుంది. విశాల విశాఖ బోరున విలపిస్తుంది..తస్మాత్ జాగ్రత్త..!

vizag

2024-03-26 05:17:12

కన్ను పడితే.. కాటేస్తాడు.. ఫిషరీష్ జెడీ వికృత చేష్టలు

ఆ అధికారి కన్నుపడితే టార్గెట్ చేసిన మహిళా ఉద్యోగిణిని కాటేయాల్సిందే..నయాన్నో..భయాన్నో ఏదోలా శారీరకంగా లొంగ దీసుకోవాలని సామవేద దండోపాయాలన్నీ ప్రయోగిస్తాడు.. ఏదీ కుదరకపోతే శాఖాపరమైన విధానాలు ఎతుకుతాడు.. దానిని అడ్డం పెట్టుకొని బలవంతంగానైనా అనుభవించాలని చూస్తాడు..సరిగ్గా ఈ కామాంధుడి కంటిలో 27ఏళ్ల జూనియర్ అసిస్టెంట్ బలైపోబోయి తృటిలో తప్పించుకుంది.. ఉన్నతాధికారి లైంగిక వేధింపులు తట్టులేక పోలీసులను ఆశ్రయించి కీచక అధికారిపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యేలా చేసింది. ఈ తంతు అంతా జరిగింది త్వరలో పరిపాలనా రాజధాని కాబోతున్న విశాఖజిల్లాలోని మత్స్యశాఖ కార్యాలయంలో..ఆ కీచక అధికారి జాయింట్ డైరెక్టర్ లాల్ మహ్మద్.. ఉన్నతాధికారే తనను కాటేయాలని కక్షగట్టాడని బావించి..చాకచక్యంగా తప్పించుకొని బయపడి మహిళా సంఘాల సహకారంతో పోలీసులకి ఫిర్యాదు చేసి తప్పించుకోగలిగింది. ఈ కీచక ఉన్నతాధికారి లైంగిక వేదింపుల పర్వం ఒక్కసారి తెలుసుకుంటే...

లాల్ మహ్మద్ విశాఖజిల్లాలోని మత్స్యశాఖలో జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఈయన జిల్లాకి వచ్చేనాటికి ఇదే కార్యాలయంలో పనేచేసే 27ఏళ్ల మహిళా  ఉద్యోగిణి ఆఫీస్ సబార్డినేట్ గా ఉండేది. సరిగ్గా కామాంధుడి కన్ను ఆ ఉద్యోగిణిపై పడింది..ఎలాగైలా లోబరుచుకోవాలని పథకం వేసి..మెల్లగా ఆమె సీనియారిటీ, పదోన్నతిని వాడుకొని ఆమెకు ఇదే కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పదోన్నతిలో సహకరించాడు. పాపం ఆ మహిళా ఉద్యోగిణి..ఉన్నతాధికారి మానవతా దృక్పదంతో సహాయం చేశాడనుకొని చెప్పిన పని, చెప్పని పని అన్నీ చేస్తూ తల్లో నాలుకగా ఉండేది. అదే అదునుగా చేసుకున్న జెడి ఆమెను విధినిర్వహణలో ఉండగానే తన గదిలోకి చీటికీ మాటికి పిలిపించుకొని ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయడం మొదలు పెట్టేవాడు. తనకి ఒంట్లో బాగాలేదని చెబితే ఏదీ..జ్వరం ఎంతుందో చూస్తానంటూ స్థనాలపై చేతులు వేయడం, మెడపై చేతులు వేయడం, వీపుకి చేతులు ఆనించడం వంటి రక రకాల చేష్టలు ప్రదర్శించేవాడు. ఒక్కోసారి తాను చెప్పినట్టు వినకపోతే ఉద్యోగంలో నుంచి తొలగిస్తానని, ప్రమోషన్ డిమోషన్ చేస్తానని కూడా బెదిరంచేవాడు.  దీనితో ఎలాగైనా తనను లోబరుచుకుని కాటేసేలా ఉన్నాడనుకుని భావించిన ఆద్యోగిణి ఎలాగోలా  చాలా కాలం భరించిన ఆ ఉద్యోగిణి సహనం నశించిపోయి పోలీసులను ఆశ్రయించి.. తనను ఏవిధంగా లొంగదీసుకోవాలని చూస్తున్నాడో లిఖిత పూర్వకంగా సోమవారమే పోలీసుకు ఫిర్యాదు చేసి కార్యాలయానికి రావడం మానేసింది. 

