1 ENS Live Breaking News

గుండెపోటు మరణాలపై మౌనమేల.. ఒకేరోజు 4గురు సచివాలయ ఉద్యోగులు మృతి..!

ఆంధ్రప్రదేశ్ లోని స్వర్ణవార్డు, స్వర్ణ గ్రామ పంచాయతీ ఉద్యోగుల గుండెపోటు మరణాలపై కూటమి ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు.. రోజుకి ఒకరు మృత్యువాత పడుతున్న సంఖ్య సోమవారం ఒకేరోజు నాలుగు మరణాల నమోదుకి వేదికైంది.. అధికారుల పనిఒత్తిడి.. వేధింపులు.. అనధికార బిఎల్వో విధులు, టార్గెట్లు, బెదిరింపులే ఉద్యోగుల గుండెపోటు మరణాలకు కారణమని తెలిసినా ప్రభుత్వం ఒక్క ప్రకటన కూడా చేయడం లేదు.. సర్వేల ఒత్తిడి కూడా సిబ్బందికి తగ్గించడం లేదు.. వెరసీ సచివాలయ ఉద్యోగంలోకి వచ్చిన పాపానికి కుటుంబ సభ్యులకు గుండెకోత మిలిచ్చి.. గుండె ఆగి మృత్యువాత పడుతున్నారు సచివాలయ సిబ్బంది.. చెట్టంత పిల్లలు కళ్లెదుటే గుండెపోటుతో పిట్టల్లా రాలిపోతున్నా.. కూటమి సర్కారు స్పందించకపోవడం పట్ల  కటుంబు సభ్యులు,  ఉద్యోగుల సంఘాల్లో తీవ్ర వ్యతిరేకత, నిరసన వ్యక్తం అవుతున్నాయి.


స్వర్ణవార్డు, స్వర్ణ గ్రామ పంచాయతీ (గ్రామ,వార్డు సచివాలయ)శాఖలో ఒకేరోజు నలుగురు ఉద్యోగులు మృత్యువాత పడటం..అందులోనూ ఒకరు బ్రెయిన్ స్ట్రోక్ తో మరణించడం ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఒక్కరోజులో తూర్పుగోదావరి జిల్లాకి చెందిన డొంక విజయ్ కలవలపల్లి పంచాయతీలో పనిచేస్తూ.. గుండెపోటుతో మృతిచెందారు. అదేవిధంగా బ్రెయిన్ స్ట్రోక్ తో తూర్పుగోదావరి జిల్లా బుచ్చయ్యపేటలోని సచివాలయ ఉద్యోగి లక్ష్మణరావు మృతిచెందారు. ఇక గుంటూరు జిల్లాలో ఏఎన్ఎంకి కె.సుజాతకి గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించి సర్జరీ చేస్తున్న సమయంలో మృతిచెందారు. ఒంటిమిట్ట ప్రాంతంలో పంచాయతీ కార్యదర్శిని లారీ ఢీకొనడంతో సురేష్ అనే ఉద్యోగి మృతిచెందారు. 

పరమ పవిత్రమైన శివరాత్రి పర్వదినాన నలుగురు సహచర ఉద్యోగులను కోల్పోయి న ఉద్యోగులకు వీరి మరణాలు కలవరపాటుకి గురిచేస్తున్నాయి. కళ్లముందే ఉద్యోగులు పిట్టల్లా రాలిపోతున్నా.. మండలాల్లోని ఎంపీడీఓలుగానీ.. పట్టణాల్లోని మున్సిపల్ జోనల్ కమిషనర్లు గానీ, జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్లు గానీ సచివాలయ ఉద్యోగుల మరణాలపై చిన్న ప్రకటన కూడా చేయకపోవడం వెనుక పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకప్పుడు ఏదైనా రోగం వస్తే ప్రజలు మృతిచెందేవారు.. కానీ ఇపుడు సచివాలయంలో ఉద్యోగం వస్తే.. వాళ్లకి ఎప్పుడైనా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, సుగర్, బీపీతోపాటు ఎర్లీ డెత్ కూడా వీరిపై అదనపు విధులను బలవంతంగా రుద్దే అధికారుల ద్వారా వచ్చేస్తున్నది. దాని ప్రభావం సచివాలయ ఉద్యోగుల అందరిపైనా పడటంతో.. కొందరు పిట్టల్లా రాలిపోతుంటే.. మరికొందరు.. మానసిక వేధనను అనుభవిస్తున్నారు.

-వలసవెళ్లిపోతున్న సచివాలయ ఉద్యోగులు
సచివాలయశాఖలోని పనిచేసి ప్రాణాల మీదకు తెచ్చుకునే కంటే.. ఇతర ప్రభుత్వశాఖల్లోనో.. సాఫ్ట్ వేర్ రంగంలో భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్న ఉద్యోగులు డిఎస్సీ రాసి ఉపాధ్యాయులుగానూ, ఎపీపీఎస్సీ రాసి గ్రూప్-2, గ్రూప్-1 అధికారుల గానూ, మరికొందరు రియలెస్టేట్ రంగానికి వెళ్లిపోతున్నారు. ఇలా వెళ్లిపోయిన వారి సంఖ్య ఇటీవల వచ్చిన వివిధ జాబ్ నోటిఫికేషన్ల ద్వారా సుమారు 1000 మంది వరకూ సిబ్బంది ఖాళీ అయిపోయారు. రానున్న రోజుల్లో నోటిఫికేషన్లు పడితే మొత్తం స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామపంచాయతీ ఉద్యోగులందరూ ఖాళీ అయిపోయినా ఆశ్చర్య పోనవసరం లేదు. ఎందుకంటే ఈ శాఖలో పనిచేసి ప్రాణాలు పోగొట్టుకునే కంటే.. ఇతర ఉద్యోగాల్లో భవిష్యత్తు చూసుకోమని ఉద్యోగుల తల్లిదండ్రులు వారి పిల్లలకి సూచిస్తున్నారు. మరికొందరు లాంగ్ లీవ్ పెట్టి ఎపీపీఎస్సీకి సుదీర్ఘంగా పోటీ పడుతున్నారు. ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం గుర్తించకుండా ఉద్యోగులపై అదనపు పనిభారాన్ని మోపుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

సచివాలయ ఉద్యోగుల గుండెపోటు మరణాలను  రాష్ట్రప్రభుత్వం రాజకీయ కోణంలోనే చూస్తుందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి... ఈ ప్రభుత్వశాఖను వైఎస్సార్సీపీ ఏర్పాటు చేయడం వలనే ఉద్యోగులు పిట్టల్లా రాలిపోతున్నా రాష్ట్రప్రభుత్వం పట్టించుకోకపోగా.. మరణాలపై విచారణ కూడా చేయడలేదని.. జాతీయ మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదులు నమోదైనా కనీసం పట్టనట్టు వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఏపీఈపీడీసీఎల్ లోని ఎనర్సీ అసిస్టెంట్ల మరణాలు, మంచానికే పరిమితం అయిన వారి విషయంలో జాబితాల ఇవ్వాలని ఎన్ హెచ్ఆర్సీ ఆదేశించినా.. నేటికి సమాచారం పూర్తిస్థాయిలో ఇవ్వకపోవడానికిగల కారణం కూడా రాజకీయ కోణమే ఉందని సచివాలయ ఉద్యోగులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు.

-న్యాయపోరాటంతోనే మరణాలు ఆగుతాయి..ప్రయోజనాలొస్తాయి
గ్రామ, వార్డు సచివాలయ(స్వర్ణవార్డు, స్వర్ణ గ్రామ పంచాయతీ) శాఖలోని మరణ మృదంగం ఆగాలన్నా.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 309, రూల్ 28, ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్టినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం ఉద్యోగులకు పదోన్నతులు రావాలన్నా ఒక్క న్యాయపోరాటమే దిక్కని సచివాలయ ఉద్యోగులు భావిస్తున్నారు. దానికోసం భారీ ఎత్తున ఆందోళనకు సిద్దపడుతున్నారు. న్యాయస్థానాలను ఆశ్రయించడానికి సిద్దపడుతున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో ఈశాఖపై వేసిన కేసులు పెండింగ్ లో ఉండగానే ఉద్యోగులు తమకు జరుగుతున్న అన్యాయం, విధినిర్వహణలో ఉద్యోగులు భారీ సంఖ్యలో మృత్యువాత పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపైనా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. 

ఈవిషయంలో ఉద్యోగులకు ఎవరికి ఫిర్యాదు చేసినా అది బుట్టదాఖలే అవుతుందని.. ఈ విధానంలో మార్పు రావాలన్నా.. ఉద్యోగుల ప్రాణాలు నిలబడాలన్నా.. సమస్యలు పరిష్కారం అవ్వాలన్నా ఒక్క న్యాయపోరాటమనే దిక్కని.. న్యాయస్థానాలు మాత్రమే తమకి ఆఖరి మజిలీ అని ఉద్యోగులు ముక్త కంఠంతో బలమైన వాణి విపిస్తున్నారు. ఈ విషయంలో పోలీసులు ఎక్కడికక్కడ ఉద్యోగుల వాట్సప్ గ్రూపుల్లోకి ఎంటర్ అయి.. ఉద్యోగుల కదలికలపై కన్నేసినా.. వాళ్లపని వాళ్లు చల్లగా చేసుకెళ్లిపోతున్నారు. ఏది ఏమైనా సచివాలయశాఖలో పెద్ద ఎత్తున సంభవిస్తున్న గుండెపోటు మరణాలపై ప్రభుత్వం ప్రకటన చేయపోవడంపై సచివాలయ ఉద్యోగుల కటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమనకి పట్టించుకోని ప్రభుత్వానికి తాము రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నామని కూడా బహిరంగంగానే చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తుందో వేచి చూడాల్సిందే..?!

visakhapatnam

2026-02-16 18:42:18

కోర్టుకేసులుండగా పదోన్నతులు ఎలా..? త్రిశంఖు స్వర్గంలో మహిళా పోలీసులు..!

గ్రామ, వార్డు సచివాలయ శాఖ మహిళా పోలీసుల నియమాకాలు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నియమాలకు విరుద్దమనే కేసు హైకోర్టులో పెండింగ్ లోఉంది.. అసలు మహిళా పోలీసులకు రాష్ట్రప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని రాష్ట్రప్రభుత్వం దాఖలు చేసిన అఫడవిట్ కోర్టు కూడా దాఖలైంది.. మీకు ఐసీడీఎస్ కావాలో.. పోలీసు శాఖ కావాలో ఎంచుకోవాలనే రెండు డిపార్ట్ ఆప్షన్లు ఇచ్చిన డేటా ఏమైందో తెలీదు.. 10 మంది మంత్రులతో కూడి క్యాబినెట్్ సబ్ కమిటీ ఏం నివేధిక ఇస్తుందో అసలే తెలీదు.. కానీ  స్వర్ణవార్డు.. స్వర్ణ గ్రామ పంచాయతీలలో పనిచేసే మహిళా పోలీసులు మాత్రం నేటికీ గాల్లోనే ఉన్నారు.. సచివాలయ సిబ్బందికి పదోన్నతులు ఇస్తామని ప్రభుత్వం ప్రపకటించిన వేళ.. వీటిని దాటుకొని ఏ విధంగా పదోన్నతులు కల్పిస్తారన్నదే ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్.. ఇంత జరుగుతున్నా కూటమి ప్రభుత్వం సచివాలయశాఖకు కనీసం సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ అసలు ఏర్పాటే చేయలేదు.. మరి పదోన్నతులు ఏ విధంగా ఇస్తుంది..?! ఎలా ఉద్యోగులకు మేలు చేస్తుంది..?

ఆంధ్రప్రదేశ్ లోని 75వ ప్రభుత్వశాఖగా ఏర్పాటైన గ్రామ, వార్డు (స్వర్ణ గ్రామం, స్వర్ణవార్డు) సచివాలయ శాఖలోని ఉద్యోగులకు ప్రభుత్వం పదోన్నతులు ఇచ్చేస్తుందని జరుగుతున్న ప్రచారం నుంచి అనేక అంశాలు ఇపుడు తెరపైకి వస్తున్నాయి. 2019 అక్టోబరు 1 నుంచి ప్రారంభమై ఈ సచివాలయ శాఖ ఉద్యోగుల విషయంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం, నేటి కూటమి ప్రభుత్వం రెండూ దొందూ దొందూగానే వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వానికి అవసరం అయితే రాత్రికి రాత్రే జీఓలు తెస్తోంది కానా.. ఉద్యోగుల పదోన్నతులు, సర్వీసు నిబంధనలు, నోషనల్ ఇంక్రిమెంట్లు, ఇతర ప్రయోజనాలపై మాత్రం ఒక్క ప్రకటన కూడా చేయడం లేదు. ఓ ప్రక్క సచివాలయ ఉద్యోగులు అధికారులు పెట్టే పని ఒత్తిడి తట్టుకోలేక పిట్లల్లా రాలిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇతర ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తున్న వేళ ప్రభుత్వ సీఎస్ చేసిన ప్రకటన.. సచివాలయ ఉద్యోగుల్లోనూ.. అందులోనూ మహిళా పోలీసుల్లోనూ ఆనందాన్ని కలిగించినా.. వాస్తవ పరిస్థితులు దీనికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. 

మహిళా పోలీసుల విషయంలో కోర్టు కేసులు పెండింగ్ లో ఉండగానే కూటమి ప్రభుత్వం వీరికి రెండు ప్రభుత్వ శాఖల ఆప్షన్లు ఇచ్చింది. అయితే దానిపై క్లారిటీ లేకపోవడం చాలా మంది ఆ రెండు ప్రభుత్వశాఖల ఆప్షన్లు ఎంచుకోలేదు. ఇపుడు మళ్లీ పదోన్నతులు అంశం తెరపైకి రావడంతో కోర్టు కేసులు పెండింగ్ లో ఉండగా ఏ విధంగా తమకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని మహిళా పోలీసులు పెద్ద చర్చకు తెరలేపారు. అసలు ఉద్యోగులు విధినిర్వహణలో గుండాగి మృతిచెందుతున్నా పట్టించుకోని ప్రభుత్వం.. ఆర్ధికపరమై అంశాన్ని ఎక్కడ అమలు చేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగులతో వెట్టిచాకిరీ చేయించుకోవడంతోపాటుగా.. శివరాత్రి శైవ క్షేత్రాల్లో పురుషుల మరుగు దొడ్ల వద్ద ప్రత్యే విధులు నిర్వహించాలని మహిళా పోలీసులపై ఉత్తర్వులు జారీ చేయడం, వీధుల్లోని కుక్కలు ఎన్నున్నాయో లెక్కించాలంటూ మహిళా శానిటేషన్ లకు ప్రత్యేక విధులు అప్పగించడం వంటి చర్యలతో తలలు పట్టుకుంటున్న వేళ.. పదోన్నతుల అంశం కూడా పెద్ద చర్చకు వస్తోంది.

