1 ENS Live Breaking News

ఆర్డీడి పోస్టు మాత్రమే ఇష్టం.. డాక్టర్ విధులంటే చాలా కష్టం..?!

నాకు ఇచ్చార్జి ఆర్డీడి పోస్టు వచ్చేసింది.. నాకు అస్సలు ఖాళీ ఉండదు.. కేజిహెచ్ లో ఆయుర్వేద డిస్పెన్సరీ ఓపీ కూడా ఇన్చార్జి ఆర్డీడి అయినా కూడా నేనే చూడాలా.. అంతగా చూడాల్సి వస్తే కమిషనరేట్ లో నాకు తెలిసిన అధికారులను మేనేజ్ చేస్తాను.. ఇక్కడ అంతా నా ఇష్టప్రకారమే జరగాలి.. అవసరం అయితే ఓపీలో కాంపౌండర్ తో డిస్పెన్సరీ నడిపిస్తాను.. కానీ రెగ్యులర్ గా ఆర్డీడి పనులు మాత్రమే చేస్తాను.. ఆయుష్ కమిషనర్ కి నేను ఎంత చెబితే అంత... నా ఇష్టం వచ్చినట్టే జోన్-1లో ఆయుష్ డాక్టర్లు అంతా పనిచేయాలి.. లేదంటే అందరినీ కమిషనరేట్ కి సరెండర్ చేసేస్తాను.. ఏంటి ఇవేవో సినిమా డైలాగులు అనుకుంటున్నారా.. ఆయుష్ కమిషనర్ ఏమీ పట్టించుకోకుండా వదిలేయడంతో విశాఖలోని ఆయుష్ ఇన్చార్జి ఆర్డీడి వైద్యాధికారులపై చేస్తున్న రుబాబు.. వైద్యాధికారుల ఫిర్యాదులను బుట్టదాఖల వుతుండటంతో ఆర్డీడి ఇష్టాను వ్యవహరిస్తున్న విషయం వైద్యఆరోగ్యశాఖలోని ఆయుష్ లో చర్చనీయాంశం అవుతున్నది.

కేజిహెచ్ లో ఆయుర్వేద డిస్పెన్సరీ ఓపీలో వైద్యులు లేక రోగులు నీరసంగా వెనుతిరుగుతున్నారు. రోగులు వెళ్లే సమయానికి అటెండరో..ఫార్మసిస్టో ఉంటే మాత్రం మందులు ఇస్తారు..వారూ లేకపోతే అక్కడ ఎవరినీ అడిగేందుకు కూడా ఎవరూ ఉండదరు. ఇక్కడి ఆయుర్వేద ఆసుపత్రిలో సీనియర్ మెడికల్ ఆఫీసర్ విధులు నిర్వహించాల్సి వుంది. అయితే ఆమెకు ప్రభుత్వం వైద్యాధికారితోపాటు గత కమిషనర్ ఈమెను ఇన్చార్జి ఆర్డీడిగా నియమిస్తూ తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చారు. దానితో ఆమె పూర్తిస్థాయి ఆర్డీడిగా అవతారం ఎత్తారు. పూర్తిగా డిస్పెన్సరీని గాలికి వదిలేస్తున్నారు. ఎవరైనా వచ్చి అడిగితే డాక్టర్ ఇప్పటి వరకూ ఉన్నారు.. మీరొచ్చే ముందే బయటకు వెళ్లారు అనే డైలాగును మాత్రం అక్కడి సిబ్బంది చెబుతున్నారు. 

కెజిహెచ్ ఓపీకి నిత్యం రావడానికి తెగ ఇబ్బందులు పడిపోతున్న ఆర్డీడి రెగ్యులర్ ఆర్డీడిలా మధురవాడలోని కార్యాలయానికి, మూడు జిల్లాల్లో డిస్పెన్సరీలకు మాత్రం రెగ్యులర్ గా వెళుతున్నారు. అదేమంటే ఇన్చార్జి ఆర్డీడిలు ఎక్కడైనా ఓపీ చూస్తారా.. అలా ఎక్కడైనా రూలుందా.. అయినా నాకు కమిషనరేట్ లో అందరూ తెలుసు.. మొన్నటి వరకూ అక్కడే చేసొచ్చాను. అందుకే నాకు ఇన్చార్జి ఆర్డీడి కూడా ఇచ్చారంటూ ప్రశ్నించినవారందరిపైనా ఒంటికాలపై లేస్తున్నారు. అంతేకాదు జోన్-1 పరిధిలోని ఆయుష్ మెడికల్ ఆఫీసర్లు అందరినీ టార్గెట్ చేస్తూ వేధిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కొందరు వైద్యులు దైర్యం చేసి కమిషనర్ కి ఫిర్యాదులు చేసినా.. అక్కడ ఫిర్యాదులన్నీ బుట్టదాఖలవుతున్నాయి. 

దానితో వైద్యాధికారులు ఫిర్యాదులేమీ కమిషనర్ వరకూ వెళ్లడం లేదుట. అలాగని విశాఖజిల్లాలోని జిల్లా కలెక్టర్ అయినా తెలుసా అంటే.. ఇన్చార్జి ఆర్డీడికి భయపడి ఎవరూ జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదులు చేయడం లేదు. వాస్తవానికి యునానీ, హోమియో సీనియర్ మెడికల్ ఆఫీసర్లకు రావాల్సిన ఆర్డీడి పదోన్నతి కాస్తా.. ఆయుర్వేద వైద్యాధికారికి దక్కింది. విశాఖలోని జోన్-1 మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా నాలుగు జోన్లలోనూ ఆయుర్వేద వైద్యులకు ఇన్చార్జి ఆర్డీడి పోస్టులు దక్కాయి.  విశేషం ఏంటంటే  రోస్టర్ విధానం, ఈమెకంటే సీనియర్లుగా ఉన్న హోమియో, యునాని సీనియర్ మెడికల్ ఆఫీసర్ల  మాత్రం పదోన్నతి గానీ, ఇన్చార్జి పోస్టు గానీ రాలేదు. ఇన్చార్జి ఆర్డీడి పోస్టు వచ్చిందే తడవుగా ఆయుష్ సదరు అధికారి చేసే హడావిడి ఎక్కువ వైద్యసేవలు, పరిపాలన తక్కువ అన్నట్టుగా మారిపోయింది. 

సీనియర్ మెడికల్ ఆఫీసర్లను కూడా దూషిస్తూ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని మెడికల్ ఆఫీసర్లు గగ్గోలు పెడుతున్నారు. అంతేకాకుండా ఇటీవల ఉద్యోగ సంఘం ఎన్నికల్లో తాను ప్రాతినిధ్యం వహించిన పోస్టుకి వైద్యాధికారులు సహకరించలేదనే నెపంతో కూడా పేరు పేరునా వైద్యాధికారులందరినీ బెదిరింపులకు గురిచేస్తూ.. కమిషనరేట్ కి సరెండర్ చేసేస్తానంటూ వేధిస్తున్నారి వైద్యాధికారులు వాపోతున్నారు. అంతేకాండా కమిషనరేట్ లోని ఉన్నతాధికారులకు అనుమానం రాకుండా చేయని పనులకు కూడా తనకు అనుకూలంగా.. కాసులిచ్చి మీడియా పబ్లిసిటీ చేయించుకుంటూ.. తాను చాలా కష్టపడిపోతున్నానని.. ప్యాకేజీ వార్తలు రాయించుకుంటూ చలామణీ అయిపోతున్నారని వైద్యాధికారులు చెబుతున్నారు.

 తాము ఎంత కష్టపడినా..డిస్పెన్సరీల్లో ఓపీలు చూస్తున్నా.. ఏదో ఒక కారణంతో దూషిస్తున్నారని వైద్యాధికారులు, క్రింది స్థాయి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు-ఈఎన్ఎస్ కి కూడా పలువురు వైద్యులు, సిబ్బంది కూడా ఫిర్యాదులు చేశారు. ఈ విషయమై సదరు ఆర్డీడిని సంప్రదించగా ఆమె అందుబాటులో లేరు. ఇన్చార్జి ఆర్డీడీ పోస్టు అడ్డంపెట్టుకొని.. రెగ్యులర్ గా చేయాల్సి కెజిహెచ్ లోని డ్యూటీ డాక్టర్ పోస్టు ఎందుకు చేయడంలేదని.. అవసరం లేని వ్యవహారాల్లోకి వెళుతూ, వైద్యాధికారులను వేధిస్తున్న ఆర్డీడిపై విశాఖ జిల్లా కలెక్టర్ దృష్టిసారించి విచారణ చేపడితే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం వుంది.

అదేవిధంగా రోస్టర్ విధానంలో పదోన్నతులు కల్పిస్తే.. అడ్డదారలో వచ్చిన ఆర్డీడి పోస్టు విషయంలో లంచాల వ్యవహారం కూడా బయటపడుతుందని వైద్యాధికారులు డిమాండ్ చేస్తున్నారు. చూడాలి ఆయుష్ కమిషనర్, జోన్ వన్ లోని ( ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం) జిల్లా కలెక్టర్లు జోన్-1 ఇన్చార్జి ఆర్డీడి విషయంలో ఏం చేస్తారనేది..?!

visakhapatnam

2025-01-06 18:49:22

వార్డు సచివాలయాలకు స్టేషనరీ నిధులు..! ఈరోజు-ఈఎన్ఎస్ కథనాలపై జివిఎంసీ కమిషనర్ స్పందన

మహా విశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ పి.సంపత్ కుమార్ తన వార్డు అడ్మిన్ ఆర్డిక కష్టాలను తీర్చే విషయంలో ఉదారతను చాటు కున్నారు.. ఇప్పటి వరకూ జోనల్ కమిషనర్లు పట్టించుకోకుండా వదిలేసిన స్టేషనరీ బిల్లులు చెల్లించడానికి ముందుకి వచ్చారు. వార్డు అడ్మి న్ల స్టేషనరీ ఆర్దిక కష్టాలపై ఈరోజు-ఈఎన్ఎస్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనితో వాస్తవ పరిస్థితి తెలుసుకున్న జివిఎంసీ కమిష నర్ వచ్చే తక్కువ జీతాలతో వార్డు కార్యదర్శిలు మోస్తున్న స్టేషనరీ భారాన్ని తగ్గించేందుకు నెలకు రూ.1000 స్టేషనరీకి ఇచ్చేందుకు చర్యలు చే పట్టారు. దానిపై జివిఎంసీ పరిధిలోని 574 వార్డు సచివాలయాలకు వర్తించేలా  ఒక సర్క్యులర్ ను జారీ చేశారు..! 

విశాఖతో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పోరేషన్ లలో వార్డు అడ్మిన్లు సచివాలయాల్లో వార్మడు అడ్మిన్ లు వారి సొంత ఖర్చులు పెట్టి స్టేషనరీ కొనుగోలు చేస్తున్నా.. కమిషనర్లు, జోనల్ కమిషనర్లు ఏమీ పట్టించుకోకుండా వదిలేశారు. పైగా ఆమాత్రం ప్రజల కోసం ఖర్చుచేయలేరా అన్నట్టుగా వ్యవహరించేవారు. ప్రభుత్వం ఆదేశించిన పనులను సెలవు రోజుల్లో కూడా ప్రత్యేక విధులు అప్పగించి పని పూర్తయ్యేవరకూ అదిరించి, బెదిరించి, కనీసం ప్రభుత్వం మంజూరు చేసిన సెలవులను కూడా ఇవ్వకుండా పనులు చేయించే కమిషనర్లు, జోనల్ కమిషనర్లు వీరి ఆర్ధిక ఇబ్బందులను పక్కన పెట్టేసేవారు. ఆఖరికి వార్డుల్లో కంప్యూటర్లు, ప్రింటర్లు పనిచేయకపోయినా.. సిబ్బందే వారి సొంత ఖర్చులు పెట్టుకొని బాగుచేయించుకుని వాడే పరిస్థితి. 

ఆ కారణంగా ప్రభుత్వం సేవలు అందించడంలో చాలా ఆలస్యం అయ్యేది. ఆ విషయాలను అధికారులకు తెలియజేస్తే.. చూద్దాం.. చేద్దాం అంటూ కాలం నెట్టుకుంటూ వచ్చారు తప్పితే.. సిబ్బంది ఇబ్బందులను జోనల్ కమిషనర్లు, కమిషనర్లు, కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు ప్రభుత్వం దృష్టికి మాత్రం తీసుకెళ్లలేదు. కానీ విశాఖపట్నంలోని జివిఎంసి కమిషనర్ డా.సంపత్ కుమార్ మాత్రం ఒక్క అడుగు ముందుకి వేసి ప్రభుత్వ సేవలకు వార్డు అడ్మిన్ సొంత ఖర్చులు చేయించడం బావ్యం కాదని.. వారికి కనీస ఖర్చులు ఇవ్వాలని వారికి నెలకి రూ.1000 అందించడానికి చర్యలు చేపట్టారు.  ఆది నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కష్టాలు, ఇబ్బందులను ప్రత్యేక కథనాల రూపంలో అందిస్తున్న ఈరోజు-ఈఎన్ఎస్.. వీరి పరిస్థితిని ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో కమిషనర్ సర్క్యులర్ జారీ చేశారు.

 విశాఖజివిఎంసీ కమిషనర్ జారీ చేసిన ఆ సర్క్యులర్ ఇపుడు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఉద్యోగుల సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతున్నది.  తమ కష్టాలు అధికారుల దృష్టికి ప్రత్యేక కథనాలుగా తీసుకెళుతున్నందుకు గ్రామ, వార్డుసచివాలయ ఉద్యోగులు ఈరోజు-ఈఎన్ఎస్ కార్యాలయానికి ఫోన్లు చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. వాస్తవానికి మహా విశాఖ నగరపాలక సంస్థకు డాక్టర్ పి.సంపత్ కుమార్ కమిషనర్ గా వచ్చిన దగ్గర నుంచి భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. క్లీన్ విశాఖ-గ్రీన్ విశాఖ కార్యక్రమం దగ్గర నుంచి ఉద్యోగుల సంక్షేమం కూడా చూడటంలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో జివిఎంసీ పరిధిలోని 574 వార్డు సచివాలయ కార్యదర్శిలకు కాస్త ఉపసమనం కలగనుంది. అయితే ఇప్పటి వరకూ చేసిన ఖర్చులతోపాటు, పాడైన కంప్యూటర్లు, ప్రింటర్లు కూడా రిపేర్లు చేయించి, పౌర సేవలకు అవాంతరాలు లేకుండా చూడాలని వార్డు అడ్మిన్లు కోరుతున్నారు. చూడాలి ఈ విషయమై జివిఎంసీ కమిషనర్ ఏ తరహా చర్యలు తీసుకుంటారోననేది..?!

visakhapatnam

2024-12-20 16:00:51

విశాఖ ఏపీటీడీసీలో దొంగలు పడ్డారు..?!

విశాఖలోని ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పోరేషన్ లో దొంగలు పడి మొత్తం ప్రభుత్వ రికార్డులతో సహా.. పాత ఏసీలు, ఫర్నిచర్, భవనాలు తొల గించగా వచ్చిన సామాగ్రి మొత్తం దోచుకుపోయారు.. పోయింది ప్రభుత్వ ఆస్తి కదాని అధికారులు కూడా లైట్ తీసుకున్నారు.. విశేషం ఏంటం టే.. పోయిన సామాగ్రితోపాటు వాటి వివరాలు రాసిన రికార్డులను కూడా దొంగలించుకుపోయారట బహుసా పోయింది ఎంతో తెలయ కూడద నో ఏంటో... ఆ విషయమై విశాఖజిల్లాలోని ఏపీటీడీసీ అధికారులు గానీ, రాష్ట్రంలోని ఏపీటీడీసీ ఎండీ కానీ, జిల్లా కలెక్టర్ కానీ అస్సలు నోరు మెదపడం లేదు. కాకపోతే ప్రస్తుతం హరిత రిసార్ట్స్ ను అభివృద్జి చేస్తున్న విషయంలో అధనంగా పెరిగినట్టు చూపించాల నుకున్న ఖర్చుని మాత్రం ఏ విధంగా కాంట్రాక్టర్ కి ఇప్పించాలనే కోణంలో మాత్రం చాలా తీవ్రంగా ఆలోచన చేస్తున్నారు అధికారులు. ఒక ప్రక్కనెలకి లక్షల్లో ప్రభుత్వానికి ఆదాయం పోతున్నా.. రుషికొండ,అప్పుఘర్ ప్రాంతంలో పాత భవనాలు తొలగించేసమయంలో వేరుచేసిన సామాగ్రి పోయినా.. ఏ ఒక్క అధికారీ కనీసం ఈ విషయాన్ని బయటకు చెప్పడం లేదు.. !