 చిన్న కేసుతో తప్పించాలని పోలీసుల యత్నం..
విశాఖలో సంచలనంగా మారిన మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ లైంగిక వేధింపుల కేసుని పోలీసులు నిర్వీర్యం చేయాలని చూసినా ఫలితం దక్కలేదు. బెదిరించాలని చూసినా దైర్యంగా నిలబడి మరీ ఉన్నతాధికారి, పోలీసులకు ఎదురెల్లింది ఆ మహిళా ఉద్యోగిణి. ప్రస్తుతం ఆమెకు మహిళా సంఘాల మద్దతు పెరిగింది. తప్పని సరి పరిస్థితుల్లో పోలీసులు కూడా కేసు నమోదు చేయాల్సి వచ్చింది. ఉన్నతాధికారిగా వున్న తనను బయట పడేయాలని ఎన్ని ప్రయోగాలు చేసినా పాచికలు ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా ఆపలేకపోయాయి. చిన్న సెక్షన్లతో నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని మహిళా సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. మహళా ఉద్యోగి పట్ల మరీ ఇంత నీచంగా ప్రవర్తిస్తున్న ఆ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. అఫీస్ కేబిన్ కు పిలిపించి ఆమెపై అసభ్యకరమైన ప్రవర్తనకు పాల్పడితే మరీ చిన్న సెక్షన్లతో అతడిని తప్పించాలనే ప్రయత్నం  సరైంది కాదని ఇందులో ఎంతటి వారు వచ్చినా సదరు అధికారికి శిక్ష పడేవరేకూ వదిలిపెట్టేది లేదని తెగేసి చెబుతున్నారు.


పరారీలో మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్
మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడిన జాయింట్ డైరెక్టర్ లాల్ మహ్మద్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలిసింది. లాంగ్ లీవ్ పెట్టి వెళ్లిపోయినట్టు సమాచారం అందుతుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్ని పర్యటనలు చేయాల్సి ఉండగా వాటన్నింటినీ రద్దు చేసుకున్నట్టు సమాచారం అందుతుంది. ప్రస్తుతం లాల్ మహ్మద్ కాకినాడ  స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీష్ టెక్నాలజీ ప్రిన్సిపల్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈయన పనిచేసే ప్రతీ చోట ఇదే తరహా లైగింక వేధిపులు మహిళా ఉద్యోగులు ఎదుర్కొన్నట్టు సమాచారం అందుతుంది. మత్స్యశాఖలో ఉన్నతాధికారిగా ఉన్న లాల్ మహ్మద్ లైంగిక వేధింపుల ఘటన సదరు మత్స్యశాఖ కమిషనర్ కూడా సీరియస్ గా తీసుకున్నట్టు తెలిసింది. ఆమె ఆదేశాలతో ఈయన విధులకు లాంగ్ లీవ్ పెట్టినట్టు చెబుతున్నారు. ఈరోజు 2టౌన్ పోలీసు స్టేషన్ లో విచారణ ఎదుర్కొన్న అనంతరం బెయిల్ కోసం వెళ్లిపోయినట్టు వార్తలొస్తున్నాయి. చూడాలి అత్యంత దారుణంగా వ్యవహరించిన మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ విషయంలో జిల్లా కలెక్టర్, కమిషనర్ లు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది.

visakhapatnam

2024-03-13 02:07:33

డబ్బు కొట్టు..ఆర్డర్ పట్టు.. ఆ లెక్కే వేరబ్బా..?!