ఇప్పటికే రెండు మూడు ప్రభుత్వశాఖల ఉద్యోగులకు పదోన్నతులు కల్పించిన రాష్ట్రప్రభుత్వం మిగిలిన ప్రభుత్వశాఖల సిబ్బంది పదోన్నతులు కల్పించలేదు. దీనితో ఆగ్రహం వ్యక్తం చేసిన ఉద్యోగులే సచివాలయ వ్యవస్థ పరిపాల నపైనా రాజ్యాంగ భద్దం ఏర్పాటైన ఈ సచివాలయ శాఖ పరిపాలనపై సమాచారహక్కు చట్టం క్రింద 20 అంశాలకు సంబంధించి సమాచారం కావాలంటూ అర్జీ పెట్టాడు. వాస్తవానికి ఆ సమాచారం ఇస్తే రాష్ట్రప్రభుత్వం పక్కాగా దొరికిపోయినట్టే.. అందులో ఉద్యోగుల పదోన్నతులు, విధినిర్వహణలోని మరణాలు, నోషనల్ ఇంక్రిమెంట్లు.. సర్వీసు రూల్స్, ఉద్యోగులకు పీఆర్సీ ప్రయోజనాలు, ప్రత్యేక ఇంక్రిమెంటు, ఉద్యోగులకు కల్పించాల్సిన మౌళిక సదుపాయాలు తదితర అంశాలు ఉన్నాయి. దానికి సమాచారం ఇచ్చినా.. అటు కోర్టుకేసులో ఉండగా పదోన్నతి కల్పించినా.. అంది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు అవుతుంది. అలాంటి సమయంలో అసలు ప్రభుత్వం మహిళా పోలీసులకు పదోన్నతులు కల్పిస్తుందా.. లేదంటే కంటి తుడుపు చర్యగా ప్రకటన చేసిందా అని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గోడు ఎవరికి చెప్పుకోవాల తెలియడం లేదని.. ఆర్టికల్ 309, రూల్ 28కి అధిపతిగా ఉన్న గవర్నర్ కూడా స్పందించని సమయంలో తమ పరిస్థితి ఏంటని  మహిళా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అందరికీ పదోన్నతులు వచ్చినా తాము మాత్రం ఇలాగే ఉండిపోవాలా..? లేదంటే త్రిశంఖు స్వర్గంలో తేలిపోవాలా అంటూ వాపోతున్నారు. ఈనేపథ్యం క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ఏం చెబుతుంది.. దాని ఆధారంగా ఏ ప్రభుత్వశాఖల్లోకి వీరికి పంపిస్తారు.. ఏ తరహా పదోన్నతులు ఇస్తారనే విషయం తేలాల్సి ఉంది..?!

visakhapatnam

2026-02-14 05:50:25

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త..?!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు-ఈఎన్ఎస్ వరుస కథనాలపై స్పందించింది.. స్వర్ణవార్డు, స్వర్ణ పంచాయతీ ఉద్యోగులకు(గ్రామ, వార్డు సచివాలయశాఖ) రాష్ట్రప్రభుత్వం శుభవార్త చెప్పనుంది.. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పదోన్నతులు ఇచ్చి ఉగాది నాటికి ప్రక్రియ పూర్తిచేయాలని యోచిస్తున్నది.. దానికోసం అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులతోపాటు.. సచివాలయశాఖలోని ఉద్యోగుల వివరాలు, సీనియారిటీ, మెరిట్ లిస్టులను కూడా సిద్దం చేయాలని అన్ని ప్రభుత్వశాఖలకు ఆదేశాలు జారీ అయ్యాయి. సచివాలయ ఉద్యోగులందరూ ఇతర 74 ప్రభుత్వశాఖల్లోని మాతృశాఖలకు చెందిన ఉద్యోగులు కావడంతో ఇపుడు వీరికి కూడా లైన్ క్లియర్ అవనుంది. అయితే కోర్టు కేసులు కారణంగా మహిళా పోలీసుల విషయంలోనే అవాంతరాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఇప్పటికే ప్రభుత్వం రెండు ఆప్షన్లు ఇచ్చినా దానిపై అతీగతీ లేదు.. దీనితో తమ పరిస్థితి ఏమౌతుందోనని మహిళా పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని 75 ప్రభుత్వశాఖలుంటే 74 ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు, అధికారులు ఒకేసారి వేల సంఖ్యలో రిటైర్ అయిపోతున్నారు. వాస్తవానికి రెండేళ్ల క్రితమే రిటైర్ కావాల్సి ఉన్నా.. గత ప్రభుత్వం వీరి ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచేయడంతో అది కాస్తా ఆలస్యమై ఇపుడు ఏక బిగిన అన్ని ప్రభుత్వశాఖల్లోని ఉద్యోగులు ఒకేసారి రిటైర్ అయిపోతున్నారు. ఈ క్రమంలో అన్నిప్రభుత్వశాఖల్లోని ఖాళీలు భర్తీచేయాలంటే రాష్ట్రప్రభుత్వం ఆ సాహసం చేయలేదు. దానితో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయశాఖలోని ఉద్యోగులను ఇతర ప్రభుత్వశాఖల్లోని డిప్యూటేషన్లు పంపడంతో పాటు.. ఉన్నావారిలో కొందరికి పదోన్నతులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ అంశాలనికి సంబంధించి పది మంది మంత్రులతో కూడా క్యాబినెట్ సబ్ కమిటీ కూడా రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసింది. 

దేశంలో ఎక్కడా.. ఏ రాష్ట్రప్రభుత్వంలోనూ లేని విధంగా.. ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే నియామకాలు చేసిన మాతృశాఖలోని ఉద్యోగులకు ఏ విధంగా పదోన్నతులు ఇవ్వాలనే అంశంపై క్యాబినెట్ సబ్ కమిటీ వేసి అధ్యయం చేసింది. ఈ నేపథ్యంలో ఇతర ప్రభుత్వశాఖల్లోని అధికారులు, సిబ్బంది కూడా వేల సంఖ్యలో రిటైర్ కావడంతో.. ఆ ఖాళీలను భర్తాచేయడానికి రాష్ట్రప్రభుత్వం క్లస్టర్ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాలను కుదించేసింది... అనగా ఇక్కడి సిబ్బందిని కేటగిరీలుగా విభజించి ఉద్యోగుల సంఖ్య తగ్గించేసింది. అలా తగ్గించేయగా వచ్చిన సిబ్బందిని పోస్టులు మిగిలిపోయిన సిబ్బందిని ఇతర ప్రభుత్వశాఖల్లోకి సర్దుబాటు చేసేందుకు ఆరునెలల క్రితమే జీఓలు జారీ చేసింది.  అప్పటి నుంచి ఇప్పటి వరకూ కుస్తీ పడితే  ప్రాధాన్యత కలిగిన ప్రభుత్వశాఖల్లోకి సర్ధబాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసింది.

ఇక మిగిలిన సిబ్బంది వివరాలను సీనియారిటీ లిస్టు తయారు చేసి వారికి పదోన్నతులు ఇవ్వనుంది. భారతదేశంలోనే సర్వీసు రూల్స్ లేకుండా, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయకుండా ఆరున్నరేళ్లు సిబ్బందితో ఉద్యోగాలతోపాటు అదనపు పనులు చేయించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది. అంతేకాకుండా అదనపు పని ఒత్తిడి ఉద్యోగులపై పెట్టి అత్యధిక సంఖ్యలో ఉద్యోగుల గుండెపోటు, బలవన్మరణాలకు కారణం కూడా అయ్యింది. ఉద్యోగుల మరణాల పరంపర రోజుకి ఒకరు లేదా వారికి ముగ్గురు చొప్పుగ గత ఆరునెలలుగా మరణ మృదంగం కొనసాగుతూనే వుంది. ఉద్యోగులు ఆందోళన సిద్దపడి.. కోర్టులో కేసులు వేయడానికి సిద్దపడిన తరుణంతో రాష్ట్రప్రభుత్వం మేల్కొని ఇపుడు ఇపుడు ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వడానికి సిద్దపడింది. పదోన్నతులు ఇవ్వడానికి అయితే ముందుకి వచ్చింది కానీ.. ఉద్యోగులకు ఇవ్వాల్సిన రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు సంగతీ తేల్చలేదు. పదోన్నతులు ఇచ్చే క్రమంలే ఏ సర్వీసే నిబంధనల ఆధారంగా పదోన్నతులు ఇస్తుందో కూడా క్లారిటీలేదు. కాకపోతే అన్నిప్రభుత్వశాఖల ఉద్యోగులతోపాటు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా పదోన్నతులు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది. అయితే ఎంతమందికి పదోన్నతులు వస్తాయి..? కోర్టు కేసులున్న మహిళా పోలీసులకు పదోన్నతులు ఇస్తుందో, లేదంటే ఇచ్చిన రెండు ఆప్షన్లలలోకి సర్దు బాటు చేస్తుందా అనేది తేలాల్సి ఉంది..?!

visakhapatnam

2026-02-05 16:36:56

గుండెపోటుతో విధినిర్వహణలోనే కుప్పకూలిపోయిన సచివాలయ ఉద్యోగి..!

కూటమి ప్రభుత్వంలో అధికారులు పెట్టే అధిక పనిభారం వేధింపులతో స్వర్ణవార్డు, స్వర్ణ గ్రామ పంచాయతీ(సచివాలయ) ఉద్యోగుల గుండెపోటుతో పిట్టల్లా రాలిపోతున్నారు.. గత ఏడాది ఒక్క డిసెంబరులోనే 15 మంది మృతిచెందితే.. 2026 జనవరిలో విశాఖ జివిఎంసీ పరిధిలోని ఆరిలోవ శివాజీ నగర్ -2 సచివాలయంలో టౌన్ ప్లానింగ్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న సందక ఉదయ్ మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు.. బిఎల్వో విధులు చేస్తూనే.. ఉన్నచోటే కుప్పకూలిపోయాడు..వెంటనే సహచర ఉద్యోగులు ఆరిలోవ హెల్త్ సిటీకి తరలించినా ఫలితం లేకపోయింది.. అప్పటికే ఉదయ్ మృతిచెందారని వైద్యలు నిర్ధారించారు.. దీనితో జీవిఎంసీలోని అన్ని స్వర్ణ వార్డుల్లో విషాదం నెలకొంది. విశాఖ జివిఎంసీ పరిధిలో సచివాలయ ఉద్యోగుల్లో రెండు నెలల్లో ఇది రెండవ గుండెపోటు మరణ కావడం విశేషం..రాష్ట్రంలో ఏ ప్రభుత్వశాఖలోనూ లేని విధంగా ఒక్క స్వర్ణవార్డు, స్వర్ణ గ్రామ పంచాయతీ(సచివాలయ) ఉద్యోగులు గుండెపోటుకి బలికావడం ఇతర ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తున్నది..!

కూటమి ప్రభుత్వంలోని ఐఏఎస్ అధికారులు సచివాలయ ఉద్యోగులపై అధిక పనిభారం మోపి.. తద్వారా జరిగే గుండెపోటు మరణాలతో స్వర్ణవార్డు, స్వర్ణ గ్రామ పంచాయతీ(సచివాలయ) ఉద్యోగుల ద్వారా జనాభా నియింత్రణకు పూనుకున్నట్టు కనిపిస్తున్నది. రాష్ట్రంలోని ఒక్క విశాఖపట్నం జిల్లాలోని జీవిఎంసీ పరిధిలో రెండు నెలల్లో ఇద్దరు సచివాలయ ఉద్యోగులు విధినిర్వహణలోనే గుండెపోటుతో మృత్యువాత పడ్డారంటే ఇక్కడి అధికారుల పని ఒత్తిడి వేధింపులు ఏ విధంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఎన్నికల కమిషన్ హేండ్ బుక్ నిబంధనలకు విరుద్దంగా సచివాలయాల్లోని ఉద్యోగులకు అదనపు పని భారంగా బిఎల్వో విధులు అప్పగించడంతో పాటు.. చెప్పిన సమయానికి  ఇచ్చిన టార్గెట్లు పూర్తిచేయకపోతే సంక్రాంతికి సెలవులు ఇచ్చేది లేదని హుకుం జారీ చేయడంతో ఉద్యోగులు గత 15 రోజులుగా ఇళ్లకి ఏ సమయానికి వెళుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. వారం వారం రివ్యూలు.. ప్రతీరోజూ టెలీ కాన్ఫరెన్సులు.. పెట్టి ఉద్యోగులపై పనిభారాన్ని పెంచడంతోపాటు..అధికారులు దారుణంగా వేస్తున్నారు. 

అంతేకాదు.. జీవిఎంసీ పరిధిలోని అన్ని జోన్ లలో పనిచేస్తున్న స్వర్ణవార్డు ఉద్యోగులకు ఇచ్చిన టార్గెట్లు పూర్తిచేయకపోతే జోన్ కమిషనర్లు జోన్ కార్యాలయాలకు పిలిచి మరీ పనులు చేయిస్తున్నారు. ఓటరు లిస్టులకి సంబంధించి ఓటర్లు ఉన్నా లేకపోయినా అధికారులకు అనవసరం.. వాళ్లకిచ్చిన టార్గెట్లు మాత్రం పూర్తవాల్సిందేనని ఉద్యోగులను వేధిస్తున్నారు. దీనితో పని ఒత్తిడికి లోనవుతున్న ఉద్యోగులు గుండెపోటుతో మృత్యువాత పడుతున్నారు. ఇలానే ఆరిలోవ శివాజీ నగర్ -2 సచివాలయంలో టౌన్ ప్లానింగ్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న సందక ఉదయ్ మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు.. ఈరోజు  ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సమయంలోనే ఉదయ్ గుండెపోటుతో మృతిచెందడంతో ఇతర ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయాన్ని సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు జాతీయ మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు కూడా చేశారు. రాజకీయనాయకుల సోషల్ మీడియా ప్రచారాలపై పోలీసులు కేసులు పెట్టే ప్రభుత్వం.. సచివాలయ ఉద్యోగులను వేదించి, నిబంధనలకు విరుద్దంగా పనిభారం మోపి ఉద్యోగులు గుండెపోటు మరణాలకు గురైతే మాత్రం రాష్ట్రప్రభుత్వం అందకు సంబంధించి ఏ ఒక్క అధికారిపై చర్య తీసుకోవడం లేదు. 

ఆరున్నరేళ్లుగా ఎలాంటి ప్రయోజనాలకు నోచుకోని సచివాలయ ఉద్యోగులు.. రోజు రోజుకీ పనిభారం మోస్తున్నారు. తమకు రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని ప్రభుత్వానికి అర్జీపెట్టినా పట్టించుకోకపోవడంతో.. ఉద్యోగులు తమ అర్జీలను పట్టించుకోవాలని.. పరిగణలోనికి తీసుకోవాలని హైకోర్టుని సైతం ఆశ్రయించారంటే ఉద్యోగులను ప్రభుత్వం ఏ స్థాయిలో ప్రక్కన పెట్టిందో అర్ధం చేసుకోవచ్చు. అలాగని ప్రభుత్వానికి కావాల్సిన ప్రత్యేక పనులు, విధుల కోసం మాత్రం రాత్రికి రాత్రే జీఓలు విడుదల చేస్తున్నదని.. తమకు ఇవ్వాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లు, పదోన్నతులు, సర్వీసు రూల్స్ అమలు చేయాలని మాట్లాడితే మాత్రం అధ్యయనం చేయాలని దానికి చాలా సమయం పడుతుందని ప్రభుత్వం దాటవేత దోరణి అవలంభిస్తున్నది సచివాలయ ఉద్యోగులు వాపోతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా సచివాలయవ్యవస్థపై అనేక కధనాలు వండి వడ్డించిన పెద్ద పత్రికలు, టీవీ ఛానళ్లు ఒక్కసారి వారికేమీ తెలియనట్టుగా మౌనవ్రతం పాటిస్తున్నాయి. 