ఏపీ పర్యాటక కార్పోరేషన్ భవనాలను రెన్నోవేషన్(మార్పులు, చేర్పులు) చేస్తున్న సమయంలో ఇక్కడ హోటళ్లలో  మంచాలు, బీరువాలు, కుర్చీలు, బెంచీలు, ఏసీలు, పరుపులు, భవనాలు తొలగించగా వచ్చిన తలుపులు, ఇతర శానిటరీ సామాన్లు మొత్తం దొంగలు పడి దోచుకు పోయారట. పాపం.. పోయింది ప్రభుత్వ సొమ్మే కదాని అధికారులు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇదంతా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని.. తాను చార్జ్ తీసుకున్న సమయంలో జరగలేదని ప్రస్తుత ఆర్డీ కూడా నాకేం సంబంధం లేదన్నట్టుగా వ్యవహరి స్తున్నారట. ఏపీటీడీసీలో దొంగలు పడి దోచుకుపోయిన పాత ఏసీలు, ఇతర సామాగ్రి విలువ సుమారు రూ.4.50 కోట్ల వరకూ వుంటుందని అంచనా. 

గత ప్రభుత్వం విశాఖలోని అప్పుఘర్, రుషికొండ ప్రాంతాల్లోని హోటళ్లను తొలగించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినపుడే ఇక్కడి సామాన్లన్నీ గుర్తు తెలియని వ్యక్తులు మాయం చేసేశారట. అలా చెబితే తమపైకి వస్తుందని.. భారీ వస్తు సామాగ్రితోపాటు, ఆ వివరాలు రాసిన రికార్డులు కూడా దొంగలెత్తుకెల్లిపోయారని.. పోయిన వాటిపై పోలీసులకు ఫిర్యాదు ఇస్తే మాత్రం వెనక్కి వస్తాయాని రాష్ట్ర కార్యాలయ అధికారులు, జిల్లా కార్య లయ అధికారులు లైట్ తీసుకొని ఎవరికీ చెప్పడం మానేశారట. కాకపోతే ప్రభుత్వ సొమ్ము పైసా అయినా లెక్కలు ప్రభుత్వానికి చెప్పాలి కనీ సం ఆ విషయంలో కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. 

ఎంతసేపూ.. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భనాలు పూర్తికాలేదని మాత్రమే తెరమీదకు తీసుకు వస్తున్న ఏపీటీడీసీ రాష్ట్ర కార్యాలయ అధికా రులు.. అసలు మరమ్మతులకు ముందు ఏ హోటల్ లో ఏ సామాగ్రి ఉంది.. వాటిని తొలగించి ఏంచేశారు.. గంపగుత్తగా టెండర్లు వేసి ఆ సొమ్ముని ప్రభుత్వానికి అప్పగించారా..? లేదంటే ఇక్కడ పనిచేసే అధికారులే వాటిని సొంత అవసారాలకు వాడుకున్నారా..? అదీ కాదంటే అవేమీ పనిచేయవని.. వట్టి స్క్రాప్ మాత్రమేనని పనిచేసిన వారికి ఉచితంగా ఇచ్చేశారా అనే విషయాలు కూడా బయటకు రానీయ కుండా అధికారులు జాగ్రత్తపడ్డారు. ప్రభుత్వ ఆస్తి అయితే దొంగలెత్తుకుపోయినా.. ఆ పేరుతో అధికారులే తీసేసుకున్నా.. లేదంటే వారికి వెన్ను ద న్నుగా ఉండే అధికారుల ఇళ్లకు బాగు చేయించి పంపినా లెక్కలోనికి రావనేది తేలిపోయింది. కోట్లాది రూపాయలతో ప్రస్తుతం ఏపీటూరిజం కార్పోరేషన్ వారి భవనాలను, హోటళ్లను మార్పులు చేర్పులు చేస్తున్నది. 

దీనితో దొరికిందే తడవుగా ఇక్కడ సామాగ్రి మొత్తం ఎవరు మడత పెట్టాశారో గట్టిగానే పెట్టేశారు. ఇంత జరిగినా ఏపీటూరిజం కార్పోరేషన్ ఎండీ, డైనమిక్ ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి సైతం ఈ విషయంపై విచారణ చేయకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. ఇక్కడ మాయమై పోయిన వస్తువులు ఏమయ్యాయో కనీసం జిల్లా కలెక్టర్ కి కూడా తెలియలేదంటే ఇక్కడ పనిచేసిన అధికారులు వాటిని ఏంచేశారనేది తేలాల్సి ఉంది. నిజంగా అవి ఉంటే ఎక్కడున్నాయి..? అన్నీ ఉన్నాయా..? కొన్ని మాయమయ్యాయా అనేది ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేసి విచారణ చేయాల్సి వుంది. లేదా..పోయిన కోట్లాది రూపాయల ఆస్తులపై పోలీసులకైనా ఫిర్యాదు చేయాలి.. ఈ రెండూ నేటివరకూ చేయ లేదంటే తప్పు ఎక్కడ జరిగిందనే విషయంపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.. చూడాలి ఎండీ ఆమ్రపాలీ ఏం చేస్తారనేది..?!

visakhapatnam

2024-12-11 18:35:59

మెప్మాలో బోగస్‌ రుణాలు మడతెట్టారు..?!

మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఏర్పాటుచేసిన మెప్మా ఇప్పుడు అవినీతిపరులకు ఆదాయ వనరుగా మారింది. కంచె చేను మేసిందన్న చందంగా  విధులు నిర్వహహించాల్సిన సిబ్బంది  అక్రమాలకు తెరతీశారు. ధర్మవరం  పట్టణ పేదిరక నిర్మూలన సంస్థ (మెప్మా)లో రుణాల పేరుతో జరిగిన గోల్‌మాల్‌ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది.   లేని పొదుపు సంఘాలను ఉన్నట్లుగా చిత్రీకరించి మాయచేసేస్తున్నారు. ఆన్‌లైన్‌లో గ్రూపులు కనిపించకుండా మొత్తంగా బోగస్‌ రుణాలతో భారీగా దోచేశారు. నకిలీ గ్రూపులతో బ్యాంకును  బురిడీ కొట్టించి రూ. అర కోటి  మేర రుణాలు దోచుకున్న వారి గుండెల్లో గుబులు మొదలైంది. అదే సమయంలో రుణాలు బొక్కేసిన సిబ్బంది తప్పులు కప్పిపుచ్చు కునేందుకు దారులు వెతుకుతున్నారు. ఎలాగైనా ఈ గండం నుంచి గట్టెక్కించాలని, బ్యాంకులకు తామే సొమ్ము చెల్లిస్తామని బ్యాంకు మేనేజర్ ,  పొదుపు మహిళల చుట్టూ తిరుగుతున్నారు. 

-మెప్మా లక్ష్యం 
పట్టణంలోని పేద మధ్యతరగతి మహిళల స్వయం ఉపాధి  ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు మెప్మా ఆధ్వర్యంలో రుణాలు ఇస్తుంటారు ఇందులో బ్యాంక్ లింకేజీ లోన్లు అన్ని సంఘాలకు ఇస్తారు వాయిదాల చెల్లింపులు మెరుగైన రికార్డు ఉన్న కొన్ని సంఘాలను గుర్తించి వారికి శ్రీనిధి రుణాలు అందిస్తుంటారు ఏ రుణం తీసుకోవాలన్న సంఘ సభ్యులు సామూహిక తీర్మానం తప్పనిసరి సభ్యుల ప్రతిపాదన ఆర్పీలు, సిఆర్పిలు నివేదిస్తారు.  రుణం కావలసిన సంఘం సభ్యులతో సిఆర్పిలు సమావేశమై అందరి అభిప్రాయాలు తీసుకుంటారు అనంతరం బ్యాంకులకు అందజేస్తారు మొత్తంగా రుణాల మంజూరులో మెప్మా సిఆర్పి, ఆర్పి, బ్యాంక్ అధికారుల పాత్ర కీలకము ఉంటుంది.అయితే ఈ బాగోతం మెప్మా జిల్లా అధికారులకు తెలిసినప్పటికీ చర్యలకు వెనుకడుగు వేయడం అనుమానాలకు తావిస్తోంది. అవినీతి వ్యవహారంలో వారికీ వాటా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

-బయటపడిందిలా..
బోగస్‌ రుణాలు తీసుకున్న కొన్ని గ్రూపులు సభ్యులను రుణాలు తీసుకున్నట్లు సమాచారం అందడంతో ఒక్కసారిగా హులిక్కి పడ్డారు  . సభ్యులు తీసుకున్న రుణం కంటే మూడింతలు రుణం తీసుకున్నట్లు సదరు బ్యాంకు నుండి ఎస్. ఏం. ఎస్ రావడంతో  ఒకింత ఆందోళనకు గురైన కొందరు సభ్యులు బ్యాంకు మేనజర్ కలిశారు .  మేము తీసుకున్నది సొమ్ము ఒకటే అయితే మాకు ఎస్. ఏం. ఎస్ పెద్ద మొత్తంలో రుణం తీసుకున్నట్లు వచ్చిందని తెలిపారు . దీంతో అప్రమత్తమైన బ్యాంకు మేనజర్ మెప్మా సిబ్బందితో విచారణ చేస్తే అసలు విషయం వెలుగులోకి ఈ వ్యవహారంలో మెప్మా అధికారులు మౌనందాల్చగా, కొందరు బ్యాంకు సిబ్బంది సుమారు 5 సంఘాల లీడర్లను  పిలిపించి  సొమ్ము రికవరీ చేసే పనిలో పడ్డారు . ఒక సంఘం సభ్యులు తీసుకున మొత్తం సొమ్ము చెల్లించినట్టు సమాచారం. ఇంకా 4 సంఘాలు సుమారు రూ. 60 లక్షలు చెల్లించాల్సి ఉంది . 

-వాస్తవాలు వెలికితీస్తే మరిన్ని బోగస్‌ రుణాలు..!
మెప్మాలోని కొందరు సిబ్బంది  ఈ రుణ మోసంలో సూత్రధారులుగా వ్యవహరించినట్లు సమాచారం. కాగా ఈ వ్యవహారం అమాయక పొదుపు మహిళలు ఇబ్బందిపడే అవకాశం ఉంది. అయితే పొదుపు మహిళల పేరుతో నకిలీ గ్రూపులు సృష్టించి లక్షల రూపాయల నిధులు కాజేసిన వైనంపై జిల్లాస్థాయి ఉన్నతాధికారులు దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపై విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగు లోకి వచ్చే అవకాశం లేకపోలేదు. అంతే కాకుండా భవిష్యత్‌లో ఇలాంటి బోగస్‌ రుణాలకు కళ్లెం వేసినట్లు అవుతుందని, అలాగే వారిపై చర్య లు తీసుకుని నగదు రికవరీ చేయాలని పలువురు పొదుపు మహిళలు కోరుతున్నారు.

-గోప్యంగా మెప్మా పిడి విచారణ..?
ధర్మవరం  పట్టణ పేదిరక నిర్మూలన సంస్థ (మెప్మా)లో రుణాల పేరుతో జరిగిన గోల్‌మాల్‌ వ్యవహారంపై మెప్మా పిడి విజయలక్ష్మి విచారణలో భాగంగా బుధవారం  మున్సిపల్ కార్యాలయంలో సిబ్బందితో గోప్యంగా సమావేశం నిర్వహించారు . పలువురు  పాత్రికేయులు అక్కడికి చేరుకు న్న విషయం తెలిసిన పిడి హుటాహుటిన సమావేశం అర్ధాంతరంగా ముగించి అక్కడ నుండి వెళ్ళి పోయారు.  ఇంత జరుగుతున్నా మెప్మా అధికారులు మాత్రం నోరు మెదకపోవడం పలు  అనుమానాలకు  తావిస్తోంది. ఈరోజు-ఈఎన్ఎస్ ఈ విషయమై విచారణ కోరేందుకు ప్రయ త్నించినా మెప్మా అధికారులు స్పదించకపోవడం విశేషం.

ananthapuram

2024-12-04 18:34:13

కూటమి పాలనలో గత ప్రభుత్వ శేషం..?!

ఆంధ్రప్రదేశ్ లో పరిపాన చేస్తున్నది కూటమి ప్రభుత్వం కాదా..? అలా అయితే సీఎం చంద్రబాబు మార్కు ఎక్కడ..? సుపరిపాలన ఏది..? ప్రజలకు సేవకు సేవచేయడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు ఎంత వరకూ అమలవుతున్నాయి.. నాలుగు నెలలకే ఉద్యోగ వర్గాల్లో ప్రభుత్వంపై వ్యతిరేక ఎందుకు వచ్చింది.. కాదు కాదు వచ్చేలా ఎవరు చేస్తున్నారు.. ఆ రకమైన పాత పరిపాలననే మళ్లీ ఎందుకు చేపడుతున్నారు..? అసలు కూటమి పరిపాలనలో చంద్రబాబు మార్కు కనిపించకపోవడానికి పరిపాలనలో కోవర్టులుగా వ్యవహరిస్తున్నది ఎవరు..? మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఆదేశాలు ఎందుకు అమలు కావడంలేదు..? 

విశాఖ ఏపీటీసీడిసీలో కోట్ల రూపాయల అవినీతి ఆధారాలతో సహా బయట పడితే దీని వెనుక ఉన్న గత ప్రభుత్వంలోని   ఆ బుజ్జి కన్న ఐఏఎస్ ని ఎందుకు గుర్తించలేదు.. ఇంకా ఆయన ఆధ్వర్యంలో నడిచే గ్రూప్-1 అధికారులు ఎందుకు తమ ఇష్టాను సారం వహిస్తున్నారు..? ఇది ఒక్క ఏపీటీడీసీలోనే కాదు.. మిగిలిన 74 ప్రభుత్వశాఖల్లోనే పరిస్థితి అలానే ఉంది..ఇదేదో మేము చెబుతున్న మాట కాదు కూటమి ప్రభుత్వానికి కావాలనే ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత రావడానికి కొందరు ఐఏఎస్ లు, గ్రూప్-1 అధికారలు, ఏపీటీడీసీ లోని కొందరు అధికారులు తెరవెన చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలే కారణమంటూ ప్రభుత్వ ఉద్యోగుల సామాజిక మాద్యమాల్లో పెద్ద ఎత్తున చర్చజరుగుతోంది..!

అవును మీరు చదువుతున్నది నిజమే కూటమి ప్రభుత్వంపై అతి కొద్ది నెలల్లోనే ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రావడానికి ఇంకా పరిపాలనలో గత ప్రభుత్వ శేషం మిగిలిపోవడమే అంటున్నాయి ఉద్యోగ వర్గాలు. అంతేకాదు బల్లగుద్ది మరీ వాదిస్తున్నాయి. వారి వాదనకు బలం చేకూర్చేలా కనిపిస్తున్నాయి ప్రభుత్వం పరిపాలన అంశాలు కూడా. అసలు సీఎం చంద్రబాబు పరిపాలన అంటే ఒక విజన్, ఒక టెక్నాలజీ, ఒక సంపద, ఒక ముందు చూపు ఇవన్నీ ఉంటాయని ప్రభుత్వ అధికాకులు సిబ్బంది అనుకోవడం మానేస్తున్నట్టుగానే ఉంది. దానికి ఉదాహరణలుగా చాలా అంశాలనే ఉద్యోగులు అధికారులు నిర్భయంగా సామాజిక మాద్యమాల్లో చర్చకు తీసుకు వస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగులకు పదోన్నతులు, కొత్తగా నియమాకాలు, కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరజైషన్, ప్రభుత్వశాఖల్లో దినసరి కార్యక్రమాలు ఇబ్బంది లేకుండా అదనపు సిబ్బంది నియామకం.

 ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే ఆదాయం పెంచుకునే మార్గాలు చూపించడం ఇవన్నీ సీఎం చంద్రబాబు పరిపాలనలో ఐఏఎస్ అధికారుల నుంచి గ్రూప్-1 అధికారులు ఆ క్రింది మినిస్టీరియల్ స్టాఫ్ వరకూ చూశారు. అయితే గత ప్రభుత్వంలో చాలా మంది ఐఏఎస్, గ్రూప్-1 అధికారులు, కార్పోరేషన్ లో పనిచేసే ఎండీలు, సిఈఓలు, డైరెక్టర్లు,  కాంట్రాక్టర్లు, బినామీల అవతారం ఎత్తారు. ప్రైవేటు సంస్థల తెరవెనుక ఉండా చాలా గట్టిగానే సంపాదించారట. అదే విధానాలు ఇపుడు కూటమి ప్రభుత్వంలోనూ కొనసాగుతున్నాయని.. అసలెక్కడా చంద్రబాబు మార్కు పరిపాలన కనిపించడం లేదని ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు గగ్గోలు పెడుతున్నట్టు చెబుతున్న ఉద్యోగులు.. మరికొందరు ప్రజాప్రతినిధులు..

మంచి విజన్ ఉన్న ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు.. ఆయన ముందుచూపు పరిపాలనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లాంటి వారు తోడైతే దేశంలోనే ఆంధ్రప్రదశ్ నెంబర్-1 గా అవుతుందని అంతా భావించారు. వీళ్లు నిజంగా కన్నెర్ర చేస్తే మొత్తం పరిపాలనే గాడిన పడిపోతుందని అనుకున్నారు కూడా. అయితే ఇటీవల డిప్యూటీ సీఎం పోలీసు శాఖ అధికారులపై అసహనం వ్యక్తం చేయడం, రాష్ట్రంలో అత్యాచారాలు భారీగా పెరిగిపోవడం, నింధితులకు సరైన శిక్షలు పడకపోవడం కూడా చంద్రబాబు పరిపాలనపై ప్రభావం చూపిస్తున్నట్టుగా కనిపిస్తున్నది. అంతేకాకుండా ఐదేళ్ల తరువాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రభుత్వ ఉద్యోగులు, అందునా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఎంతగానో ఆనందించారు. అయితే గత ప్రభుత్వంలో మాదిరాగానే ఒక శాఖ పని కాకుండా అన్ని శాఖల పనులు సచివాలయ ఉద్యోగులతో చేయించడం,

 రెండవ శనివారం, ఆదివారాల్లోనూ ఉద్యోగులను విధులకు రమ్మని చెప్పడం, పనిచేస్తున్నా మెమోలు, షోకాజ్ నోటీసులు ఇవ్వడం, సస్పెండ్ చేస్తామని ఉద్యోగులని బెదిరించడం వంటి అంశాలు కూడా ఉద్యోగులకు కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచుతున్నాయట. అంతేకాదు ఇటీవలన జరిగిన బదిలీల్లో కూడా కూటమి ప్రభుత్వంలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫార్సు చేసిన ప్రభుత్వ ఉద్యోగులకి కాకుండా గత ప్రభుత్వంలో అనుకూలంగా ఉన్నవారికి ఆయాశాఖల్లో అధికారులు బదిలీలు అనుకున్న చోటుకి చేశారనే ప్రచారం భారీగా జరిగింది. కడుపు చింపుకుంటే కాళ్లపై పడుతుందని ఈ విషయాన్న కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు బయటకు చెప్పకపోయినా..వారి నుంచి సిఫారసు లేఖలు తీసుకొని అవి ప్రభుత్వశాఖల్లో చిత్తుకాగితాల్లా పక్కకి వెళ్లిపోవడంతో ఉద్యోగుల వారి సామాజిక మాద్యమాల్లో ఇదే అంశాలన్ని ప్రస్తావించుకోవడం కూడా చర్చనీయాంశం అవుతుంది. 

అంతేకాకుండా ఐఏఎస్ లకి ప్రభుత్వశాఖల కేటాయింపులు, గ్రూప్-1 అధికారులను ఏళ్లకు ఏళ్లు ఒకే చోట ఉంచేయడం, అవినీతి, తేడా వ్యవహారాలు బయటపడిన ఏపీటీడీసీ లాంటి కార్పోరేషన్లో గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన వారికే పెద్ద హోదాలు కట్టబెట్టడం కూడా ఇపుడు హాట్ టాపిక్ అవుతున్నది. దీనితో కావాలనే కొందరు ఐఏఎస్ అధికారులు, గ్రూప్-1 అధికారులు కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా పరిపాలన చేస్తున్నారని.. పనికొచ్చే సర్వేలు, ఉద్యోగులను వేళా పాలా లేకుండా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 వరకూ ఫీల్డులోనే ఉంచే కూడా సచివాలయ ఉద్యోగుల నుంచి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నది. ఈ సర్వేల కంటే ఒక్కో సచివాలయంలో పది మంది సిబ్బంది ఉన్నందుకు వారందరికీ కంప్యూటర్లు కేటాయించి, అన్ని రకాల సర్వీసులు సచివాలయాల నుంచి జరిగేలా ఆదేశిస్తే ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందని చెబుతున్నారు. 

అన్ని సర్వీసులు ఒకే చోట లభించడంతో ప్రజలే ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి సేవలు పొందుతారని.. అలాకాకుండా సర్వేలు, జియో ట్యాగింగ్లు పేరిట ఇళ్లకు వెళుతుంటే అక్కడ సిబ్బందికి ఎదురయ్యే ఇబ్బందులు, చీత్కారాలతో ప్రభుత్వాన్ని, పరిపాలించే వారిని ఉద్యోగులు తిట్టుకోవాల్సి వస్తుందని ప్రభుత్వ అధికారులవద్దే సిబ్బంది చెబుతున్నారు.  విశాఖలో గత ప్రభుత్వానికి కొమ్ముకాస్తూ.. రుషి కొండ ప్యాలస్ నిర్మించిన ఏపీటీడీసీ అధారులు ఇపుడు అదే స్థాయిలో హరిత మరమ్మత్తుల్లో పెద్ద ఎత్తున అవినీతి చేపడుతున్నా.. దీనిపై సాక్షాత్తూ టూరిజంశాఖ మంత్రి, కార్పోరేషన్ చైర్మన్ లు ఆగ్రహం వ్యక్తం చేసినా రాష్ట్రప్రభుత్వం ఇంకా ఈశాఖలో లాంగ్ స్టాండింగ్ కార్పోరేషన్ అధికారులపై చర్యలు తీసుకోకవడంపై మంత్రి కూడా గుర్రుగానే ఉన్నారట. ఇలా ఏ ప్రభుత్వశాఖలో చూసినా సీఎం చంద్రబాబు పారిపాలన కంటే గత ప్రభుత్వ శేషమే అధికంగా కేనిపిస్తుందంటూ.. అధికారులు, సిబ్బంది చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ప్రజా పరిపాలన.. గత ప్రభుత్వ శేషాన్ని తొలగించి అందిస్తుందా..? లేదా అనేది వేచి చూడాలి..?!

visakhapatnam

2024-11-23 20:24:39

కలెక్టర్ సారూ హరిత యాత్రీ నివాస్ ను పరిశీలించరూ..?

ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలెప్ మెంట్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో అంచనాలకు మించి నాణ్యతాలోపంగా జరుగుతున్న హరిత యాత్రీ నివాస్ పనులపై జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ పరిశీలన చేస్తే చాలా విషయాలు వెగులు చూసే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఇక్క డ రూ.8 కోట్లతో మరమ్మతులు, గదుల్లో ఫర్నిచర్, ఇంటీరియర్ డెకరేషన్లు మార్పులు, చేర్పులు చేస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వం కేటా యించిన రూ.8 కోట్లతో ప్రస్తుత యాత్రీ నివాస్ ఉన్న చోట ఆ బవంతిని మొత్తం కూల్చివేసి కొత్తదే నిర్మించవచ్చు. కానీ ప్రభుత్వంలో నిబం ధనలను సొమ్ము చేసుకోవడానికి ఏపీటీడీసి రాష్ట్ర అధికారులు, కాంట్రాక్టర్ కుమ్మక్కై చేస్తున్న పనులపై కనీసం జిల్లా కలెక్టర్ పరిశీలన లేకపోవ డం, అక్కడ జరుగుతున్న పనుల నాణ్యత తెలుసుకోకపోవడం, కాంట్రాక్టర్ ఎందుకు అదనంగా మరో రూ.5 కోట్లు పెంచాలని ఏపీటీడీసీకి లేఖ రాయడం.. దానిని ప్రస్తుతం ఇన్చార్జి ఆర్డీగా వ్యవహరిస్తున్న ఇరిగేషన్ ఇఇ కూడా ఆమోదించి పంపడంపైనా అనుమానాలు వ్యక్తం అవుతు న్నాయి. గ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులు ఇంకా నత్తనడకన సాగుతూనే ఉన్నాయి.

 ఫలితంగా ప్రభుత్వానికి ఇప్పటి వరకూ సుమారు రూ.10కోట్లు నష్టం ఏర్పడింది. ప్రస్తుతం పర్యాటకులు అధికంగా వచ్చే సీజన్ కావడంతో ఈ సీజన్ నాటికి కూడా యాత్రీ నివాస్ పూర్తికాకపోవడంపై పంపకాల్లో తేడాలొచ్చాయని సమాచారం అందుతుంది. టెండరు ప్రకారం రూ.8 కోట్లు కాంట్రాక్టర్ పనులు దక్కించుకున్నా.. జిల్లా కార్యాలయం నుంచి రష్ట్ర కార్యాలయం వరకూ కమిషన్లు ఇచ్చిన కారణంగానే ప్రభుత్వ టెండరు కంటే అధికంగా మళ్లీ ప్రభుత్వానికి నివేధించినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం విశాఖలోని అప్పుఘర్ హరిత యాత్రీ నివాస్ లో జరుగుతున్న మరమ్మతు పనులపై విజిలెన్స్ విచారణ చేసినా.. థర్డ్ పార్టీ విచారణ చేపట్టినా ఇక్కడ లోప భూఇష్టంగా జరుగుతున్న పనులు వెలుగు చూసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం  ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న ఆర్డీ ఈ విషయమై ఇప్పటి వరకూ రాష్ట్ర కార్యాలయానికి గానీ, జిల్లా కలెక్టర్ కి గానీ జరుగుతున్న పనులపై నివేదికలు ఇచ్చినట్టు కనిపించలేదని తెలుస్తున్నది. ఇటీవల రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి, కార్పోరేషన్ చైర్మన్లు సైతం ఇక్కడ రూ.8 కోట్లతో జరుగుతున్న పనులను చూసి నివ్వెర పోయారు. 

అంతేకాదు.. అదనంగా  మరో రూ.5 కోట్లు కి ఖర్చుపెంచాలని చేసిన ప్రతిపాదనలపైనా కన్నెర్ర చేశారు. ఇంత జరిగినా... ఏపీటీడీసీ రాష్ట్ర అధికారులకి చీమ కుట్టినట్టు కూడా లేదు. పైగా అడ్డగోలుగా ఈ విషయం బయటకు రాకుండా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్డీ శ్రీనివాస్ పాణిని తిరిగి మాతృశాఖకు పంపేయడంతోపాటు, శ్రీకాకుళం జిల్లా నుంచి మరోఅధికారి జిల్లా మేనేజర్ గా రాత్రికి రాత్రే నియమించేశారు. వాస్తవానికి ఇక్కడున్న టూరిజం అధికారులకు ఆర్డీ, లేదా జిల్లా మేనేజర్ ఇన్చార్జి అప్పగిస్తే అసలు ఒకే వ్యక్తికి రూ.40 కోట్లు టెండర్లు ఎలా ఇచ్చారు. ఏం పనులు చేశారు.. నాణ్యత ఎంత..? ప్రభుత్వానికి ఎంత మేర నష్టం వచ్చింది.. తదితర అంశాలన్నీ లిఖిత పూర్వకంగా ప్రభుత్వానికి అందే అవకాశముంది. 

అవన్నీ బయటకు రాకుండా చేయడానికే టూరిజం శాఖ అధికారులకి, ప్రస్తుతం ఉన్న సిబ్బందికి కాకుండా బయట శాఖల అధికారులను ఇన్చార్జిలుగా నియమించి ఇక్కడ జరుగుతున్న అంశాలన్నీ గంపకింద కప్పెట్టాయని ఏపీటీడీసీ అధికారులు చూస్తున్నారు. ఇవన్నీ ఆధారాలతో సహా ప్రభుత్వానికి తెలియాలంటే ఏపీటీడీసీలో జరుతుగున్న పనులపై జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలన చేసినా... థర్డ్ పార్టీ నిర్మాణ సంస్థలతో లెక్కలు కట్టించినా ఇక్కడి అధికారులు తేడా పనుల వ్యవహారాలన్ని వెలుగు చూసే అవకాశం ఉంది..? మరి జిల్లా కలెక్టర్ వాటిని నిగ్గు తేలుస్తారా.. డిల్లీ సరుకు అసలు రేటు బయట పెడతారా..?!

visakhapatnam

2024-11-20 15:09:37

ఏపీటీడీసీలో ఆర్డీ పోస్టు కోసం కలెక్టర్ ని అవమానించారు..!

ఏపీటీడీసీ అధికారులు విశాఖజిల్లా కలెక్టర్ ని ఘోరంగా అవమానించారు.. అవును మీరు చదువుతున్నది నిజమే.. సొంతశాఖ అధికారులను కాదని పొరుశాఖ ఇరిగేషన్ లోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కి ఆర్డీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.. ఒక జిల్లా మెజిస్ట్రేట్, కలెక్టర్ ఐఏఎస్ అధికారిని కాదని.. ఇన్చార్జి బాధ్యతలు అప్పగించినట్టే అప్పగించి.. కార్పోరేషన్ లో తేడా వ్యవహారాలు ఎక్కడ బయటపడిపోతాయోనని ఆర్ఢర్ నే మార్చేశారు.. అదనపు బిల్లులు ప్రభుత్వానికి లెక్కలు చూపించి బురిడీలను చేయడానికి పక్కా మాష్టర్ ప్లాన్ వేసుకున్నారు..ఇదేకాదు అడ్డగోలుగా వచ్చిన ఒడిసా కాంట్రాక్ట గడువు ముగిసినా.. మళ్లీ వాళ్లకే మెయింటినెన్స్ కాంట్రాక్టు ఇచ్చేలా పథకం కూడా వేశారు.. విశాఖలో ఏపీటీడీసీ ఆర్డీ పోస్టు కోసం ఉన్నఅధికారులను కాదని ఎందుకు క్కశాఖ అధికారులను ఇన్చార్జిలుగా తేవాల్సి వచ్చిందని ప్రశ్నిస్తే పరిపాలనా సౌలభ్యం కోసం తమకి నచ్చిన వాళ్లే నియమిస్తామని.. ఆ విషయంలో జిల్లా కలెక్టర్ అయినా ప్రక్కన పెట్టేస్తామని బీరాలు పోతున్నారు ఏపీటీడీసీ రాష్ట్ర అధికారులు. ప్రభుత్వానికి రూ.కోట్లు నష్టం తెచ్చి ప్రైవేటుకి మెయింటినెన్స్ కాంట్రాక్టు అంత రెండింతలు కట్టబెట్టడానికి ఇదే శాఖలో మాజీ ఎండీ అనుచరగణమే అంతా ఓపక్కా ప్లాన్ ప్రకారం చేస్తున్నట్టు కనిస్తున్నది. కూటమి ప్రభుత్వంలో పర్యాటకశాఖ మంత్రి, కార్పోరేషన్ చైర్మన్లే ఈ విషయంలో చేతులెత్తేశారంటే ఏ స్థాయి లాభియింగ్ జరుగుతోంది అర్ధం చేసుకోవచ్చుననే ఆరోపణలున్నాయి.. ఏపీటీడీసీలో అడ్డగోలు వ్యవహారాలపై ఈరోజు-ఈఎన్ఎస్ క్షేత్రస్థాయి పరిశోధన అంశాలు హరికథలు పార్ట్-4గా అందిస్తున్నాం..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లక్షలు కాదు.. రూ.కోట్లలో నష్టం వచ్చినా పర్లేదు.. అది మన సొమ్ముకాదు.. దానికి పరిపాలనరమైన కారణాలు చూపించవచ్చు..  కానీ మనకి మాత్రం విశాఖజిల్లాలో జరిగే అధికారిక వ్యవహారాల్లో అనుకున్నంత టార్గెట్ మొత్తం పూర్తికావాలి. దానికోసం మనవాళ్లే అక్కడుండాలి.. అలా కాకపోతే అక్కడ ఏం జరిగినా అధికారికంగా అవాంతరాలు, అదనపు ఖర్చులు, మెయింటినెన్సు కాంట్రాక్టు విషయంలో ఎదురువుతాయని ముందుగా ఊహించిన ఏపీటీడీసీ రాష్ట్ర అధికారులు పర్యాటకశాఖకు సంబంధం లేని ఇరిగేషన్ ఈఈని ఇన్చార్జి ఆర్డీగా నియమించారు. వాస్తవానికి ఇదేశాఖలో ఆర్డీ క్యాడర్ స్తాయి అధికారులు ఉన్నా వారికి ఇన్చార్జిలు ఇవ్వకుండా..జిల్లా కలెక్టర్ అనుమతి కూడా తీసుకోకుండా అడ్డగోలుగా వ్యవహరించారు రాష్ట్ర ఏపీటీడీసీ అధికారులు. 