మీ అందరి ఉద్యోగాలు రెగ్యులర్ అవుతున్నాయి..డేటా మొత్తం ఆన్ లైన్ చేయాలి..దానికి అమరావతి సెక్రటేరియట్ నుంచి అందరు అధికారులకు డబ్బు లు ఇవ్వా లి..ఒక్కో ఉద్యోగి రూ.10వేలు ఇస్తేనే వివరాలు పైకి వెళతాయి లేదంటే మీ ఇష్టం కాంట్రాక్టు ఉద్యోగిగానే ఉండిపోతారు..కట్ చేస్తే 98 మంది పారామెడికల్, ఇతర ఉద్యోగులు వారి సర్వీసులు రెగ్యురల్ చేసుకోవడానికి వారి వారి విభాగాలోని మినిస్టీరియల్ స్టాఫ్ కి అక్షరాలా రూ.10 కట్టారు.. ఇక ఇందులో ప్రధాన పత్రికల వారికిచ్చేది ఇచ్చే యండి..విషయం ఎక్కడా బయటకి పొక్కకూడదు.. సదరు పత్రికల్లో వస్తే ఇరుకున పడతాం.. డబ్బులు ఇచ్చిన విషయం బయటకు చెబితే ఇచ్చిన ఆర్డర్లు కూడా కేన్సిల్ చేస్తామని ముందుగా చెప్పి ఉంచారు..ఏదైనా మీడియాలో వస్తే..సర్వీసులు రెగ్యులర్ అయిన ఉద్యోగులే తిరగబడాలి..మీరే ఖండించాలి..ప్రెస్ మీట్లు పెట్టాలి.. ఈ నిబంధనలకు ఒప్పుకున్నవారే డబ్బులు కట్టాలనే నిబంధనలు కూడా ఉద్యోగులకి వెళ్లాయి. అంతే అనుకున్నట్టుగా జాబితా స్టేట్ సెక్రటేరియట్ కి వెళ్లిపోయాయి. ఆర్డర్లు కూడా ఇచ్చేశారు. తంతు మొత్తం భారీ మొత్తం కావడంతో పంపకాల్లో తేడాలొచ్చి విశాఖజిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయం నుంచే విషయం పొక్కేసింది. ఈ విషయం తెలుసుకున్న ‘ఈరోజు’ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.జగదీశ్వర్రావు దృష్టికి విషయాన్ని తీసుకెళితే అబ్బే అలాంటిదేమీ లేదండీ అని మొదలు పెట్టి.. ఆర్డర్లు కోసం డబ్బులిచ్చిన వారు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులిస్తే తప్పా తానేమీ చేయలేనని..తానే స్వయంగా రెండు రోజులు పాటు కార్యాలయంలో రాత్రింబవళ్లు కష్టపడి మరీ ఆర్డర్లు జారీ చేశానని, ఎలాంటి లావాదేవీలు చేతు మారలేదని చెప్పారు..

