1 ENS Live Breaking News

మహిళా పోలీసులను కరుణించిన కూటమి..?!

గ్రామ, వార్డు సచివాయ మహిళా పోలీసుల మొరను కూటమి సర్కారు ఆలకించి కరుణించింది.. వీరి సమస్యలపై నిత్యం ఈరోజు-ఈఎన్ఎస్  అందించిన ప్రత్యేక వార్త కథనాలపై ఎట్టకేలకు స్పందించింది.. సుమారు ఐదున్నరేళ్ల పాటు గాల్లో ఉన్న మహిళా పోలీసులకు ఒక ప్రభుత్వశాఖ ఖరారు చేయడానికి రూట్ క్లియర్ చేయడానికి రంగం సిద్దం చేసింది.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వీరిని ఉద్యోగాల్లో నియమించిన తరువాత.. కోర్టులో కేసులు పడితే వీరికి పోలీసుశాఖకు ఎలాంటి సంబంధం లేదని కోర్టుకి చెప్పేసి కూడా వీరిని పోలీసు, అంగన్వాడీ సేవలకు వినియోగించుకుంది తప్పితే వీరికి ఎలాంటి న్యాయం చేయలేదు.. 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. వస్తూ వస్తూనే వీరి విషయాన్ని హోం మంత్రి అనిత ద్వారా అసెంబ్లో ప్రస్తావించి భారీ స్థాయిలో హడావిడి చేసి వైఎస్సార్సీ చేసిన తప్పిదాలను కడిగేసింది. ఇపుడు సరిగ్గా ఏడాదిన్నర తరువాత మహిళా పోలీసులకు ఒక ప్రభుత్వశాఖ కేటాయించడానికి ఆప్షన్లు ఇస్తూ ఉద్యోగుల హెచ్ఆర్ఎంఎస్ కి వర్తమానాలు పంపింది. దీనితో మహిళా పోలీసులకు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు.!

హైకోర్టులో కేసుల కారణంగా పోలీసుశాఖకు సంబంధం లేదని గత ప్రభుత్వం చెప్పేయడంతోనే ఇన్నేళ్లూ గాల్లో ఉన్న గ్రామ, వార్డు సచివాలయశాఖ మహిళా పోలీసులకు కూటమి ప్రభుత్వం ప్రభుత్వ శాఖను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నది. సచివాలయ ఉద్యోగుల సమస్యలను 2019 నుంచి ఒక ప్రత్యేక సామాజిక బాధ్యతగా స్వీకరించిన ఈరోజు-ఈఎన్ఎస్ ప్రభుత్వానికి వీరి సమస్యలు తెలిసే విధంగా అనేక కథనాలు అందించింది. దీనితో ఆలోచనలో పడ్డ ప్రభుత్వం మహిళా ఉద్యోగులు నష్టపోకుండా వారికి ప్రభుత్వశాఖను కేటాయించేందుకు చర్యలు ప్రారంభించింది. అసెంబ్లీలో ప్రస్తావించినట్టుగానే.. తలా తోకా లేని మహిళా పోలీసులకు ఒక ప్రభుత్వశాఖను ఏర్పాటు చేయడం ద్వారా వారికి సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నాలు ప్రారంభించి ఉద్యోగుల హెచ్ఆర్ఎంఎస్ లాగిన్ కు వర్తమానం పంపించింది. 

ఐసిడిఎస్, పోలీసుశాఖలు రెండు ఆప్షన్లు ఇచ్చి వాటిలో వారికి నచ్చిన శాఖను ఎంచుకోమంది. ఉద్యోగులు ఏఏ ప్రభుత్వశాఖలు ఎంచుకున్నారో లెక్కగట్టిన తరువాత వీరికి ప్రభుత్వశాఖ కేటాయించే విధంగా చర్యలు తీసుకోవడానికి అధీకృతంగా ఉండేవిధంగా హెచ్ఆర్ఎంఎస్ ద్వారనే కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. అయితే ఈ రెండు ప్రభుత్వశాఖల్లో వీరికి ఏ క్యాడర్ ఉద్యోగాలను ప్రభుత్వం అలాట్ చేస్తుందో క్లారిటీ మాత్రం రాలేదు. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టుగా ముందు తమకు ప్రభుత్వశాఖ ఏర్పాటు చేస్తే ఆ తరువాత జరగాల్సిన తంతు జరుగుతుందని ఉద్యోగులు కాస్త ఊరట చెందుతున్నారు.
మరో వైపు గత ప్రభుత్వం రెండేళ్లు ఉద్యోగ విరమణ వయస్సు పెంచేయడంతో ఆ వ్యవది పూర్తయిన వారు ఇటు పోలీసుశాఖలోనూ, అటు ఐసిడిఎస్ లో నూ భారీగా రిటైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో సదరు ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. 