ఒకటి అరా ఈరోజు-ఈఎన్ఎస్ లాంటి పత్రికలు, మీడియా వాస్తవాలు చూపించినా.. గుండెపోటు మరణాల విషయం విశాఖ జీవిఎంసీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా దాటవేత దోరణి తప్పితే సచివాలయ ఉద్యోగులకు ఎక్కడా న్యాయం మాత్రం జరగలేదు. తమను ఇంతదారుణంగా వేధిస్తున్న ప్రభుత్వానికి తాము ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని సచివాలయ ఉద్యోగులు బహిరంగంగానే వార్నింగులు ఇస్తున్నారు. అయినా విషయం సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలిసినా కూడా పట్టించుకునే నాధుడే లేకపోయాడు. ఏ ప్రభుత్వశాఖలోనైనా ఉద్యోగి మృతిచెందితే సదరు శాఖ అధికారులు ప్రకటిస్తారని.. కనీసం సచివాలయ ఉద్యోగులు ఆ ప్రకటనకు కూడా నోచుకోలేదని.. కారుణనియామకాలకు, ఇతర మరణాంతర ప్రయోజనాలకు కూడా నోచుకోకపోవడం విశేషం. సంక్రాంతి పండుగ వేళ జీవిఎంసీ అధికారుల విధినిర్వహణ ఒత్తిడికి తట్టుకోలేక గుండెపోటుతో కుప్పకూలి మృతిచెందిన సచివాలయ ఉద్యోగి మరణంతోపాటు ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో.. ఏ విధమైన ప్రకటన చేస్తుందో వేచి చూడాలి..?!

visakhapatnam

2026-01-13 18:35:02

సచివాలయ ఉద్యోగులను మాతృశాఖల్లో విలీనం చేయండి..!

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తాము నియామకమైన మాతృశాఖల్లోకి విలీనం చేయాలని.. ఆరున్నరేళ్లుగా కోల్పోయిన ప్రయోజనాలన్నీ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.. కూటమి ప్రభుత్వం 10 మంది మంత్రులతో కూడిన క్యాబినెట్ సబ్ కమిటీ వేసినా.. నేటికీ సదరు కమిటీ ఎలాంటి అంశాలను తెరపైకి తీసుకురాకపోవడంతో తమకు అన్యాయం జరిగేలా ఉందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఈ విషయంలో తమకు ఎలాంటి అన్యాయం జరిగినా ఉద్యోగులం అందరం న్యాయపోరాటానికి దిగుతామని కూడా హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా దానికోసం ముందస్తు కార్యాచరణ కూడా సిద్దం చేసుకోవడం..దానిపై సామాజిక మాద్యమాల్లో పెద్ద చర్చకు తెరలేపడంతోపాటు.. అవకాశం కుదిరినపుడల్లా ప్రత్యేక సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకొని దానిపై మాట్లాడుతుండటం ఇపుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ అవుతోంది..!

గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే తమకు రావాల్సిన ప్రయోజనాలన్నీ కోల్పాయామనుకుంటే.. ఇపుడు కూటమి ప్రభుత్వంలో కూడా ప్రయోజనాలు కోల్పోయేలా ఉన్నామని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీ వేసినా.. దానిపై ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం సేకరించారు.. ఆయా ప్రభుత్వశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలతో ఏమేమి చర్చించారనే విషయాన్ని నేటికీ ఒక్క మంత్రి కూడా ప్రకటించకపోవడం పట్ల ఉద్యోగులందరూ ఆందోళనగా ఉన్నారు. ఇప్పటికే ఒకసారి అధికారిక వాట్సప్ గ్రూపుల్లోనుంచి బయటకు వచ్చేసిన ఉద్యోగులు.. ఇపుడు ఎలాంటి తేడా జరిగినా న్యాయపోరాటినికి దిగాలని నిర్ణయానికి వచ్చినట్టుగా కనిస్తున్నది. దానికంటే ముందు రాజ్యాంగ ప్రతినిధిగా ఉన్న రాష్ట్ర గవర్నర్ ను కలిసి తమ బాధలను చెప్పుకొని.. అప్పటికీ న్యాయం జరగకపోతే ఒకేసారి ఉద్యోగులందరం న్యాయపోరాటానికి దిగుతామని కూడా సంకేతాలు ఇస్తున్నారు. 

అంతేకాకుండా ఇప్పటి వరకూ రాష్ట్రప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల ఏదైనా ప్రయోజనాలు కల్పించలేదు.. అలాంటి ప్రయోజనాలను ఆర్టికల్ 309, రూల్ 28, ఆర్టికల్ 16 ఆధారంగా సచివాలయ ఉద్యోగులకు జరిగిన అన్యాయంపై కోర్టులో కేసుల వేసి న్యాయపోరాటం చేయాలని నిర్ణయానికి వచ్చి.. ఆ దిశగా కార్యాచరణ కూడా సిద్దం చేసుకుంటున్నారట. అయితే దానికంటే ముందు రాజ్యాంగానికి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ కి అధిపతిగా ఉన్న రాష్ట్ర గవర్నర్ ను కలిసి గత ఆరున్నరేళ్లు తాము కోల్పియి ప్రయోజనాలన్నీ వివరించాలని కూడా ఉద్యోగులు సిద్ద పడుతున్నారు. దానికోసం గవర్నర్ అపాయింట్ మెంట్ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. గవర్నర్ ను కలిసేందకు ఉన్న అన్నిదారులనూ ఉద్యోగులు వెతుకుతున్నారు. ఇప్పటి వరకూ నోషనల్ ఇంక్రిమెంట్లు కలపలేదని.. సర్వీసు రూల్స్ అమలు చేయలేదని.. ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయకుండా వదిలేశారని.. పీఆర్సీ ప్రయోజనాలు కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదనే విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడం ద్వారా తమ సమస్యకు పరిష్కార మార్గం దొరకుతుందని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. 

ఈ మధ్య కాలంలో రాష్ట్రప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడాని సబ్ కమిటీ వేసినా.. నేటికీ ఏ విషయమూ బయటకు రాలేదు.. మరోప్రక్క ఇదే సచివాలయశాఖలోని కొన్ని శాఖల ఉద్యోగులకు పదోన్నతులు కల్పించినా.. వారికి ప్రత్యేక ఇంక్రిమెంట్లు ఏమీ ఇవ్వకుండా మాత్రమే ప్రమోషన్ కల్పించారని ఉద్యోగులు ఆందోళన చెందున్నారు. ప్రయోజనాలు లేని పదోన్నతులు తాము ఏం చేసుకోవాలని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక సచివాలయ మహిళా పోలీసులకైతే అసలు ప్రభుత్వశాఖ లేకుండా గాల్లో ఉంచి.. అనధికారికంగా పోలీసు విధులు, స్టేషన్ విధులు అప్పగిస్తున్నారని కూడా వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలా చూసినా సచివాలయ ఉద్యోగులందరం శ్రమదోపిడీకి గురవతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ముందున్న అన్ని దారులూ మూసుకుపోయాయని ఇపుడు తమకు న్యాయం జరగాలంటే అదొక్క న్యాయపోరాట మాత్రమేనని కూడా చెబుతున్నారు. చూడాలి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాదిన్నర తరువాత సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి క్యాబినెట్ సబ్ కమిటీ వేసి.. ఏ స్థాయిలో న్యాయం చేస్తుంది.. ఎన్ని ప్రయోజనాలు ఇస్తుంది.. ఇంకెన్ని ప్రయోజనాలు తొక్కిపెడుతుంది.. నిజంగా సచివాలయ ఉద్యోగులు కోర్టు వెళితే వారికి ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగుల మాదిరిగా విజయం సిద్ధిస్తుందా అనేది వేచి చూడాల్సిఉంది..!

visakhapatnam

2025-11-17 20:44:33

మానస పుత్రిక గొల్లుమంటున్నా పట్టదా..? సచివాలయ ఉద్యోగులు గుర్రు..!

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్.జగన్ మోహనరెడ్డి మానస పుత్రిక..దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు తొంగిచూసిన వ్యవస్థ నేడు రాష్ట్రంలో గొల్లుమంటున్నా..తండ్రి స్థానంలో ఉండి ప్రభుత్వశాఖను ఏర్పాటు చేసిన వ్యక్తికి చీమకుట్టినట్టైనా లేదా అని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.. గత ప్రభుత్వంలోనే సచివాలయ ఉద్యోగుల విషయలో అన్నీ చక్కగా అమలు చేసి ఉంటే నేడు రాష్ట్రవ్యాప్తంగా 1.30లక్షల మంది ఉద్యోగులం రోడ్డు ఎందుకు ఎక్కుతామంటూ మండి పడుతున్నారు. మాట్లాడితే మానస పుత్రిక..అంటూ గత ప్రభుత్వంలో ఊదరగొట్టిన వైఎస్సార్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఇపుడు తీరా ఓడిపోయిన తరువాత కనీసం పట్టించుకోవడమే మానేశారంటూ తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఉత్తరాంధ్రాలోని అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలోని మెడికల్ కాలేజీలను చూడటానికి వస్తున్నవేళ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ నిరసనను,ఆవేదనను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వెళ్ళ గక్కుతుండటం చర్చనీయాంశం అవుతున్నది..!

వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి అనకాపల్లి జిల్లా పర్యటనకు వస్తున్న వేళ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ నిసన చర్చలను సోషల్ మీడియాలో చేపట్టడం సర్వత్రా ఆశక్తిని రెకెత్తిస్తోంది. 1.30 లక్షల మంది ఉద్యోగులు ప్రభుత్వం ఇవ్వాల్సిన ప్రయోజనాలు ఇవ్వకపోతే రోడ్డెక్కి పోరాడుతుంటే.. కనీసం స్పందించని మానస పుత్రిక తండ్రి.. ఇంకా పూర్తికాని మెడికల్ కాలేజీలే పిపిపి విధానంలో ప్రైవేటు పరం అయిపోయితున్నాయంటూ నెత్తీ నోరూ బాదుకోవడం నిజంగా రాజకీయమనని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వంలోనే సచివాలయ ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలన్నీ ఇచ్చి ఉంటే నేడు కూటమి ప్రభుత్వంలో రోడ్డెక్కి ఆందోళనకు దిగే పరిస్థితి ఉందాని హెచ్చరిస్తున్నారు. 

సాధారణంగా ఒక ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో తప్పుచేస్తే ప్రతిపక్షపార్టీలో ఉన్న రాజకీయ పార్టీలు అదే ఉద్యోగుల తరపున ఉండి పోరాటం చేస్తుందని.. కానీ వైఎస్సార్సీపీ తన మానస పుత్రికగా చెప్పుకొని.. ఐదేళ్లపాటు ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజరాలు ఇవ్వకుండా గడిపేసిన వైఎస్సార్సీపీ నేడుు అదే తప్పుని కూటమి ప్రభుత్వం కూడా చేస్తున్న తరుణంలో ప్రశ్నించకపోవడం నిజంగా రాజకీయమేనని మండి పడుతున్నారు సచివాలయ ఉద్యోగులు.. అంతేకాకుండా రెండేళ్లకు చేయాల్సిన సర్వీసు రెగ్యలరైజేషన్ రెండేళ్ల తొమ్మినెలల వరకూ చేయలేదని, నాడు ఇవ్వాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లను కూడా ఇవ్వకపోగా.. ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి డోర్ టు డోర్ సర్వేలకోసం తిప్పారని.. నేడు అదే పనులను కూటమి ప్రభుత్వం కూడా చేయిస్తూ వన్ ఎంప్లాయ్ మల్టీ డిపార్ట్ మెంట్ సర్వీసెస్ అన్నచందంగా రాష్ట్రప్రభుత్వం ఉద్యోగుల జీవితాలతో ఆకుంటుందని గత ప్రభుత్వ విధానాలను కూడా వల్లె వేసుకుంటన్నారు. 

వైఎస్ జగన్ అనకాపల్లి వస్తున్న వేళ కూటమి ప్రభుత్వంలోని నాయకులు గత ప్రభుత్వ విధానాల కారణంగానే ఆసుపత్రులు తలలేని మొండెంలా మిగిలిపోయాయని దానిని పిపిపి విధానంలో పూర్తిచేయాలని చూస్తే.. దానిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఎదురుదాడి చేస్తే.. ఇటు సచివాలయ ఉద్యోగులు కూడా అసలు భారతదేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వంలోనూ లేని విధంగా ఒక్క ఉద్యోగంతో.. అదీ ఎలాంటి జాబ్ క్యాడర్, సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ లేకుండా ఐదేళ్లు పనిచేయించుకున్నారని పెద్ద ఎత్తు చర్చలు జరుపుతున్నారు. అంతేకాకుండా 1.30 లక్షల మంది ఉద్యోగులు రోడ్డున పడి తమ డిమాండ్ల సాధాన కోసం ఉద్యమిస్తుంటే..మెడికల్ కాలేజీల పిపిపి విధానంపై రాజకీయం చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 

నాడు 1.30 లక్షల కుటుంబాల్లో వైఎస్సార్సీపీ వెలుగులు నింపిందని ప్రచారం చేసుకున్నారని.. మీ చలవతో నేడు అవే కుటుంబాలు రోడ్డెక్కాయని కన్నీటి పర్యంతం అవుతున్నారు. అదే సమయంలో ఇతర మీడియా కూడా ఈ అంశాలను ప్రస్తావించకపోవడం వెనుక కేవలం రాజకీయమే తప్పా మరేవి లేవని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ అనకాపల్లి పర్యటన ఖారారైన దగ్గర నుంచి రాష్ట్రంలోని అతి ఎక్కువ గ్రామ, వార్డు సచిలయాలున్న విశాఖజిల్లాలో ఈ తరహా చర్చలు జరగడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఇక్కడ వైఎస్సార్సీపీ అధినేత మానస పుత్రిక ఆందోళన చెందుతుందంటూ ప్రశ్నించడానికి  వస్తే..గత ప్రభుత్వం హయాంలో మీరేం చేశారని ప్రశ్నిస్తారనే కారణంతో కూడా వైఎస్సార్సీపీ గ్రామ , వార్డు సచివాలయ ఉద్యోగులు, వారి డిమాండ్ల విషయంలో నేటి వరకూ ఎలంటి స్పందన  చేపట్టలేదని స్పష్టమవుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

 ఏది ఏమైనా వైఎస్సార్సీపీ హయాంలో ప్రారంభమైన గ్రామ, వార్డు సచివాలయ శాఖను కుదించడానికి కూటమి ప్రభుత్వం క్లస్టర్ , రేషనలైజేషన్ తీసుకొచ్చి ఉద్యోగులను ఇతరశాఖలకు తరలించేస్తున్న మానసపుత్రిక తండ్రి వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహనరెడ్డి మాట్లాడలేదని చెబుతున్నారు. అంతేకాకుండా గత ఎన్నికల్లో వైఎస్. జగన్, వైఎస్సార్సీపీకి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు చాలా వరకూ దెబ్బకొట్టారనే కారణం బాధ మనసులో ఉండిపోయే సచివాలయ ఉద్యోగులు రోడ్డెక్కి వివిధ రఖలుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోలేదని చెబుతున్నారు. చూడాలి అనకపాల్లి పర్యటనలో నైనా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు  ఆందోళనపై మానసపుత్రిక కటుంబంలో పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగుల విషయమై ఏదైనా ప్రకటన చేస్తారా.. లేదంటే కూటమి ప్రభుత్వం తీసుకుంటన్న ఉద్యోగ వ్యతిరేక విధానాలు.. సచివాలయాలను విచ్ఛన్నం చేస్తున్న అంశాలపై మాట్లాడతారా లేదా అనేది తేలిపోనుంది..?!

vsakhapatnam

2025-10-07 21:36:33

మహిళా పోలీసులను కరుణించిన కూటమి..?!

