1 ENS Live Breaking News

నారా భువనేశ్వరిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆడారి కిషోర్

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు సతీమణి, మహిళానేత నారాభువనేశ్వరిని మిషన్ కర్షక దేవోభవ జాతీయ అధ్యక్షలు, టిడిపి యువనాయకులు ఆడారి కిషోర్ కుమార్ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం ఢిల్లీలోని ఓబెరాయ్ హోటల్ లో ఆమెను కలిసి డెమెక్రసీ ఇన్ డేంజర్ కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిరంకుశత్వంగా వ్యవహరిస్తోందని, కక్షసాధింపులకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని మండి పడ్డారు. ఇలాంటి తరుణంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై డెమెక్రసీ ఇన్ డేంజర్ కార్యక్రమం అన్ని వర్గాలనూ ఆలోచించేలా చేస్తుందని అన్నారు. అదేవిధంగా మిషన్ కర్షకదేవోభవ కార్యక్రమం కోసం కూడా ఆడారి కిషోర్ కుమార్ తో చర్చించారు. యువత చైతన్యం కోసం, రైతుల అభివృద్ధి కోసం చేపడుతున్న మంచి పనులను భువనేశ్వరి అభినందించారు. టిడిపి ఎంతో చరిత్రకలిగిన పార్టీ అని..అలాంటి పార్టీలో యువచైతన్యానికే పెద్ద పీట ఉంటుందనే విషయాన్న ప్రతీ ఒక్కరూ గుర్తించాలన్నారు. మంచి పనులు చేసే మీకు పార్టీ సహకారం, తమవంతు సహకారం ఎల్లప్పడుతూ వుంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం ఆడారి కిషోర్ కుమార్ మాట్లాడుతూ, గత మూడు రోజులుగా టిడిపి అధినేతతోపాటు తాను ఢిల్లీలోనే ఉన్నానని చెప్పారు. తాను చేపడుతున్న కార్యక్రమాలు ఢిల్లీ వేధికగా చేపడుతున్న విషషయాన్నిఅధినేత సతీమణి  దృష్టికి తీసుకొచ్చామని, తమ పార్టీ అధ్యక్షులు,  సతీమణి ఇచ్చిన ప్రోత్సాహం మరువలేదని అన్నారు. వారి సహకారంతో గ్రామ, గ్రామన డెమెక్రసీ ఇన్ డేంజర్ కార్యక్రమాన్ని చేపట్టి అన్ని వర్గాల్లోనూ చైతన్యం తీసుకురావడానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని చెప్పారు. అనంతరం ఢిల్లీ ఎయిర్ పోర్టులో చంద్రబాబుకి సాదర వీడ్కోలు పలికారు. అంతకు ముందు మాజీ మంత్రి నారాయణను కూడా ఆడారి కిషోర్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.

New Delhi

2023-11-28 13:30:29

డెమెక్రసీ ఇన్ డేంజర్ ఉద్యమంపై ఆడారికి చంద్రబాబు ప్రశంస

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను డెమెక్రసీ ఇన్ డేంజర్ ఉద్యమం ద్వారా ప్రజలను చైతన్యం చేస్తున్న టిడిపి యువ నాయకులు ఆడారి కిషోర్ కుమార్ ను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షలు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశంసించారు. సోమవారం చంద్రబాబునాయుడుని  ఢిల్లీ ఓబె రాయ్ హోటల్ లో కిషోర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, డెమెక్రసీ ఇన్ డేంజర్ పేరిట యువతను ఉత్తేజ పరచడంలో చేస్తున్న కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని కొనియాడారు. రాష్ట్రంలో యువత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన నష్టం కోసం తెలుసుకో గలిగితే మీరు చేస్తున్న ఉద్యమం మరింతగా అన్ని వర్గాల ప్రజల్లోకి వెళుతుందన్నారు. అదేవిధంగా సామాజిక దృక్పదంతో రైతుల కోసం చేస్తున్న మిషన్ కర్షక దోవోభవ చక్కని కార్యక్రమమని అన్నారు. ఇప్పటి వరకూ ఢిల్లీ నుంచి అనకాపల్లి వరకూ డేంజర్ ఇన్ డెమెక్రసీ, సేవ్ డెమెక్రసీ కార్యక్రమాల విశేషాలను కిషోర్ కుమార్ చంద్రబాబుకి తెలియజేశారు. టిడిపిలో కష్టపడి పనిచేసేవారికి ఎల్లప్పుడూ గుర్తింపు వుంటుందని, దైర్యంగా మీ కార్యక్రమాలను కొనసాగించాలని బుజం తట్టి ప్రోత్సహించారు. ఆంధ్రప్రేదేశ్ లో యువతకు జరిగిన అన్యాయం, యువ నాయకత్వం ద్వారా ప్రజలకు తెలియాలన్నారు. ఈ అరాకచక పాలనకు ప్రజలు చరమగీతం పాడే సమయం దగ్గర పడిందని అన్నారు.  ఆయనను కలిసిన అనంతరం కిషోర్ కుమార్ మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ అధినేత తాను చేపట్టే కార్యక్రమాలను చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లానని చెప్పారు. విమానం లోనూ, విశాఖ క్రికెట్ స్టేడియంలోనూ, డెమెక్రసీ ఇన్ డేంజర్ కార్యక్రమాలను ఆయనకు వివరించానని అన్నారు. దానికి ఆయన ఇచ్చిన స్పూర్తి, ప్రోత్సాహం మాటల్లో చెప్పలేనని అన్నారు. వైఎస్సార్సీపీ చేపడుతున్న అన్ని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, కక్షసాధింపు చర్యలను అన్ని వర్గాల ప్రజల వద్దకూ తీసుకెళ్లడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు.

Delhi

2023-11-27 13:34:23

వైభవంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం

లోక కళ్యాణార్థం భవిష్యత్తులో టీటీడీ మరిన్ని  భక్తి చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.  అలిపిరి సమీపంలోని సప్త గో ప్రదక్షిణ మందిరంలో గురువారం ఉదయం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ప్రారంభోత్సవ కార్యక్రమంలో చైర్మన్ దంపతులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, తరతరాలుగా సనాతన హైందవ సంస్కృతిలో హోమానికి విశేష ప్రాధాన్యత ఉందన్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో  శ్రీవారి పాదపద్మముల వద్ద ఈ హోమ కార్యక్రమాన్ని శాశ్వతంగా  నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తుల కోరికలను భగవంతునికి చేర్చే ఒక బృహత్తర కార్యక్రమానికి టీటీడీ శ్రీకారం చుట్టిందన్నారు. ఎంతో ఖర్చు, శ్రమ తో కూడిన హోమ కార్యక్రమాన్ని భక్తుల కోసం తక్కువ ఖర్చుతో ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం 9 నుండి 11 గంటల వరకు ఈ హోమ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. 