దానికోసం గతంలోనే ఉద్యోగులకు ప్రమోషన్స్, అడ్జెస్ట్ మెంట్స్, డిప్యూటేషన్స్ ఇలా మూడు అంశాలను ఉటంకిస్తూ జీఓ జారీ చేసింది. సదరు జీఓ ఆధారంగానే ఇపుడు మహిళా పోలీసులకు డిపార్ట్ మెంట్ చూజింగ్ ఆప్షన్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. ముందు ఆప్షన్లు ఇవ్వడం ద్వారా వీరికి ప్రభుత్వశాఖ అంటూ ఒకటి ఏర్పాటు అవుతుంది. ఆ తరువాత ఏ క్యాడర్ ఉద్యోగం ఇవ్వాలనే దానిపై ప్రభుత్వం విధివిధానాలు రూపొందించే అవకాశాలున్నాయని రాష్ట్రస్థాయి అధికారి ఒకరు ఈరోజు-ఈఎన్ఎస్ కి తెలిపారు. అయితే సచివాలయ ఉద్యోగులు ఎప్పటి నుంచో జూనియర్ అసిస్టెంట్ పేస్కే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుశాఖ ఎంచుకున్నవారికి క్లరికల్ క్యాడర్ ఉద్యోగాన్ని అందించి వారిని పోలీసు స్టేషన్లలో మినిస్టీరియల్ సిబ్బందిగా వినియోగించుకునే అవకాశం ఉందని, లేదంటే ఫిజికల్ ఫిట్ నెస్ ఆధారంగా మళ్లీ ప్రత్యేంకగా పోలీసు రిక్రూట్ మెంట్ బోర్టు ద్వారా ప్రత్యేక పరీక్ష పెట్టి కానిస్టేబుళ్లుగా తీసుకుంటారనే ప్రచారం కూడా జరుగుతుంది. 

అయితే ఇప్పటికే చాలా మంది ఉద్యోగులకు పోలీసు ఉద్యోగం వయస్సు దాటిపోయింది. దాని కారణంగా వారికి డ్రెస్ డ్యూటీ ఉంటే పోస్టు వచ్చేఅవకాశం లేదని కూడా సమాచారం అందుతుంది. అయితే గతంలో మహిళా పోలీసులకు ఇచ్చిన సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ లెక్కన చూసుకుంటే వీరికి తరువాత ప్రమోషన్ హెడ్ కానిస్టేబుల్ ని చేసి ప్రత్యేకంగా మహిళా పోలీసు స్టేషన్లకు సిబ్బందిగా పంపిస్తారని కూడా చెబుతున్నారు. అటు ఐసిడిఎస్ ఎంచుకున్నవారికి సూపర్ వైజర్ క్యాడర్ పోస్టు వచ్చే అవకాశాలున్నాయని కూడా చెబుతున్నారు. ఎందుకంటే ఐసిడిఎస్ లో తొలి ఉద్యోగం కార్యకర్త అయితే చదువుకున్నవారు విధుల్లో చేస్తున్న ఉద్యోగం సూపర్ వైజర్.. తరువాత పదోన్నతుల ద్వారా సీడీపీఓ, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వరకూ పదోన్నతులు దక్కే చాన్సు వుంది. ఏది ఏమైనా ముందు వీరికి డిపార్ట్ మెంట్ ఎలాట్ మెంట్ చేసే క్రమంలో ప్రభుత్వం ఏం చేయబోతుందనే విషయం తేలనుంది. కాగా ప్రభుత్వం తమ ఉద్యోగాలను గాల్లోనే ఉంచేయకుండా.. ప్రభుత్వం గుర్తించే విధంగా ప్రత్యేక కథనాలు అందించిన ఈరోజు-ఈఎన్ఎస్ కి మహిళా పోలీసులు ప్రత్యేకంగా ఫోన్లు చేసి ధన్యవాదములు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం తమకు, తమ చదువు, శారీరక దారుడ్యాన్ని అనుసరించి ఒక మంచి పోస్టులో కూర్చోబెడితే జీవితాంతం కూటమి ప్రభుత్వ మేలు మరిచిపోమనే విషయాన్ని కూడా మహిళా పోలీసు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు..!

visakhapatnam

2025-09-17 21:45:35

రాజకీయ మొదలు.. యూటర్న్ తీసుకున్న సచివాలయ ఉద్యోగులు..?!