ఇక్కడ ఒక విషయం  రాష్ట్ర తాధికారులు, జిల్లా కలెక్టర్ కూడా గమనించాలి.. చాలా ఏళ్ల తరువాత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు రెగ్యులర్ అవుతుందన్న ఆనందంతో ఉద్యోగులు ఉన్నారు. ఈ సంతోషంలో జిల్లా ఆరోగ్యశాఖలోని అధికారులు సిబ్బంది పెట్టిన కండిషన్ కి తలొగ్గి అడిగినంతా ఇస్తారా..? లేదంటే మేము డబ్బులివ్వలేమని కాంట్రాక్టు జాబ్ రెగ్యులర్ అవుతున్నా, కాకపోయినా పర్లేదని కాలదన్నుకుంటారా..? సరిగ్గా ఈ వీక్ పాయింట్ నే క్యాష్ చేసుకున్నారు విశాఖజిల్లా వైద్యఆరోగ్యశాఖలోని అధికారులు, సిబ్బంది. ప్రభుత్వం నుంచి 98 మంది ఉద్యోగులకు సంబందించి డేటా వచ్చినపుడే షరతులతో కూడిన కలెక్షన్ మొదలు పెట్టారు. ముందుగా పేమెంట్లు చేసిన వారికి ఆర్డర్లు ఇచ్చి..ఇవ్వని వారికి మరో సరికొత్త కండిషన్లు కూడా పెట్టారట. ‘దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందాన’..రాష్ట్రప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తే దానిని కూడా తమ కలెక్షన్ల కోసం వాడేసుకున్నారు ఇక్కడి అధికారులు. పైగా తాము సత్య హరిశ్చంద్ర వంశానికి చెందిన వారమని..ఉద్యోగులు, సిబ్బంది అంతా చాలా వృత్తి ధర్మరమే పరమావధిగా బావించి, మానవతా దృక్పదంతో సొంతడబ్బులు ఖర్చు చేసీ మరీ ఆర్డర్లు తయారు చేసి ఇచ్చామని వల్లెవేస్తున్నారు ఉమ్మడి విశాఖజిల్లా కార్యాలయ సిబ్బంది.
‘పిల్లి గుడ్డిదైతే..ఎలుక ఏదో ఎత్తి చూపించిందట’.. చేసిన తప్పుని కప్పి పుచ్చుకోవడానికి, వసూళ్ల విషయం బయటకు వచ్చిందని దాచిపెట్టడానికి, ప్రధాన మీడియాలో ఈ విషయం వార్తలు రాకుండా మేనేజ్ చేసున్న అధికారులు.. తీరా విషయం బయటకు వచ్చేసరికి వైద్యఆరోగ్యశాఖలోని అక్రమ వసూళ్లపై ప్రశ్నించిన కొందరు మీడియాకి జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డా.జగదీశ్వర్రావు దగ్గర నుంచి సంబంధిత విభాగాల సిబ్బంది కూడా మూకుమ్మడిగా ఒకే రకమైన వివరణ ఇచ్చారు.  రెగ్యులర్ ఆర్డర్ల కోసం ఎవరైనా ఉద్యోగులు డబ్బులు ఇచ్చినట్టు నేరుగా తనకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తేనే తాను చర్యలు తీసుకోగలనని, లేదంటే తానేమీ చేయలేనని చెప్పారు. ఉద్యోగులు వారి ఉద్యోగాల మీదకు వచ్చే విషయాన్ని ఎవరు మాత్రం ముందుకొచ్చి బయటపడి ఫిర్యాదులు చేస్తారని ప్రశ్నిస్తే..దానికి మమ్మల్ని ఏం చేయమంటారు అని బదులిచ్చారు. మీ దగ్గరకొచ్చి ఫిర్యాదు చేసిన వారిని ఎందుకు బహిరంగంగా విషయాన్ని బయటపెట్టారని టార్గెట్ చేసి, తరువాత ఇబ్బంది పెడతామని ముందుగానే హెచ్చరించారనే సమాచారం కూడా ఉందని చెప్పగా.. అలా ఎందుకు చేస్తామని..తమపై గిట్టని వారు ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాట దాటవేశారు. నేనూ.. మా సిబ్బంది చాలా నీతి మంతులమని..అవసరం అయితే సొంతంగా ఖర్చు చేస్తాం తప్పా మరెవ్వరి వద్దా పైసా కూడా తీసుకొమని కూడా చెప్పుకొచ్చారు. సాధారణంగా ఉద్యోగాలు రెగ్యులర్ అయిన సమయంలో ఇలాంటి ప్రచారాలు బయటకి వస్తాయని..వాటిని మీడియా కూడా లైట్ తీసుకోవాలని సూచించడం కూడా విశేషం.

ప్రధాన పత్రికలు, ఛానళ్లకు రూ.2లక్షలు నజరారా..?!
విశాఖజిల్లా వైద్య ఆరోగ్యశాఖలో జరిగిన ఈ అక్రమ వసూళ్ల తంతు బయటకు రాకుండా ఉండేందుకు ప్రధాన పత్రికలు, టివి ఛానళ్ల ప్రతినిధులకు సుమారు రూ.2 లక్షల వరకూ ముట్టజెప్పినట్టు తెలిసింది. నొక్కిన మొత్తంలో కొంతమొత్తమెట్టి కొట్టడంతో డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఏమీ జరగనట్టుగా ఉన్నారని సమాచారం. అడ్డగోలుగా వసూళ్లు చేసినా..జిల్లా అధికారి నుంచి సిబ్బంది వరకూ నిస్సుగ్గుగా చెబుతున్న సమాధానాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇదే కార్యాలయానికి చెందిన కొందరు ఉద్యోగులైతే ఒక అడుగు ముందుకేసి మేము ఒక్కరమే అంతా తినేస్తున్నామా..మీడియాకిస్తున్నామా..జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఇస్తున్నామా..స్టేట్ సెక్రటేరియట్ పంపిస్తున్నామా..ఇంతా చేస్తే మాకు మిగిలేది ఎంత..? ఆ మాత్రం దానికే మీరు వార్తాలు రాసేస్తారా..ఏం ప్రభుత్వంలోని 75 ప్రభుత్వ శాఖలుంటే ఒక్క జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో చేసిన వసూళ్లే కనిపించాయా..మిగిలిన ఏ డిపార్ట్ కనిపించ లేదా అంటూ తిరగబటం విశేషం. పక్కా ప్లాన్ అండ్ టెర్మ్స్ అండ్ కండిషన్స్ తో మడతెట్టిన భారీ మామూళ్లుపై యదా రాజా తదా ప్రజా అన్నట్టుగా అధికారులు కూడా లైట్ తీసుకున్నారు..విశాఖ జిల్లా వైద్యఆరోగ్యశాఖకు ఇదాంతా షరామామూలే..!?

vizag

2024-03-11 17:38:20

సరికొత్త రాజకీయ వ్యూహం..?!