 సప్త గో ప్రదక్షిణ మందిరం నందు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన హోమ వేదిక వద్ద ప్రతిరోజు 100 మంది గృహస్తులు పాల్గొనేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఆన్లైన్లో డిసెంబర్ 
31వ తేదీ వరకు హోమం టికెట్లు బుక్ అయ్యాయని తెలిపారు. భక్తులు వర్చువల్ గా కూడా ఈ హోమ కార్యక్రమంలో పాల్గొనవచ్చన్నారు. దాత సహకారంతో త్వరలో దాదాపు 500 మంది గృహస్తులు కూర్చుని ఈ హోమ కార్యక్రమంలో పాల్గొనేలా వేదికను నిర్మించనున్నట్లు చైర్మన్ తెలిపారు. భక్తులకు సులభతరంగా 
శ్రీవారి దర్శనం కల్పించడంతో పాటు, భక్తుల చెంతకు భగవంతుణ్ణి తీసుకువెళ్లాలనే  సంకల్పంతో టీటీడీ శ్రీనివాస కళ్యాణాలు, వైభవోత్సవాలు, శ్రీ వెంకటేశ్వర భక్తి 
ఛానల్, భజన బృందాల ఏర్పాటు, అన్నమాచార్య సంకీర్తనలు భక్త లోకానికి అందించడం, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం స్థాపన లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు చైర్మన్ వివరించారు. ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ, భగవంతుని ఆరాధించే అనేక పద్ధతుల్లో హోమ కార్యక్రమం అత్యంత ప్రాసస్యమైందని తెలిపారు.  హోమం చేయడం, గానం చేయడం ద్వారా భగవంతుని త్వరగా చేరుకోవచ్చన్నారు. 



శోభాయ మానంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ ప్రారంభోత్సవ ఊరేగింపు :
  ఎస్వీ  వేద విశ్వవిద్యాలయం నుండి 
గురువారం ఉదయం 7 గంటలకుశ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం 
ప్రారంభోత్సవ ఊరేగింపు నిర్వహించారు. టీటీడీ 

చైర్మన్  కరుణాకర రెడ్డి , ఈవో.   ఎవి.ధర్మారెడ్డి పాల్గొన్నారు.  వేద  విద్యార్థులు, అధ్యాపకులు, భజన మండళ్ల కళాకారులు ఊరేగింపుగా సప్తగో ప్రదక్షిణ మందిరంకు చేరుకున్నారు.  ఈ హోమ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి   రోజా , మేయర్ డాక్టర్ శిరీష, టీటీడీ  ఈవో  ఎవి ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు  తిప్పే స్వామి,  సుబ్బరాజు,  దేశ పాండే,  యనాదయ్య,  సతీష్ కుమార్,  శేఖర్ రెడ్డి , జేఈవోలు  సదా భార్గవి, వీరబ్రహ్మం దంపతులు, మున్సిపల్ కమిషనర్  హరిత, తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్  బాలాజి, సివిఎస్వో  నరసింహ కిషోర్, మున్సిపల్ కార్పొరేషన్ వైస్ చైర్మన్  భూమన అభినయ రెడ్డి దంపతులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


Tirupati

2023-11-23 10:19:01

జాతీయ స్థాయికి మిషన్ కర్షక దేవోభవ..ఆడారి కిషోర్

అన్నంపెట్టే రైతన్న ఆరోగ్యంగా ఉంటే దేశం శుభిక్షంగా ఉంటుందని..అలాంటి రైతు యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యతను ప్రజల్లోకి మరింత లోతుగా తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్టు మిషన్ కర్షకదేవోభవ  జాతీయ అధ్యక్షలు, టిడిపి యువనాయకులు ఆడారి కిషోర్ కుమార్ తెలియజేశారు. ఇప్పటికే పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక అవగాహక కార్యక్రమాలు నిర్వహిస్తున్న మిషన్ బృందం వ్యవసాయ ఆధారిత ప్రాంతాల వారీగా రైతుల స్థితిగతులు, చేస్తున్న వ్యవసాయ విధానాలు,  అభివృద్ధి, రైతుల కష్టాలు, రైతులు సాధిస్తున్న విజయాలు, తదితర అంశాలపై ప్రచారం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈమేరకు మిషన్ అధ్యక్షులు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీకి భవిష్యత్ కార్యాచరణ వివరాలను  ప్రత్యేకంగా తెలియజేశారు. కర్షకదేవోభద మిషన్ కార్యక్రమం రైతు యొక్క అవసరం మానవాళికందరికీ తెలియజేయాలనే లక్ష్యంతో జరుగుతోందన్నారు. కరోనా వైరస్ విలయతాండం చేసిన సమయంలో రైతు లేకపోయినా, రైతు పంటలు పండించకపోయినా జరిగే నష్టం ఊహకి కూడా అందేది కాదన్నారు. ప్రపంచ విపత్తు సమయంలోనూ ప్రాణాలను పణంగా పెట్టి వ్యవసాయం చేసి, వాటి ఫలాలను అన్ని వర్గాలకు అందించడం ద్వారానే ప్రజలకు ఆరోగ్యం సిద్ధించదనే విషయం ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిందన్నారు. 

అలాంటి రైతుని ఆరోగ్యంగా ఉంచితే ఆ ఫలాలు ప్రజలందరికీ చేరుతాయని అన్నారు. రైతులు వ్యవసాయం దండగ అనుకుంటే.. కార్పోరేట్ శక్తులు ప్రజల రక్త, మాంసాలను కూరగాయలు, బియ్యం, పండ్లుకి అత్యధిక ధరలు పెట్టి పీడించేస్తాయన్న ఆయన.. ప్రస్తుత మానవ మనుగడకు గాలి, నీరు, ఎంత అవసరమో రైతు, ఆయన చేసే వ్యవసాయం కూడా అంతే అవసరమన్న విషయాన్ని ప్రజలు గుర్తించే వరకూ మిషన్ కర్షకదేవోభవ  తనకార్యకలాపాలు నిర్విరామంగా చేస్తూనే ఉంటుందన్నారు. అంతేకాకుండా రైతులకు ప్రకృతి, సేంద్రియ  వ్యవసాయాన్ని చేరువ చేయడానికి రైతులకు కూడా అవగాహన కార్యక్రమాలు చేపట్టే ఆలోచన ఉందన్నారు. దానికోసం వ్యవసాయ విద్య చదిన విద్యార్ధులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో సంప్రదింపులు జరిపి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి రైతులకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. రైతు రాజైతే ప్రజలకు ఆరోగ్య, ఆహారం రెండూ చేరువ అవుతాయని..అది జరగాలంటే కాస్త సమయం పడుతుందన్నారు. రైతు దేశానికి వెన్నుముఖ అనే విషయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పోరేట్ సంస్థలు, అన్ని వర్గాలు గుర్తించే స్థాయికి రైతు అవసరాన్నితీసుకెళతామన్నారు. 