గ్రామ, వార్డు సచివాయ మహిళా పోలీసుల మొరను కూటమి సర్కారు ఆలకించి కరుణించింది.. వీరి సమస్యలపై నిత్యం ఈరోజు-ఈఎన్ఎస్  అందించిన ప్రత్యేక వార్త కథనాలపై ఎట్టకేలకు స్పందించింది.. సుమారు ఐదున్నరేళ్ల పాటు గాల్లో ఉన్న మహిళా పోలీసులకు ఒక ప్రభుత్వశాఖ ఖరారు చేయడానికి రూట్ క్లియర్ చేయడానికి రంగం సిద్దం చేసింది.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వీరిని ఉద్యోగాల్లో నియమించిన తరువాత.. కోర్టులో కేసులు పడితే వీరికి పోలీసుశాఖకు ఎలాంటి సంబంధం లేదని కోర్టుకి చెప్పేసి కూడా వీరిని పోలీసు, అంగన్వాడీ సేవలకు వినియోగించుకుంది తప్పితే వీరికి ఎలాంటి న్యాయం చేయలేదు.. 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. వస్తూ వస్తూనే వీరి విషయాన్ని హోం మంత్రి అనిత ద్వారా అసెంబ్లో ప్రస్తావించి భారీ స్థాయిలో హడావిడి చేసి వైఎస్సార్సీ చేసిన తప్పిదాలను కడిగేసింది. ఇపుడు సరిగ్గా ఏడాదిన్నర తరువాత మహిళా పోలీసులకు ఒక ప్రభుత్వశాఖ కేటాయించడానికి ఆప్షన్లు ఇస్తూ ఉద్యోగుల హెచ్ఆర్ఎంఎస్ కి వర్తమానాలు పంపింది. దీనితో మహిళా పోలీసులకు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు.!

హైకోర్టులో కేసుల కారణంగా పోలీసుశాఖకు సంబంధం లేదని గత ప్రభుత్వం చెప్పేయడంతోనే ఇన్నేళ్లూ గాల్లో ఉన్న గ్రామ, వార్డు సచివాలయశాఖ మహిళా పోలీసులకు కూటమి ప్రభుత్వం ప్రభుత్వ శాఖను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నది. సచివాలయ ఉద్యోగుల సమస్యలను 2019 నుంచి ఒక ప్రత్యేక సామాజిక బాధ్యతగా స్వీకరించిన ఈరోజు-ఈఎన్ఎస్ ప్రభుత్వానికి వీరి సమస్యలు తెలిసే విధంగా అనేక కథనాలు అందించింది. దీనితో ఆలోచనలో పడ్డ ప్రభుత్వం మహిళా ఉద్యోగులు నష్టపోకుండా వారికి ప్రభుత్వశాఖను కేటాయించేందుకు చర్యలు ప్రారంభించింది. అసెంబ్లీలో ప్రస్తావించినట్టుగానే.. తలా తోకా లేని మహిళా పోలీసులకు ఒక ప్రభుత్వశాఖను ఏర్పాటు చేయడం ద్వారా వారికి సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నాలు ప్రారంభించి ఉద్యోగుల హెచ్ఆర్ఎంఎస్ లాగిన్ కు వర్తమానం పంపించింది. 

ఐసిడిఎస్, పోలీసుశాఖలు రెండు ఆప్షన్లు ఇచ్చి వాటిలో వారికి నచ్చిన శాఖను ఎంచుకోమంది. ఉద్యోగులు ఏఏ ప్రభుత్వశాఖలు ఎంచుకున్నారో లెక్కగట్టిన తరువాత వీరికి ప్రభుత్వశాఖ కేటాయించే విధంగా చర్యలు తీసుకోవడానికి అధీకృతంగా ఉండేవిధంగా హెచ్ఆర్ఎంఎస్ ద్వారనే కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. అయితే ఈ రెండు ప్రభుత్వశాఖల్లో వీరికి ఏ క్యాడర్ ఉద్యోగాలను ప్రభుత్వం అలాట్ చేస్తుందో క్లారిటీ మాత్రం రాలేదు. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టుగా ముందు తమకు ప్రభుత్వశాఖ ఏర్పాటు చేస్తే ఆ తరువాత జరగాల్సిన తంతు జరుగుతుందని ఉద్యోగులు కాస్త ఊరట చెందుతున్నారు.
మరో వైపు గత ప్రభుత్వం రెండేళ్లు ఉద్యోగ విరమణ వయస్సు పెంచేయడంతో ఆ వ్యవది పూర్తయిన వారు ఇటు పోలీసుశాఖలోనూ, అటు ఐసిడిఎస్ లో నూ భారీగా రిటైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో సదరు ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. 

దానికోసం గతంలోనే ఉద్యోగులకు ప్రమోషన్స్, అడ్జెస్ట్ మెంట్స్, డిప్యూటేషన్స్ ఇలా మూడు అంశాలను ఉటంకిస్తూ జీఓ జారీ చేసింది. సదరు జీఓ ఆధారంగానే ఇపుడు మహిళా పోలీసులకు డిపార్ట్ మెంట్ చూజింగ్ ఆప్షన్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. ముందు ఆప్షన్లు ఇవ్వడం ద్వారా వీరికి ప్రభుత్వశాఖ అంటూ ఒకటి ఏర్పాటు అవుతుంది. ఆ తరువాత ఏ క్యాడర్ ఉద్యోగం ఇవ్వాలనే దానిపై ప్రభుత్వం విధివిధానాలు రూపొందించే అవకాశాలున్నాయని రాష్ట్రస్థాయి అధికారి ఒకరు ఈరోజు-ఈఎన్ఎస్ కి తెలిపారు. అయితే సచివాలయ ఉద్యోగులు ఎప్పటి నుంచో జూనియర్ అసిస్టెంట్ పేస్కే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుశాఖ ఎంచుకున్నవారికి క్లరికల్ క్యాడర్ ఉద్యోగాన్ని అందించి వారిని పోలీసు స్టేషన్లలో మినిస్టీరియల్ సిబ్బందిగా వినియోగించుకునే అవకాశం ఉందని, లేదంటే ఫిజికల్ ఫిట్ నెస్ ఆధారంగా మళ్లీ ప్రత్యేంకగా పోలీసు రిక్రూట్ మెంట్ బోర్టు ద్వారా ప్రత్యేక పరీక్ష పెట్టి కానిస్టేబుళ్లుగా తీసుకుంటారనే ప్రచారం కూడా జరుగుతుంది. 

అయితే ఇప్పటికే చాలా మంది ఉద్యోగులకు పోలీసు ఉద్యోగం వయస్సు దాటిపోయింది. దాని కారణంగా వారికి డ్రెస్ డ్యూటీ ఉంటే పోస్టు వచ్చేఅవకాశం లేదని కూడా సమాచారం అందుతుంది. అయితే గతంలో మహిళా పోలీసులకు ఇచ్చిన సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ లెక్కన చూసుకుంటే వీరికి తరువాత ప్రమోషన్ హెడ్ కానిస్టేబుల్ ని చేసి ప్రత్యేకంగా మహిళా పోలీసు స్టేషన్లకు సిబ్బందిగా పంపిస్తారని కూడా చెబుతున్నారు. అటు ఐసిడిఎస్ ఎంచుకున్నవారికి సూపర్ వైజర్ క్యాడర్ పోస్టు వచ్చే అవకాశాలున్నాయని కూడా చెబుతున్నారు. ఎందుకంటే ఐసిడిఎస్ లో తొలి ఉద్యోగం కార్యకర్త అయితే చదువుకున్నవారు విధుల్లో చేస్తున్న ఉద్యోగం సూపర్ వైజర్.. తరువాత పదోన్నతుల ద్వారా సీడీపీఓ, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వరకూ పదోన్నతులు దక్కే చాన్సు వుంది. ఏది ఏమైనా ముందు వీరికి డిపార్ట్ మెంట్ ఎలాట్ మెంట్ చేసే క్రమంలో ప్రభుత్వం ఏం చేయబోతుందనే విషయం తేలనుంది. కాగా ప్రభుత్వం తమ ఉద్యోగాలను గాల్లోనే ఉంచేయకుండా.. ప్రభుత్వం గుర్తించే విధంగా ప్రత్యేక కథనాలు అందించిన ఈరోజు-ఈఎన్ఎస్ కి మహిళా పోలీసులు ప్రత్యేకంగా ఫోన్లు చేసి ధన్యవాదములు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం తమకు, తమ చదువు, శారీరక దారుడ్యాన్ని అనుసరించి ఒక మంచి పోస్టులో కూర్చోబెడితే జీవితాంతం కూటమి ప్రభుత్వ మేలు మరిచిపోమనే విషయాన్ని కూడా మహిళా పోలీసు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు..!

visakhapatnam

2025-09-17 21:45:35

రాజకీయ మొదలు.. యూటర్న్ తీసుకున్న సచివాలయ ఉద్యోగులు..?!

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు వారి డిమాండ్లు సాధించుకోవడంలో యూటర్న్ తీసుకున్నారు..అవును ఇది నిజం.. ప్రభుత్వానికి ఎదురు తిరిగితే ఉన్న ఉద్యోగాన్ని గాల్లో పెడతారానే సంకేతాలు వచ్చాయట.. అందుకే కొందరు ఉద్యోగులు ఉద్యోగం ఉంటే చాల్లే.. పదోన్నతులు, సర్వీసు రూల్స్, జాబ్ క్యాడర్ లేకపోయినా పర్లేదని వాట్సప్ యూనివర్శిటీలో సన్నాయి నొక్కుళ్లు నొక్కుతున్నారు.. మొన్నటి వరకూ తమకు పదోన్నతులు అర్జెంగ్ ఇచ్చేయాలి.. నోషనల్ ఇంక్రిమెంట్లు కావాలని ఒంటికాలిపై లేచిన సచివాలయ ఉద్యోగులు ఇపుడు వెనక్కి తగ్గిపోవడం చర్చనీయాంశం అవుతున్నది. అయితే అన్ని యూనియన్ల ఉద్యోగులు కాదండోయ్.. ఇక్కడ కొన్ని యూనియన్లు మాత్రమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాయట. మిగిలిన వారు తమ ఆందోళన కొనసాగిస్తామని చెబుతున్నారట..ఆ విషయాన్ని కూడా స్వయాన సచివాలయ ఉద్యోగులే మీడియాకి లీకులివ్వడం కూడా విశేషం..!

తాడిని తన్నేవాడు ఒకడుంటే.. వాడి తలదన్నేవాడు ఒకడుంటాడని.. గ్రామ, వార్డు సచివాలయ శాఖలో ప్రతీసారి రుజువవుతూ వస్తున్నది. ఉద్యోగుల్లో ఉద్యోగులకి.. యూనియన్లలో యూనియన్లకి పడక వారు న్యాయ బద్దంగా సాధించుకోవాల్సిన డిమాండ్ల విషయంలో ఉద్యోగులు యూటర్న్ తీసుకోవాల్సి వస్తున్నది. ప్రస్తుతం కొందరు సచివాలయ ఉద్యోగులు చేస్తున్న పని కూటమి ప్రభుత్వానికి తెగ కలిసొచ్చేవిధంగా తయారైంది. డిమాండ్ చేసేవారికంటే.. చేయని వారంటనే ప్రభుత్వానికి ఇష్టం కదా.. వారినే అక్కున చేర్చుకుని.. చేసేవారిని ఓ కంట కనిపెట్టుకొని ఉండటానికి కూడా బాగుంటుంది. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఒక ప్రభుత్వశాఖ ఏర్పాటైతే దానికి విధి విధానాలన్నీ ఆ శాఖ ఏర్పాటు అయినపుడే సదరు రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రిన్సిపల్ సెక్రటరీలు ఏర్పాటు చేసి.. ప్రత్యేకంగా ఒక గెజిట్ ద్వారా చట్టబద్దత తీసుకు వస్తారు.. 

అదేంటో ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటైన దగ్గర నుంచి తలా తోకా లేకుండా వ్యవహారం మొత్తం నడిచినా.. చట్టపరంగా.. న్యాయబద్దంగా సాధించుకోవాల్సిన డిమాండ్ల విషయంలో ఒకరు ఎడ్డం అంటే మరొకరు తడ్డెం అంటున్నారు.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఈ ద్వంధ వైఖరి కలిసొచ్చి ఎవరికీ పదోన్నతులు ఇవ్వకుండా ఐదేళ్లు కాలం గడిపేసింది. ఉద్యోగుల్లో ఉద్యోగులకే పడక ఆడుతున్న నాటకాలు కూడా కూటమి ప్రభుత్వానికి కూడా కలిసొచ్చే విధంగా ఉన్నాయి. సచివాలయ ఉద్యోగులకు న్యాయం చేసేస్తామని ఎన్నికల ముందు హామీలు గుప్పించి.. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత అసెంబ్లీ సాక్షిగా హడావిడి చేసిన కూటమి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకి వేయలేదు. పైగా.. ఈశాఖను విచ్చిన్నం చేయడానికి క్లష్టర్ వ్యవస్థ, రేషనలైజేషన్, డిప్యూటేషన్ అంటూ జీఓలు తీసుకొచ్చినా కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు ఎక్కడా నోరు మెదపలేదు. 

తాగాజా రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల జేఏసీ అంటూ తెరపైకి వచ్చి తమ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం చేస్తాం.. సర్వీసులు నిలిపివేస్తాం.. పెన్షన్లు పంచమని చెప్పిన వారే తాము ఆ మాట అనలేదని అంటే.. మరికొందరు ఆ జేఏసితో తమకు సంబంధం లేదని వాట్సప్ గ్రూపుల్లో చర్చకు తెరలేపారు. మరికొన్ని యూనియన్ల సభ్యులు ఎవరో ఒకరు చేస్తున్నారు కదా.. మళ్లీ మనమెందుకు అన్నట్టు మిన్నకుండిపోయారు. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా కొన్ని సంఘాలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే మరికొన్ని సంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటాయి. ఇక్కడ కూడా అదే కలిసొచ్చింది కూటమి ప్రభుత్వానికి. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న సంఘాల్లో ఉద్యోగులు.. జేఏసి పేరుతో విధులు బహిష్కరణ, డిమాండ్ల సాధనతో మాకు సంబంధం లేదని వాట్సప్ గ్రూపుల్లో చర్చకు తెరలేపింది. అదీ ఎంతలా అంటే విషయం మొత్తం మీడియాకి తెలిసే విధంగా కొందరు ఉద్యోగులు పనిగట్టుకొని మరీ ఈ విషయాలను లీకులు ఇచ్చేంతగా మారిపోయింది. 