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు వారి డిమాండ్లు సాధించుకోవడంలో యూటర్న్ తీసుకున్నారు..అవును ఇది నిజం.. ప్రభుత్వానికి ఎదురు తిరిగితే ఉన్న ఉద్యోగాన్ని గాల్లో పెడతారానే సంకేతాలు వచ్చాయట.. అందుకే కొందరు ఉద్యోగులు ఉద్యోగం ఉంటే చాల్లే.. పదోన్నతులు, సర్వీసు రూల్స్, జాబ్ క్యాడర్ లేకపోయినా పర్లేదని వాట్సప్ యూనివర్శిటీలో సన్నాయి నొక్కుళ్లు నొక్కుతున్నారు.. మొన్నటి వరకూ తమకు పదోన్నతులు అర్జెంగ్ ఇచ్చేయాలి.. నోషనల్ ఇంక్రిమెంట్లు కావాలని ఒంటికాలిపై లేచిన సచివాలయ ఉద్యోగులు ఇపుడు వెనక్కి తగ్గిపోవడం చర్చనీయాంశం అవుతున్నది. అయితే అన్ని యూనియన్ల ఉద్యోగులు కాదండోయ్.. ఇక్కడ కొన్ని యూనియన్లు మాత్రమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాయట. మిగిలిన వారు తమ ఆందోళన కొనసాగిస్తామని చెబుతున్నారట..ఆ విషయాన్ని కూడా స్వయాన సచివాలయ ఉద్యోగులే మీడియాకి లీకులివ్వడం కూడా విశేషం..!

తాడిని తన్నేవాడు ఒకడుంటే.. వాడి తలదన్నేవాడు ఒకడుంటాడని.. గ్రామ, వార్డు సచివాలయ శాఖలో ప్రతీసారి రుజువవుతూ వస్తున్నది. ఉద్యోగుల్లో ఉద్యోగులకి.. యూనియన్లలో యూనియన్లకి పడక వారు న్యాయ బద్దంగా సాధించుకోవాల్సిన డిమాండ్ల విషయంలో ఉద్యోగులు యూటర్న్ తీసుకోవాల్సి వస్తున్నది. ప్రస్తుతం కొందరు సచివాలయ ఉద్యోగులు చేస్తున్న పని కూటమి ప్రభుత్వానికి తెగ కలిసొచ్చేవిధంగా తయారైంది. డిమాండ్ చేసేవారికంటే.. చేయని వారంటనే ప్రభుత్వానికి ఇష్టం కదా.. వారినే అక్కున చేర్చుకుని.. చేసేవారిని ఓ కంట కనిపెట్టుకొని ఉండటానికి కూడా బాగుంటుంది. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఒక ప్రభుత్వశాఖ ఏర్పాటైతే దానికి విధి విధానాలన్నీ ఆ శాఖ ఏర్పాటు అయినపుడే సదరు రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రిన్సిపల్ సెక్రటరీలు ఏర్పాటు చేసి.. ప్రత్యేకంగా ఒక గెజిట్ ద్వారా చట్టబద్దత తీసుకు వస్తారు.. 

అదేంటో ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటైన దగ్గర నుంచి తలా తోకా లేకుండా వ్యవహారం మొత్తం నడిచినా.. చట్టపరంగా.. న్యాయబద్దంగా సాధించుకోవాల్సిన డిమాండ్ల విషయంలో ఒకరు ఎడ్డం అంటే మరొకరు తడ్డెం అంటున్నారు.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఈ ద్వంధ వైఖరి కలిసొచ్చి ఎవరికీ పదోన్నతులు ఇవ్వకుండా ఐదేళ్లు కాలం గడిపేసింది. ఉద్యోగుల్లో ఉద్యోగులకే పడక ఆడుతున్న నాటకాలు కూడా కూటమి ప్రభుత్వానికి కూడా కలిసొచ్చే విధంగా ఉన్నాయి. సచివాలయ ఉద్యోగులకు న్యాయం చేసేస్తామని ఎన్నికల ముందు హామీలు గుప్పించి.. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత అసెంబ్లీ సాక్షిగా హడావిడి చేసిన కూటమి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకి వేయలేదు. పైగా.. ఈశాఖను విచ్చిన్నం చేయడానికి క్లష్టర్ వ్యవస్థ, రేషనలైజేషన్, డిప్యూటేషన్ అంటూ జీఓలు తీసుకొచ్చినా కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు ఎక్కడా నోరు మెదపలేదు. 

తాగాజా రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల జేఏసీ అంటూ తెరపైకి వచ్చి తమ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం చేస్తాం.. సర్వీసులు నిలిపివేస్తాం.. పెన్షన్లు పంచమని చెప్పిన వారే తాము ఆ మాట అనలేదని అంటే.. మరికొందరు ఆ జేఏసితో తమకు సంబంధం లేదని వాట్సప్ గ్రూపుల్లో చర్చకు తెరలేపారు. మరికొన్ని యూనియన్ల సభ్యులు ఎవరో ఒకరు చేస్తున్నారు కదా.. మళ్లీ మనమెందుకు అన్నట్టు మిన్నకుండిపోయారు. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా కొన్ని సంఘాలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే మరికొన్ని సంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటాయి. ఇక్కడ కూడా అదే కలిసొచ్చింది కూటమి ప్రభుత్వానికి. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న సంఘాల్లో ఉద్యోగులు.. జేఏసి పేరుతో విధులు బహిష్కరణ, డిమాండ్ల సాధనతో మాకు సంబంధం లేదని వాట్సప్ గ్రూపుల్లో చర్చకు తెరలేపింది. అదీ ఎంతలా అంటే విషయం మొత్తం మీడియాకి తెలిసే విధంగా కొందరు ఉద్యోగులు పనిగట్టుకొని మరీ ఈ విషయాలను లీకులు ఇచ్చేంతగా మారిపోయింది. 