జాతీయ స్థాయిలో చేపడుతున్న ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందన్నారు. ప్రతీ ఇంట్లో ఒక ఉద్యోగి, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఎలా ఉంటున్నారో..ఒక రైతు కూడా ఉండాలనే ఆలోచన కల్పించడానికి వినూత్న కార్యక్రమాల రూపకల్పన జరుగుతుందని చెప్పుకొచ్చారు. త్వరలోనే వ్యవసాయాధారిత రాష్ట్రాల్లో పర్యటనలు కూడా చేపట్టి అక్కడి అభవృద్ధి విధానాలపై అధ్యయనాలు కూడా చేయిస్తామన్నారు. వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే కొత్త వంగడాల రూపకల్పన జరగాలని, అది కార్యరూపం దాల్చాలంటే వ్యవసాయ విద్య, పరిశోధనలు విస్త్రుతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అన్ని అంశాలను క్రోడీకరించి రైతు మానవాళికి, జీవకోటికి ఎంత అవసరమో చాటిచెప్పి ప్రపంచ వ్యవసాయాధినేతగా రైతుని నిలబెడతామని స్పష్టంచేశారు మిషన్ కర్షకదేవోభవ  జాతీయ అధ్యక్షలు, టిడిపి యువనాయకులు ఆడారి కిషోర్ కుమార్..!

Visakhapatnam

2023-11-18 05:11:11

అడ్డగోలు హెట్రో..అన్నీ అతిక్రమణలే..!

అధికారం..డబ్బూ..పలుకుడి..అధికారుల వత్తాసు..ప్రభుత్వం సహకారం ఉంటే అనుమతులు ఆలస్యంగా వచ్చినా..పనులు మాత్రం ముందుగానే చేసేసుకోవచ్చు. అదీ పోలీసు బందోబస్తును పెట్టి మరీ.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.15కోట్ల తో సముద్రంలోకి సుమారు రెండు కిలోమీటర్లు చేపట్టే వ్యర్ధాల పైప్ లైన్. ఇంత ఖర్చు చేస్తున్నప్పుడు అనుమతులు రాకుండా ఉంటాయా..అన్నీ ఆఘమేఘాలపై వచ్చేశాయి..ఎన్నికేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని అనుమతులు ఇచ్చినా స్థానిక సంస్థల అనుమతులు( నక్కపల్లి మండలంలోని ఎన్.నరసాపురం పంచాయతీ, సిహెచ్ లక్ష్మీపురం, రాజయ్యపేట, పెద తీనార్ల,గ్రామ పంచాయతీల తీర్మాణాలు) లేకపోతే పనులు ప్రారంభించడానికి లేదు. అదీ సముద్ర జలాలు కలుషితం అయ్యే పనులకు స్థానికులు ఒప్పుకోరు, పంచాయతీ గ్రామసభ తీర్మాణం కూడా రాదు. కానీ.. పనులు చేస్తున్నది మెస్సర్స్ హెట్రో ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఎస్ఈజెడ్ లిమిటెడ్ కదా పంచాయతీ అనుమతి మాత్రం కాస్త తేడా వచ్చింది. ఏ ప్రాంతంలోనైనా ప్రభుత్వం, ప్రైవేటు నిర్మాణాలు చేపట్టే సమయంలో సదరు గ్రామసభ అనుమతితో పంచాయతీ తీర్మాణం ఉండాలి. దానికోసం తహశీల్ధార్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి ఆ నివేదికను ఆర్డీఓ ద్వారా జెసి, ఆపై కలెక్టర్ తరువాత ప్రభుత్వానికి నివేదించాల్సి వుంటుంది. 

కానీ హెట్రో విషయంలో పెద్ద పెద్ద అనుమతులన్నీ ముందే వచ్చేశాయ్. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, కోస్టల్ రెగ్యులేటరీ జోన్, జిల్లా పరిశ్రమలశాఖ, ఫైర్ అండ్ సేఫ్టీ ఇలా అన్ని అనుమతులూ వచ్చేశాయి. అదేంటి ఇవన్నీ గ్రామ పంచాయతీల తీర్మాణాలు జరిగిన తరువాత కదా వస్తాయి..అంటే ఇక్కడ మాత్రం ముందు సదరు అనుమతులన్నీ వచ్చేశాక పనులు మొదలు పెట్టేశాక..చివరాఖరున పంచాయతీ అనుమతి వస్తుంది. అదీ నవంబరు 6వ తేదీన అంటే పనులు నవంబరు 1వ తేదీ కంటే ముందుగానే మొదలైపోయి, నిర్మాణాలకు సంబంధించిన సామాగ్రి మొత్తం వచ్చేశాక చివరాఖరుగా తీసుకున్నారన్నమాట. అదీ ఎలా అంటే గ్రామసభ పెడితే అడ్డంకులు వస్తాయని, ముందుగా అన్నిప్రభుత్వశాఖలు అనుతమతులు ఇచ్చేశాయని కేవలం పంచాయతీ పాలకవర్గం, పంచాయతీ సర్పంచ్, కార్యదర్శి సంతకాలతో  అనుమతు ఇచ్చేశారు. రూ.15కోట్ల ఖర్చు స్థానికులు గొడవలు చేస్తే ఊరుకుంటారా..? సముద్ర జలాలు, భూగర్భ జలాలు కలుషితం అయిపోయినా పర్లేదు, మత్స్యసంపద సర్వ నాసనం అయిపోయినా పట్టించుకోవాల్సిన పనిలేదు.