అంటే ఒక వర్గం ఉద్యమం చేస్తుంటే.. ఒక వర్గం దానికి సంబంధం లేదన్నట్టుగా వ్యహరించడం కూడా ఇక్కడ చర్చనీయాంశం అవుతున్నది. ప్రభుత్వం చేయాలనుకుంటే ఎలాగైనా చేస్తుందని.. చేయడం ఇష్టం లేకపోతే హడావిడీ చేసి ఊరుకుంటుందని.. దానికోసం డిమాండ్లు, విధులు బహిష్కరణ అంటే ఉద్యోగులపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తుందని బెదిరింపులకు దిగడం ఇక్కడ విశేషం. ఉద్యోగుల జేఏసి గ్రామ, వార్డు సచివాలయశాఖ డైరెక్టర్ కి నోటీసు ఇచ్చిన తరువాత ఈ విషయాలన్నీ తెరపైకి రావడం వెనుక ఉద్యోగ సంఘాల్లోని వారికే క్లారిటీ లేదని.. ఒకరంటే మరొకరికి గిట్టడం లేదని పక్కాగా తేలిపోయింది. ఇలాంటి అంశాలే ప్రభుత్వానికి కూడా చాలా బాగా కలిసి వస్తాయి. ప్రస్తుతం కూడా అదే జరిగేలా కనిపిస్తున్నది. ఒక వర్గం అలా ఉంటే ఉద్యమం చేయాలనుకున్న వర్గంలోని యూనియన్లు ఉద్యోగులు మాత్రం... ఫ్రీ బస్సుతో ఉపాది పోయిందని రోడ్డెక్కి మరీ పథకాన్ని సాధించుకున్న ఆటోకార్మికులే నయం.. 

ఆ పాటికూడా మనం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని రాలేకపోతున్నామని వాట్సప్ గ్రూపుల్లోనే ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నారు. ఏ ది ఏమైనా భూమికి బొక్క పెడతాం..ఆకాశాన్ని అరచేత్తో పట్టేస్తామని బీరాలు పోయి..డమ డిమాండ్లు అన్నీ సాధించుకుంటామని ప్రకటన చేసిన ఉద్యోగ సంఘాల్లో వారిలో వారికే పడక బయటకు వస్తున్న తేడా వ్యవహారాలు.. డిమాండ్ల సాధనకు కొన్ని యూనియన్లు వ్యతిరేకమని తేలిపోయింది. అంటే కూటమి ప్రభుత్వంలో కూడా గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులు ప్రధాన డిమాండ్లు.. పదోన్నతులు, సర్వీసు రూల్స్, జాబ్ క్యాడర్, కోర్టు కేసులో ఉన్న మహిళా ఉద్యోగులకు ప్రభుత్వశాఖ కేటాయింపు వంటి అంశాలు మరో మూడున్నరేళ్ల వరకూ పరిష్కారం అయ్యే మార్గాలు కనుచూపుమేరలో కనపించవనే విషయాన్ని ఇటు విశ్లేషకులు కూడా వ్యక్తం చేస్తున్నారు.. ఎక్కడైనా ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల్లో ఉండే పొరపొచ్చాలే ఇటు గ్రామ, వార్డు సచివాలయశాఖ లో కూడా వారి డిమాండ్ల సాధన విషయంలో రాజకీయం చేయడానికి  తెరపైకి రావడం విశేషం..!

visakhaptnam

2025-09-11 04:20:03

సచివాలయ ఉద్యోగుల పోరుబాట.. అక్టోబర్ 1 డెడ్ లైన్ ?!

గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల కడుపు మండింది..ప్రక్క ప్రభుత్వశాఖల ఉద్యోగులకు పదోన్నతులు వస్తుంటే..నేటికీ సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్.. నోషనల్ ఇంక్రిమెంట్లు.. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలకు నోచుకోని ఉద్యోగులు తిరగబడ బోతున్నారు.. తమ న్యాయమైన.. చట్టబద్దమైన డిమాండ్లు పరిష్కరించకపోతే అక్టోబరు 1 నుంచే ప్రభుత్వసేవలన్నీ నిలిపివేస్తామని హెచ్చరిస్తూ.. ప్రభుత్వానికి నోటీసు ఇచ్చారు..ఉద్యోగం ఒకటి.. విధులు మాత్రం అన్ని ప్రభుత్వశాఖలవి చేయించుకుంటూనే తమకు చట్టబద్దంగా ఇవ్వాల్సిన ప్రయోజనాలు ఇవ్వకపోతే ఎలా అంటు తిరగబడబోతున్నారు.. ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద ఉద్యోగుల నెట్వర్క్ గా ఉన్న గ్రామ, వార్డు సచివాలయశాఖ తమ పనులు ఆపేస్తే.. రాష్ట్రం మొత్తం ప్రజలకు సేవలు నిలిచిపోతాయి..ఒక వేళ ఎస్మా ప్రయోగించినా.. కోర్టుకి వెళితే ప్రభుత్వం చేసిన తప్పులు, కావాలని నిలిపేసిన ప్రయోజనాలు స్పష్టంగా కనపిస్తాయి..ఎలా చూసుకునున్నా ఉద్యోగులే విజయం సాధిస్తారు..ఇది కాస్తా వైఎస్సార్సీపీకి ప్రధాన అస్త్రం కూడా అయిపోతుంది..!

అనుకున్నంతా అయ్యింది.. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని సుమారు 1.28లక్షల ఉద్యోగులు తమ సేవలు అక్టోబరు 1 నుంచి ఆపేయాలని నిర్ణయించుకొని.. ప్రభుత్వానికి నోటీసు ఇచ్చారు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం ఐక్య వేదిక చైర్మన్ బూరాడ మధుబాబు ఆధ్వర్యంలో నోటీసు ఇచ్చారు. అనంతరం మీడియాకి ప్రకటన విడుదల చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి రావాల్సిన ప్రయోజనాలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇచ్చినట్టుగా అధికారంలోకి రాగానే హోం మంత్రి అనిత సచివాలయ మహిళా పోలీసుల అంశాలన్ని అసెంబ్లీలో ప్రస్తావించి తెగ హడావిడీ చేశారు. కూటమి ప్రభుత్వం తమ సమస్యలను అసెంబ్లీలోనూ, శాసన మండలిలోనూ ప్రస్తావిస్తే వెంటనే సమస్యలు పరిష్కారం అయిపోతాయని ఉద్యోగులంతా ఆనంద పడ్డారు. కానీ ఆ హడావిడీ కేవలంల ప్రజలను, ఉద్యోగులను, వ్యతిరేక వైఎస్సార్సీపీని నమ్మించడానికేనని తేలిపోయింది. 

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్య ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. పైగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వశాఖల ముఖ్యకార్యదర్శిలకు ఇచ్చిన అభ్యర్ధనలన్నీ బుట్టదాఖలే అయ్యాయి. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించని కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత క్లస్టర్ వ్యవస్త, రేషలైజేష్ అంటూ జీఓలు జారీ చేసింది. అంటే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించని ప్రభుత్వం వ్యవస్థను విచ్చిన్నం చేయడానికి కంకణం కట్టుకుంది. తాజాగా జీఓ నెంబరు 16 విడుడదల చేసి..అందులో తలా తోకా లేకుండా అంశాలను పొందు పరిచింది. అదేంటంటే.. ప్రమోషన్లు, అడ్జెస్ట్ మెంట్లు, డిప్యూటేషన్లు.. అని చెబుతూ జీఓ జారీ చేసింది. వీరి సమస్యలు పరిష్కరించని కూటమి ప్రభుత్వం.. వీరిని భారీగా ఏర్పడుతున్న ప్రభుత్వశాఖల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గా వినియోగించుకోవడానికి కార్యాచరణ సిద్దం చేసింది. రాష్ట్రంలో 75 ప్రభుత్వశాఖలు ఉంటే.. 74 ప్రభుత్వశాఖలు మాత్రమే వారి వారి శాఖల పనులు చేసుకుంటారు. 

కానీ ఒక్క గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులు మాత్రం అన్ని ప్రభుత్వశాఖల పనులూ చేయాలి.. ప్రభుత్వ సంక్షేమపథకాలు వీళ్లే ప్రజల వద్దకు చేర్చాలి.. మరి సమస్యలూ.. ప్రయోజనాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని అర్జిస్తే మాత్రం ఆ ఒక్కటీ అడక్కు అంటారు అంటున్నారని సచివాలయ ఉద్యోగులు నెత్తీ నోరూ కొట్టుకుంటున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ విరమణ వయస్సు రెండేళ్లు పెంచేయడంతో.. వారు కాస్తా 75 ప్రభుత్వ శాఖల్లో వేల సంఖ్యలో రిటైర్ అయిపోతున్నారు. దీనితో డైలమాలో పడ్డ కూటమి ప్రభుత్వం ఉన్న గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులతోనే అన్ని ప్రభుత్వశాఖ ల పనులూ చేయించేయడానికి సిద్దమైపోయింది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఆయా శాఖల అధిపతులే వారిపై అజమాయిషీ చలాయిస్తారు.. కానీ గ్రామ, వార్డు సచివాలయశాఖ విషయానికొస్తే.. వీరు విధులు నిర్వహించే అన్నిశాఖల జిల్లా అధికారులు వీరి మీదికి ఎక్కేస్తుంటారు.. ఇక మున్సిపల్ కార్పోరేషన్లలో అయితే.. ఏకంగా జెడ్సీలు వీరి ఉద్యోగాలనే తీయించేస్తానని బెదిరింపులకు దిగుతారు.. 

ఇలాంటి వేధింపులు తట్టుకొని ఇప్పటి వరకూ పనిచేసిన సచివాలయ ఉద్యోగుగు ఒక్కసారిగా తిరుగుబావుటా ఎగుర వేశారు. ఇప్పటి వరకూ అజయాయిషీ చలాయించిన అన్ని జిల్లాశాఖల అధికారులు వీరి నోటీసుతో డైలమాలో పడ్డారు. సచివాలయ ఉద్యోగులు ఒకటవ తేదీన పెన్షన్లు ఇవ్వడం మానేస్తే.. ప్రభుత్వానికి ఎక్కడలేని చెడ్డ పేరూ వస్తుంది. అంతేకాదు ఇతర ప్రభుత్వ పథకాలు కూడా గ్రామ, వార్డు స్థాయిలో ప్రజలకు అందే పరిస్థితి ఉండదు. అయితే ఇక్కడ కొన్ని సంఘాలు ప్రభుత్వానికి అనుకూలంగా.. అధికంగా వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. ఏ సంఘం ఉద్యోగులు..సమ్మెలో పాల్గొంటారు.. మరే సంఘం ఉద్యోగులు సమ్మెలో పాల్గొనరు. అనే అంశం రెండు మూడురోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవశాకం ఉంది. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో చేస్తున్న తాత్సారం.. ఇపుడు వైఎస్సార్సీపీ ప్రధాన అస్త్రం కాబోతున్నది.  గ్రామ సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వానికి సమ్మెనోటీసు ఇచ్చిన క్రమంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే ఆశక్తి కరంగా మారింది..!

visakhapatnam

2025-09-09 06:06:41

గ్రామ సచివాలయ కార్యదర్శిలకు పదోన్నతిశాపం..!

గ్రామ, వార్డు సచివాలయశాఖలో గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శి కార్యదర్శిలకు పదోన్నతి శాపం వెంటాడుతోంది.. రాష్ట్రప్రభుత్వం గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలను గ్రేడ్-4 గా పదోన్నతి కల్పించాలని ఉత్తర్వులు ఇచ్చినా అవి ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో తప్పా మరెక్కడా సక్రమంగా అమలు అయినట్టు కనిపించలేదు. విశాఖ జిల్లాలో అయితే ఆ ఊసే ఎత్తలేదు డిఎస్సీ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్. తమతో పాటు విధుల్లోకి చేరి గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు ఇతర జిల్లాల్లో గ్రేడ్-4 పదోన్నతి కల్పించడంతోపాటు చిన్న పంచాయతీలకు కేటాయింపులు చేసి డిప్యూటేషన్లను రద్దు చేశారు. అదేంటో మిగిలిన జిల్లాల్లోని డిఎస్సీ కమిటీ చైర్మన్లు ఆ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకి వేయకపోవడంతో సచివాలయ పంచాయతీ కార్యదర్శిలు వారి గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక గొల్లు మంటున్నారు. సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూసే పంచాయతీరాజ్ శాఖ ఇంత దారుణంగా ఉంటే ఇతర ప్రభుత్వశాఖలు ఏ విధంగా ఉంటాయో అర్ధంచేసుకోవచ్చు..!

ఏ ముహూర్తాన గత ప్రభుత్వం అరకొర విధానాలతో గ్రామ, వార్డు సచివాలయశాఖను ఏర్పాటు చేసిందో తెలియదు కానీ.. వీరి విషయంలో ప్రభుత్వం గానీ, జిల్లా కలెక్టర్లు గానీ ఏఒక్క కార్యక్రమం కూడా సక్రమంగా చేయడం లేదు. వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శిల కొరత అత్యంత తీవ్రంగా వెంటాడుతోంది. ఇలాంటి సమయంలో సచివాలయశాఖ ఏర్పాటైన తరువాత చాలా సచివాలయాలకు పంచాయతీ కార్యదర్శిలను నియమించలేదు. ఉన్న గ్రేడ్-3, గ్రేడ్-2 పంచాయతీ కార్యదర్శిలకే అప్పగించి అదనపు పనులు చేయిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత డిప్యూటీ సీఎం చొరవతో సచివాలయాల్లో పనిచేసే గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు పదోన్నతులు కల్పించాలని యోచన చేసి ఉత్తర్వులు జారీ చేసినా వాటిని జిల్లా కలెక్టర్లు అమలు చేయలేదు. అమలు చేసిన జిల్లాల్లో మాత్రం  డిప్యూటేషన్లు రద్దు చేసి పదోన్నతులు పొందిన వారికే పంచాయతీలను అప్పగించారు. దానితో వారిని చూస్తున్న ఇతర జిల్లాల  పంచాయతీ కార్యదర్శిలు ఇద్దరం ఒకేసారి విధుల్లోకి చేరినా.. మీజిల్లా కలెక్టర్ వలన మీకు పదోన్నతులు వచ్చాయి.. మా జిల్లా కలెక్టర్ వలన మేము ఇంకా ఇలాగే ఉండిపోయామంటూ ఒకరితో ఒకరు చెప్పుకొని బాధపడుతున్నారు. 

వాస్తవానికి రాష్ట్రప్రభుత్వం ఒక ప్రభుత్వశాఖకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తే.. వెంటనే అన్ని జిల్లాల్లోని డిఎస్సీ కమిటీ చైర్మన్లుగా వ్యవహరిస్తున్న కలెక్టర్లు దానిని అమలు చేయాలి. కొత్త జిల్లాలకు చట్టబద్దత లేనందున ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే పదోన్నతులు కల్పించాల్సి వుంది. ఇతర జిల్లాల్లో కలెక్టర్లు చొరవ తీసుకొని పదోన్నతులు కల్పించినా ఉమ్మడి విశాఖజిల్లాలో మాత్ర ఆ ఊసే లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే డిసెంబరు తరువాత ఎన్నికల కోడ్ వచ్చేస్తుంది. అది వచ్చేస్తే మరో మూడు నుంచి ఐదు నెలలు సమయం పెరిగిపోతుంది. ఒక్క గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిల విషయంలోనే కాకుండా గ్రామ, వార్డు సచివాలయశాఖలోని ఇతర శాఖల ఉద్యోగులకు సంబంధించి ఇటీవల కాలంలో ప్రభుత్వం జారీ చేసిన జీఓ పదోన్నతులు, సర్దుబాట్లు, డిప్యూటేషన్లు సచివాలయ ఉద్యోగులకు చేయాలని జారీ చేసినా దానిపై కూడా జిల్లా కలెక్టర్లు ఎలాంటి చర్యలు తీసుకోకపోడం విచిత్రంగా ఉంది. 