ఇక్కడ గతంలో ఇన్చార్జి ఆర్డీగా పనిచేసిన శ్రీనివాసరావు సమయంలో భారీఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నాయి. దానితో ఆయనను మాతృశాఖ గణాంక విభాగానికి పంపించేశారు. మళ్లీ ఆ పోస్టులోకి తమకు అనుకూలంగా మలచుకునేందుకు ఇరిగేషన్ శాఖ నుంచి ఈఈ రమణను ఇన్చార్జి ఆర్డీగా ఏపీటీడీసీ నియమించింది. ఈఈ క్యాడర్ కి ఆర్డీ క్యాడర్ కి చాలా వ్యత్యాసం ఉంది. అలాంటి వ్యత్యాసం ఉన్నప్పుడు ఆ పోస్టు ఎవరికీ కేటాయించకుండా దానిని జిల్లా కలెక్టర్ అధీనంలో ఉంచుతారు. లేదా కలెక్టర్ కే అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. కానీ ఇక్కడే ఏపీటీడీసీ రాష్ట్ర అధికారులు చాకచక్యంగా వ్యవహరించారు. జిల్లా కలెక్టర్ ను కాదని.. తమ ఆర్డర్లు మాత్రమే కలెక్టర్ అమలు చేయాలనే హుకుం జారీచేస్తూ.. ఇరిగేషన్ ఈఈని ఇన్చార్జి ఆర్డీగా బాధ్యతలు అప్పగించింది.

ఇరిగేషన్ ఈఈని ఇన్చార్జిగా నియమించడం వెనుక రెండు ప్రధాన లాభదాయ వ్యవహారాలు దాగి ఉన్నాయి. స్వతహాగా ఇంజనీర్ అయిన అధికారిని నియమిస్తే.. ఇప్పటికే మరమ్మతు పనులను దగ్గరుండి చేయించవచ్చు. అదే సమయంలో సాంకేతికపరంగా ప్రభుత్వం నుంచి పొందిన టెండర్లు కంటే అధనంగా బిల్లులు పెట్టడానికి కూడా అవకాశం వుంటుంది. మరోవైపు విశాఖలోని బ్లూఫ్లాగ్ బీచ్ మెయింటినెన్స్ వ్యవహారంలో రూ.5లక్షలతో పోయే పనికి ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ప్రతీనెలా రూ.10 లక్షలు ఇచ్చేయొచ్చు. వాస్తవానికి ఇక్కడ కాంట్రాక్టు గత నెలతోనే ముగిసిపోయింది. అలా ముగిసిపోయిన కాంట్రాక్టు స్థానంలో టెండర్లు పిలిచి కొత్త కాంట్రాక్టర్ ను ప్రభుత్వం నియమించాలి. లేదా ప్రభుత్వానికి నష్టం వస్తుందని దానిని సంస్థ ఆధ్వర్యంలోనే నడిపించాలి. 

ఇక్కడే ఏపీటీడీసీ రాష్ట్ర అధికారులు చాలా చక్యంగా వ్యవహరించారు. విశాఖలో ఉన్న ఇన్చార్జి ఆర్డీని వెనక్కి పంపేశారు గనుక.. మళ్లీ ఆ స్థానంలో మరొక అధికారికి ఇన్చార్జి ఇవ్వాలి. జిల్లా కలెక్టర్ కైనా అప్పగించాలి. అలా ఇన్చార్జి ఇవ్వాలంటే అదేశాఖలోని అధికారులకు ఇవ్వాలి.. అలా ఇస్తే.. ఇప్పటి వరకూ జరగని పనులకు బిల్లులు చెల్లించిన ఏపీటీడీసీకి లెక్కలు చూపించాలి. అదే తమకు అనుకూలంగా ఉన్న అధికారిని నియమిస్తే.. నెల నెలా మెయింటినెన్స్ కాంట్రాక్టు గడుపు పెంచుకుంటూ పోవచ్చు. దానిని దృష్టిలో పెట్టుకునే ఏపీటీడీసీకి ఎలాంటి సంబంధం లేని ఇరిగేషన్ ఈఈకి ఆర్డీగా బాధ్యతలు అప్పగించి కలెక్టర్ ను కాదని ఆర్డర్ ఇచ్చేశారు. ఇలా ఆర్డర్ వేయడంతో మాజీ ఎండీ కోటరీ అధికారులే ఈ రకంగా వ్యవహరించారనే చెబుతున్నారు. 

ఒడిసా కాంట్రాక్టర్ కి మెయింటినెన్స్ కాంట్రాక్టు ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి ప్రతీనెలా రూ.5లక్షలు లాసు.. అటు రిసార్ట్ ల మర్మత్తు పనుల వలన మరో రూ.8 కోట్లు లాసు. ఈ వ్యవహారాలన్నింటికీ రికార్డులు చూపించాలంటే రాష్ట్ర కార్యాలయ అధికారులు చెప్పినట్టు చేసే వారే విశాఖలో ఆర్డీగా ఉండాలి. ఇపుడు అదే చేసి కథ నడిపిస్తున్నారు ఏపీటీడీసీ అధికారులు.ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పోరేషన్ లో కోట్లాది రూపాయల నష్టం వస్తున్న విషయమై రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేసినా రాష్ట్ర కార్యాలయ అధికారులు లైట్ తీసుకున్నారు. కార్పోరేషన్ చైర్మన్ బాలజీ తేడా పనులు, అధనపు బిల్లలు విషయమై నివేదికలు, బిల్లులు కావాలని అడిగినా, విచారణ చేయమని ఆదేశించినా.. జరిపిన విచారణ నివేదిక ఎక్కడుందో రాష్ట్ర అధికారులు చెప్పడం లేదు. 

అలాగని జిల్లాకి ముఖ్య, ప్రధాన అధికారి జిల్లా కలెక్టర్ సైతం ఈ విషయంలో వాస్తవ నివేదిక రాష్ట్రప్రభుత్వానికి పంపలేదు. కానీ ఇన్చార్జి వచ్చిన ఇరిగేషన్ ఈఈ ఆర్డీ క్యాడర్ లో తనకంటే క్యాడర్ ఎక్కువైన అధికారులపై కూడా జులం ప్రదర్శిస్తున్నారట. దీనిని జీర్ణించుకోలేని అధికారులు మూకుమ్మడి సెలవు పెట్టే దిశగా సమాలోచనలు చేస్తున్నారని సమాచారం అందుతుంది. కాగా జిల్లా కలెక్టర్ ని, ఇదే శాఖలోని అధికారులను కాదని నన్నే ఇక్కడి తననిఎందుకు పంపారో మీకు అర్ధం కావడం లేదన్నట్టుగా సదరు అధికారి వ్యవహరిస్తున్నతీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ విషయంలో పెద్ద పెద్ద వాళ్లు తెరవెనుక ఉన్నారని.. తేడా పనులను ప్రశ్నిస్తున్నవారికి వార్నింగ్ హింట్ కూడా ఇస్తున్నట్టుగా వార్తలొస్తున్నాయి. 

ప్రభుత్వ ఆదాయానికి రూ.కోట్లలో గండి కొట్టి బినామీల పేరుతో మెయింటినెన్స్ కాంట్రాక్టు పనులు, టెండర్ కంటే అత్యధికంగా మరో రూ.5కోట్లు కావాలని బిల్లు పెట్టి చేపడుతున్న వ్యవహారాలపై నిగ్గు తేల్చే విషయంలో కూటమి ప్రభుత్వం ఎందుకనో కినుక వ్యవహిస్తున్నట్టే కనిపిస్తున్నది. ఈ మొత్తం వ్యహారంలో రాష్ట్ర కార్యాలయంలో మహిళా అధికారిణి చక్రం తిప్పుతున్నట్టు చెతున్నారు. ఈ తేడా వ్యవహారంలో తమ ఆదేశాలు అమలు కాలేదని చేతులెత్తేసినట్టుగా ఇదేశాఖలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వానికి ఆదాయం రూ.8 కోట్ల నష్టం, మరమ్మతులలో అదనపు ఖర్చుల విషయంలో నేటికీ ఎంక్వైరీ కమిషన్ వేయకపోవడం చూస్తే ఏం జరుగుతుందో  మేం వేరేగా చెప్పాలా..? కానీ చెబుతాం హరికధలు పార్ట్-5 లో బీచ్ మెయింటినెన్స్ లెక్కలు.. వాటి వెను ప్రభుత్వానికి బొక్క పడి కనిపించిన చుక్కల విషయం..?!

visakhapatnam

2024-11-16 16:40:20

ఏపీటీడీసీలో ఒడిసా ఇల్లరికరపు అల్లుడు..!

ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలెప్ మెంట్ కార్పోరేషన్ లో ఇల్లరికపు అల్లుడిని రాష్ట్ర ప్రభుత్వం ముప్పుద్దులా పందెంకోడిలా పెంచి పోషిస్తున్నది.. నెల నెలా ఖర్చులకి రూ.5 లక్షలు సరిపోవని మరో రూ.5లక్షలు కలిపి రూ.10లక్షలు లెక్కగట్టి మరీ ఇస్తున్నది.. పనీపాట లేకపోయినా అప్పనగంగా డబ్బులు వచ్చి పడుతున్నాయేయో..బీచ్ నిర్వహణలో దగ్గరుండి చేయించడం మానేసి ప్రభుత్వం ఇచ్చే కాసులతో కదల్లేక.. మెదల్లేక కూర్చుండి పోతున్నాడా ఇల్లిరకపు అల్లుడు.. ఫలితంగా విశాఖలో సర్వాంగం సుందరంగా ప్రభుత్వ అదీనంలో నడిచే బీచ్ లన్నీ ఇపుడు.. చెత్త కంపు కొడుతున్నాయి.. వచ్చే ఆ కొద్దో గొప్పో పర్యాటకులు కనీసం మెయింటినెన్సులు లేని బీచ్ ను చూసి డోక్కుంటూ వెనక్కి వెళ్లిపోతున్నారు.. అసలు ఈరోజు-ఈఎన్ఎస్ మీడియా వారికి పనీపాటా లేదా..?ఇల్లరికపు అల్లుడేంటి..? ఏపీటీడీసీ మెయింటినెన్సు కోసం అప్పనంగా తినడం ఏంటనే కదా మీ డౌటు.. అక్కడికే వస్తున్నాం..  వైఎస్సార్సీపీ హయాంలో ఏపీటీడీసీకి ఇల్లరికానికి వచ్చిన ఒడిస్సాకి చెందిన మెయింటెన్సు కాంట్రాక్టర్ విశాఖలోని బీచ్ ని బ్రష్టు పట్టించాడు.. పేరుకి మెయింటినెన్సు కాంట్రాక్టర్ అయినా ఖర్చులన్నీ ఏపీటీడీసీతోనే పెట్టిస్తున్నాడు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నాడు. అయినా ఇల్లరికానికి వచ్చిన అల్లుడిని ఎలా చూస్తారో.. అంతకు పది రెట్లు ఏపీటీడీసీ ఈ మెయింటినెన్సు కాంట్రాక్టర్ ని పెంచిపోషిస్తున్నది. ఈ తేడా మెయింటినెన్సు వ్యవహారానికి సంబంధించిన అంశాలను గ్రౌండ్ లెవల్ రిపోర్టు పార్టు-3 గా అందిస్తున్నాం..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ఓ ఐఏఎస్ అధికారి తన బినామీతో పనులు చేయించుకోవడానికి వేసిన మాస్టర్ ప్లాన్ కి రాష్ట్రప్రభుత్వం ప్రతీనెలా రూ.5లక్షలతో పోయే పనికి రూ.10లక్షలు చెల్లించాల్సి వస్తున్నది అదీ ఎలాంటి మెయింటినెన్సు చేయకుండానే. అదేంటి మెయింటినెన్సు చేయకుండా బిల్లులు ఎలా చెల్లిస్తారని మీకు అనుమానం రావొచ్చు. ఆ అధికారి తనకు అనుకూలంగా రాష్ట్ర కార్యాలయం నుంచి విశాఖజిల్లా వరకూ ఓ కోటరీని నిర్మించుకున్నాడు. దీనితో ఆయన చెప్పింది వేదం.. చేయమన్నది బిల్లు.. ఎంత దారుణం అంటే.. ప్రైవేటు కాంట్రాక్టర్ తీసుకున్న మెయింటినెన్స్ కాంట్రాక్టర్ టెర్మ్ అయిపోయినా.. ఇంకా సదరు సంస్థకు ఎలాంటి వర్క్ ఆర్డర్ లేకుండా బిల్లులు చెల్లిస్తున్నారంటే ఆ ఐఏఎస్ అధికారి, తన కోటరీ అధికారులు ఏ స్థాయిలో కూటమి ప్రభుత్వంలో కూడా చక్రం తిప్పుతున్నారో అర్ధం చేసుకోవచ్చు.

ఏపీటీడీసీ ఆధ్వర్యంలో నడిచే సమయంలో ఆదాయంతోపాటు చాలా చక్కగా వుండే బీచ్ లన్నీ ఒడిసా కాంట్రాక్టర్ కి మెయింటినెన్సుకి ఇచ్చిన తరువాత బీచ్ లన్నీ చెత్త చెత్తగా తయారయ్యాయి. ఈ విషయాన్నీ మీడియా కోడై కూసినా.. పర్యావరణ ప్రేమికులు ఆధారాలతో సహా ఫిర్యాదులు చేసినా.. ప్రభుత్వం ఈ తేడా పనులపై కనీసం విచారణ కూడా చేపట్టలేదంటే విశాఖ జిల్లా నుంచి అమరావతి వరకూ ఏ స్థాయిలో ఆ అధికారి కాసులతో లాబీయింగ్ చేస్తున్నాడో అర్ధం చేసుకోవచ్చు.విశాఖజిల్లాలో పనులన్నీ చేయడానికి హరేరామ్ అనే ఉద్యోగి ఉండి కదమొత్తం నడిపించేవాడని చెబుతారు. ఈయనకి తోడుగా ఏపీటీడీసీ సంబంధం లేని అధికారికి డిప్యూటేషన్ పై ఇక్కడికి వచ్చి ఆయనతో కలిసి కథమొత్తం నడిపించేవారు. దానితో జిల్లా కలెక్టర్ కలుగ చేసుకోవడంతో ఇన్చార్జిగా వచ్చిన ఆర్డీ క్యాడర్ అధికారి శ్రీనివాస్ ని మాతృశాఖకు పంపించేశారు. ఒడిసా కాంట్రాక్టర్ గడువు పూర్తయిపోవడంతో ముందుగానే ఇక్కడ జాయింట్ మేనేజర్ గా పనిచేసిన హరేరామ్ కూడా రాష్ట్ర కార్యాలయానికి వెళ్లిపోయారు.