అంటే ఒక వర్గం ఉద్యమం చేస్తుంటే.. ఒక వర్గం దానికి సంబంధం లేదన్నట్టుగా వ్యహరించడం కూడా ఇక్కడ చర్చనీయాంశం అవుతున్నది. ప్రభుత్వం చేయాలనుకుంటే ఎలాగైనా చేస్తుందని.. చేయడం ఇష్టం లేకపోతే హడావిడీ చేసి ఊరుకుంటుందని.. దానికోసం డిమాండ్లు, విధులు బహిష్కరణ అంటే ఉద్యోగులపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తుందని బెదిరింపులకు దిగడం ఇక్కడ విశేషం. ఉద్యోగుల జేఏసి గ్రామ, వార్డు సచివాలయశాఖ డైరెక్టర్ కి నోటీసు ఇచ్చిన తరువాత ఈ విషయాలన్నీ తెరపైకి రావడం వెనుక ఉద్యోగ సంఘాల్లోని వారికే క్లారిటీ లేదని.. ఒకరంటే మరొకరికి గిట్టడం లేదని పక్కాగా తేలిపోయింది. ఇలాంటి అంశాలే ప్రభుత్వానికి కూడా చాలా బాగా కలిసి వస్తాయి. ప్రస్తుతం కూడా అదే జరిగేలా కనిపిస్తున్నది. ఒక వర్గం అలా ఉంటే ఉద్యమం చేయాలనుకున్న వర్గంలోని యూనియన్లు ఉద్యోగులు మాత్రం... ఫ్రీ బస్సుతో ఉపాది పోయిందని రోడ్డెక్కి మరీ పథకాన్ని సాధించుకున్న ఆటోకార్మికులే నయం.. 

ఆ పాటికూడా మనం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని రాలేకపోతున్నామని వాట్సప్ గ్రూపుల్లోనే ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నారు. ఏ ది ఏమైనా భూమికి బొక్క పెడతాం..ఆకాశాన్ని అరచేత్తో పట్టేస్తామని బీరాలు పోయి..డమ డిమాండ్లు అన్నీ సాధించుకుంటామని ప్రకటన చేసిన ఉద్యోగ సంఘాల్లో వారిలో వారికే పడక బయటకు వస్తున్న తేడా వ్యవహారాలు.. డిమాండ్ల సాధనకు కొన్ని యూనియన్లు వ్యతిరేకమని తేలిపోయింది. అంటే కూటమి ప్రభుత్వంలో కూడా గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులు ప్రధాన డిమాండ్లు.. పదోన్నతులు, సర్వీసు రూల్స్, జాబ్ క్యాడర్, కోర్టు కేసులో ఉన్న మహిళా ఉద్యోగులకు ప్రభుత్వశాఖ కేటాయింపు వంటి అంశాలు మరో మూడున్నరేళ్ల వరకూ పరిష్కారం అయ్యే మార్గాలు కనుచూపుమేరలో కనపించవనే విషయాన్ని ఇటు విశ్లేషకులు కూడా వ్యక్తం చేస్తున్నారు.. ఎక్కడైనా ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల్లో ఉండే పొరపొచ్చాలే ఇటు గ్రామ, వార్డు సచివాలయశాఖ లో కూడా వారి డిమాండ్ల సాధన విషయంలో రాజకీయం చేయడానికి  తెరపైకి రావడం విశేషం..!

visakhaptnam

2025-09-11 04:20:03

సచివాలయ ఉద్యోగుల పోరుబాట.. అక్టోబర్ 1 డెడ్ లైన్ ?!

గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల కడుపు మండింది..ప్రక్క ప్రభుత్వశాఖల ఉద్యోగులకు పదోన్నతులు వస్తుంటే..నేటికీ సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్.. నోషనల్ ఇంక్రిమెంట్లు.. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలకు నోచుకోని ఉద్యోగులు తిరగబడ బోతున్నారు.. తమ న్యాయమైన.. చట్టబద్దమైన డిమాండ్లు పరిష్కరించకపోతే అక్టోబరు 1 నుంచే ప్రభుత్వసేవలన్నీ నిలిపివేస్తామని హెచ్చరిస్తూ.. ప్రభుత్వానికి నోటీసు ఇచ్చారు..ఉద్యోగం ఒకటి.. విధులు మాత్రం అన్ని ప్రభుత్వశాఖలవి చేయించుకుంటూనే తమకు చట్టబద్దంగా ఇవ్వాల్సిన ప్రయోజనాలు ఇవ్వకపోతే ఎలా అంటు తిరగబడబోతున్నారు.. ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద ఉద్యోగుల నెట్వర్క్ గా ఉన్న గ్రామ, వార్డు సచివాలయశాఖ తమ పనులు ఆపేస్తే.. రాష్ట్రం మొత్తం ప్రజలకు సేవలు నిలిచిపోతాయి..ఒక వేళ ఎస్మా ప్రయోగించినా.. కోర్టుకి వెళితే ప్రభుత్వం చేసిన తప్పులు, కావాలని నిలిపేసిన ప్రయోజనాలు స్పష్టంగా కనపిస్తాయి..ఎలా చూసుకునున్నా ఉద్యోగులే విజయం సాధిస్తారు..ఇది కాస్తా వైఎస్సార్సీపీకి ప్రధాన అస్త్రం కూడా అయిపోతుంది..!