అయితే సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు వస్తే వారికి వచ్చే ఆదాయం పడిపోతుందని ప్రస్తుతం ఇన్చార్జిలుగా పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శిలే జిల్లా కేంద్రాల్లో యూనియన్ల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి పదోన్నతులు ముందుకి కదలనీయకుండా చేస్తున్నారనే ప్రచారం ఈ మధ్య కాలంలో తారా స్థాయిలో జరుగుతుంది. దానికి అనుగుణంగానే జిల్లా కలెక్టర్లు కూడా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా వాటిని అమలు చేయకపోవడంతో సచివాలయ ఉద్యోగులు నిజమని నమ్ముతున్న పరిస్థితులే అధికంగా ఉన్నాయి. ఏదైనా ఒక ప్రభుత్వశాఖ ఏర్పాటు చేసే సమయంలోనే దానికి విధి విధానాలు, సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేసి ఉంటే ఎలాంటి అడ్డంకులు రావు. కానీ గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల విషయంలో గత ప్రభుత్వం అలాంటి పనులు సక్రమంగా చేయకపోవడం వలనే.. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి కూడా ఏమీ చేయకుండా కాలయాపన చేస్తూ.. నామ్ కేవాస్తు జీఓ విడుదల చేయడానికి అవకాశం ఏర్పడిందని సచివాలయ ఉద్యోగులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. 

ఇప్పటికైనా ప్రభుత్వం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ తీసుకొని పంచాయతీ  గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు గ్రేడ్-4 కార్యదర్శిలుగా పదోన్నతులు కల్పించడంతోపాటు, చిన్న పంచాయతీలకు రెగ్యులర్ కార్యదర్శిలను నియమించాలని కూడా ఉద్యోగులు, జిల్లా వాసులు కోరుతున్నారు. డిప్యూటేషన్ పై పనిచేసే వారు పంచాయతీకి ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు వెళతారో తెలియని పరిస్థితి నెలకొంటుందనే ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు డిఎస్సీ కమిటీ చైర్మన్ గా ఉన్న జిల్లాల కలెక్టర్లు సచివాలయ ఉద్యోగులు వారి ప్రమోషన్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే..!

visakhapatnam

2025-09-06 20:24:19

ఈరోజు-ఈఎన్ఎస్ చెప్పిందే నిజమైంది.. సచివాలయ ఉద్యోగుల బదలాయింపు షురూ..!

ఈరోజు-ఈఎన్ఎస్ గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగుల విషయంలో ఏం రాసినా దానిని కూటమి ప్రభుత్వం నిజం చేసి పారేస్తున్నది. దానికి అనుంబంధంగా ప్రత్యేకంగా జీఓలను కూడా జారీ చేస్తున్నది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను భారీగా ఖాళీలు అయిపోతున్న ఇతర శాఖలకు బదలాయిస్తారని ఈరోజు-ఈఎన్ఎస్ రాసిన వార్త నేడు  కూటమి ప్రభుత్వం నిజం చేస్తూ.. జీఓఆర్టీ నెంబరు 12 జారీ చేసింది.  చెప్పినట్టుగా సచివాలయ ఉద్యోగుల బదలాయింపు బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తూ కూటమిప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పనీ పాట లేదు.. ఏది నోటికొస్తే అది రాసేస్తున్న ఈరోజు-ఈఎన్ఎస్ అని కూసిన నోళ్లన్నింటికి ఇపుడు ప్రభుత్వం జారీ చేసిన జీఓ ద్వారానే సమాధానం చెప్పినట్టు అయ్యింది. 2019లో గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటు అయిన దగ్గర నుంచి గత ప్రభుత్వ, చర్యలు, ఆ తరువాత కూటమి ప్రభుత్వ చర్యలపై లోతుగా పరిశోధించి మరీ వరసు కథనాలు ప్రచురించింది ఈరోజు-ఈఎన్ఎస్. ఇప్పటి వరకూ ఒక్క వార్త విషయంలో అక్షరం కూడా ఒమ్ము కాకుండా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనూ.. నేడు కూటమి ప్రభుత్వంలో అన్నీ నిజమవుతూనే వచ్చాయి. దీనిని బట్టి ఈరోజు-ఈఎన్ఎస్ వార్తలకు ఎంతటి శచ్చీలత ఉందో మేము చెప్పడం కాదు ప్రభుత్వాలే జీఓలు జారీ చేసి మరీ నిజం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఏ మీడియా రాయనన్ని కథనాలు ఒక్క గ్రామ, వార్డు సచివాలయశాఖ విషయంలో ఈరోజు-ఈఎన్ఎస్ మాత్రమే రాసిందంటే అతిశయోక్తి కాదేమో..!

తాడిని తన్నినోడు ఒకడైతే.. వాడి తల తన్నినోడు ఇంకోడనే సామెత సరిగ్రా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. నేటి కూటమి ప్రభుత్వం చేస్తున్న చర్యలతో సరిగ్గా సరిపోతుంది.. ఏ సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్, జాబ్ క్యాడర్ ఇవ్వకుండా ఎలాగైతే గత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను నియమించిందో.. దానికి మించి కూటమి ప్రభుత్వం ఉన్న ఉద్యోగులను వివిధ శాఖలకు బదలాయింపు చేసుకోవచ్చునని  చక చకా ఉత్తర్వులు జారీ చేసేసింది. పేరుకి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులే అయినా ప్రభుత్వం ఇపుడు జారీ చేసిన జీఓఆర్టీ నెంబరు 12 ఆధారంగా డిఎస్సీ చైర్మన్ గా జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వంలో భారీగా ఖాళీలు ఏర్పడిన ప్రభుత్వ శాఖల్లోకి వీరిని బదలాయించ వచ్చు. అంతే శాఖ ఒకటి.. విధులు మరో శాఖలో అన్నమాట.  రాజ్యాంగ బద్ధంగా కల్పించాల్సిన చట్టబద్దత విషయంలో ఎలాంటి జోళికి వెళ్లని కూటమి ప్రభుత్వం.. వేల సంఖ్యలో రిటైర్ అవుతున్న వివిధ శాఖల ఉద్యోగుల ఖాళీల్లో సచివాలయ ఉద్యోగులతో పనిచేయించడానికి మాత్రం ప్రత్యేకంగా జీవోలు జారీ చేస్తున్నది.

రాజు తలచుకుంటే డబ్బులకు, దెబ్బలకు కొదవలేదన్నట్టుగా.. తలా తోకలేక ప్రభుత్వశాఖ ఉద్యోగులుగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కంటే భిన్నంగా.. కూటమి ప్రభుత్వం వినియోగించుకోవాలని చూస్తున్నది. దానికోసం పదోన్నతులు అనే పదాన్ని ముందు చేర్చి.. ఆ తరువాత డిప్యూటేషన్లు, అదనపు విధులు పేరట ప్రత్యేక జీఓ జారీ  సచివాలయ ఉద్యోగులను బదలాయించ నుంది. మొన్నటి వరకూ రేషనలైజేషన్, క్లస్టరైజేషన్ పేర్లు వల్లె వేసిన ప్రభుత్వం ఇపుడు ప్రమోషన్ల పేరుతో ఇపుడు ఉన్న సచివాలయ ఉద్యోగులను వారి మాత్రు శాఖలకు అనుగుణంగా బదలాయింపులు చేయడానికి సిద్దమై జీఓ జారీ చేసింది. అన్ని ప్రభుత్వశాఖల కోసం ఈ జీఓలో ప్రస్తావించిన కూటమి ప్రభుత్వం ఎక్కడా మహిళా పోలీసులను ఏం చేస్తుందనే విషయాన్ని మాత్రం ఎక్కడ ఉటంకించలేదు. కారణం వీరి నియామకాల విషయంలో కోర్టులో కేసులు నడుస్తుండటమే. అయినా.. వీరిని సముచిత స్థానాలు కల్పించి.. వారి చదువులు, హోదాకి తగ్గట్టుగా వారిని ప్రత్యేక స్థానాల్లో కూర్చోబెడతామన్న హోం మంత్రి చేసిన ప్రకటనలు, అసెంబ్లీలో సచివాలయ ఉద్యోగుల విషయంలో చేసిన హడావిడి ఏమైపోయిందో హోం మంత్రి ప్రకటించాల్సి వుంది.

రాజ్యాంగ బద్దంగా ఒక ప్రభుత్వశాఖను ఏర్పాటు చేసినపుడు సదరు ఉద్యోగులకు జాబ్ క్యాడర్, సర్వీస్ రూల్స్, ప్రమోషన్ ఛానల్, పేస్కేలు వర్తింపజేస్తారు. దాని ప్రకారం సర్వీసులోకి వచ్చిన తరువాత రెండేళ్ల తరువాత ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తారు. కానీ విచిత్రంగా ఒక్క గ్రామ, వార్డు సచివాలయ శాఖ విషయంలో అవేమీ లేకుండా ఆరేళ్లు సర్వీసు చేయించాయి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం, నేటి కూటమి ప్రభుత్వం. విధుల్లోకి చేరిన ఉద్యోగుల ప్రొబేషన్ రెగ్యులర్ చేసే సమయంలో రెండు ఇంక్రిమెంట్లు వేస్తారు. కానీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నియామకాలే సెపరేటేమో.. అలాంటివేమీ చేయకుండానే వీరి ఉద్యోగాలను అదనంగా 9నెలలు అంటే రెండేళ్ల 9నెలలు పనిచేయించుకున్నారు. అదీ తొలుత ప్రకటించిన ఆ రూ.15వేలు జీతానికే. తరువాత రెగ్యులర్ చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. అసలు మీ ఉద్యోగాలు రెగ్యులర్ చేయడమే ఎక్కువ అన్నట్టుగా ఇవ్వాల్సిన రెండు ఇంక్రిమెంట్లు కోత విధించేసింది. ఆ తరువాత పేస్కేలు అమలు చేసే సమయంలో హెచ్ఆర్ఏ, డీఏలను పూర్తిగా కుదించేసి.. ఆతరువాత మళ్లీ సరిచేసి వీరికి పేస్కేలు వర్తింపజేసింది.. 

అంటే కుదించిన హెచ్ఆర్ఏ ఆధారంగానే సుమీ.. సవరించిన పాత విధానంతో కాదు. అదే సమయంలో పీఆర్సీని అన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగులకు అమలు చేసి.. వీరికి మాత్రం ప్రత్యేకంగా పేస్కేలు వరకూ అమలు చేసి.. సాధారణ ప్రభుత్వ ఉద్యోగికి రావాల్సిన అరియర్సుని ఎగ్గొట్టారు. సరిగ్గా ఉద్యోగులకు పదోన్నతలు కల్పించే సమయానికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో మహిళా పోలీసు నియామకాలపై కోర్టులో కేసులు పడ్డాయి. దానితో అసలు మహిళా పోలీసులకు పోలీసుశాఖకు సంబంధమే లేదని హైకోర్టుకి పోలీసుశాఖ లిఖిత పూర్వకంగా రాసిచ్చేసింది. కానీ విధులు మాత్రం అనధికారికంగా పోలీసు స్టేషన్లు, ఎన్నికల విధులు, ఇతర ప్రభుత్వశాఖల్లో సహాయకులుగానేవినియోగించుకుంటున్నది. ఈ లోగా ఉద్యోగులకు ఐదేళ్లు పూర్తయిపోయింది. కొన్ని శాఖల ఉద్యోగులకు నియామకాల సమయంలో పేర్కొన్న ఉత్తుత్తి  ప్రమోషన్ ఛానల్ ఆధారంగా పదోన్నతులు కల్పించాలి.. కానీ అదిగో ఇదిగో అనేసరికి వైఎస్సార్సీ ప్రభుత్వ టైమ్ అయిపోయింది. వీరు మాత్రం అలా గాల్లోనే ఉండిపోయారు.

ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లోనే సచివాలయ ఉద్యోగుల సమస్యలన్నీ తీర్చేస్తాం.. పదోన్నతులు కల్పించేస్తాం.. ఖాళీలు భర్తీచేస్తాం.. జాబా చార్ట్, జ్యాబ్ కేడర్ రూపొందిస్తామంటే ఉద్యోగులు కూడా అంతా నిజమని నమ్మేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఆరు నెలల పాటు అసెంబ్లీలో ఒకటే చర్చలు దానికి ప్రాతినిథ్యం వహించిన హోం మినిస్టర్.. గ్రామ, వార్డు సచివాలయ శాఖకు తలా తోకా లేదని.. కూటమి ప్రభుత్వం అన్నీ సెట్ చేసేస్తుందని ప్రకటించారు. ప్రకటించి సుమారు రెండేళ్లు దగ్గర పడుతున్నా.. వారి విషయం అతీ గతీ లేదు. కారణం గ్రామ, వార్డు సచివాలయశాఖకు గత ప్రభుత్వమే చట్టబద్దత కల్పించడం మానేసింది. ఏ ప్రభుత్వశాఖకైనా చట్టబద్దత కల్పించకపోయినా.. సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయకపోయినా.. ప్రభుత్వం కాదు కదా.. సుప్రీం కోర్టులో కేసులు వేసినా అవెందుకూ పనిచేయవు. సరిగ్గా కూటమి ప్రభుత్వానికి అదే కలిసొచ్చింది. అదిగో ప్రమోషన్ ఇదిగో ప్రమోషన్ అంటూ..కాలయమాప చేసి.. ఒక దశలో ఈ శాఖలు పూర్తిగా రద్దు చేసే స్థితికి వచ్చింది.

 అలా చేస్త ప్రజల నుంచి ప్రభుత్వం నుంచి ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించిన ప్రభుత్వం ఈ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసే చర్యలకు పూనుకుంది. అందులో భాగంగానే రేషనలైజేషన్, క్లస్టర్ విధానాలు తెరమీదకు తీసుకొచ్చింది.  అయితే ఈలోగా గత ప్రభుత్వం పెంచేసిన రెండేళ్ల అదనపు జాబ్ సర్వీసు పూర్తయిన ఉద్యోగులు వేల సంఖ్యలో రిటైర్ అయిపోతుంటే కంగారు పడిన ప్రభుత్వం.. సచివాలయ ఉద్యోగులను ఆయా శాఖల్లోకి నేరుగా కాకుండా అదనపు విధుల పేరుతో పంపేయాలని సిద్ద పడింది. దానికోసం డిప్యూటేషన్లు అంటే మళ్లీ వ్యతిరేత వస్తుందని ఆలోచించిన ప్రభుత్వం... ప్రమోషన్ అనే పదాన్ని ముందు చేర్చి.. ఆతరువాత డిప్యూటేషన్, ఓడీ అరేంజ్ మెంట్స్ పేరుతో జీఓ జారీ చేసింది. దాని ప్రకారం డిఎస్సీ కమిటీ చైర్మన్ గా ఉన్న జిల్లా కలెక్టర్లు ప్రస్తుతం ఉన్న సచివాలయ ఉద్యోగులను వారి శాఖల ఆధారంగా మాత్రుశాఖలు, లేదా వాటి అనుబంధ శాఖల్లోకి డిప్యూటేషన్ పై పంపించడానికి చర్యలు మొదలు పెట్టింది. 