కానీ కాంట్రాక్టు గడువు పూర్తయినా.. మళ్లీ టెండర్లు పిలిచి వర్క్ మెయింటినెన్స్ ఇవ్వాల్సిన ఏపీటీడీసీలోని రాష్ట్ర అధికారులు ఒడిసాకి చెందిన కాంట్రాక్టర్ నే పెంచి పోషిస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వ అధీనంలో ఉన్నప్పుడు ఉద్యోగులు మెయింటినెన్సులు చేసినపుడే బీచ్ లన్నీ ఎంతో ఆహ్లాద కరంగా ఉండేవి. ఒడిసా సంస్ష చేతిలోకి వెళ్లాక మొత్తం బీచ్ లన్నీ వాటి స్వరూపాన్నే కోల్పోయాయి. పర్యాటకులు వచ్చినా కనీసం మరుగుదొడ్డి సౌకర్యం కూడా లేకుండా చేసి బీచ్ లన్నింటిని సర్వనాశం చేసేశారు. గడువు దాటిపోయినా.. మళ్లీ ఈయనకే ఇప్పుడిచ్చే రూ.10 లక్షలకు మరో 5 లక్షలు కలిపి రూ.15 లక్షలతో మెయింటినెన్స్ కాంట్రాక్ట అప్పగిం చడానికి(ఖర్చులు పెరిగాయని చెప్పి)ఏపీడీసీలో ఆ ఐఏఎస్ అధికారి అనుచర వర్గం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల బ్లాఫ్లాగ్ లెసెన్స్ రెవిన్యువల్ సమయంలో కూడా ఆ ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిచింది.

లాబర్ నిబంధనలు ప్రక్కనపెట్టి ఉద్యోగులకు కనీసం పీఎఫ్ లు కూడా కట్టకుండా నెల నెలా టంచనుగా రూ.10 లక్షలు బిల్లులు లాగించేస్తున్నారంటే ఈ అధికార బృందానికి ఏపీటీడీసీలో ఎంతమంది సహకరిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వ ధనం కాంట్రాక్టర్ జేబులోకి.. కమిషన్లు ఆ ఐఏఎస్ అధికారివర్గానికి.. నిందలు, పనిష్మింట్లు పనిచేస్తున్నా సిబ్బందికీ దక్కుతున్నాయి. పర్యాటకం ముసుగులో భారీ ఎత్తున జరుతున్న ఈ అవినీతి వ్యవహారంపై పర్యాటక శాఖ మంత్రి కన్నెర్ర 
ప్రయోజనం లేకుండా పోయింది.. కార్పోరేషన్ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేసినా.. ఆదేశాలు బుట్ట దాఖలయ్యాయి. ఇపుడు మిగిలింది విశాఖ జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగడమే.. ఇప్పటికైనా ఆ ఐఏఎస్ అధికారికి బినామీగా ఉన్న మెయింటెన్స్ కాంట్రాక్టర్ విషయంలో ప్రభుత్వం విచారణ జరిపించినా.. లేదా జిల్లా కలెక్టర్ చొరవ చూపినా ఆశక్తి కర అంశాలు వెలుగులోకి వస్తాయి.

చూడాలి ఆ దిశగా చర్యలు తీసుకుంటారా..? లేదంటే మీడియాని కాసుల కమిషన్లతో నోరు మూయించినట్టుగా  విశాఖ జిల్లా కలెక్టర్ ను కూడా దారి మళ్లిస్తారా అనేది.. ఏపీటీడీసీ మెయింటినెన్స్ కాంట్రాక్ట్ ఎందుకు ప్రైవేటుకి ఇవ్వాల్సి వచ్చింది.. తరువాత ఇదే శాఖలో మిగిలిన ప్రాంతాల్లో కూడా ఆ ఐఏఎస్ అధికారి అనుచరగణం ఏ స్థాయిలో ప్రభుత్వం నుంచి అడ్డగోలుగా మొత్తం మడత పెట్టడానికి మాస్టర్ ప్లాన్ వేసిందనే విషయాలు..ఏపీటీడీసీ చెప్పే హరికథలు పార్ట్-4లో గ్రౌండ్ లెవల్ రిపోర్టుతో మీ ముందుకి తీసుకు రాబోతున్నాం..?!

visakhapatnam

2024-11-15 16:54:44

మనోడనే రూ.40కోట్ల కాంట్రాక్టులు ఆయనకే ఇచ్చేశారు..?!

వడ్డించేవాడు మనోడైతే బంతి చివరన కూర్చున్నా విస్తరంతా నిండుతుందన్నట్టు.. కోట్లాది రూపాయల సివిల్ వర్క్స్ లో  వాటాలు అడ్డంగా బొక్కాలనుకున్నా మనోడనే ముద్ర వేసి, నిబంధనలు ప్రక్కన పెట్టి అన్ని కాంట్రాక్టులు ఒకరికే ఇచ్చేయొచ్చు.. సరిగ్గా ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్(ఏపీటిడిసి)లో కూడా అదే జరిగింది. రాష్ట్ర కార్యాలయంలో ఓ ముఖ్య అధికారి తన బినామీగా ఒక వ్యక్తిని కాంట్రాక్టర్ గా తెరమీదకు తీసుకు వచ్చి అన్నీ తానై చక్రం తిప్పుతున్నాడు. సివిల్ పనులు మాత్రమే కాంట్రాక్టర్ కి అప్పగించి.. ఇతర కమర్సియల్ కొనుగోళ్లు మొత్తం అన్నీ ఢిల్లీ కేంద్రంగా చేపట్టి ఆ అధికారే అంతా దగ్గరుండి చూసుకుంటున్నాడంటే ప్రభుత్వాన్ని ఏ స్థాయిలో బురిడీ కొట్టించాడో అర్ధం చేసుకోవచ్చు. ఒకరికే కాంట్రాక్టు పనులు అప్పగిస్తే.. ఖర్చులు పెరిగాయని కాంట్రాక్టర్ తో ఆర్ధిక భారమని చెప్పించి కూడా అదనపు ఎస్టిమేషన్లుతో వర్క్ ఆర్డర్ లేకుండా అదనపు నిధులు కొల్లగొట్టవచ్చునని మాస్టర్ ప్లాన్ వేశారు.. ఇపుడు దానిని అమలు చేయడానికి టెండర్ దక్కించుకున్న రేటు కంటే అదనపు ఎస్టిమేషన్లు వేసి ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్న వైనం ఇతర ప్రభుత్వ శాఖల్లోనూ హాట్ టాపిక్ అవుతున్నది. ఏపీటిడిసిలో మరమ్మతుల పేరిట ప్రజాధనాన్ని కొల్లగొడుతూ హరికథలు చెబుతున్న వ్యవహారంపై ఈరోజు-ఈఎన్ఎస్ ప్రత్యేక కథనాలు దారావాహికం పార్ట్-2 ద్వారా అంది స్తున్నది..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏపీ టూరిజం కార్పోరేషన్(ఏపీటిడిసి) కాంట్రాక్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నది.. కాదు కాదు ఇదేశాఖలో పనిచేసిన ఒక ముఖ్య అధికారికి బినామీగా ఉన్న కాంట్రాక్టర్ ద్వారా అడ్డదారిలో ఆదాయం వస్తున్నది. ప్రజా ధనం కొల్లగొట్టి.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి.. ప్రభుత్వ నిబంధనలను ప్రక్కన పెట్టి టార్గెట్ పెట్టుకున్న మొత్తం ప్రభుత్వం నుంచి రాబట్టడానికి అన్ని అడ్డదారులూ తొక్కుతున్నారు ఏపీటిడిసిలోని అధికారులు. స్వయంగా పర్యాటకశాఖ మంత్రే ఈ తేడా కాంట్రాక్టు పనులపై ఆగ్రహం వ్యక్తం చేసినా.. కార్పోరేషన్ చైర్మన్ వాస్తవాలు బయటకు తీస్తామని హెచ్చరించినా.. అవేమీ ఏపీటీడిసిలోని అధికారులను ఏమీ చేయలేకపోతున్నాయి. పైగా బినామీగా పెట్టిన కాంట్రాక్టర్ కే ఏకంగా రూ.40 కోట్ల పనులు అప్పగించి మరీ పనులను సా..గదీస్తున్నారు. 

ఈ క్రమంలో పర్యాటకుల ద్వారా ప్రభుత్వానికి వచ్చే సుమారు రూ.10కోట్ల ఆదాయం పోయినా.. ప్రభుత్వాన్ని నమ్మించ గలుగుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మొదలైన ఈ తేడా పనుల బాగోతం బయటకు రాకుండా మీడియాకి కూడా లక్షల రూపాయలు ముడుపులు ఇచ్చారని సమాచారం అందుతుంది. లేకపోతే కోట్లాది రూపాయాల టెండర్ పనులను అడ్డగోలుగా పెంచేసి మరో ఐదుకోట్లు ప్రభుత్వం నుంచి లాగేయలని చూస్తున్నా.. ఏ ఒక్కరూ ఈ విషయంలో కన్నెత్తి కూడా చూడటం లేదు.. అలా చూడకుండా చేసినందుకు అయిన ఖర్చు మీడియా వాటాగా రూ.25 లక్షలకు పైగా ఖర్చుచేశారట. ఒక్క మీడియాకే రూ. 25 లక్షలు ఖర్చు చేస్తే.. ఇందులో తేడా వ్యవహారాలను వెనుకేసుకు వచ్చే అధికారులకు ఏ స్థాయిలో వాటాలు ముట్టిఉంటాయో వేరేగా చెప్పాల్సిన పనిలేదు.

ఏపీటిడిసిలో విశాఖలోని హరిత యాత్రీ నివాస్ అప్పుఘర్, హరిత హిల్ రిసార్ట్ అనంతగిరి, హరిత వ్యాలీ రిసార్ట్ అరకు, హరిత హిల్ రిసార్ట్ మయూరిలలో మరమ్మతు పనులకు సంబంధించి ఒకే కాంట్రాక్టర్ కు రూ.40కోట్ల పనులు అప్పగించేశారు అధికారులు. ఇందులో కేవలం సివిల్ పనులు మాత్రమే కాంట్రాక్టర్ ఆ ముఖ్య అధికారికి బినామీగా ఉన్న కాంట్రాక్టర్ చేపడుతుండగా.. హోటల్స్ లో కొనుగోలు చేసే పరుపులు, ఇతర ఫర్నిచర్, టివిలు అన్నీ ఢిల్లీలోని ఓ కంపెనీతో సంబంధం పెట్టుకొని.. అన్నీ అధిక ధరలకు కోట్ చేయించారట. ప్రస్తుతం జరుగుతున్న పనులన్నీ పూర్తయితే తప్పా ఏ వస్తువుకి ఎంత రేటు పెట్టి కొన్నారన్న విషయం బయటకు రాదు. ఈ పనులన్నీ ఇదేశాఖలోని అధికారులను పెట్టి చేయిస్తే వాస్తవాలు బయటకి వచ్చేస్తాయని గుర్తించిన ఆ రాష్ట్ర అధికారి ఇరిగేషన్ లో పనిచేస్తున్న ఈఈని ఏపీటీడిసికి అధికారిగా డిప్యూటేషన్ పై తీసుకువచ్చినట్టుగా తెలుస్తుంది. ఈయన ఆధ్వర్యంలోనే ప్రభుత్వ టెండర్ల ఖర్చుకంటే అధనంగా ఖర్చులు అయ్యాయని చెప్పి ఎక్సట్రా ఎస్టిమేషన్లు వర్క్ ఆర్డర్ లేకుండా పంపి మరీ ప్రభుత్వం నుంచి నిధులు కొల్లగొడుతున్నారు కాంట్రాక్టర్లు.. ఇంత జరుగుతున్నా.. విశాఖజిల్లా, అల్లూరి జిల్లా 
కలెక్టర్లు ఈ తేడా పనులపై కన్నెత్తి చూడటం లేదు.

ఉమ్మడి విశాఖజిల్లాలో ఏపీటిడిసి హోటళ్లు మరమ్మతులు చేపట్టే సమయంలోనే ఇక్కడ పనులను సా..దీసి చేపట్టినందుకు నగరంలోని కొన్ని ప్రైవేటు హోటళ్ల నుంచి ముడుపులు కూడా తీసుకున్నట్టుగా తెలిసింది. ఏపీటిడిసి వసతి లేకపోతే పర్యాటకులు ప్రైవేటు హోటళ్లను ఆశ్రయిస్తారు. అలా ప్రైవేటు హోటళ్లలో ఆతిథ్యం పొందినవారు మళ్లీ ఏపీటిడిసి హోటళ్లకు రావాలంటే అది కల. అత్యంత తక్కువ మొత్తంలోనే దొరికే ఏపీటిడిసి రిసార్ట్ లు హోటళ్ల లో ఆతిథ్యాన్ని ప్రైవేటు హోటళ్లకు మరమ్మతుల ముసుగులో దారిమళ్లించడానికి కూడా ప్రత్యేక ప్యాకేజీలు తీసుకున్నారట. ఈ నేపథ్యంలో ఏపీటీడిసికి రావాల్సిన సుమారు రూ.10కోట్లు ప్రైవేటు హోటళ్లు కొట్టేశాయి. ప్రస్తుతం మరమ్మతులు జరుగుతున్న ఒక్క అప్పుఘర్ హరిత యాత్రీ నివాస్ ద్వారానే నెలకి సుమారు రూ.60 లక్షల నుంచి రూ.80లక్షలు ప్రభుత్వం ఆదాయం కోల్పోతున్నది. తద్వారా ప్రభుత్వం నష్టాన్ని భరించి.. ఉద్యోగులకు కూర్చోబెట్టి జీతాలు ఇవ్వాల్సి వస్తున్నది. 

ఏపీటిడిసి హోటళ్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కొల్లగొట్టడానికే మరమ్మతులు చేపట్టి.. దాని ద్వారా కూడా కోట్లాది రూపాయలు కొల్లగొట్టడానికే ఆ రాష్ట్ర అధికారి మాస్టర్ ప్లాన్ వేశారని చెబుతున్నారు. వర్క్ ఆర్డర్, టెండర్ లేకుండా అదనపు ఎస్టిమేషన్లు పంపిన విషయంలోనూ నిధులు రాబడుతున్న విషయంలో విశాఖ జిల్లా కలెక్టర్ దృష్టి సారిస్తే పెద్ద ఎత్తున జరిగిన అక్రమాలు వెలుగులోకి వస్తాయి. ఏపీటిడిసీలో అక్రమాలను తన బినామీ కాంట్రాక్టర్ల ద్వారా చేయిస్తూ ప్రభుత్వానికి కోట్ల రూపాయలు నష్టం కలిగిస్తున్న ఆ రాష్ట్ర అధికారి బాగోతాలను వరుస కథనాల రూపంలో ఈరోజు-ఈఎన్ఎస్ బయట పెట్టడానికి తన నెట్వర్క్ ను విశాఖపట్నం నుంచి అమరావతి వరకూ యాక్టివేట్ చేసింది. ఈ అక్రమాలు బయట పడకుండా ఉండేందుకు ఏ మీడియాకి ఎంతెంత ఖర్చు చేశారు ఎవరి ద్వారా  ఆ వివరాలను కూడా రానున్న కథనాల్లోబయట పెట్టనున్నాం. అంతేకాకుండా ఏపీటీడిసిలోని అధికారులను ప్రక్కనపెట్టి ఇతర శాఖల నుంచి అధికారులను ఇక్కడికి తీసుకొచ్చిన విషయంలో ఎవరు కీలక పాత్రపోషించారో కూడా జిల్లా కలెక్టర్ విచారణ చేపడితే బయటకు వచ్చే అవకాశాలున్నాయి..!

visakhapatnam

2024-11-14 15:11:49

ఏపీటిడిసి సిత్రాలు.. హరితపై మర్మమతుల బుర్ర కథ..?!