అనకాపల్లిలో అసలైన రాజకీయం మొదలైంది..మాజీ మంత్రులు ఇద్దరూ గెలుపే లక్ష్యంగా కలిసి పనిచేయడానికి సిద్దపడ్డారు. వీరి కలయిక ఆంధ్రప్రదేశ్ లోనే హాట్ టాపిక్ అవుతోంది. ఏది ఏమైనా జిల్లాను హస్తగతం చేసుకోవాలంటే ఒకే సామాజిక వర్గానికి చెందిన ప్రధాన నేతలు కలవకపోతే కుదరదనే ఆలోచనకి వచ్చిన వీరు కలిసి పనిచేసి జిల్లా నుంచి తొలిగెలుపు..అదీ అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గాన్నే టిడిపి-జనసేన కూటమికి ఇవ్వాలని నిర్ణయించారు. వీరి కలయికతో ఒక్కసారిగా జిల్లాలో రాజకీయం వేడెక్కింది వైఎస్సార్సీపి చెక్ పెట్టాలంటే అది దాడి, కొణతా కలయిక వలనే సాధ్యపడుతుందనే కార్యకర్తల అభీష్టాన్నీ ఇరువురు నాయకులు నిజంచేయడానికి ఒక్కటవడం సంచలనం రేపుతోంది..!  తెలుగుదేశం జనసేన అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ విజయానికి ప్రతి ఒక్కరూ పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు. శుక్రవారం గవరపాలెం లోని ఆయన నివాసానికి రామకృష్ణ  విచ్చేశారు. ఈ సందర్భంగా దాడి ఆయన అంతరంగికులందరూ రామకృష్ణ కు ఘనంగా స్వాగతం పలికారు. ఆత్మీయ పలకరింపు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా రాజకీయ అంశాలపై ఇరువురి నేతలు చర్చించారు. వారిని కలిసిన విలేకరులతో వీరభద్రరావు మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన పార్టీ విజయం చారిత్రాత్మక అవసరం అన్నారు. రాష్ట్రం అరాచక పాలన వల్ల అధోగతి పాలవుతుందన్నారు భూకబ్జాదారులు సంఘ విద్రోహసక్తులు పెట్రేగిపోతున్నారని అన్నారు. ఇటువంటి తరుణంలో రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.వైయస్ రాజశేఖర్ రెడ్డి కి ముఖ్య అనుచరుడిగా ఆయన మంత్రివర్గంలో పనిచేసిన రామకృష్ణ సమర్థవంతమైన పాత్ర పోషించార న్నారు .ఆ సమయంలో తాను శాసనమండలి ప్రతిపక్ష నేతగా వ్యవహరించాలని చెప్పారు . కొణతాలకు టికెట్టు పొత్తులో భాగంగా జనసేన నుండి రావటం జరిగిందన్నారు  అందుకు అందరూ పొత్తు ధర్మాన్ని పాటించాల్సిన అవసరం ఆమోదించాల్సిన అవసరం ఉందన్నారు ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. రామకృష్ణ గెలుపుకు సంపూర్ణ సహకారం అందిస్తానని ప్రకటించారు. అలాగే జనసేన నేత టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థి కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ దాడి వీరభద్రరావు తో కాలేజీ నుండి అనుబంధం ఉందన్నారు.

ఆయన అధ్యాపకుడిగా ఉన్నప్పుడు ఏఎంఎ ఎల్ కాలేజీ లో తాను చదువుకోవడం జరిగిందన్నారు.  మా కుటుంబానికి ఆయన ఆత్మీయులు అన్నారు. అయితే రాజకీయంగా విభేదించాల్సిన పరిస్థితి నెలకొందని తిరిగి మళ్ళీ కలిసి పనిచేసే అవకాశం  ఏర్పడిందని చెప్పారు.. చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం లక్ష్యంగా అందరం కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన  సహకారం తనకు ఎంతో అవసరమన్నారు .ముందు ముందు అన్ని విషయాలు చర్చించుకుని ప్రజల్లోకి వెళ్ళటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొణతాల సత్యనారాయణ, మల్ల రాజా, దాడి జగన్ ప్రభాకర్, విల్లూరి రాము, కాండ్రేగుల కృష్ణప్పారావు, బొడ్డపాటి రాజారావు , బొడ్డేడ శంకరరావు, కోటిపల్లి జేజి బాబు, పెద్ద ఎత్తున జనసేన తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గవరపాలెం సంతబైల సందడి వాతావరణం నెలకొంది అనకాపల్లి నియోజకవర్గంలో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది.