అయితే ఇవేమీ తెలియని సచివాలయ ఉద్యోగులు మాత్రం తమకు ప్రమోషన్లు వచ్చేస్తున్నాయనే త్రిశంఖు స్వర్గంలో ఊగిస లాడుతున్నారు. సచివాలయ ఉద్యోగులను ఆయా మాత్రుశాఖలకు బదిలీ చేస్తే అక్కడి రెగ్యులర్ ఉద్యోగులకు ఇచ్చే పేస్కేలు, ఇతర ప్రయోజనాలు ఇవ్వాల్సి వుంటుంది. అదీ ప్రభుత్వానికి భారం అనుకున్న కూటమి ప్రభుత్వం..తెలివిగా డిప్యూటేషన్ ఓడీ అరేంజ్ మెంట్స్ పేరుతో జీఓ జారీ ఉద్యోగులను ఇతర శాఖలకు బదలాయించనున్నది. ప్రభుత్వ అవసరాలకోసం ఏ జీఓ అయినా వెంటనే వస్తుంది.. అదే ఉద్యోగుల సమస్యలు, వారికి రాజ్యాంగ బద్దంగా కల్పించాల్సిన ప్రయోజనాల విషయంలో అయితే మాత్రం ఆ ఒక్కటీ అడక్కు.. దానికి చాలా సాంకేతిక కారణాలు అడ్డున్నాయని చెప్పి తప్పించుకుంటున్నట్టుగానే కనిపిస్తున్నది. మాట్లాడితే తమకు పదోన్నతలు ఇచ్చేయండన నానా గోల చేస్తున్న సచివాయల ఉద్యోగ సంఘాలు అసలు.. చట్టబద్దత ఇవన్నీ ఎలా సాధ్యపడయోననే విషయాన్ని ఆలోచించడంలేదు. వారి వెర్రి ఆలోచనలను మాత్రం ప్రభుత్వం చాల చక్కగా క్యాష్ చేసుకుంటూ.. కాలయాపన చేస్తున్నది తప్పి ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగుల్లా సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్, జాబ్ చార్టు మాత్రం ఏర్పాటు చేయడం లేదు.  చూడాలి ప్రభుత్వం జారీ చేసిన జీఓఆర్టీ నెంబరు 12 ఆధారంగా గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులను ప్రభుత్వం ఏ రీతిలో బదలాయింపు చేపడుతుందనేది...?!

visakhapatnam

2025-08-19 19:01:49

ప్రజలను చైతన్య పరిచే ఫోర్త్ ఎస్టేట్ ను పట్టించుకునే నాధుడేడి..?!

ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోతే.. జర్నలిస్టులు.. మీడియాకి మన బాధలు చెప్పుకుంటేనైనా అపుడుగాని ఎవరూ దారిలోకి రారు..అని ఎంతో దైర్యంతో, నమ్మకంతో  మీడియా దగ్గరకి వస్తారు ప్రజలు.. తాము అధికారంలో ఉండగా చేసిన పనులు ప్రజలకి తెలియాలన్నా కూడా అదే ప్రజాప్రతినిధులు కూడా మీడియా ద్వారా ప్రచారం పొందుతారు.. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చేసే సంక్షేమ కార్యక్రమాలు అన్ని వార్గాలకు తెలియజేయాలన్నా ప్రభుత్వాల గొప్ప తెలియాలన్నా కూడా మీడియా, జర్నలిస్టులే అవసరం. అలాంటి మీడియాలో పనిచేసే జర్నలిస్టుల భవిష్యత్తు ఇపుడు ప్రశ్నార్ధకం అయ్యింది. అన్నివర్గాలకు అవసరాలను, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ల జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించుకోవడంలో అత్యంత దారుణంగా విఫలం అవుతున్నారు. సాధారణ ప్రజల కంటే దారుణంగా వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చుట్టూ అర్జీలు పట్టుకొని తిరుగుతున్నా నేటికీ జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. 

ఒకప్పుడు జర్నలిస్టు అంటే ఎంతో రాజభోగం, కానీ నేడు పరిస్థితి పూర్తిగా పోయింది. సాంకేతిక విప్లవం తీసుకొచ్చిన టెక్నాలజీ, సోషల్ మీడియా జర్నలిస్టుల భవితవ్యాన్ని త్రిశంఖు స్వర్గంలో పడేశాయి. ఇపుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి మీడియా కంటే సోషల్ మీడియా అంటనే మక్కువ పెరిగిపోయింది. దానితో జర్నలిస్టులు, వారి సమస్యలను పరిష్కరించడాన్ని ప్రభుత్వాలు లైట్ తీసుకుంటున్నాయి. ఒకప్పుడు ఏదైనా మీడియాలో పనిచేసే జర్నలిస్టుకి అత్యంగ గౌరవంగా ప్రెస్ అక్రిడిటేషన్ కార్డు వచ్చేది. సదరు పత్రికకు క్రమం తప్పకుండా ప్రభుత్వ ప్రకటనలు వచ్చేవి. కానీ ఇపుడు మీడియా కూడా రాజకీయం అయిపోవడంతో..ఎవరి సామాజిక వర్గం అధికారంలో ఉంటే సదరు సామాజిక వర్గం మీడియాకి అగ్రతాంబూలం ఇచ్చి స్థానిక పత్రికలను పూర్తిగా ప్రక్కన పెట్టేస్తున్నారు. దానికి ప్రభుత్వాలు చెప్పే కారణం కూడా ఒక్కటే మీ పత్రికకు డిఏవీపీలేదు, ఎంపానల్ మెంట్ లేదని.

 అలాగని ఎంపానల్ మెంట్ కి, డిఏవీపికి సరిడేంత కాలం పత్రికలు దిగ్విజయంగా నడిపి దరఖాస్తు చేసుకున్నా వాటిని పట్టించుకునే నాధుడే లేడు. ప్రభుత్వం తీవ్ర ఆర్ధిక సంక్షోభంతో కొట్టిమిట్టాడుతుందని చెప్పి ఒకసారి.. ప్రస్తుతం ప్రజల సమస్యలపై దృష్టిపెట్టామని మరోసారి.. పదేళ్లపాటు డిఏవీపీ, ఎంపానల్ మెంట్ పై బ్యాన్ విధించామని మరోసారి, మీ పత్రికకు కావాల్సిన అనుబంధ పత్రాలు సక్రమంగా లేవని మరోసారి చెబుతూ కాలం వెల్ల దీస్తున్నారు తప్పితే అన్నీ సక్రమంగా ఉన్న పత్రికలకు కూడా ప్రభుత్వ ప్రకటనలు వచ్చే ఎంపానల్ మెంట్ మాత్రం సక్రమ మార్గంలో చేయడం లేదు. మరోవైపు స్థానిక పత్రికలను పూర్తిగా పాతాలళ లోకానికి తొక్కేసే విధంగా ప్రభుత్వ జీఓలు రూపొందించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2019 జర్నలిస్టులకి ఇచ్చే ప్రెస్ అక్రిడిటేషన్లను కుదించేశాయి. ఒకప్పుడు మండల విలేఖరికి కూడా ఇచ్చే ప్రెస్ అక్రిడిటేషన్ ఇపుడు నియోజకవర్గానికి ఒకటి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. 

పెద్ద పత్రికలు, ఎడిషన్లు ఎక్కువగా వుంటే ఒకలా, స్థానిక పత్రికలు అయితే మరోలా... 8పేజీలు పేపర్ అయితే ఒకలా, నాలుగు పేజీల పేపర్ అయితే ఇంకోలా.. 12 పేజీల డమ్మీసైజ్ పేపర్ అయితే వేరే రకంగా అక్రిడిటేషన్లు మంజూరు చేసి జర్నలిస్టులకు అసలు మీడియా అంటేనే విరక్తి పుట్టేలా చేసి.. స్థానిక పత్రికలపై భారం మోపుతున్నారు. అలాగనీ చచ్చీ చెడీ పెళ్లాం మెడలో పుస్తులు తాకట్టు పెట్టి కూడా పేపర్ నిర్వహణ సక్రమంగా చేసినా కూడా సమాచారశాఖ ద్వారా ఏవేవో కొర్రీలు వేస్తూ స్థానిక పత్రిక నిర్వాహకుల ఆత్మస్తైర్యం, రెగ్యులారిటీకి గాలి తీసేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు పాటించలేని స్థానిక పత్రికలు వారంటత వారే మూసేసుకుంటున్నారు. మరికొందరు అమ్మేసుకుంటున్నారు. ఇంకా మిగిలిన వారు చచ్చీ చెడీ అప్పులు చేసి మరీ పత్రికలను నడిపిస్తున్నారు. ప్రస్తుతం ప్రధాన పత్రికల్లో కూడా జర్నలిస్టులకు పనిచేసినందుకు జీతాలు లేకుండా పోయాయి..

కనీసం ప్రెస్ అక్రిడిటేషన్ గౌరవానికైనా నోచుకుందామని నిర్వహిస్తున్న పత్రికలకు ఆర్ఢిక భారం రోజు రోజు కీ పెరిగి పోతున్నది తప్పితే మరొకటి లేదు. ఉదాహరణకు సుమారు 20ఏళ్లుగా జర్నలిస్టులు కనీసం ఇంటి స్థలాలకు నోచుకోలేదంటే అతిశయోక్తి కాదు. ఇదే సమస్యపై జర్నలిస్టులు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా కలెక్టర్లు, ఆఖరికి ముఖ్యమంత్రికి విన్నవించినా ఫలితం లేకుండా పోతున్నది. ప్రస్తుతం జర్నలిస్టులు ప్రెస్ అక్రిడిటేషన్ కూడా పొందే అవకాశం లేకుండా పోతున్నది. అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు వారికి, వారి సామాజిక మీడయాలకి అనుగుణంగా నిబంధనలు మార్చేస్తున్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కూడా స్థానిక పత్రికలకు ఎన్ని అక్రిడిటేషన్లు వస్తాయో తెలియని పరిస్థితి. అయితే గతంలో టిడిపి అధికారంలో ఉన్న సమయంలో మాత్రం మండల జర్నలిస్టుకి ఒక అక్రిడిటేషన్ మంజూరు చేసింది.

కానీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని ఏకంగా పత్రికకు కేవలం 6 అక్రిడిటేషన్లతో కుదించేశారు. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇపుడైనా జర్నలిస్టుల ప్రధార గుర్తింపు ప్రెస్ అక్రిడిటేషన్, దీర్ఘకాలికంగా పరిష్కారం కాని సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ఇంటిస్థలం మంజూరు అవుతుందా..అనే ఆశతో ఉన్న జర్నలిస్టులు లేదంటే మళ్లీ సాధారణ ప్రజానీకం మాదిరిగానే అర్జీలు పట్టుకొని కలెక్టరేట్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎం వరకూ అర్జీలు పెట్టుకోవడమే జర్నలిస్టుల కర్తం అయిపోతుంది. అయినా జర్నలిజం వర్ధిల్లాలి..జర్నలిస్టు అభివృద్ధి చెందాలి.. లాంగ్ లివింగ్ మీడియా..జైహింద్ ఫోర్త్ ఎస్టేట్..!

visakhapatnam

2025-07-29 12:33:26

ఆంధ్రప్రదేశ్ లో వర్కింగ్ జర్నలిస్టులు అదృష్టవంతులు..?!

ఆంధ్రప్రదేశ్ లో వర్కింగ్ జర్నలిస్టులు చాలా అదృష్టవంతులు.. ఏ చీకూ చింతా లేదు. పనిచేసినంత కాలం పనిచేస్తారు.. 60ఏళ్లు దాటిన తరువాత  ప్రభుత్వం నుంచి ఏవిధమైన ప్రయోజనం లేకుండా.. పొందకుండా.. పొందే వీలు లేకుండా.. ఇంటిదగ్గే రెస్టు తీసుకుంటూ రామా క్రిష్ణా అని పిల్లలు పెట్టే ఏదో నాలుగు మెతుకులు తిని బ్రతుకు ఈడ్చేస్తారు. అదే బీహార్ రాష్ట్రంలో లాగా ప్రతీనెలా రూ.15 వేలు పెన్షన్ ఏమీ తీసుకోరు. అసలు అలాంటి ఊసే ఏపీలో లేదు.. రాదు.. రాబోదు. 60ఏళ్లపాటు ప్రజలకి, ప్రభుత్వాలకి మధ్య సమాచార వారధిగా పనిచేసి కూడా కనీసం పెన్షన్ కి కూడా నోచుకోని జర్నలిస్టులన్న రాష్ట్రంగా ఏపీ కీర్తికెక్కింది. జర్నలిస్టుల కనీస అవసరాలు తీర్చలేని, తీర్చుకోలేని, ఆ దిశగా పోరాటాలు చేయని జర్నలిస్టుల సంఘాలున్న రాష్ట్ర జర్నలిస్టుల సంఘాలున్న రాష్ట్రంగా  కూడా దేశంలోనే కీర్తి పొందింది. 

అదేదో బీహార్ రాష్ట్రమట. అక్కడ మాత్రం జర్నలిస్టులు ఏదో చేశారని.. సమాజం కోసం ప్రజలు, ప్రభుత్వం కోసం పనిచేశారని గుర్తించిన అక్కడి ప్రభుత్వం రిటైర్ అయిన జర్నలిస్టులకి ఇప్పటి వరకూ రూ.10వేలు ఇచ్చేది. ఇపుడు దానిని కాస్తా రూ.15వేలకి పెంచిందట. అంతే  మన రాష్ట్రంలో ఏమీ సాధించుకోలేని జర్నలిస్టులు, జర్నలిస్టుల సంఘాలు ఆ పెన్షనేదో ఇక్కడే తీసుకుంటున్నట్టు పత్రికా ముఖంగా ప్రకటనలు ఇచ్చి మరీ తెగ ఆనంద పడిపోతున్నారు.. బహుసా జర్నలిస్టులంటే అక్కడి రాష్ట్రప్రభుత్వానికి కాస్త గౌరవం కాబోలు. లేదంటే  జర్నలిస్టులకిచ్చే పెన్షన్ ను రూ.10వేల నుంచి రూ.15కి కి పెంచడమేంటి సిరాకు కాకపోతే. అదే మన ఆంధ్రప్రదేశ్ ని చూడండి.. ఒక్కసారి సారి ఆలోచించండి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులూ.. జర్నలిస్టుల సంఘాల నేతలు. నిజంగా జర్నలిస్టులంటే మనం.. జర్నలిస్టు సంఘ నేతలమంటే మనమే.. మనకి ఏ రాష్ట్రంలోని జర్నలిస్టులతోనూ పోలిక ఉండదు. 

కనీసం వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లలేం సరికదా.. కనీసం మండల విలేఖరికి ప్రభుత్వం ఇచ్చే ప్రెస్ అక్రిడిటేషన్ కూడా సాధించుకోలేం. ఇంతలా చేయడం అంటే మాటలా చెప్పండి.  ప్రభుత్వాలంటే బీహార్, ఒడిసా లాంటి  రాష్ట్రాలవినే కాదా..? చెప్పండి..! అదే ఆంధ్రప్రదేశ్ లో అయితే వర్కింగ్ జర్నలిస్టులకి ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు అదేనండీ ప్రెస్ అక్రిడిటేషన్ పొందాలన్నా దేశంలోనే లేని నిబంధనలన్నీ వర్తింపజేస్తారు. వాటిని ప్రశ్నించలేం.. సంక్షేమ పథకాలంటారా.. అవి ఒక్కటి కూడా జర్నలిస్టులకి ఉండవు.. ఒక వేళ ప్రజలను నమ్మించడానికి ఏ రాజకీయపార్టీ అయినా మేనిఫెస్టోలో పెట్టినా కూడా వాటిని అమలు చేయలేక ప్రత్యేక సబ్ కమిటీలు వేస్తాయి. అపుడూ మాట్లాడలేం.. సబ్ కమిటీ అంటే తెలుసుకదా..వాళ్లకున్నంత బిజీ మరే కమిటీకి ఉండదు. ఇచ్చే రిపోర్టులు కూడా అంతే త్వరగా ఇచ్చేస్తారు(ఎంత లేదనుకున్నా ఆరు నెలల నుంచి ఏడాదిలోపే లేదంటే మన ప్రెస్ అక్రిడిటేషన్ లాగా మరో ఆరు నెలలు ఎక్స్ టెన్షన్ చేసుకుంటూ పోతారు)..