హరికథలు చెబుతామండి హరి కథలు.. కూటమి ప్రభుత్వంలో వినేవారుంటే హరిత రిసార్ట్స్(యాత్రినివాస్) పై మరమ్మతుల కోసం చేసిన ఖర్చులకు వైఎస్సార్సీపీలో చేపట్టిన పనులపై బుర్ర కథలు చెబుతామండి బుర్ర కథలు అంటున్నారు ఏపీడీసి అధికారులు.. ఏంటి ఇదేదో తేడాగా ఉన్నట్టుందే అనుకుంటున్నారు కదా.. నిజమే  పక్కా తేడా.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 14 కోట్లుతో  ఒక ఫైవ్ స్టార్ హోటల్ నే నిర్మించేసే మొత్తంతో  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని బురిడీ కొట్టించి కోట్ల రూపాయలను గుత్తేదారుడికి దోచి పెట్డానికి ఏపీ టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ లోని రాష్ట్ర అధికారుల నుంచి జిల్లా అధికారులవరకూ వేసిన మాష్టర్ ప్లాన్ ఇది.. అవును మీరు చదువుతున్నది నిజమే.. విశాఖలోని అప్పుఘర్ వద్ద ఉన్న ఏపీటిడిసి రిసార్ట్స్ లో మరమ్మతుల పేరిట జరుగుతున్న నిలువు దోపిడీ రుషికొండ ప్యాలస్ ని మించి వుందంటే నమ్ముతారా..? నమ్మకం లేకపోతే మీరూ కూడా రూ.8 కోట్ల టెండర్ ఎస్టిమేషన్ ని ఇష్టాను సారం రూ. 14 కోట్లకు పెంచేసి నిధులు లాగేస్తున్న అధికారుల అవినీతి ఫైల్స్ పై కాలేసినట్టే.. మరమ్మతుల పేరిట ఏకంగా ప్రభుత్వ ఆదాయానికి మరో రూ.8కోట్ల నష్టాన్ని మిగిలిన ఏపీటిడిసి పేరుతో బొక్కేస్తున్న అధికారులను కూటిమి ప్రభుత్వం కూడా ఏమీ చేయడం లేదంటే అతిశయోక్తి కాదు..?!

విశాఖజిల్లాలోని ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ భవనాలను మరమ్మతుల చేయడానికి, రూపు రేఖలు మార్చడానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ. 8 కోట్ల రూపాయలకు టెండర్లు దక్కించుకున్నారు గుత్తేదారులు. అయితే గుత్తేదారులకు లాభం చేకూర్చడానికి విశాఖ జిల్లా నుంచి అమరావతి వరకూ ఇదే ఏపీటిడిసిలోని అధికారులు చక్రం తిప్పి మరీ రూ.8 కోట్లను కాస్తా ఖర్చులు పెరిగిపోయాని చెప్పి వాటిని ఏకంగా రూ.14 కోట్ల ఎస్టిమేట్లను పెంచేసి నేరుగా పనులు చేయిస్తున్నారు. అసలు టెండరు ఖరారు అయిన తరువాత ప్రభుత్వం అనుమతి లేకుండా ఇచ్చిన టెండర్ మొత్తం కంటే అధనంగా రెండు ఏ విధంగా నిధులు డ్రా చేసి పనులు చేపడుతున్నారో అధికారులకే తెలియాలి. 

ప్రభుత్వం ఇప్పటి వరకూ విడుదల చేసి ఈ మొత్తం నిధులతో విశాఖలోని అప్పుఘర్ ప్రాంతంలోని హరిత రిసార్ట్స్ స్థానంలో ఏకంగా కొత్త భవంతినే నిర్మించేయవచ్చు. కానీ ప్రభుత్వంలో ఉన్న సాంకేతిక లోపాలను వినియోగించుకున్న ఏపీటిడిసి అధికారులు గుత్తేదారుడిని అడ్డం పెట్టుకొని పెరిగిన ఖర్చులను చూపిస్తూ ప్రభుత్వాన్ని నిలువుదోపిడీ చేస్తున్నారు. ఈ విషయమై ఇటీవల కాలంలో పర్యాటకశాఖ మంత్రి కూడా ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఎవరిని అడిగి చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినా.. దానిని పట్టించుకోకుండా వారి పని వారు చేసుకు పోతున్నారు. గత ఏడాది డిసెంబరులో మొదలు పెట్టిన ఈ పనుల కారణంగా ఇప్పటి వరకూ ఏపీటిడిసి ఏకంగా సుమారు రూ.8కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. 

విశాఖజిల్లాలోని పర్యాటక ప్రదేశాలను తిలకించడానికి, ఈ రిసార్ట్స్ పర్యాటకులకి ఆతిథ్యం ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి నెలకి సుమారు రూ. 60 లక్షల వరకూ ఆదాయం వచ్చేది. అయితే మరమ్మతుల కారణంగా గత డిసెంబరు నుంచి పూర్తిగా ఆదాయం పడిపోయింది. దీనిని పట్టించుకోని ఏపీటిడిసి జిల్లా, రాష్ట్ర అధికారులు కేవలం టెండరు దారుడితో పనులు సా..గ దీస్తూ.. ఎస్టిమేషన్లు పెంచేస్తూ.. ప్రభుత్వం నుంచి నిబంధనలకు విరుద్ధంగా నిధులు డ్రా చేసి మరీ పనులు చేయిస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ టెండరు దారుడిని మరమ్మతులకు రూ.5 కోట్లు, ఫర్నిచర్ కి రూ.3 కోట్లు కోట్లకు టెండర్లు ఖరారు అయ్యాయి.

 అయితే ఖర్చులు పెరిగిపోయాయని చెప్పి గుత్తేదారుడు మధ్యలోనే పనులు ఆపివేశాడు.. కాదు కాదు.. నిధులు అధికంగా రాబట్టడానికే ఏపీటీడీసీలోని రాష్ట్ర కార్యాలయంలో ఓ అధికారి ద్వారా పనులు నిలుపుదల చేయించి.. దానికి అధనంగా నిధులు మంజూరు చేయించారనే ప్రచారం జరుగుతుంది.  వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మొదలైన ఈ పనులు ఇంకా సా..తూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత కూడా వచ్చే ఆదాయం పూర్తిగా పోయి నష్టాలు వస్తూనే ఉన్నాయి. 

వాస్తవానికి గత ప్రభుత్వం విశాఖలోని హరిత రిసార్ట్స్ (యాత్రినివాస్) కి మరమ్మతుల ప్రభుత్వం టెండరు లో కేటాయించిన రూ.8 కోట్లతో ఆ ప్రదేశంలో నేరుగా కొత్త భవంతినే ఓ మహల్ మాదిరిగా కట్టవచ్చుననేది తర్డ్ పార్టీ ఇంజనీరింగ్, ఇంటీరియర్ డెకరేషన్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నమాట. ఎంత తిప్పి తిపి కొట్టినా మరమ్మతులకు, అదనపు హంగులకు రూ.3 కోట్లకు మించి అవదని.. ఫర్నిచర్ కి రూ.1.50 కోట్లు దాటదని చెబుతున్నారు. అదీ పేరు మోసిన కంపెనీల నుంచి కొనుగోలు చేస్తేనే అంత అవుతుందని ఆర్కిటెక్చర్ నిపుణులు కూడా చెబుతున్నారు. 

ఇక్కడ కూడా రాష్ట్రంలో చాలా మంది ఆర్కిటెక్చర్ నిపుణులు ఉన్నప్పటికీ ఏపీటీడిసిలోని ఓ అధికారి కావాలని ఒకే ఆర్కిటెక్చర్ కి ఈ అదనపు హంగుల పని కల్పించినట్టుగా రికార్డులు చెబుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో కూటమి ప్రభుత్వం నికార్సైన  ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్ సంస్థలతో లెక్కలు గట్టించినా.. కొనుగోలు బిల్లులపైనా, నిర్మాణాలపైనా విచారణ జరిపిస్తే విస్తుపోయే వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం వుంది. చూడాలి ప్రజాధనం ఈ విధంగా మరమ్మతులు.. బయట హంగులు, ఫర్నిచర్ల కోసం కోటాను కోట్లు గుత్తేదారులకు దోచిపెడతారా..? వాస్తవాలను కూటమి ప్రభుత్వం వెలికి తీస్తుందా.. ఇంటిదొంగలపై చర్యలు తీసుకుంటుందా..  అనేది..?!

visakhapatnam

2024-11-12 19:21:25

ఆ.. ఆడ బిడ్డల ఉసురు తగలదా ..?!

ఆ.. ఆడ బిడ్డకి తండ్రి దూరమోపోయాడు.. ఆ అన్నకి తమ్ముడు కనిపించకుండాపోయాడు.. భార్య తాళి, సుమంగళి ఆత్మహత్య వ్యవహారంలో కొట్టుకుపోయాయి.. 150 కుటుంబాలు ఉపాది లేక రోడ్డున పడ్డాయి.. కుటుంబ సభ్యులందా గుండెలు అవిసేలా రోధిస్తున్నా.. మాకు అన్యా యం జరిగిందని నెత్తీ నోరూ కొట్టుకుంటున్నా.. స్పందించే మీడియా కనిపించలేదు. అసలు ఏం జరిగిందో లోతుగా పరిశీలన చేయాలనే ఆలోచన కూడా రాలేదు.. బహుసా వ్యాపార ప్రకటనలిచ్చే బడా వ్యక్తుల విషయంలో మీడియా నిబంధనలు, పరిశోధనలు, పరిశీలనలు పనిచేయవేమో.. అందుకే  శ్రీ దుర్గా మార్కెటింగ్ కూల్ జోన్  సాయిగణేష్ ఆత్మహత్య సంఘటనను గాలికి వదిలేశాయి. నిజంగా విశాఖలో మానవత్వం మంటగలిసిపోయినట్టే.. వ్యాపార వర్గాలు ఇలాంటి ఆత్మ హత్యల కేసుల్లో ఇరుక్కున్నా.. వాళ్లే తన చావుకి కారణమని చెప్పినా పోలీసులు కూడా పట్టించుకోరేమో..ఆఖరికి ఈ విషయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరకి వెళ్లినా నేటికీ న్యాయం జరగలేదంటే ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి..? ప్రభుత్వంపై నమ్మకం ఉంటుందా..? ఒక బడా వ్యాపారి వాలనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నాననే మరణ వాంగ్మూలాన్ని నిజం చేయడానికి భారత న్యాయ సంహిత లో ఆర్టికల్స్, సెక్సన్స్ లేకుండా పోవడం అత్యంత దారుణం..!

 విశాఖలో సోనో విజన్ ఎండీ  వేమూరి భాస్కర మూర్తి వేధింపుల వలనే  శ్రీ దుర్గా మార్కెటింగ్ కూల్ జోన్ అధినేత కొవ్వూరు సాయిగణేష్ ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సెల్పీ వీడియో తీసుకొని మృతి చెందిన ఘటన రాష్ట్రంలో సంచనలం అయినా.. అది కేవలం సాధారణ మరణమేనని పోలీసుశాఖ ఎఫ్ఐఆర్ రాసింది. చిన్న బ్యాగు పోతే పోలీసులు దానిని వెతికి పట్టి బ్యాగ్ పోగొట్టుకున్నవారికి అప్పగించడానికి యావత్ యంత్రాగన్ని మొత్తం వినియోగిస్తారు. కానీ అందరికీ తెలిసేలా వివరాలన్నీ చెప్పి మరీ బలవంతంగా ఆత్మ హత్య చేసుకున్న సాయిగణేష్ విషయంలో పోలీసు అధికార యంత్రాంగం ఏమీ పట్టనట్టు ఉండటడం అనుమానాలకు తావిస్తున్నది. సెల్ఫీ వీడియోపై సమాచారాన్ని బాహ్య ప్రపంచానికి చూపించని ఓ వర్గం మీడియా ఈ ఆత్మహత్యకు తనకి ఎలాంటి సంబంధం లేదని చెప్పిన మాటలను మాత్రం పదే పదే  ప్రసార మాద్యమాల్లో చూపిస్తే.. పత్రికల్లోనూ భారీగానే అచ్చువేశారు. 

అయితే ఇక్కడ మృతుడి మరణంపై ఎవరికీ అసలు అనుమానాలే రాలేదా..? లేదంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థ నుంచి వచ్చే భారీ ప్రకటనలు పోతాయని ఈ విషయాన్ని బయట పెట్టలేదా అంటే అవుననేనే అంటున్నాయి మీడియా వర్గాలు. మనకెందుకు వచ్చిన గొడవులు.. పోలీసులే ఈ సూసైడ్ ని నార్మల్ డెత్ గా ఎఫ్ఐఆర్ రాశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి బడా వ్యక్తి ఆయనని ఎదిరిస్తే వచ్చే నాలుగు యాడ్స్ కూడా రావనుకున్నారో ఏమో తెలీదు గానీ ఈ సంఘటన అసలు ఏమీ కాదన్నట్టే తేడా మీడియా మిన్నకుండి పోవడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతున్నది.

తమ కుటుంబంలోని పెద్దనుకోల్పోయామని కుటుంబ సభ్యులు, తమ యజమానికి కల్పోయామని కార్మికులు చెబుతున్నా.. వారంతా రోడ్డున పడ్డా.. కనీసం వారి బాధను నివారించే నాధుడే కరువయ్యాడు విశాఖలో. ఎక్కడో సినిమాల్లో చూపించే కిల్లర్ సీన్ వ్యవహారాలు నిజ జీవితంలోనూ.. అందునా సెల్ఫీ వీడియోల్లో నేరుగా ఆధారాలుగా చూపించి బాధితులు మృత్యువాత పడినా అవి పోలీసులకు కనిపించవని.. మృతుడి కుమార్తె గుండెలు పగిలేలా ఏడ్చిన ఏడుపులు కూడా ఏ మీడియాని కదిలించలేకపోయాయి.  వ్యాపార వర్గాల కబంద హస్తాల్లో నలిగిపోతున్న సంస్థలు చెప్పినట్టు చేయాల్సిన లక్ష్మణ రేఖ ఆంక్షలు ఈ ఆత్మ హత్యపై నిజంగా లోతుగా పరిశీలన చేయాలనుకున్నా వీలు పడలేని పరిస్థితి. 

ఈ నేపథ్యంలో ఈరోజు-ఈఎన్ఎస్ రాసిన కథనాలు నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లినా నేటికీ బాధితులకు న్యాయం జరగలేదంటే నిజంగా దారుణమనే చెప్పాలి. విశాఖలో సోనో విజన్ ఎండీ  వేమూరి భాస్కర మూర్తి వేధింపుల వలనే  శ్రీ దుర్గా మార్కెటింగ్ కూల్ జోన్  సాయిగణేష్ ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సెల్పీ వీడియో తీసుకొని మృతి చెందిన ఘటన లో నిజమంగా మీడియా లోతుగా పరిశీలన, పరిశోదన చేస్తే అసలు విషయాలు వెలుగుచూసే అవకాశం ఉంది. కానీ ఆ దిశగా ఎవరూ ముందుకి రావడం లేదు.  నిజంగా పోలీసుశాఖ, ప్రభుత్వం ఈ ఆత్మహత్య ఘటనలో మనసు పెట్టి విచారణ చేస్తే వాస్తవాలు వెలుగు చూసే అవకాశాలున్నాయి. లేదంటే నిజంగా కుటుంబ పెద్ద కోల్పోయిన ఆ ఆడబిడ్డల ఉసురు ఖచ్చితంగా వాస్తవాలను బయటపెట్టని సోకాల్డ్ మీడియాకి, పోలీసులకి, ప్రభుత్వానికి కూడా తగులుతాయన పెదవి విరుస్తున్నారు విశాఖ వాసులు..?!

visakhapatnam

2024-11-09 19:56:17

విశాఖలో శవంపై పైసలు దండుకున్న తేడా మీడియా..?!