 వారికి కావాల్సింది రెండో పైప్ నిర్మాణం ఎలాంటి ఆటంకం లేకుండా జరగాలి. దీనితో జిల్లా అధికార యంత్రాంగంతో అనుమతులు తెచ్చుకొని మరీ పోలీసులను, బలగాలను రంగంలోకి దింపి పనులు ప్రారంభించారు. దీనితో ఇక్కడ హెట్రో పైప్ లైన్ వద్దంటూ 700 రోజులు ఆందోళన చేసిన స్థానికుల సమస్యను, ఇబ్బందిని, పక్కన పెట్టి జిల్లా అధికారులు కూడా అనుమతులు ఇచ్చేశారు. అన్నీ వచ్చేసిన తరువాత అడ్డెవరు వస్తారనుకున్న హెట్రో యాజమాన్యం స్థానికుల నుంచి ఇబ్బందులు రాకుండా నక్కపల్లి మండల మెజిస్ట్రేట్, నర్సీపట్నం డివిజన్ మెజిస్ట్రేట్ కి కూడా కనీసం సమాచారం ఇవ్వకుండా జిల్లా పోలీసులను రంగంలోకి దించింది. దీనితో విషయాన్ని రెవిన్యూ అధికారులు అనకాపల్లి జెసి దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన జెసి హెట్రో వద్ద జరుగుతున్న నిర్మాణపనులను పరిశీలించాలని ఫైమెన్ కమిటీ వేసింది. ఆ కమిటీ కూడా మంగళవారం ఫ్యాక్టరీలో సమావేశం జరిపి అంతా సక్కమంగానే ఉందని నివేదిక ఇవ్వడం విశేషం. మొదట అనుకున్నట్టుగా కాకుండా కంపెనీ స్థలం నుంచి కొత్త పైప్ లైన్ కూడా వేసుకోవడానికి అన్ని శాఖల అనుమతులు ఇచ్చేశారు. 

ఇప్పటికే ఉన్న పైప్ లైన్ ద్వారా సముద్రంలో సుమారు 100 కిలోమీటర్ల వరకూ మత్స్యసంపద మొత్తం రసాయానాల వాసన వస్తుందని, వాటి తింటుంటే అనారోగ్యాల భారిన పడుతున్నామని స్థానికులు నెత్తీనోరూ కొట్టుకుంటున్నారు. ఈ తరుణంలో వామపక్షాలు వందల రోజులు ఆందోళనలు చేసినా వాటిని పట్టించుకోకుండా అనుమతులు ఇచ్చేసింది ప్రభుత్వం. ఈ విషయంలో ప్రభుత్వంలోని పెద్దలను ప్రశన్నంచేసుకొని ఎక్కడా పనులకు ఆటంకం రాకుండా ఉండాలని, అనుమతుల్లో ఇచ్చినట్టుగా ఏడేళ్లలోగా అన్ని పనులు పూర్తిచేసుకోవడానికి ఆఘమేఘాలపై పనులు మొదలు పెట్టేసింది యాజమాన్యం.


అనుమతులన్నీ ఉన్నాయి..స్థానికుల ఆందోళన ఉంటుందనే పోలీసు బందోబస్తు
హెట్రో చేపడుతున్న ఖర్మాగార వ్యార్ధాలను సముద్రంలోకి విడిచిపిట్టే డిశాలినేషన్ ప్లాంట్ పైప్ లైన్ నిర్మాణానికి అన్ని రకాల అనుమతులు వచ్చేశాయని యాజమాన్యానికి చెందిన సుబ్బారెడ్డి అనే ఫైనాన్స్ విభాగానికి చెందిన ఉద్యోగి వివరణ ఇచ్చారు. పైగా అనుమతులు రాకుండా పోలీసుల బందో బస్తు ఎవరిస్తారని కూడా ఎదురు ప్రశ్నవేశారు. అలాంటపుడు పనులు ప్రారంభించడానికి ఒకరోజు ముందు పంచాయతీ తీర్మాణం అదీ, గ్రామసభ కాకుండా పాలకవర్గం అనుమతి మాత్రమే తీసుకొని, ప్రజలు కంపెనీ విస్తరించి ఉన్న మూడు పంచాయతీ ప్రజల గ్రామసభ ఆమోదం లేకుండా ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తే..నేను బండిపై ఉన్నాను..మీకు కావాలనుకుంటే కంపెనీ వచ్చి అనుమతులు చూసుకోవచ్చునని సమాధానమిచ్చారు. అంటే అన్ని రకాల అనుమతులు ముందే వచ్చినా ప్రధాన అనుమతి అంటే పంచాతీల గ్రామసభల తీర్మాణంతో ప్రజల అభీష్టం మేరకు ఇచ్చిన అనుమతి మాత్రం ఇంతకాలం ( నక్కపల్లి మండలంలోని ఎన్.నరసాపురం పంచాయతీ, సిహెచ్ లక్ష్మీపురం, రాజయ్యపేట, పెద తీనార్ల,గ్రామ పంచాయతీల తీర్మాణాలు) అనుమతులు రాలేదనే విషయం గ్రామపంచాయతీలు నవంబరు 6వతేదీతో రాసి ఇచ్చిన అనుమతులే రుజువు చేశాయి.

 అంటే 6వ తేదీ వరకూ అనుమతి రాకపోయినా పనులు ప్రారంభించేశారు. ఈ విషయంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్,  నర్సీపట్నం ఆర్డీఓ, నక్కపల్లి తహశీల్దార్, ఇలా మొత్తం అందరినీ ఒకేసారి బురిడీలను చేసింది హెట్రో. అదేవిషయం అధికారులకు తెలిసినప్పటికీ ప్రభుత్వంలోని పెద్దల అండదండలతో జరిగే వ్యవహారం కనుక అధికారులు కూడా ఏమీ చేయలేక.. అన్ని అనుమతులు సక్రమంగానే ఉన్నాయని, కాకపోతే పైప్ లేన్ వేరే విధంగా వేస్తున్నామని చెప్పి ఫైవ్ మెన్ కమిటీ ని కూడా మమ అనిపించేశారు. అడ్డగోలు హెట్రోపై అనుమతులు, వాటి నకళ్ల ఆధారాలతో మళ్లీ కలుద్దాం..!