అనుకున్నంతా అయ్యింది.. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని సుమారు 1.28లక్షల ఉద్యోగులు తమ సేవలు అక్టోబరు 1 నుంచి ఆపేయాలని నిర్ణయించుకొని.. ప్రభుత్వానికి నోటీసు ఇచ్చారు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం ఐక్య వేదిక చైర్మన్ బూరాడ మధుబాబు ఆధ్వర్యంలో నోటీసు ఇచ్చారు. అనంతరం మీడియాకి ప్రకటన విడుదల చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి రావాల్సిన ప్రయోజనాలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇచ్చినట్టుగా అధికారంలోకి రాగానే హోం మంత్రి అనిత సచివాలయ మహిళా పోలీసుల అంశాలన్ని అసెంబ్లీలో ప్రస్తావించి తెగ హడావిడీ చేశారు. కూటమి ప్రభుత్వం తమ సమస్యలను అసెంబ్లీలోనూ, శాసన మండలిలోనూ ప్రస్తావిస్తే వెంటనే సమస్యలు పరిష్కారం అయిపోతాయని ఉద్యోగులంతా ఆనంద పడ్డారు. కానీ ఆ హడావిడీ కేవలంల ప్రజలను, ఉద్యోగులను, వ్యతిరేక వైఎస్సార్సీపీని నమ్మించడానికేనని తేలిపోయింది. 

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్య ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. పైగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వశాఖల ముఖ్యకార్యదర్శిలకు ఇచ్చిన అభ్యర్ధనలన్నీ బుట్టదాఖలే అయ్యాయి. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించని కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత క్లస్టర్ వ్యవస్త, రేషలైజేష్ అంటూ జీఓలు జారీ చేసింది. అంటే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించని ప్రభుత్వం వ్యవస్థను విచ్చిన్నం చేయడానికి కంకణం కట్టుకుంది. తాజాగా జీఓ నెంబరు 16 విడుడదల చేసి..అందులో తలా తోకా లేకుండా అంశాలను పొందు పరిచింది. అదేంటంటే.. ప్రమోషన్లు, అడ్జెస్ట్ మెంట్లు, డిప్యూటేషన్లు.. అని చెబుతూ జీఓ జారీ చేసింది. వీరి సమస్యలు పరిష్కరించని కూటమి ప్రభుత్వం.. వీరిని భారీగా ఏర్పడుతున్న ప్రభుత్వశాఖల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గా వినియోగించుకోవడానికి కార్యాచరణ సిద్దం చేసింది. రాష్ట్రంలో 75 ప్రభుత్వశాఖలు ఉంటే.. 74 ప్రభుత్వశాఖలు మాత్రమే వారి వారి శాఖల పనులు చేసుకుంటారు. 

కానీ ఒక్క గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులు మాత్రం అన్ని ప్రభుత్వశాఖల పనులూ చేయాలి.. ప్రభుత్వ సంక్షేమపథకాలు వీళ్లే ప్రజల వద్దకు చేర్చాలి.. మరి సమస్యలూ.. ప్రయోజనాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని అర్జిస్తే మాత్రం ఆ ఒక్కటీ అడక్కు అంటారు అంటున్నారని సచివాలయ ఉద్యోగులు నెత్తీ నోరూ కొట్టుకుంటున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ విరమణ వయస్సు రెండేళ్లు పెంచేయడంతో.. వారు కాస్తా 75 ప్రభుత్వ శాఖల్లో వేల సంఖ్యలో రిటైర్ అయిపోతున్నారు. దీనితో డైలమాలో పడ్డ కూటమి ప్రభుత్వం ఉన్న గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులతోనే అన్ని ప్రభుత్వశాఖ ల పనులూ చేయించేయడానికి సిద్దమైపోయింది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఆయా శాఖల అధిపతులే వారిపై అజమాయిషీ చలాయిస్తారు.. కానీ గ్రామ, వార్డు సచివాలయశాఖ విషయానికొస్తే.. వీరు విధులు నిర్వహించే అన్నిశాఖల జిల్లా అధికారులు వీరి మీదికి ఎక్కేస్తుంటారు.. ఇక మున్సిపల్ కార్పోరేషన్లలో అయితే.. ఏకంగా జెడ్సీలు వీరి ఉద్యోగాలనే తీయించేస్తానని బెదిరింపులకు దిగుతారు.. 