విశాఖలో సోనోవిజన్ ఎండీ వేమూరి భాస్కరమూర్తి దాష్టీకం, వేధింపుల వలనే తాను ఆత్మ హత్యచేసుకుంటానని చెప్పిన సెల్ఫీ వీడియోలో చెప్పిన శ్రీ దుర్గా మార్కెటింగ్ కూల్  జోన్ అధినేత సాయిగణేష్ చెప్పారు..నిజంగానే భాస్కరమూర్తి వేధింపులతో వ్యాపారవేత్త గణేష్ ఆత్మహత్య చేసుకున్నారా..? ఆ వేధింపుల వీడియో తొలుత తేడా మీడియాకే ఎందుకు రిలీజ్ చేశారు..? సోనోవిజన్ వ్యాపారాన్ని అడ్డంపెట్టుకుని నల్లధనాన్ని వైట్ మనీగా మారుస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు వ్యక్తి  గతంలో ఎన్ఏడి జంక్షన్ లో వాషింగ్ మిషన్,  ఫ్రిజ్ లో డబ్బులు అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన వైనం నుంచి ఎందుకు తేడా మీడియాను మేనేజ్ చేస్తున్నారు..? ఎందుకు తప్పుడు బిల్లులతో అడ్డగోలు వ్యాపారం చేస్తున్న సోనోవిజన్ పై చర్య తీసుకోవాలంటూ గణేశ్ బంధువులు శవయాత్ర చేసి మరీ  ఆగ్రహం ఎందుకు వ్యక్తం చేశారు..? సోనోవిజన్ వ్యాపారంపై లోతైన దర్యాప్తు చేస్తే విస్తుపోయే వాస్తవాలు నిజంగానే వెలుగు చూస్తాయా..? ఈ సూసైడ్ ఎపిసోడ్ ని ఎందుకు తేడా మీడియా పక్కదోవపట్టిస్తున్నది.. తేలాల్సి ఉంది..?

బాహ్య ప్రపంచంలో వాస్తవాలను సమాచారం రూపంలో ప్రజల కళ్లకి కట్టినట్టు చూపించాల్సిన మీడియా.. విశాఖలో తప్పుదోవ పడుతోంది.. ఈ మధ్య మీడియాలో తేడా మీడియా విభాగం ప్రత్యేక స్థానం సంపాధించుకొని.. ఎక్కడ పడితే అక్కడ పైసలు ఏరుకోవడం మొదలు పెట్టింది. అందులో పలానా వాళ్లే ఉన్నారని అనుకోవడానికి లేనంతగా మారిపోయిందా విభాగం. ఆఖరికి ఓ కుటుంబం పెద్దనుకోల్పోయి భార్య, పిల్లలు, బాధితులు ఉసూరు మంటే.. ఆ విషయంలో సమాచారం బయటకు రాకుండా ఉండటానికి.. ఎలాంటి వార్తలు రాయకుండా చేయడానికి కాస్త ఖర్చు అవుతుందంటూ.. ఆ తేడా మీడియా ఈ శవంపై కూడా పైసలు దండుకున్నదట. ఈ మాటలు మేము అంటున్నవి కాదు.. విశాఖ మహానగరంలో  శ్రీ దుర్గా మార్కెటింగ్ కూల్  జోన్ అధినేత సాయగణేష్ సెల్ఫీ వీడియోతీసుకొని.. తన చావుకి సోనోవిజన్ ఎండీ వేమూరి భాస్కరమూర్తి కారమంటూ ఆత్మహత్య చేసుకున్నారు. దానిపై కూడా కొందరు తేడా మీడియా ప్రతినిధులు వెళ్లి పీనుగను రాబందులు పీక్కుతిన్నట్టుగా.. ఆ శవాన్ని అడ్డుపెట్టుకొని అనుమానిత సంస్థ నుంచి లక్షలాది రూపాయలు కొట్టేశారట.. ఈ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకొని లాభం పొందలేక ప్రయత్నించి విఫలమైన బ్యాచ్ బయటకొచ్చి బావురు మంటే.. ఆ విషయం కాస్తా విశాఖ మొత్తం దావానంలా పాకేసింది..!

విశాఖలో ఆత్మహత్య ఘటనలో ఆరోపణలు ఎదుర్కొన్నవారు.. వారికి మధ్య వర్తిగా ఉన్నవారి నుంచి కాస్తో కూస్తో దండుకున్న తేడా మీడియా బయటకొచ్చి ఇద్దరికి మాత్రమే చెప్పారట(అడిగినోడికి.. అడగనోడికి) దీనితో తామేమీ తక్కువ తిన్నామా అంటూ మిగిలిన వాళ్లంతా కూడా ఎగేసుకొని వెళ్లి అడుక్కు తెచ్చేసుకున్నారట.. ఈ సీక్వెన్స్ లో మరికొందరు కష్టపడినా పైసా కూడా ముట్టలేదని వినికిడి. దానితో ఈ విషయాన్ని కూడా పైసలు దక్కించుకోలేని మరో వర్గం మీడియా కూడా మళ్లీ ఇద్దరికే చెప్పడం మొదలు పెట్టిందట( ఒకటి అడిగిన వారికి.. రెండూ అడగని వారికి) దీనితో విషయం కాస్త గుప్పుమంది.  జరిగింది ఆత్మహత్య కాదని.. కావాలనే వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునేలా ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్న బాధితులగోడు మహావిశాఖ నగరంలో సిసలు  మీడియాకి కనీసం పట్టలేదనే ఆరోపణలున్నాయి. 

ఎవరిని కదిలించినా అటువైపు సంస్థ కాస్త పెద్దది.. వాళ్లతో మనకెందుకొచ్చింది.. మన మీడియాకి వచ్చే యాడ్స్ పోతాయ్.. దానితో ఉన్న ఆ కాస్త యాడ్స్ మార్కెట్ మసకబారిపోతుందని అందిన కాడికి దండేసుకొని వచ్చేశారట. అంతే తప్పా.. ఎవరు ఏ విధంగా వేధిస్తే మృతుడు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది..? అలా చేసుకోవడానికి ప్రేరేపించిన కారణాలేంటి..? కేజిహెచ్ లోని శవపంచనామాలో ఏం తేలిందినే విషయాలు సాధారణ కేసుల్లో తెగ కూపీ లాగి వార్తలు గుద్దేసే మీడియా.. గంట గంటకీ చెప్పిందే చెప్పి.. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు సైతం భయంతో ఊరు వదిలేసి పోయేలా చూపించే సోకాల్డ్ ఛానళ్లు కూడా ఏమీ చేయకుండానే వదిలేశాయనే దుమారం విశాఖలో రేగింది..

 ఏది నిజమో.. ఏది అబద్దమో తెలీదు గానీ..ఇదేదో పాత కక్షల గొడవలతోనే జరిగిందని.. ఇలాంటివి రాసినా.. టీవీల్లో చూపించినా.. ఆరోపణలు ఎదుర్కొంటున్న సో కాల్డ్ విజన్  సంస్థ నుంచి నిత్యం వచ్చే యాడ్స్ పోతాయని కాస్త తెలివిగా ఆలోచించిన తేడా మీడియా గమ్మున ఉన్నదట. ఒక్క పైసా ఏమైనా చేయిస్తుంది.. ఒక్క ఆత్మ హత్య ఎన్ని యాడ్స్ నైనా వచ్చి పడేలా చేస్తుంది.. ఒక్క వార్త ఎంత మొత్తమైనా వసూల్ అయ్యేలా చేస్తుంది.. ఒక్క ఆత్మ హత్య శవం బాహ్య ప్రపంచాన్ని నమ్మించేందుకు ఎన్ని నాటకాలైనా ఆడిస్తుందని చెప్పడానికి విశాఖలో జరిగిన  సెల్ఫీ వీడియో ఆత్మహత్యే ప్రధాన ఉదాహరణ అని.. దానిపై పైసలు దండుకున్న తేడా మీడియానే ప్రధాన సాక్షులని ప్రజలు ఉమ్మేసే పరిస్థితికి తెచ్చేశారు తేడాగాళ్లు. 

ఇంతకీ ఈ విషయంలో పోలీసుశాఖ ఏవిధంగా వ్యవహరిస్తుందనే ఇపుడు ప్రశ్నార్ధకం అయినా.. చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్న వీడియోలు కేసు నమోదు చేయడానికి సరిపోవేమో అనినా అంటారని.. ఈవిషయంలో తేడా మీడియానా కాసుల ముసుగులో గమ్మునుంటే.. ఇక పోలీసులు మాత్రం ఏం చేస్తారులే అనే వాదన కూడా వినిపిస్తోంది. సెల్పీ వీడియో తీసుకొని బలవంతంగా తనువు చాలించి కుటుంబానికి తీరని అన్యాయం చేసినా.. తేడా మీడియాకి తన శవంపైనే కాసులు కురిపించిన కూల్ జోన్ అధినేత సాయి గణేష్ పేరుని తీసుకున్న మొత్తం అరిగే వరకూ దండుకున్న పైసలు ఖర్చైనంత వరకూ చెప్పుకుంటారేమో.. మీడియా అంటే సమాజంలో నాల్గవ స్థంబంగా బలంగా ఉండాలి.. కానీ సమాజంలో జరిగే చావు, పుట్టుకలపైనా పైసలు ఏరుకునే రాబంధుల్లా కాదు.. కాకూడదు.. నిజంగా సాయిగణేష్ సెల్ఫీ ఆత్మహత్యపై కాసులేరుకుంటే దానంత దరిద్రం మరొకటి ఉండదు.. ఉండబోదు.

. మీకు ఇక్కడ అనుమానం రావొచ్చు.. కొంపదీసి మీకు ముట్టక ఇదంతా రాసారని అనుకోవచ్చు.. మేము తేడా మీడియాల శవాలపై పైసలు ఏరుకోము.. మాకంటూ కొన్ని విలువలున్నాయి.. సమాజంలోని ఫోర్త్ ఫిల్లర్ గా కొన్ని బాధ్యతలున్నాయి.. అందుకనే జరిగింది.. మాకు తెలిసినది.. విశాఖలో దావానమైనది అక్షర రూపంలో మీ ముందుంచాం. డబ్బు ఎవరికి చేదు చెప్పండి.. కానీ శవాలపై ఎరుకుంటే ఆ డబ్బు నిలువదు.. మృతుడి కుటుంబం శోకం పాపంపై వెంటాడక మానదు.. ఆ క్షణం కాసులు కళ్లకి ఇంపుగా కనిపించొచ్చు.. కానీ తరువాత అంతకు రెండింతలు మనం పోగొట్టుకోవాల్సి వస్తుందనే సత్యాన్ని మాత్రమే నమ్ముతాం..  సత్యమేవ జయతే..!

visakhapatnam

2024-11-04 19:50:21

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా డా. జి.లక్ష్మీషా నియామకం

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా డైనమిక్ ఐఏఎస్ అధికారి డా.జి.లక్ష్మీషాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్త ర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆదివారం జిఓనెంబరు-1884ను విడుదలచేశారు. లక్ష్మీషా గతంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీగా పనిచేశారు. దానికంటే ముందు గ్రామ, వార్డు సచివాలయశాఖ డైరెక్టర్ గా కూడా పనిచేశారు. ఆయన పనిచేసిన సమ యంలో గ్రామ, వార్డు సచివాలయశాఖలో ఉద్యోగులకు పదోన్నతుల ప్రక్రియ మొదలు పెట్టి కొందరికి పదోన్నతులు రావడానికి ఎంతో కృషిచే శారు.  ముక్కుసూటి అధికారిగా, ప్రభుత్వ సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేసే అధికారిగా ఈయనకు పేరుంది. అలాంటి మంచి అధికారిని  ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల బదిలీల్లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా నియమించింది. ఈయన రాకతో ఎన్టీఆర్ జిల్లాలో ప్రభుత్వ పరిపా లన గాడిలో పడటంతోపాటు. ప్రజాసమస్యల పరిష్కారానికి కూడా పెద్ద పీట లభించనుంది.

visakhapatnam

2024-11-03 16:19:57

విశాఖ అక్రమార్కుల గుండెల్లో సింహ స్వప్నం..!

‘ఒకడు నాకు ఎదురొచ్చినా వాడికే రిస్క్.. నేను ఒకడికి ఎదురెళ్లినా వాడికే రిస్క్.. అవతలి వాడు ఎంతటి వాడైనా బ్లండ్ గా ఎదురెళ్లిపోవడమే.. తొక్కపట్టి నార తీస్తా నా కొడకా’..ఏంటి ఈరోజు పేపర్, ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ వాళ్లు సినిమాహీరో బాలక్రిష్ణ డైలాగులు చెబుతు న్నారు అనుకుంటున్నారా..? బాలయ్య సినిమాల్లో ఈ డైలాగ్ చాలా పవర్ ఫుల్.. అదే డైలాగ్ ని.. దానిపై  రియల్ లైఫ్ యాక్షన్ లో చేసి చూపిస్తే.. అందునా ఒక ఐపీఎస్ ఆఫీస్ ఆ విధంగా వ్యవహరిస్తే.. తట్టుకోవడం ఎవరి తరం అవుతుంది..? ప్రస్తుత విశాఖలో అక్రమార్కుల పరిస్థితి కూడా అదే.. 7995098799 ఈ నెంబర్ మీ దగ్గరుంటే శ్రీరా రక్ష.. అర్ధరాత్రైనా మహిళలు దైర్యంగా నగరంలో తిరగొచ్చు.. నేను ఆపదలో ఉన్నానని ఒక్క ఫోన్ వెళ్లినా.. లేదా మెసేజ్ వెళ్లినా క్షణాల్లో రంగంలోకి దిగిపోతున్నారు.. అవతలి వాడి ఆటకట్టిస్తున్నారు ఆయన వైజాగ్ సిటీ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్జీ ఐపీఎస్.  విశాఖ పోలీస్ శాఖ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేపిన మహానగర పోలీస్ బాస్ పై ఈరోజు-ఈఎన్ఎస్ ప్రత్యేక కథనం..!

విశాఖలో ప్రజలు ఇపుడు జపం చేసే అధికారి పేరు శంఖబ్రత బాగ్జీ.. అదేంటీ ఒక పోలీసు అధికారి పేరు జపం చేయడం తప్పా మరేం లేదా అనుకుంటే ఎఫ్ఐఆర్ లో కాలు పెట్టినట్టే. అవును నిజం.. విశాఖకి ఎందరో పోలీస్ కమిషనర్లు వచ్చారు.. వెళ్లారు.. కానీ శంఖబ్రత బాగ్జీ మాత్రం మహావిశాఖపై చెరగతి సంతకం చేసేశారు. ఆపద అన్నవారికి తోడుగా నిలబడుతున్నారు. అక్కమార్కులను హడలెత్తిస్తున్నారు. సెటిల్ మెంట్లు చేసారికి సీన్ సితార్ చేస్తున్నారు.. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలను భయపెట్టే తేడా కాఖీలు సైతం ఈయన ముందుకి రావడానికి ఒంటేలు  పోసుకుంటున్నారంటే పరిస్థితి ఏ విధంగా అర్ధం చేసుకోవచ్చు. అంతలా పోలీసుశాఖ ద్వారా ప్రజల కష్టాలను తీర్చడమే కాకుండా పోలీసుశాఖనే ప్రక్షాళన చేసే క్రమంలో ఎవరినీ ఉపేక్షించడం లేదు. తేడా పనులు చేస్తున్నట్టు తెలిసినా.. తన దృష్టికి వచ్చినా వెంటనే యాక్షన్ లోకి దిగిపోతున్నారు. 