Visakhapatnam

2023-11-08 01:49:47

నీతి ఆయోగ్‌ భవిష్యత్‌ ప్రణాళికలో వైజాగ్‌కు చోటు

కేంద్ర ప్రభుత్వం విశాఖ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. నీతి ఆయోగ్‌ గ్రోత్‌ హబ్‌ నగరాల్లో విశాఖకు చోటు కల్పించింది. దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో నాలుగు నగరాలను నీతి ఆయోగ్‌ ఎంపిక చేయగా అందులో వైజాగ్‌కు చోటు దక్కింది.. దక్షిణాది రాష్ట్రాల నుంచి విశాఖను ఎంపిక చేయగా, మిగతా వాటిలో ముంబై, సూరత్‌, వారణాసి ఉన్నాయి. వీటిని పైలట్‌ నగరాలుగా కేంద్రం ఎంచుకుంది. 2047 అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను మార్చేందుకు పైలట్ ప్రాజెక్టు ప్రవేశపె ట్టగా,  తాజాగా ఎంపికైన నాలుగు నగరాలలో పైలట్‌ ప్రాజెక్టు అమల్లోకి రానుంది. నీతి ఆయోగ్‌ ఎంపిక చేసిన నగరాల్లో భారీ ఎత్తున ఆర్థిక అభివృద్ధి, మౌలిక సదుపా యాలు అభివృద్ధి చేయనుంది. ఇప్పటికే పలు కీలక అభివృద్ధి విషయాల్లో ముందున్న విశాఖ నీతి ఆయోగ్ భవిష్యత్ ప్రణాళికతో మరింత అభివృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తున్నట్టుగా ప్రకటించిన తరుణంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశం అవుతోంది. రాష్ట్రప్రభుత్వం ప్రకటన రాజధాని ప్రకటన చేసినా దానికి సంబంధించి అధికారిక కార్యక్రమాలు చేపట్టేలేదు. మరోవైపు డిసెంబరులోగా రాజధాని కార్యకలాపాలు ప్రారంభం అయితేనే ఏపీ ప్రభుత్వం చేసిన ప్రకటనకు కార్యరూపం వస్తుంది. ఆతరువాత ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Delhi

2023-09-20 07:39:47

2రోజుల్లో చంద్రుడిపై పగలు.. రోవర్‌, ల్యాండర్‌ ఏం చేయబోతున్నాయి..?!

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చేపట్టిన చంద్రయాన్‌-3 సక్సెస్‌ ను భారత్ తోపాటు ప్రపంచం మొత్తం ఎంజాయ్ చేస్తున్నది. చంద్రుడి దక్షిణ ధృవంపై దిగిన విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌లు ఇప్పటికే కీలక సమాచారాన్ని దివి నుంచి భువి అందించాయి. అయితే, చంద్రుడిపై లూనార్‌ నైట్‌ ప్రారంభం కావడంతో ఇస్రో.. ఈ నెల 2, 4 తేదీల్లో ల్యాండర్‌, రోవర్‌లను నిద్రాణ స్థితిలోకి పంపింది. మళ్లీ చంద్రుడిపై పగలు ఏర్పడిన తరువాత ఇవి తన పనిని ప్రారంభిస్తాయని ఇస్రో ఆదిలోనే ప్రకటించాయి. చంద్రునిపై ప్రజ్ఞాన్ రోవర్ సంచరిస్తూ అనేక విషయాలను వెలుగులోకి తెచ్చింది. అయితే.. జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ దిగిన దృశ్యాలను 3డీ ప్రింటింగ్‌ని ఇస్రో విడుదల చేసింది. మరోవైపు.. రోవర్ ప్రజ్ఞాన్ సరైన దారిని వెతుక్కునే క్రమంలో అక్కడక్కడే తిరుగాడుతున్న దృశ్యాలను ల్యాండర్ ఇమేజర్ కెమెరా వీడియో తీసింది. ఈ వీడియోను ఇస్రో తన అధికారిక టిట్వర్ ఖాతాలో పంచుకుంది.

ఇదిలా ఉండగా.. తాజాగా చంద్రయాన్‌-3లోని విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌లు నిద్రాణస్థితి నుంచి బయటకు రావడంపై ఇస్రో శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చంద్రుడిపై రాత్రి ముగిసిపోయి, తిరిగి  పగలు మొదలయ్యాక  22న ల్యాండర్, రోవర్‌ స్లీప్‌ మోడ్‌ నుంచి బయటకు వస్తాయని ఇస్రో అంచనా వేస్తోంది.  లూనార్‌ డే మొదలైన తర్వాత ల్యాండర్, రోవర్‌ మళ్లీ ఎలా పనిచేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. అక్కడి మైనస్‌ 200 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతను ఎలక్ట్రానిక్‌ పరికరాలు తట్టుకోవడం, రీఛార్జి కావడంపైనే ఇది ఆధారపడి ఉంది. అయితే, రోవర్‌, ల్యాండర్‌లను మేల్కొలిపేందుకు ప్రయత్నిస్తామని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే అప్పటికే విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్‌ రోవర్ లలో బ్యాటరీలు ఫుల్ గా చార్జింగ్ లోనే ఉన్నాయని, అవి తిరిగి పగలు వచ్చినత తరువాత ఛార్జ్ అవడానికి పూర్తిస్థాయిలో అవకాశాలున్నాయని పేర్కొంది. అయితే చంద్రుడిపై అతి శీతల వాతావరణ పరిస్థితులు ఏమైనా ప్రతికూల ప్రభావాలు చార్జింగ్ విషయంలో చూపించవచ్చుననే అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్న ఇక్కడి పరిశోదకులు. 

విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన రోవర్ ప్రజ్ఞాన్.. చంద్రుడిపై పరిశోధనలను కొనసాగిస్తోంది. చంద్రునిపై నీటిజాడ, వాయువులు, మట్టి, అక్కడ దొరుకుతున్న రసాయనిక పదార్థాల గురించి ఆరా తీస్తోంది. చంద్రుని దక్షిణ ధ్రువంపై సల్ఫర్ మూలకం పుష్కలంగా ఉందని ప్రజ్ఞాన్ రోవర్ ఇప్పటికే గుర్తించింది. అల్యూమినియం, కాల్షియం, ఇనుము, క్రోమియం, టైటానియం, మాంగనీసు, సిలికాన్, ఆక్సిజన్ కూడా అక్కడ ఉన్నట్లు కనుగొంది. చంద్రునిపై ఉష్ణ్రోగ్రత 70 డిగ్రీల వరకు ఉంటోందని ఇస్రో తెలిపింది. చంద్రుడిపై పగలు వచ్చిన తరువాత ఎలాంటి సమాచారం మళ్లీ చంద్రయాన్-3 పంపిస్తుందనే అంశంపై ప్రపంచం మొత్తం ఆశక్తిగా ఎదురుచూస్తున్నది. ఈ క్రమంలో చంద్రునిపై రోవర్ ఆటలను అమ్మలా ఆప్యాయతా చూస్తున్నట్టుగా ఉంటే వీడియోను ఇస్రో సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది వైరల్ అవుతోంది.

Bengaluru

2023-09-20 05:18:32

సింహ‌ వాహనంపై యోగ‌ న‌ర‌సింహుడిగా శ్రీ‌ మలయప్ప

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన బుధ‌వారం ఉదయం శ్రీ మలయప్పస్వామి సింహ‌ వాహనంపై యోగ‌న‌ర‌సింహుడి అలంకారంలో దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. సింహ వాహనం - ధైర్య‌సిద్ధి  శ్రీవారు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహ‌నాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో 'సింహదర్శనం' అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంత‌మ‌వుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజ‌య‌స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు. 