anakapalli

2024-03-09 00:41:50

ఏపీటిఎఫ్ విశాఖ జిల్లా అధ్యక్షునిగా సిహెచ్.కరుణాకరరావు

ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్(ఏపీటిఎఫ్) విశాఖపట్నం జిల్లా అధ్యక్షునిగా సిహెచ్.కరుణాకరరావు ఏకగ్రీవంగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కార్యవర్గం ఈ విషయాన్ని ప్రకటించింది. ఈయన గత20ఏళ్లుగా యూనియన్ లో వివిధ హోదాల్లో పనిచేసి, ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటాలు చేశారు. ఇటీవల జరిగిన యూని యన్ ఎన్నికల్లో కరుణాకరరావుని ఉపాధ్యాయులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యాయులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాలు, సిపిఎస్ రద్దు, ఇతర అలవెన్సులు, పీఆర్సీ బకాయిలు, అరియర్స్ విడుదల విషయంలో ఈయన కీలకంగా వ్యవహరించారు. కరుణాకరరావు సేవలను గుర్తించిన ఉపాధ్యాయులు ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈయన ఎంపిక పట్ల జిల్లాలోని పలువురు ఉపాధ్యాయులు, సిపిఎస్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఉపాధ్యాయుల సమస్యలు, డిమాండ్ లు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Visakhapatnam

2024-02-22 10:43:46

అనకాపల్లి జిల్లాలో 604 జంటలకు రూ.3.57 కోట్లు

అనకాపల్లి జిల్లాలో వై.ఎస్.ఆర్. కళ్యాణమస్తు, షాదీ తోఫా క్రింద 604 జంటలకు రూ.3కోట్ల 57 లక్షల 20 వేలు జమ చేసినట్లు జిల్లా కలెక్టరు రవి పట్టన్ శెట్టి తెలిపారు.  మంగళవారం జిల్లా కలెక్టరు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన లబ్దిదారులకు చెక్కును అందజేశారు.  కలెక్టరు మాట్లాడుతూ కొత్తగా వివాహం చేసుకున్న వారిలో అర్హులైన వారందరూ కళ్యాణమస్తు, షాదీ తోఫా కొరకు దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు.  జిల్లాలో బిసి-ఎ కు చెందిన 74 జంటలకు రూ.37 లక్షల 50 వేలు, బిసి-బి కి చెందిన 51 జంటలకు రూ.28 లక్షల 75 వేలు, బిసి-డికు చెందిన 406 జంటలకు రూ.2కోట్ల, 14లక్షల 75 వేలు, బి.సి.ఈ కి చెందిన మూడు జంటలకు రూ. 3 లక్షలు, ఓసికి చెందిన ఒక జంటకు రూ.1లక్షా 50 వేలు,  ఎస్.సి.కి చెందిన 63 జంటలకు రూ.64 లక్షల 90 వేలు, ఎస్.టి.కి  చెందిన 6 జంటలకు రూ.6లక్షల 80 వేలు వారి ఖాతాలలో జమచేసినట్టు తెలిపారు.   అనకాపల్లి జెడ్.పి.టి.సి. బి. వరాహ సత్యవతి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్ని వర్గాల పేద ప్రజలకు పెద్ద కొడుకుగా వారి ఆర్ధిక సమస్యలను తీర్చడమే ధ్యేయంగా సుపరిపాలన సాగిస్తున్నారని చెప్పారు.  అమ్మఒడి, పించన్లు, ఆసరా మొదలైన కార్యక్రమాలను ప్రవేశపెట్టి అన్ని కుటుంబాలను ఆదుకుంటున్నారని చెప్పారు.  పేదలైన ఎస్.సి., ఎస్.టి., బి.సి. కుటుంబాలలో ఆడపిల్లల పెళ్ళికి ధన సహాయం చేస్తూ ఆదుకుంటున్నారని ఆమె తెలిపారు.  అంతకు ముందు తాడేపిల్లి క్యాంప్ కార్యాలయం నుండి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాల్గన్న కార్యక్రమాన్ని అందరూ తిలకిం చారు.  తరువాత జిల్లా కలెక్టరు లబ్దిదారులకు చెక్కును అందజేశారు.  ఈ కార్యక్రమంలో డిఆర్ డిఏ పి.డి. శచీదేవి, ఎపిడి డైజీ, బి.సి. సంక్షేమ శాఖ ఏ.డి.  అజయ్ బాబు, పెద్ద సంఖ్యలో మహిళలు, యువ జంటలు పాల్గొన్నారు. 