ఇలాంటి వేధింపులు తట్టుకొని ఇప్పటి వరకూ పనిచేసిన సచివాలయ ఉద్యోగుగు ఒక్కసారిగా తిరుగుబావుటా ఎగుర వేశారు. ఇప్పటి వరకూ అజయాయిషీ చలాయించిన అన్ని జిల్లాశాఖల అధికారులు వీరి నోటీసుతో డైలమాలో పడ్డారు. సచివాలయ ఉద్యోగులు ఒకటవ తేదీన పెన్షన్లు ఇవ్వడం మానేస్తే.. ప్రభుత్వానికి ఎక్కడలేని చెడ్డ పేరూ వస్తుంది. అంతేకాదు ఇతర ప్రభుత్వ పథకాలు కూడా గ్రామ, వార్డు స్థాయిలో ప్రజలకు అందే పరిస్థితి ఉండదు. అయితే ఇక్కడ కొన్ని సంఘాలు ప్రభుత్వానికి అనుకూలంగా.. అధికంగా వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. ఏ సంఘం ఉద్యోగులు..సమ్మెలో పాల్గొంటారు.. మరే సంఘం ఉద్యోగులు సమ్మెలో పాల్గొనరు. అనే అంశం రెండు మూడురోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవశాకం ఉంది. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో చేస్తున్న తాత్సారం.. ఇపుడు వైఎస్సార్సీపీ ప్రధాన అస్త్రం కాబోతున్నది.  గ్రామ సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వానికి సమ్మెనోటీసు ఇచ్చిన క్రమంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే ఆశక్తి కరంగా మారింది..!

visakhapatnam

2025-09-09 06:06:41

గ్రామ సచివాలయ కార్యదర్శిలకు పదోన్నతిశాపం..!

గ్రామ, వార్డు సచివాలయశాఖలో గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శి కార్యదర్శిలకు పదోన్నతి శాపం వెంటాడుతోంది.. రాష్ట్రప్రభుత్వం గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలను గ్రేడ్-4 గా పదోన్నతి కల్పించాలని ఉత్తర్వులు ఇచ్చినా అవి ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో తప్పా మరెక్కడా సక్రమంగా అమలు అయినట్టు కనిపించలేదు. విశాఖ జిల్లాలో అయితే ఆ ఊసే ఎత్తలేదు డిఎస్సీ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్. తమతో పాటు విధుల్లోకి చేరి గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు ఇతర జిల్లాల్లో గ్రేడ్-4 పదోన్నతి కల్పించడంతోపాటు చిన్న పంచాయతీలకు కేటాయింపులు చేసి డిప్యూటేషన్లను రద్దు చేశారు. అదేంటో మిగిలిన జిల్లాల్లోని డిఎస్సీ కమిటీ చైర్మన్లు ఆ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకి వేయకపోవడంతో సచివాలయ పంచాయతీ కార్యదర్శిలు వారి గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక గొల్లు మంటున్నారు. సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూసే పంచాయతీరాజ్ శాఖ ఇంత దారుణంగా ఉంటే ఇతర ప్రభుత్వశాఖలు ఏ విధంగా ఉంటాయో అర్ధంచేసుకోవచ్చు..!

ఏ ముహూర్తాన గత ప్రభుత్వం అరకొర విధానాలతో గ్రామ, వార్డు సచివాలయశాఖను ఏర్పాటు చేసిందో తెలియదు కానీ.. వీరి విషయంలో ప్రభుత్వం గానీ, జిల్లా కలెక్టర్లు గానీ ఏఒక్క కార్యక్రమం కూడా సక్రమంగా చేయడం లేదు. వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శిల కొరత అత్యంత తీవ్రంగా వెంటాడుతోంది. ఇలాంటి సమయంలో సచివాలయశాఖ ఏర్పాటైన తరువాత చాలా సచివాలయాలకు పంచాయతీ కార్యదర్శిలను నియమించలేదు. ఉన్న గ్రేడ్-3, గ్రేడ్-2 పంచాయతీ కార్యదర్శిలకే అప్పగించి అదనపు పనులు చేయిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత డిప్యూటీ సీఎం చొరవతో సచివాలయాల్లో పనిచేసే గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు పదోన్నతులు కల్పించాలని యోచన చేసి ఉత్తర్వులు జారీ చేసినా వాటిని జిల్లా కలెక్టర్లు అమలు చేయలేదు. అమలు చేసిన జిల్లాల్లో మాత్రం  డిప్యూటేషన్లు రద్దు చేసి పదోన్నతులు పొందిన వారికే పంచాయతీలను అప్పగించారు. దానితో వారిని చూస్తున్న ఇతర జిల్లాల  పంచాయతీ కార్యదర్శిలు ఇద్దరం ఒకేసారి విధుల్లోకి చేరినా.. మీజిల్లా కలెక్టర్ వలన మీకు పదోన్నతులు వచ్చాయి.. మా జిల్లా కలెక్టర్ వలన మేము ఇంకా ఇలాగే ఉండిపోయామంటూ ఒకరితో ఒకరు చెప్పుకొని బాధపడుతున్నారు. 