   బ్ర‌హ్మోత్స‌వాలకు విచ్చేసే చిన్న‌పిల్ల‌లలు త‌ప్పిపోకుండా టీటీడీ ఛైర్మ‌న్  భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి, ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో  స‌దా భార్గ‌వి, తిరుమ‌ల అద‌న‌పు ఎస్పీ శ్రీ మునిరామ‌య్య‌తో క‌లిసి జియో ట్యాగింగ్ క‌ట్ట‌డం ప్రారంభించారు.  రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ముత్య‌పుపందిరి వాహనంపై స్వామివారు అభ‌య‌మిస్తారు. వాహ‌న‌సేవ‌లో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, డిల్లీ స్థానిక స‌ల‌హామండ‌లి అధ్య‌క్షులు  వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి, జెఈవో  వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో  న‌ర‌సింహ కిషోర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tirumala

2023-09-20 04:33:02

యువ‌త‌లో భ‌క్తిభావ‌న పెంచేందుకు గోవింద కోటి

యువ‌త‌లో హైంద‌వ స‌నాత‌న ధ‌ర్మ వ్యాప్తి కోసం శ్రీ‌వారి ఆల‌యం నుండే తొలి అడుగు వేస్తున్నామ‌ని, ఇందులో భాగంగా రామ‌కోటి త‌ర‌హాలో గోవింద కోటి రాసిన 25 ఏళ్ల లోపు వారికి వారి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఒక‌సారి తిరుమ‌ల స్వామివారి బ్రేక్ ద‌ర్శ‌నం క‌ల్పిస్తామ‌ని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్య‌క్షులు  భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి వెల్ల‌డించారు. 10 ల‌క్ష‌ల 1,116 సార్లు గోవిందనామం రాసిన‌వారికి ద‌ర్శ‌న సౌభాగ్యం క‌ల్పిస్తామ‌న్నారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో మంగ‌ళ‌వారం ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి తొలి స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా తీసుకున్న ముఖ్య నిర్ణ‌యాల‌ను ఛైర్మ‌న్ మీడియాకు తెలియ‌జేశారు.  స‌నాత‌న ధ‌ర్మం ప‌ట్ల‌, మాన‌వీయ, నైతిక విలువ‌ల ప‌ట్ల అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఎల్‌కెజి నుండి పిజి వ‌ర‌కు చ‌దువుతున్న విద్యార్థుల‌కు సుల‌భంగా అర్థ‌మ‌య్యేలా 20 పేజీల్లో భ‌గ‌వ‌ద్గీత సారాంశాన్ని పుస్త‌క ప్ర‌సాదంగా కోటి పుస్త‌కాలు ముద్రించి పంపిణీ చేస్తామ‌న్నారు.

Tirumala

2023-09-05 15:24:54

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ సిజెఐ

భారత సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆదివారం రాత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న మాజీ ప్రధాన న్యాయమూర్తికి టీటీడీ ఛైర్మన్  భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఎవి ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో జస్టిస్ రమణకు శ్రీవారి ప్రసాదాలను  అందజేశారు. ఆ తరువాత శ్రీ బేడి ఆంజనేయ స్వామివారిని జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి  మహాద్వారానికి నమస్కరించారు.  అంతకు ముందు  జస్టిస్ ఎన్వీ  రమణ తిరుచానూరు  శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం ఎదుట జేఈవో వీరబ్రహ్మం, డెప్యూటీ ఈవో  గోవిందరాజన్ స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు.

Tirumala

2023-08-27 16:15:00

తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

కలియుగ వైంకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతున్నది. శనివారం అర్ధరాత్రివరకూ శ్రీవారిని 71,073 మందిభక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.67 కోట్లు రాగా, 37,215 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఇంకా దర్శనంకోసం 29 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారికి కొన్ని నిత్యంచేసే సేవలలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసినట్టు ఒక ప్రకటనలో తెలియజేసింది.

Tirumala

2023-08-27 02:40:10

శ్రీవారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు శనివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణం జరిగింది. ముందుగా సాయంత్రం సేనాధిపతివారిని ఆలయ మాడవీధుల గుండా ఊరేగింపుగా వసంతమండపానికి వేంచేపు చేశారు. అనంతరం మృత్సంగ్రహణం, ఆస్థానం నిర్వహించారు. ఆ తరువాత ఆలయంలోని పవిత్ర మండపంలో అంకురార్పణ వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి పాల్గొన్నారు.  శ్రీవారి ఆలయంలో ఆగస్టు 27 నుంచి 29వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఉదయం శ్రీవారి మూలవిరాట్‌ ఎదుట ఆచార్య ఋత్విక్‌వరణం నిర్వ‌హించారు. భగవంతుని ఆజ్ఞ మేరకు అర్చకులకు బాధ్యతలు కేటాయించారు. అంకురార్పణ కారణంగా శనివారం సాయంత్రం సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది.

        ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఆల‌య డెప్యూటీ ఈవో  లోకనాథం, పేష్కార్  శ్రీహరి, పారుపత్తేదార్  తులసీప్రసాద్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2023-08-26 13:57:50

బ్రహ్మకుమారీల మాజీ అధిపతి పేరుతో పోస్టల్ స్టాంపు

బ్ర‌హ్మ‌కుమారీల మాజీ అధిప‌తి దాదీ ప్ర‌కాశ‌మ‌ణి జ్ఞాప‌కార్ధం రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ సాంస్కృతిక కేంద్రంలో శుక్ర‌వారం పోస్టేజ్ స్టాంపును భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము విడుద‌ల చేశారు. ఈ త‌పాలా బిళ్ళ‌ను స‌మాచార మంత్రిత్వ శాఖ త‌పాలా విభాగ‌పు  మై స్టాంప్ అన్న చొర‌వ కింద దాదీ ప్ర‌కాశ‌మ‌ణి 16వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ, ఆధ్యాత్మికత ద్వారా భార‌త్‌లో, విదేశాల‌లోనూ భార‌తీయ విలువ‌ల‌ను వ్యాప్తి చేయ‌డంలో దాదీ ప్ర‌కాశ‌మ‌ణి గొప్ప పాత్ర పోషించార‌ని రాష్ట్ర‌ప‌తి అన్నారు. ప్ర‌పంచంలోనే మ‌హిళా నాయ‌క‌త్వంలోని అతిపెద్ద సంస్థ‌గా బ్ర‌హ్మ‌కుమారీస్ ఆమె నాయ‌క‌త్వంలో అవ‌త‌రించింది. నిజ‌మైన నాయ‌కురాలిలా, ఆమె బ్ర‌హ్మ‌కుమారీల కుటుంబానికి స‌వాళ్ళ‌తో కూడిన ప‌రిస్థితుల్లో కూడా విశ్వాసం, ధైర్యంతో అండ‌గా నిల‌వ‌డ‌మే కాక ఎల్ల‌వేళ‌లా వారికి మార్గ‌ద‌ర్శ‌నం చేశారు. జీవితం తాత్కాలిక‌మైన‌ద‌నీ,  ఒక వ్య‌క్తి తాను చేసిన ప‌నుల వ‌ల్ల మాత్ర‌మే వారిని గుర్తించుకుంటార‌నేది ప్ర‌పంచంలో అతిపెద్ద స‌త్య‌మ‌ని రాష్ట్ర‌ప‌తి అన్నారు.