Anakapalle

2024-02-20 12:03:59

ఎన్నికల నిర్వహణకు ముందస్తు చర్యలతో సిద్ధం..జిల్లాకలెక్టర్

రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ముందస్తు చర్యలను చేపట్టడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి తెలిపారు. శుక్రవారం రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ జిల్లా ఎస్పీ కెవి మురళీకృష్ణ తో కలసి  పాల్గొన్నారు.  జిల్లాలో జరగనున్న పార్లమెంటు, అసెం బ్లీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు చేపట్టిన చర్యలను ఆయన వివరించారు.  జిల్లాలో గల పోలింగ్ కేంద్రాలను అన్ని మౌలిక వసతులతో సిద్ధం చేయడం జరిగిందని, నిర్వహణకు అవసరమైన అధికారులు సిబ్బందిని సమాయత్తం చేయడం జరిగిందని చెప్పారు. రూటు మ్యాపులను సిద్ధం చేసినట్లు, అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో సమస్యాత్మక అతి సమస్యాత్మ కేంద్రాలను గుర్తించామని వాటి దగ్గర అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. గత ఎన్నికలలో జరిగిన సంఘటనలు పరిశీలించి తదనుగుణంగా ప్రణాళికాయుక్తంగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.

మద్యం ఇతర మాదక ద్రవ్యాల రవాణాను ముందుగానే గుర్తించేందుకు అవసరమైనచోట్ల చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. జిల్లాలోని సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా తగిన కమ్యూనికేషన్ ప్లాన్ సిద్ధం చేయడం జరిగిందన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అధికారులు సిబ్బంది పోలీసు సిబ్బంది వాహనాలు గస్తీ సిబ్బంది మొదలైన వాటిని క్షుణ్ణంగా పరిశీలించి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు చెప్పారు. ఈవీఎంలపై ఓటింగ్ ఏ విధంగా చేయాలనే శిక్షణా కార్యక్రమాలు కూడా విస్తృతంగా జరుగుతున్నాయన్నారు. వివాదాలు జరిగే ప్రాంతాలను ముందుగానే గుర్తించడం జరిగిందన్నారు. పోలీస్ రెవెన్యూ ఇతర సిబ్బందితో ప్రశాంత వాతావరణంలో ఓటర్లందరూ నిర్భయంగా ఓటింగులో పాల్గొనే విధంగా తగిన చర్యలు చేపట్టడం జరిగిందని తెలియజేశారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ విజయభాస్కర్, సిపిఓ జి రామారావు, నర్సీపట్నం ఆర్డిఓ హెచ్.పీ జయరాం, నర్సీపట్నం పాయకరావుపేట ఎలమంచిలి అనకాపల్లి చోడవరం మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గాల ఈఆర్వోలు, తాసిల్దార్లు ఎన్నికల విభాగం పర్యవేక్షకులు డి.రామ్మూర్తి, డిటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2024-02-16 13:56:40

ఎస్సెస్సీ, ఇంటర్, ఏపీపీఎస్సీ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు

10వ తరగతి, ఇంటర్మీడియట్, ఏపీపీఎస్సీ పరీక్షలు నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లుచేయాలని జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఈ విషయాలపై రెవెన్యూ విద్యా పోలీసు తదితర శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 18వ తేదీ నుండి 27 వ తేదీ వరకు ఎస్ ఎస్ సి పరీక్షలు ఉదయం గం 9:30 నిల .నుండి మధ్యాహ్నం గం 12 45 ని.ల వరకు జరుగుతాయని   ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుండి మార్చి 20వ తేదీ వరకు ప్రతిరోజు ఉగం 9-00ని. ల నుండి మధ్యాహ్నంగం. 12-00ల వరకు, జరుగుతాయని చెప్పారు. అంతేకాకుండా ఓపెన్ స్కూల్ పరీక్షలు, ఏపీపీఎస్సీ పరీక్షలు కూడా జరుగుతాయన్నారు. వివిధ శాఖల సమన్వయంతో  ఎటువంటి లోటుపాటులు లేకుండా పరీక్షలన్నీ ప్రశాంతంగా నిర్వహించాలన్నారు. పరీక్షా కేంద్రాలలో విద్యుత్తు తాగునీరు పారిశుధ్యం మొదలైన మౌలిక వసతులన్నీ పూర్తిగా ఉండాలన్నారు. 

ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి పనులన్నీ నియమిత కాలంలో ఖచ్చితంగా జరిగేలా చూడాలన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రంలోనికి వెళ్లే ముందు క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. సెల్ ఫోన్ ఇతర ఎలక్ట్రికల్ డిజిటల్ స్మార్ట్ పరికరాలు పరీక్ష హాల్లోనికి అనుమతించ రాదన్నారు. సమయపాలన కచ్చితంగా అమలు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ప్రాథమిక చికిత్స ఓ ఆర్ ఎస్ గ్లూకోస్ మొదలైనవి అందుబాటులో ఉంచాలని చెప్పారు. పరీక్షా కేంద్రాల ప్రాంతంలో ప్రశ్న పత్రాలు ఆన్సర్ పత్రాలను కట్టుదిట్టమైన భద్రతలో ఉంచాలని పోస్ట్ ద్వారా ఆ రోజే పంపించాలన్నారు. అధికారులు సూచించిన చెక్ లిస్ట్ అనుసరించి అన్ని జాగ్రత్తలు తీసుకో వాలన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రెవిన్యూ పోలీస్ విద్యాశాఖ అధికారులతో స్క్వాడ్లను ఏర్పాటు చేయాలన్నారు.  డీఈవో వెంకట లక్ష్మమ్మ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలకు జిల్లాలో 108 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లాలో 397 పాఠశాలలకు సంబంధించిన 21, 259 మంది రెగ్యులర్ విద్యార్థులు 2324 మంది ప్రైవేటు విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు.

 పరీక్షల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లకు కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆర్ ఐ ఈ ఓ  బి. సుజాత మాట్లాడుతూ ఇంటర్ పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలను చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో 38 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, 14 పోలీసు స్టేషన్లలో ప్రశ్న పత్రాలు స్ట్రాంగ్ రూమ్ లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 13,323 మంది విద్యార్థులు హాజరవుతుండగా వారిలో 1074 మంది జనరల్, 2619 మంది ఒకేషనల్ కోర్సు విద్యార్థులు. రెండవ సంవత్సరం 15,298 మంది విద్యార్థులు హాజరవుతుండగా వారిలో 1278 మంది జనరల్ ఒకేషనల్ కోర్సు విద్యార్థులు ఉన్నారని చెప్పారు. ఏపీ ఓపెన్ స్కూల్ ఎస్ ఎస్ సి పరీక్షలు మార్చి 18 నుండి 27 వరకు ఐదు కేంద్రాల్లో జరుగుతాయని 788 మంది హాజరవుతున్నారన్నారు.

ఇంటర్మీడియట్ ద్వితీయ సం.పరీక్షలు 11 కేంద్రాలలో మార్చి 18 నుండి 26వ తేదీ వరకు జరుగుతాయని 2205 మంది హాజరవుతున్నట్లు చెప్పారు. ప్రాక్టికల్ పరీక్షలు ఐదు కేంద్రాలలో మార్చి 30వ తేదీ నుండి ఏప్రిల్ 3 తేదీ వరకు జరుగుతాయని 991 మంది హాజరవుతున్నట్లు వివరించారు.ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి బి దయానిధి అనకాపల్లి డి.ఎస్.పి సుబ్బరాజు ఉప విద్యాధికారి రవిబాబు డిఇసి మెంబర్లు డి ఈ సి మెంబర్లు ఎం శ్రీనివాసరావు పి శిరీష రాణి పివిఎన్ మూర్తి జిల్లా బల్క్ మెంబర్ ఎం.మోహన్ రావు పోస్టల్ సూపరింటెండెంట్ సంజయ్ కుమార్ పండా ఆర్ టి సి మేనేజర్ కే.ఎస్. నారాయణ ఎస్ టి ఓ పి రాజేష్ టెలిఫోన్స్ జే టి ఓ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2024-02-13 14:29:08