వాస్తవానికి రాష్ట్రప్రభుత్వం ఒక ప్రభుత్వశాఖకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తే.. వెంటనే అన్ని జిల్లాల్లోని డిఎస్సీ కమిటీ చైర్మన్లుగా వ్యవహరిస్తున్న కలెక్టర్లు దానిని అమలు చేయాలి. కొత్త జిల్లాలకు చట్టబద్దత లేనందున ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే పదోన్నతులు కల్పించాల్సి వుంది. ఇతర జిల్లాల్లో కలెక్టర్లు చొరవ తీసుకొని పదోన్నతులు కల్పించినా ఉమ్మడి విశాఖజిల్లాలో మాత్ర ఆ ఊసే లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే డిసెంబరు తరువాత ఎన్నికల కోడ్ వచ్చేస్తుంది. అది వచ్చేస్తే మరో మూడు నుంచి ఐదు నెలలు సమయం పెరిగిపోతుంది. ఒక్క గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిల విషయంలోనే కాకుండా గ్రామ, వార్డు సచివాలయశాఖలోని ఇతర శాఖల ఉద్యోగులకు సంబంధించి ఇటీవల కాలంలో ప్రభుత్వం జారీ చేసిన జీఓ పదోన్నతులు, సర్దుబాట్లు, డిప్యూటేషన్లు సచివాలయ ఉద్యోగులకు చేయాలని జారీ చేసినా దానిపై కూడా జిల్లా కలెక్టర్లు ఎలాంటి చర్యలు తీసుకోకపోడం విచిత్రంగా ఉంది. 

అయితే సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు వస్తే వారికి వచ్చే ఆదాయం పడిపోతుందని ప్రస్తుతం ఇన్చార్జిలుగా పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శిలే జిల్లా కేంద్రాల్లో యూనియన్ల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి పదోన్నతులు ముందుకి కదలనీయకుండా చేస్తున్నారనే ప్రచారం ఈ మధ్య కాలంలో తారా స్థాయిలో జరుగుతుంది. దానికి అనుగుణంగానే జిల్లా కలెక్టర్లు కూడా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా వాటిని అమలు చేయకపోవడంతో సచివాలయ ఉద్యోగులు నిజమని నమ్ముతున్న పరిస్థితులే అధికంగా ఉన్నాయి. ఏదైనా ఒక ప్రభుత్వశాఖ ఏర్పాటు చేసే సమయంలోనే దానికి విధి విధానాలు, సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేసి ఉంటే ఎలాంటి అడ్డంకులు రావు. కానీ గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల విషయంలో గత ప్రభుత్వం అలాంటి పనులు సక్రమంగా చేయకపోవడం వలనే.. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి కూడా ఏమీ చేయకుండా కాలయాపన చేస్తూ.. నామ్ కేవాస్తు జీఓ విడుదల చేయడానికి అవకాశం ఏర్పడిందని సచివాలయ ఉద్యోగులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. 

ఇప్పటికైనా ప్రభుత్వం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ తీసుకొని పంచాయతీ  గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు గ్రేడ్-4 కార్యదర్శిలుగా పదోన్నతులు కల్పించడంతోపాటు, చిన్న పంచాయతీలకు రెగ్యులర్ కార్యదర్శిలను నియమించాలని కూడా ఉద్యోగులు, జిల్లా వాసులు కోరుతున్నారు. డిప్యూటేషన్ పై పనిచేసే వారు పంచాయతీకి ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు వెళతారో తెలియని పరిస్థితి నెలకొంటుందనే ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు డిఎస్సీ కమిటీ చైర్మన్ గా ఉన్న జిల్లాల కలెక్టర్లు సచివాలయ ఉద్యోగులు వారి ప్రమోషన్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే..!

visakhapatnam

2025-09-06 20:24:19

ఈరోజు-ఈఎన్ఎస్ చెప్పిందే నిజమైంది.. సచివాలయ ఉద్యోగుల బదలాయింపు షురూ..!