 ప్ర‌జా సంక్షేమ‌మే ధ్యేయంగా ఉదాత్త‌మ‌మైన ప‌నులు చేయాల‌ని ఆమె అన్నారు. భౌతికంగా దాదాజీ మ‌న మ‌ధ్య ఉండ‌క‌పోవ‌చ్చ‌ని, కానీ ఆమె ఆధ్యాత్మిక, ఉదాత్త 
వ్య‌క్తిత్వపు జ్ఞాప‌కాలు, మాన‌వాళి సంక్షేమం కోసం ఆమె ఇచ్చిన సందేశం అన్నీ కూడా ఎల్ల‌ప్పుడూ మ‌న మ‌ధ్య స‌జీవంగా ఉంటాయ‌ని, రానున్న త‌రాల‌కు స్ఫూర్తిని ఇస్తాయ‌ని ఆమె పంచుకున్నారు. ఇటీవ‌లి కాలంలో చంద్ర‌యాన్ -3 మిష‌న్ విజ‌యం గురించి మాట్లాడుతూ, భార‌త శాస్త్ర‌వేత్త‌లు సాధించిన అపూర్వ విజ‌యాన్ని మ‌నంద‌రం వీక్షించామ‌ని అన్నారు. చంద్రుడిపై ద‌క్షిణ ధృవాన్ని చేరుకున్న తొలి దేశం భార‌త అని ఆమె అన్నారు. చంద్ర‌యాన్ -3 మిష‌న్ ద్వారా చంద్రుని భూభాగం నుంచి సేక‌రించిన నూత‌న స‌మాచారం మొత్తం ప్ర‌పంచానికి లాభాల‌ను చేకూరుస్తుంద‌నే విశ్వాసాన్ని ఆమె వ్య‌క్తం చేశారు.  

Delhi

2023-08-25 16:16:26

రూ.834 కోట్ల‌తో గిరిజ‌న కేంద్రీయ విశ్వవిద్యాల‌యం

సాలూరు నియోజ‌క‌వ‌ర్గంలో రూ.834 కోట్ల‌తో ఏర్పాటు చేయ‌నున్న కేంద్రీయ గిరిజ‌న విశ్వ విద్యాల‌య నిర్మాణ ప‌నుల‌కు రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శుక్ర‌వారం శంకుస్థాప‌న చేశారు. ఈ మ‌హోత్త‌ర కార్య‌క్ర‌మంలో కేంద్ర విద్యా, నైపుణ్యాభివృద్ధి & వ్య‌వ‌స్థాప‌క‌త‌ శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ భాగ‌స్వామ్య‌మ‌య్యారు. సాలూరు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని మెంటాడ మండ‌లం చిన‌మేడ‌ప‌ల్లి వ‌ద్ద ఏర్పాటు చేసిన శిలాఫ‌ల‌కాన్ని ఆవిష్క‌రించి నిర్మాణ ప‌నుల‌కు ముఖ్య‌మంత్రి లాంఛ‌నంగా శంకుస్థాప‌న చేశారు. కేంద్ర మంత్రితో క‌లిసి కొబ్బ‌రికాయ కొట్టి ప‌నుల‌కు అంకురార్ప‌ణ చేశారు. రూ.834 కోట్ల‌తో చేప‌డుతున్న ఈ ప్రాజెక్టును మూడు సంవ‌త్స‌రాల‌లో పూర్తి చేసి గిరిజ‌న విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతామని ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో భాగంగా ముందుగా హెలికాప్ట‌ర్ ద్వారా మెంటాడ మండ‌లం చిన‌మేడ‌ప‌ల్లి చేరుకున్నారు. అక్క‌డ ఏర్పాటు చేసిన శిలాఫ‌ల‌కాన్ని ఆవిష్క‌రించి నిర్మాణ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. అక్క‌డ నుంచి ద‌త్తిరాజేరు మండ‌లం మ‌ర‌డాం వ‌ద్ద ఏర్పాటు చేసిన స‌భాస్థలికి నేరుగా హెలికాప్ట‌ర్ ద్వారా చేరుకున్నారు. అక్క‌డ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో విద్యార్థుల‌ను, ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ముఖ్య‌మంత్రి ప్రసంగించారు. 