తప్పుచేసిన  పోలీస్ అధికారులను సైతం ఇంటికి పంపిస్తున్నారు. అక్రమార్కులను గుడ్డలూడదీసి పరుగులు పెట్టిస్తూ.. ప్రజల మనిషిగా మారిపోయారు. విశాఖలో పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన రోజునుంచే ఆయన ఫోన్ నెంబరుని ప్రజలకు చెప్పేశారు. మీకు పోలీసుశాఖ అండగా వుంటుంది. నాకు కష్టమొచ్చిందని ఎవరూ బాధపడకూడదు. పోలీస్ స్టేషన్ లో న్యాయం జరగలేదని అసలే విచారించకూడదు. నాకు సమాచారం ఇవ్వండి.. నేను చూసుకుంటానంటూ ఇచ్చిన 7995098799 నెంబరుకి ప్రజల నుంచి కూడా అంతే స్థాయిలో స్పందన వస్తున్నది. ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించడంతోపాటు వారికి న్యాయం చేయడంలో ప్రత్యేక భూమిక వహిస్తూ ప్రజలకు స్నేహపూర్వక పోలీసు సేవలు సకాలంలో అందిస్తున్న సిటీ పోలీస్ కమిషనర్ పేరుని నెంబరు ఇపుడు మహావిశాఖ నగరరంలోని ప్రజలందరూ వారి సెల్ ఫోన్ లలో తమ కుటుంబాలు, స్నేహితులతోపాటు ఈ నెంబరుని కూడా ‘పవర్ ఫుల్ పోలీస్ ’ అనే పేరుతో సేవ్ చేసుకుంటున్నారు.

 24 గంటలూ 365 రోజులు ఈ నెంబరుపై విశాఖ పోలీస్ కమిషనరేట్ లో ఒక ప్రత్యేక విభాగమే పనిచేస్తుందంటే అతిశయోక్తి కాదు. ఒక్క ప్రజలకే కాదు పోలీసుశాఖను ప్రక్షాళన చేయడానికి కూడా ఇదే నెంబరుని వినియోగించి అక్రమార్కులను ఇంటికి పంపిస్తున్నారు సిటీ పోలీస్ కమిషనర్. దీనితో ఈయన ఇక్కడ ఉన్నంత కాలం మేము ఇక్కడ పనిచేయలేం బాబోయ్ అంటూ కొందరు పోలీసులు పెద్ద స్థాయిలో పైరవీలు చేయించుకొని వేరే ప్రతాంలకు తరలి వెళ్లిపోతున్నారు. విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ నమ్మే సిద్దాంతం ఒక్కటే.. తప్పు చేస్తే..చట్టం ముందు ఎవరైనా సమానమే. ఇపుడు అదే పదం పోలీసులను సైతం హడలెత్తిస్తోంది. కమిషనర్ దృష్టిలో పడకుండా చట్టం చెప్పినట్టు పనిచేస్తున్నారు. దానితో మహావిశాఖనగరం ప్రశాంతంగా నిద్దుర పోతోంది. ఒకవేళ ఎవరైనా దొంగతనాలు, దోపీడిలు, హత్యలూ, మానభంగాలు అంటూ డిస్ట్రబ్ చేయాలని చూసినా వారి ఆటలు కూడా ఎంతో సమయం నిలవడం లేదు. గంటల వ్యవధిలోనే వారిని కోర్టు మెట్లెక్కెంచి కట కటాలపాలు చేస్తున్నారు ఈ డైనమిక్ పోలీస్ కమిషనర్.

 దానితో చేసిది లేక అంత్ రాష్ట్ర  సుపారీ బ్యాచ్ లతో పనిచేయించాలని చూసినా వారి పప్పులు కూడా ఇక్కడ వైజాగ్ లో ఉడకడం లేదు. ఒకప్పుడు కేవలం రాత్రి 10 గంట వరకే ఉండే షాపుల క్లోజింగ్ టైమ్ ఇపుడు రాత్రి 12 వరకూ పెంచారు ఈయన. చాలా మంది అది వ్యాపారస్తుల కోసం అనుకున్నారు. కానీ ఆ సమయం వరకూ షాపులు, జనసమ్మర్ధం వుంటే నేరాలు..ఘోరాలు తగ్గుతాయని చాలా లోతుగా ఆలోచించి విశాఖ ప్రజలకు ప్రశాంత వాతావరణాన్ని అందిస్తున్నారు. అడపా దడపా కొందరు పోలీసులు స్టేషన్ పరిధిలో తోక జాడించినా.. సస్పెన్షన్ అనే కత్తెరతో తోకలు కట్ చేస్తున్నారు. పోలీస్ అంటే ప్రజలకు సేవ చేసేవాడే కానీ ప్రజలను పట్టుకొని పీడించుకు తినేవాడని కాదని రుజువు చేస్తూ.. ఫ్రెండ్లీ పోలీసింగ్ కి విశాఖ ప్రజలకు చేరువ చేస్తున్నారు. 

వాస్తవానికి వైజాగ్ సిపీ అంటే ఒక పెద్ద అధికారి.. కానీ ఒక సాధారణ పోలీసు మాదిరిగా విశాఖ నగరాన్ని జల్లెడ పట్టడంలో ముందుంటున్నారంటే ఆయన వర్క్ సిన్సియారిటీ.. డెడికేషన్ ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం సివిల్ సర్వీస్ లకు, గ్రూప్-1 లాంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి కూడా విశాఖ సీటీ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్జీ ఒక మార్గదర్శి. పోలీస్ అంటే ఈయనలా పనిచేయాలనే లక్ష్యాన్ని పెట్టుకొని మరీ  సిద్దమవుతున్నారు. ఇటు మీడియాకి కూడా మంచి సమాచారాన్ని అందించడంతో పాటు.. మీడియాలో పనిచేసేవారికి, జర్నలిస్టులకి.. ఎవరికి ఆపద వచ్చినా 24 గంటల్లోనే స్పందించి పరిష్కారం చూపిస్తున్నారు. 

ఇలాంటి మంచి ఐపీఎస్ ఆఫీసర్లు రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ ఉంటే పోలీస్ సేవలు ఏ విధంగా అందుతాయో ఒక్కసారి ఊహించుకోవచ్చు. రాష్ట్రప్రభుత్వం కూడా ఏరి కోరి ఈ డేరింగ్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ ని విశాఖ పంపినందుకు చిరస్థాయిగా నిలిచిపోయే పోలీసింగ్ ని విశాఖ చేరువ చేశారు. విశాఖపై చెరగని సంతకం చేశారు. ‘వైజాగ్ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్జీ సార్ మీరు సూపర్ సర్.. మామూలు కేక కాదు.. కెవ్వు కేక అంటూ విశాఖవాసులు కీర్తిస్తున్నారు’. వృత్తిని దైవంగా భావించే ఇలాంటి పోలీసు అధికారుల సేవలు విశాఖకు కలకాలం కావాలని ఆశిద్దాం..!

visakhapatnam

2024-11-02 08:20:18

రేయ్ మా మీదే వార్త రాస్తావా..? దానిని జిల్లా కలెక్టర్ కి పంపిస్తావా..?!

విశాఖజిల్లాని సమాచారశాఖ కార్యాలయంలోని అధికారులు, సిబ్బందికి  ‘సీఎం చంద్రబాబు విశాఖ పర్యటననూ తప్పుదోవ పట్టించిన సమాచారశాఖ’ శీర్షికన ఈరోజు పేపర్ లో వచ్చిన ప్రత్యేకవార్త  బాగా మండిపోయేలా చేసింది..  చేసిన తప్పు ఆధారాలతో సహా పేపర్ రావడం.. అది కాస్తా జిల్లా కలెక్టర్ ఎంఎన్.హరేంధిరప్రసాద్ దృష్టికి వెళ్లడం, ఈరోజు పేపర్ ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అఫిషియల్ వెబ్ సైట్, మొబైల్ న్యూస్ యాలప్ లలో ప్రచురితం కావడం అది బాగా వైరల్ కావడంతో ఏం చేయాలలో తెలియని ప్రెస్టేషనల్ లో డివిజనల్ పీఆర్వో నాయారణరావు ఈరోజుప్రతినిధికి ఫోన్ చేసి మరీ అమ్మనా బూతులు తిట్టేశాడు. ఆఫీసుకి రారా నీ అంతు చూస్తాం.. నీపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిస్తాం అంటూ ఏకవచన సంభోదానికి దిగాడు.. అలా మాట్లాడిన మాటలు కూడా విశాఖజిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వున్న సమాచారశాఖ అధికారులకి సదరు తిట్ల పురాణ దండకం చేరింది.  దానితో ఇంకా రెచ్చిపోయిన ఆయన విశాఖజిల్లా అధికారిక వాట్సప్ గ్రూపు నుంచి అక్రిడేటెడ్ జర్నలిస్టుగా ఉన్న తనని తొలగించేశాడు. కోపం నషాలానికి అంటిందేమో కోరి కొరివతో వీపు గోక్కుని సవాల్ కి దిగాడు..  డివిజనల్ పీఆర్వో సవాల్ ని ఈరోజు ప్రతినిధి కూడా స్వీకరించారు.. ఇకపై తాడో పేడో తేల్చుకోవడానికి సిద్దమయ్యారు..!

విశాఖజిల్లా సమాచారశాఖలోని అధికారులు, సిబ్బందికి రాష్ట్రప్రభుత్వంలో జర్నలిస్టులు, మీడియా కోసమే ఏర్పాటైన సమాచారశాఖ గౌరవం తెలిసి రాలేదు. అందకే జర్నలిస్టులమీదే చిందులు తొక్కుతున్నారు. గట్టిడి అడిగే బెదిరిపోతారనుకొని చేసిన తేడా పనులపై వార్తలు రాస్తే.. పనిగట్టుకొని మరీ ఫోన్లు చేసి తిట్లదండం మొదలు పెట్టారు. కానీ జర్నలిస్టులు.. అందునా ఈరోజు-ఈఎన్ఎస్ జర్నలిస్టులతో పెట్టుకుంటే పరిస్థితి ఎలా వుంటుందో ఇప్పుడిప్పుడే సమారశాఖకు తెలిసొస్తున్నది. ఈ నేపథ్యంలో వారికి వ్యతిరేకంగా చేసిన తప్పులపై ప్రత్యేక కథనాలు ప్రచురితం అవుతుంటే జీర్ణించుకోలేకపోతున్నారు. జర్నలిస్టులకి ఫోన్లు చేసి బూతులు తిట్టడంతోపాటు, ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామని కూడా బెదిరింపులకి దిగుతున్నారు. ఆ తాటాకు చప్పుళ్లకి ఈరోజు-ఈఎన్ఎస్  భయపడదని.. దైర్యంగా సమాచారశాఖ తేడా వ్యవహారాలు ప్రత్యేక కథనాలతో నిగ్గు తేల్చింది. ఇప్పుడే కాదు భవిష్యత్తలో కూడా తేడాలు వస్తే తాటతీసే వార్తలే రాయాలని కూడా నిర్ణయించుకుంది.  

విశాఖలో ఈరోజు-ఈఎన్ఎస్ బాలుకి ఫోన్ చేసి బూతులు తిట్టిన డివిజనల్ పీఆర్వో విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచనలం అయ్యింది. చేసిన తప్పుకి పక్కాగా ఆధారాలున్నా.. తప్పుని సమర్ధించుకోవడానికి ఫోన్లు చేసి బెదిరింపులుకి దిగడాన్ని విశాఖలో నిజమైన వర్కింగ్ జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. దినపత్రికకు మద్దకు పలికారు. ఈరోజు-ఈఎన్ఎస్ కి జర్నలిస్టుల సంఘీభావమే శ్రీరామ రక్ష. కొందరు తేడా జర్నలిస్టుల ఈ విషయంలో కలిసి రాకపోయినా ఒరిగిపోయేది ఏమీ లేదు. ఈరోజు-ఈఎన్ఎస్ సింగిల్ గానే పోరాటం చేస్తుంది. తాడో పేడో తేల్చుకుంటుంది. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబునాయుడు ప్రజలకు మంచి చేయాలని విశాఖ పర్యటకు వస్తుంటే..ఆ పర్యటన వివరాలను విశాఖజిల్లా సమాచారశాఖ అధికారులు, సిబ్బంది జిల్లా కలెక్టర్ ఎంఎన్. హరేంధిర ప్రసాద్ పేరుతోనే తప్పుడు తేదీలతో ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తుందా..? దానిని మీడియా ప్రశ్నించకూడదా..? 

మీడియాకి సమాచారం పంపించే విషయంలో ప్రదర్శించిన నిర్లక్ష్యాన్ని వార్తల రూపంలో గుర్తు చేయకూడదా..? అంటే కూటమి ప్రభుత్వానికి మచ్చతెచ్చే విధంగా సమాచారశాఖ వ్యవహరిస్తుంటుంటే.. మీడియాకి అమిత గౌరవం, ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తున్న ప్రభుత్వ సమాచారం కరెక్టుగా మీడియాకి రావాలని చేసిన ప్రయత్నం తప్పా..? అదే తప్పు అనుకుంటే విశాఖజిల్లా ముఖ్య అధికారిగా జిల్లా కలెక్టర్ పరిపాలనను సమాచారశాఖ ఎద్దేవా చేసినట్టే. ఎందుకంటే నేరుగా జిల్లా కలెక్టర్ పేరుతోనే తప్పుడు సమాచారం ఇస్తే దానిని ఏమనుకోవాలి.. ఏ దైర్యంతో కనీసం మీడియాకి సమాచారం పంపే సమయంలో తేడా వ్యవహారాలను సరిచూసుకోదు.. ఏం.. ఆ తేడా తనాన్ని ఈరోజు-ఈఎన్ఎస్ ప్రత్యేక కథనంలో రాస్తే మండిందా..? సమాచారశాఖ క్రింద జిల్లా కలెక్టర్ పనిచేయడం లేదు.. జిల్లా ముఖ్య అధికారి తప్పుడు సమాచారం చెప్పినట్టుగా సమాచారశాఖ ఎలా రాస్తుంది.. దానినే బయట పెట్టాం.. 

అలా తప్పులను వెతికినందుకు అక్రిడేటెడ్ జర్నలిస్టుని నెంబరుని సమాచారశాఖ అధికార మీడియా నుంచి తొలగించేస్తారా..? సమాచారశాఖ వ్యవహారాన్ని వర్కింగ్ జర్నలిస్టులంతా ముక్త కంఠంతో ఖండించాలి. అంతేకాదు.. ఈరోజు-ఈఎన్ఎస్ పై సమాచారశాఖ ఎంత కాలం ఇలాంటి వ్యక్తిగత దూషణలు, కక్షలు ప్రదర్శిస్తుందో తేలిపోతుంది.  ఇప్పటికే డివిజన్ పీఆర్వోపై విశాఖ నగర పోలీసు కమిషనర్ కి తిట్ల దండకం వాయిస్ రికార్డింగ్, ప్రత్యేక కథనాల క్లిప్పింగులు, సమాచారశాఖ మీడియాకి అందించిన తప్పుడు సమాచారం యొక్క స్క్రీన్ షాట్ లతో ఫిర్యాదు కూడా చేసింది. మళ్లీ మళ్లీ చెబుతున్నాం.. ఎవరు ఏమనుకున్నా కూటమి ప్రభుత్వానికి మచ్చతెచ్చే ప్రభుత్వశాఖల అధికారుల తీరు, వ్యవహారాలను ఈరోజు-ఈఎన్ఎస్ ప్రశ్నిస్తూనే ఉంటుంది.. ఇకపైనా  ప్రత్యేక కథనాలు రాస్తూనే వుంటుంది. ఈ విషయంలో కలిసొచ్చే నిజమైన జర్నలిస్టులకు భవిష్యత్తులో సంఘీబావంగా కూడా నిలబడుతుంది. సత్యమేవ జయతే..!

visakhapatnam

2024-10-31 14:02:57