 ఆ తరువాత వాటిపై జీఓలు రావడానికి మరో ఏడాది. ఈ లోగా ఏ జర్నలిస్టు సంఘమైనా కోర్టుకి వెళ్లకుండా ఉంటే అదీ కూడా సక్రమంగా జీఓ రావడానికి. కానీ బీహార్, ఒడిసా లాంటి రాష్ట్రాలు అలా కాదు. జర్నలిస్టులంటే ప్రభుత్వానికి ప్రజలకి మధ్య నిరంతర సమాచార సారధులుగా గుర్తించి వారికి 60ఏళ్లు నిండన వారికి పెన్షన్లు ఇస్తున్నాయి. కనీసం దానికోసమైనా అక్కడి రాష్ట్ర ప్రభుత్వాల కోసం జర్నలిస్టులు పనిచేస్తారు.. ప్రచారం చేస్తారు.. ప్రభుత్వ సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళతారు.. ఇంకేమనా చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ లాంటి పరిరిస్థితి ఏంటి.. ఇక్కడ ప్రభుత్వాలకి జర్నలిస్టులతో పనిలేదు. ప్రభుత్వం ఇచ్చే ప్రెస్ అక్రిడిటేషన్ కి కూడా నిబంధనలు మామూలుగా ఉండవు. అవి పాటించే మీడియా సంస్థలు వారి ఆస్తులు తాకట్టు పెట్టి పత్రికలను నడుపుకోవాలి. మళ్లీ ఇక్కడ మాత్రం మరో వెసులుబాటు వుంది. అదే సదరు రాజకీయపార్టీకి అనుకూలంగా ఉన్న పత్రికలు, మీడియా సంస్థలు ఉంటే మాత్రం వందల కోట్ల రూపాయలు ఒక్క ప్రకటనల ద్వారానే వారికి కట్టబెడతారు.

 అందులో ఒక్కశాతం కూడా స్థానిక పత్రికలకి ఇవ్వాలంటే మాత్రం ప్రభుత్వాలు, రాజకీయపార్టీలు కూడా ఎక్కడలేని నొప్పులన్నీ పడిపోతుంటాయి. వాటికే అంతా నొప్పులు పడగా లేనిది.. ఇక 60ఏళ్లు దాటిన రిటైర్డ్ జర్నలిస్టులకి పెన్ష్లు ఏమిస్తారు చెప్పండి..? అసలే ఖజానాలో డబ్బులు లేవు. అలాంటి సమయంలో జర్నలిస్టులకి పెన్షన్లు, ప్రెస్ అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు, యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ లు, ఇళ్ల స్థలాలు, హౌసింగ్ స్కీములు, ఎటాక్స్ కమిటీలు అంటే అది అసలు జరిగే పనికూడా కాదు. అలాంటివేమీ అడక్కూడదు. అదే స్థానిక పత్రికలకు  ప్రెస్ అక్రిడిటేషన్లు కుదించేయడానికి, స్థానిక పత్రికలు నడవకుండా ఎక్కడలేని నిబంధనలు పెట్టడానికి, ఇచ్చే ప్రకటనలకు ఎంపానల్ మెంట్ నిబంధనల ముడిపెట్టడానికి,  జీఓలు తెమ్మంటే మాత్రం రాత్రికి రాత్రి జీఓలు వచ్చేస్తాయి. క్షణాల్లో నే అమల్లోకి కూడా వచ్చేస్తాయి. స్థానిక పత్రికలకు గుదిబండాలా మారిన ఆ నిబంధనలను అమలు చేసే వరకూ ప్రభుత్వం కూడా ఊరుకోదు. 

 సరికదా మీడియాకోసం పనిచేసే సమాచారశాఖ ద్వారా జీఓని అమలు చేసి దానిని పర్యవేక్షించి గంగ గంటకీ నివేదికలు ఇమ్మని చెబుతుంది. అదే మండలంలో పనిచేసే వర్కింగ్ జర్నలిస్టుకి కనీసం ప్రెస్ అక్రిటేషన్ ఇవ్వండని ప్రభుత్వానికి జర్నలిస్టుల సంఘాలు ఆర్జీ పెట్టాయనుకోండి.. అబ్బే ఆ ఒక్కటీ అడక్కు అంటాయి. కనీసం ఇంటి స్థలం ఇస్తే కనీసం కమ్మలతోనైనా ఇల్లు కట్టుకుంటామని అని అడిగితే.. దానికోసమే కమిటీ వేశాం.. ఆ కమిటీ రిపోర్టు రాగానే ఇస్తామని గుక్కతిప్పుకోకుండా చెబుతాయి. కాకపోతే ఆ లోగా ప్రభుత్వానికే టైమ్ అయిపోతుంది. ఎందుకంటే ఈలోగా ఐదేళ్లు గడిచిపోతాయ్ కదా.. కావాలంటే గత ప్రభుత్వ విధానాలు ఒక్కసారి గుర్తుచేసుకోండి. ఇళ్ల స్థలాలు ఇస్తామని ఎన్నికలకు ఏడాది ముందు హడావిడి చేసేస్తారు. అదిగో ఇదిగో అనేసరికి ఎన్నికలు వచ్చేసి ప్రభుత్వాలే మారిపోయాయి. ఇపుడు ప్రభుత్వం ఏకంగా జర్నలిస్టులకోసం మేనిఫెస్టోలోనే హామాలిచ్చింది. 

ఇచ్చినట్టుగానే అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తరువాత బ్యాబినెట్ సబ్ కమిటీ వేసింది. ఆ రిపోర్టు ఇంకా రావాల్సి ఉంది. అది ఆంధ్రప్రదేశ్ లోని పరిస్తితి. అదే బీహార్, ఒడిసా లాంటి రాష్ట్రాల్లో ఈ పరిస్థితి లేదు కదా.. జర్నలిస్టుగా పనిచేసి రిటైర్ అయితే చాలు బీహార్ లో ఇపుడు రూ.15వేలు పెన్షన్ ఇస్తున్నారు. అలాంటి పరిస్థితులు, అవకాశాలు, ఉపయోగాలు లేని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులు అదృష్టవంతులా కాదా చెప్పండి..పైగా మన అదృష్టం మనల్నే వెక్కిరించేలా ఎక్కడో బీహార్ లాంటి రాష్ట్రంలో జర్నలిస్టుల పెన్షన్ రూ.10 వేల నుంచి రూ.15వేలకి పెంచి అక్కడి జర్నలిస్టులకి మేలు జరిగితే ఆంధ్రప్రదేశ్ లో మన జర్నలిస్టులంతా.. యూనియన్ల పేరుతో హర్షం ప్రకటిస్తాం అదీ పత్రికా ముఖంగా?!

viskahpatnam

2025-07-27 07:38:48

రాజకీయపార్టీల మీడియా సంస్థలు.. జర్నలిస్టులే సమిథలు..!

మీడియారంగలోకి రాజకీయపార్టీల రంగ ప్రవేశంతో జర్నలిస్టులే సమిథలైపోతున్నారు.. జర్నలిజం విలువలు మచ్చుకైనా కనపించకుండా పోతున్నాయి. ఒక పార్టీ అంటే మరో పార్టీకి పడకపోవడంతో వీళ్లలో వీళ్లే ఒకరు పచ్చపత్రిక అని.. మరొకరు పచ్చకామెర్ల పత్రికలంటూ దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ తరుణంలో ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్లడం మాని రాజకీయపార్టీల ముష్టియుద్ధాలకు జర్నలిస్టులు గొడవలు పడాల్సి వస్తున్నది. రాజకీయపార్టీలకోసమే జర్నలిస్టుగా పనిచేయక తప్పని దుస్థితి కూడా వచ్చేసింది. అలాగని మీడియా రంగంలో వర్కింగ్ జర్నలిస్టులకు రక్షణ అయినా ఉంటుందా అదీ లేదు. కొన్ని సంస్థలు జీతాలిస్తే.. మరికొన్ని సంస్థలు ప్రజా సేవ చేయమంటున్నాయి. జర్నలిజం ఆశక్తి ఉన్నవారు తప్పితే మరెవరూ ఈ రంగంలోకి అడుగుపెట్టడానికి సాహసం చేయడం లేదు. తెల్లవారు లెగిస్తే ప్రజా సమస్యలు ఎక్కడా పత్రిలూ టీవీ ఛానల్స్ లో కనిపించడం లేదు. ఒకప్పుడు పత్రికలంటే ప్రభుత్వాలకి రాజకీయపార్టీలకు కాస్త భయం ఉండేది. ఇపుడు అది పోయింది. కారణం రాజకీయపార్టీలకే మీడియా సంస్థలు రావడం వాటినే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకే నిధుల సర్ధుబాటు ప్రభుత్వ ప్రకటనల ద్వారా అడ్డగోలుగా చేసుకోవడం అలవాటైపోయింది.

మరికొన్ని మీడియా సంస్థలు మనుగడ కోసం అధికాపార్టీలకు తొత్తుల్లా మారాల్సి వస్తున్నది. ఎటొచ్చీ రాజకీయపార్టీల మీడియా ఆదిపత్యంలో స్థానిక పత్రికలు మట్టికొట్టుకు పోతున్నాయి. అంతేకాదు స్థానిక పత్రికలను పూర్తిగా అణగదొక్కేయడానికి రక రకాల జీఓలు తీసుకువచ్చి ఇక వారంతట వారే పత్రికలు, మీడియా సంస్థలు మూసేసుకునే చర్యలకు దిగుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఒకప్పుడు తెల్లవారుజామున లేచే సరికి బాహ్య ప్రపంచంలో ఎం జరుగుతుందనే తాజా సమాచారంతో పత్రికలు ప్రజలను చైతన్య పరిచేవి. ఇపుడు పేపర్ తిరగేస్తే మూడొంతులు రాజకీయపార్టీ ముష్టియుద్దాలకు జర్నలిస్టులు బలపోయి, పొట్టగూటికోసం ఉద్యోగాలను నిలుపుకోవడం రాసిన కథనాలే కనిపిస్తున్నాయి. మీడియా సంస్థలకు ప్రభుత్వాలు ఇచ్చే గుర్తింపు ఇస్తే ఎక్కడ ప్రయోజనాలు ఇవ్వాల్సి వస్తుందోనని కనీసం పత్రికలకు ఎంపానల్ మెంట్ చేయడం లేదు. ఉన్నవాటికి కూడా రెగ్యులారిటీ పేరుతో నిబంధనలు విధించి ప్రభుత్వ ప్రకటనలు కూడా ఇవ్వడం లేదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం డిఏవీపీ ప్రకనటలు ఇవ్వడం తగ్గించేసింది.. కాదు కాదు ఇవ్వడమే మానేసింది. ఇచ్చినా కూడా ఇందులో కూడా అడ్డగోలు రాజకీయాలు చేస్తూ.. స్థానిక పత్రకలను ప్రక్కకు నెట్టేస్తున్నారు. ఈ విషయంలో కూడా రాజకీయపార్టీల పత్రికలే మొత్తం ప్రకటనల్లో అగ్రభాగాన్ని లాగేస్తున్నాయి.

ఒకప్పుడు జర్నలిజం అంటే ప్రభుత్వాన్ని, ప్రజలను వారి వార్తలతో చైతన్యపరచడం.. దాని ఇపుడు వాటి స్వరూపం మారిపోయి ఒక పార్టీ పేపరులో, మరోపార్టీ రాజకీయాలకే అగ్రతాంబాలం, పేజ్-1 ఆర్టికల్స్ కి ప్రత్యేక స్థానాలను కేటాయిస్తున్నారు. సమాజంలో తమవంతు పాత్ర పోషించి ప్రజలను చైతన్యం చేయడానికి జర్నలిజం, మీడియారంగంలోకి అడుగుపెడుతున్న జ్నలిస్టులు సమిధలుగా మారి రాజకీయ క్రీడలో ఆటగాళ్లు అవుతున్నారు. యాజమానం ఏం చెబితే అదే రాయాలి. ఎలా చెబితే అలా రాయాలి.. ఎక్కడా జర్నలిస్టులకి ప్రజా సమస్యలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలు రాసే స్వేచ్చ పోయి చాలా కాలమే అయ్యింది. ఆ స్వేచ్చ మళ్లీ వస్తుందనే నమ్మకం కూడా లేదు. ఉన్న కొద్దిపాటి స్థానిక పత్రికలైనా వాస్తవాలను బయటపెడితే ఆ లోకల్ పేపర్ మన పార్టీది కాదు.. ప్రభుత్వానికి అనుకూలంగా కూడా లేదు. అలాంటి వాటిని పట్టించుకోవాల్సిన పనిలేదంటూ ప్రభుత్వంలో ఉన్నవారే స్థానిక పత్రికలను ప్రక్కన పెట్టేస్తున్నారు. ఎంతదారుణం అంటే జర్నలిస్టులకి, పత్రికను అందంగా తీర్చి దిద్దే డెస్కు జర్నలిస్టులకి, వాస్తవాలను చిత్ర రూపంలో చిత్రించే ఫోటో జర్నలిస్టులకి, కదిలే బొమ్మలు వీడియోలు చిత్రీకరించే వీడియో జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చే ప్రెస్ అక్రిడిటేషన్ కి కూడా ప్రపంచంలో ఏ దేశంలో లేని నిబంధనలు భారతదేశంలోనూ, అందునా ఆంధ్రప్రదేశ్ లోనే అమలు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో.

ఇపుడు ఇంకో అడుగు ముందుకి వేసి. యావత్ మీడియానే నియంత్రించే పని ప్రారంభించారు. సోషల్ మీడియా అభివృద్ధి చెందడంతో ఏ పార్టీకి ఆ పార్టీ, కార్పోరేట్ సంస్థలు సైతం సోషల్ మీడియాని సొంతంగా ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఎంత దారుణమైన పరిస్థితులు ఇపుడు తెరపైకి వచ్చాయంటే.. సోషల్ మీడియాకి కూడా ప్రెస్ అక్రిడిటేషన్లు ఇవ్వాలనే సూచనలు ప్రభుత్వాలు చేస్తున్నాయంటే వర్కింగ్ జర్నలిస్టులకు వచ్చే ఆ కొద్దిపాటా గౌరవం కూడా ప్రెస్ అక్రిడిటేషన్ రూపంలో సోషల్ మీడియాకి వెళ్లిపోతుందనే భయానక పరిస్థితులు వచ్చాయి. మీడియా రంగంలో ఏం జరిగినా.. ఏం చేసినా రాజకీయపార్టీలు మాత్రమే శాసిస్తున్నాయి. దానికి అధికారం కూడా ఒక అవకాశం అవుతుంది. ఇప్పటికై మీడియా పతన దశకి చేరుకుంది. రానున్న రోజుల్లో మీడియా అనే పదం, వార్తలు కనుమరుగు అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే ఎవరు ఎన్ని సంస్థలు పెట్టుకున్నా అందులో పనిచేసేది.. రాసేది..రాయించేది..రాటుదేలి ప్రజలను, ప్రభుత్వాలను చైతన్య పరిచిదే జర్నలిస్టులు మాత్రమే..జర్నలిస్టులకి పూర్వవైభవం రావాలి.. జర్నలిజం వర్ధిల్లాలి..!

visakhapatnam

2025-07-24 07:45:54