గిరిజ‌న ప్రాంత ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అద్దంప‌డుతూ ఏర్పాటు కాబోతున్న‌ కేంద్రీయ విశ్వ విద్యాల‌యం మ‌రో మైలురాయి వంటిద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి.ఎస్ అన్నారు. దీని ద్వారా ఇక్క‌డ యువ‌త‌కు బంగారు భ‌విష్య‌త్తు ల‌భిస్తుంద‌ని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో భాగంగా మ‌ర‌డాం వ‌ద్ద ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో క‌లెక్ట‌ర్ ప్రారంభోపాన్యాసం చేశారు. విశ్వ విద్యాల‌యం ఏర్పాటులో భాగంగా చేప‌ట్టిన భూసేక‌ర‌ణ‌, ఇత‌ర చ‌ర్య‌ల గురించి వివ‌రించారు. 561 ఎక‌రాల భూమిని యూనివ‌ర్శిటీ యాజ‌మాన్యంకు అప్ప‌గించామ‌ని గుర్తు చేశారు. 42 నెల‌ల్లో గుర్తించిన ఈ ప్రాంతంలో విశ్వ‌విద్యాల‌య నిర్మాణ ప‌నులు పూర్తి అయిపోతాయ‌ని అన్నారు. గిరిజ‌న ప్రాంత ప్ర‌జ‌ల క‌ళ‌లు, సంస్కృతీ సంప్ర‌దాయాల‌కు యూనివ‌ర్శిటీ చ‌క్క‌ని వేదిక‌గా మారుతుంద‌ని పేర్కొన్నారు. విద్య‌, ప‌రిశోధ‌న‌లు మ‌రింత పెరుగుతాయ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. వ‌ల‌స‌లు ఆగిపోతాయ‌ని, చ‌క్క‌ని ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని అన్నారు. రూ.834 కోట్ల‌తో నిర్మాణాలు జ‌రుగుతాయ‌ని, మొద‌టి ద‌శ‌లో భాగంగా రూ.420 కోట్ల‌తో కొన్ని ప‌నులు ప్రారంభ‌య్యాయ‌ని చెప్పారు. ఇప్ప‌టికే ఏయూ భ‌వ‌నాల్లో తాత్కాలిక త‌ర‌గ‌తులు ప్రారంభ‌మ‌య్యాయ‌ని క‌లెక్ట‌ర్ గుర్తు చేశారు. యూనివ‌ర్శిటీ నిర్మాణంలో భాగంగా రోడ్లు, తాగునీటి స‌దుపాయం, విద్యుత్ ఇత‌ర మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు, రైతుల‌కు న‌ష్ట ప‌రిహారం చెల్లింపు నిమిత్తం రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.58.49 కోట్లు వెచ్చిస్తోంద‌ని వివ‌రించారు. అనంత‌రం కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్, రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిల‌ను డిప్యూటీ సీఎం రాజ‌న్న‌దొర‌, జిల్లా యంత్రాంగం స‌త్క‌రించి బొబ్బిలి వీణ‌ల‌ను బ‌హూక‌రించారు. వీసీ క‌ట్టిమ‌ణి

కేంద్రీయ గిరిజ‌న విశ్వ విద్యాల‌యం ఏర్పాటులో కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల స‌హ‌కారం మ‌రువ‌లేనిద‌ని వైస్ ఛాన్సలర్ క‌ట్టిమ‌ణి అన్నారు. స‌భ‌లో భాగంగా ఆయ‌న మాట్లాడుతూ, స్థానికంగా అందుతున్న స‌హ‌కారం, కేంద్రం నుంచి వ‌స్తున్న స‌హ‌కారం గురించి వివ‌రించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం అనుకున్న స‌మ‌యానికి 561 ఎక‌రాల‌ భూమిని అప్ప‌గించింద‌ని చెప్పారు. రోడ్లు, విద్యుత్‌, తాగునీటి స‌దుపాయం కోసం పూర్తి స‌హ‌కారం అందిస్తోంద‌ని గుర్తు చేశారు. భూములిచ్చిన రైతుల‌కు స‌కాలంలో న‌ష్ట ప‌రిహారం చెల్లించి ప్ర‌క్రియ‌ను స‌జావుగా నిర్వహించింద‌ని కితాబిచ్చారు. ఈ ప్రాంతంలో గిరిజ‌న యూనివ‌ర్శిటీ రావ‌టం విప్ల‌వాత్మ‌క‌మైన మార్పుకు సంకేత‌మ‌ని పేర్కొన్నారు. గిరిజ‌న ప్రాంత విద్యార్థుల‌కు ఇదొక వ‌ర‌మ‌ని, మాతృభాష‌లో విద్యాభ్యాసం చేసే విద్యార్థుల‌కు చ‌క్క‌ని అవ‌కాశ‌మ‌ని అన్నారు. యూనివ‌ర్శిటీ ఏర్పాటుతో ఈ ప్రాంతంలో విప్లవాత్మ‌క‌మైన మార్పు వ‌స్తుంద‌ని జోస్యం చెప్పారు. 

అనంత‌రం కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్, రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిల‌ను దుశ్శాలువాల‌తో స‌త్క‌రించి జ్ఞాపిక‌ల‌ను బ‌హుక‌రించారు. కార్య‌క్ర‌మంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, డిప్యూటీ సీఎం పీడిక రాజ‌న్న‌దొర‌, జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాసరావు, అర‌కు ఎంపీ గొడ్డేటి మాధ‌వి, రాష్ట్ర ఉన్న‌త విద్యాశాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ జె. శ్యామ‌ల‌రావు, వీసీ క‌ట్టిమ‌ణి, జిల్లా క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి.ఎస్, ఎమ్మెల్సీలు సురేష్ బాబు, ర‌ఘురాజు, ఎమ్మెల్యేలు అల‌జంగి జోగారావు, క‌డుబండి శ్రీ‌నివాస‌రావు, బొత్స అప్పల‌న‌ర‌స‌య్య‌, శంబంగి చిన వెంక‌ట అప్ప‌ల‌నాయుడు, పుష్ప శ్రీ‌వాణి, ఎస్టీ క‌మిష‌న్ ఛైర్ ప‌ర్శ‌న్ డా.జి.వి.జి. శంక‌ర‌రావు, ఇత‌ర అధికారులు, ప్ర‌జా ప్ర‌తినిధులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Salur

2023-08-25 15:46:58

ఆ ప్రకటనలు ప్రసారం చేస్తే కఠిన చర్యలు తప్పవు

కేంద్ర ప్ర‌భుత్వం గ్యాంబ్లింగ్‌, ఆన్‌లైన్‌ బెట్టింగ్ కార్యకలాపాలకు సంబంధించికీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్రస్తుతం ఆన్ లైన్ మోసాలు దేశ వ్యాప్తంగా అత్యధికంగా జరుగుతు న్నందున ప్రభుత్వం హెచ్చరిక జారీచేసినట్టు తెలుస్తుంది. బెట్టింగుల తరహా కార్యకలాపాలను నిర్వహించే వేదికలకు సంబంధించిన ప్రకటనలను ప్ర‌చురించ‌డం లేదా ప్ర‌సారం చేయ‌డం మానుకోవాల‌ని వార్తాపత్రికలు, టీవీ ఛానళ్లు, డిజిటల్‌ మీడియా, సామాజిక మాధ్యమ సంస్థలకు అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆన్ లైన్ బెట్టింగ్ లకు సంబంధించిన అనేక రకాల యాప్ లు అందుబాటులో ఉన్నాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి అనేక మంది వీటి భారీన పడి లక్షలాది రూపాయలు మోసాలకు గురవుతున్నారు. దీనితో వీటిని పూర్తిగా నిషేధించే క్రమంలో కేంద్రం జారీ చేసింది. ఈ ఉత్తర్వులను పాటించని సంస్థలు న్యాయపరమైన చర్యలను ఎదుర్కోవా ల్సి ఉంటుంది. ఆన్ లైన్ మోసాలపై ప్రతినిత్యం వేలల్లో కేసులు నమోదవుతున్నాయి.

New Delhi

2023-08-25 11:33:39