ఈరోజు-ఈఎన్ఎస్ గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగుల విషయంలో ఏం రాసినా దానిని కూటమి ప్రభుత్వం నిజం చేసి పారేస్తున్నది. దానికి అనుంబంధంగా ప్రత్యేకంగా జీఓలను కూడా జారీ చేస్తున్నది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను భారీగా ఖాళీలు అయిపోతున్న ఇతర శాఖలకు బదలాయిస్తారని ఈరోజు-ఈఎన్ఎస్ రాసిన వార్త నేడు  కూటమి ప్రభుత్వం నిజం చేస్తూ.. జీఓఆర్టీ నెంబరు 12 జారీ చేసింది.  చెప్పినట్టుగా సచివాలయ ఉద్యోగుల బదలాయింపు బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తూ కూటమిప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పనీ పాట లేదు.. ఏది నోటికొస్తే అది రాసేస్తున్న ఈరోజు-ఈఎన్ఎస్ అని కూసిన నోళ్లన్నింటికి ఇపుడు ప్రభుత్వం జారీ చేసిన జీఓ ద్వారానే సమాధానం చెప్పినట్టు అయ్యింది. 2019లో గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటు అయిన దగ్గర నుంచి గత ప్రభుత్వ, చర్యలు, ఆ తరువాత కూటమి ప్రభుత్వ చర్యలపై లోతుగా పరిశోధించి మరీ వరసు కథనాలు ప్రచురించింది ఈరోజు-ఈఎన్ఎస్. ఇప్పటి వరకూ ఒక్క వార్త విషయంలో అక్షరం కూడా ఒమ్ము కాకుండా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనూ.. నేడు కూటమి ప్రభుత్వంలో అన్నీ నిజమవుతూనే వచ్చాయి. దీనిని బట్టి ఈరోజు-ఈఎన్ఎస్ వార్తలకు ఎంతటి శచ్చీలత ఉందో మేము చెప్పడం కాదు ప్రభుత్వాలే జీఓలు జారీ చేసి మరీ నిజం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఏ మీడియా రాయనన్ని కథనాలు ఒక్క గ్రామ, వార్డు సచివాలయశాఖ విషయంలో ఈరోజు-ఈఎన్ఎస్ మాత్రమే రాసిందంటే అతిశయోక్తి కాదేమో..!

తాడిని తన్నినోడు ఒకడైతే.. వాడి తల తన్నినోడు ఇంకోడనే సామెత సరిగ్రా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. నేటి కూటమి ప్రభుత్వం చేస్తున్న చర్యలతో సరిగ్గా సరిపోతుంది.. ఏ సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్, జాబ్ క్యాడర్ ఇవ్వకుండా ఎలాగైతే గత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను నియమించిందో.. దానికి మించి కూటమి ప్రభుత్వం ఉన్న ఉద్యోగులను వివిధ శాఖలకు బదలాయింపు చేసుకోవచ్చునని  చక చకా ఉత్తర్వులు జారీ చేసేసింది. పేరుకి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులే అయినా ప్రభుత్వం ఇపుడు జారీ చేసిన జీఓఆర్టీ నెంబరు 12 ఆధారంగా డిఎస్సీ చైర్మన్ గా జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వంలో భారీగా ఖాళీలు ఏర్పడిన ప్రభుత్వ శాఖల్లోకి వీరిని బదలాయించ వచ్చు. అంతే శాఖ ఒకటి.. విధులు మరో శాఖలో అన్నమాట.  రాజ్యాంగ బద్ధంగా కల్పించాల్సిన చట్టబద్దత విషయంలో ఎలాంటి జోళికి వెళ్లని కూటమి ప్రభుత్వం.. వేల సంఖ్యలో రిటైర్ అవుతున్న వివిధ శాఖల ఉద్యోగుల ఖాళీల్లో సచివాలయ ఉద్యోగులతో పనిచేయించడానికి మాత్రం ప్రత్యేకంగా జీవోలు జారీ చేస్తున్నది.

రాజు తలచుకుంటే డబ్బులకు, దెబ్బలకు కొదవలేదన్నట్టుగా.. తలా తోకలేక ప్రభుత్వశాఖ ఉద్యోగులుగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కంటే భిన్నంగా.. కూటమి ప్రభుత్వం వినియోగించుకోవాలని చూస్తున్నది. దానికోసం పదోన్నతులు అనే పదాన్ని ముందు చేర్చి.. ఆ తరువాత డిప్యూటేషన్లు, అదనపు విధులు పేరట ప్రత్యేక జీఓ జారీ  సచివాలయ ఉద్యోగులను బదలాయించ నుంది. మొన్నటి వరకూ రేషనలైజేషన్, క్లస్టరైజేషన్ పేర్లు వల్లె వేసిన ప్రభుత్వం ఇపుడు ప్రమోషన్ల పేరుతో ఇపుడు ఉన్న సచివాలయ ఉద్యోగులను వారి మాత్రు శాఖలకు అనుగుణంగా బదలాయింపులు చేయడానికి సిద్దమై జీఓ జారీ చేసింది. అన్ని ప్రభుత్వశాఖల కోసం ఈ జీఓలో ప్రస్తావించిన కూటమి ప్రభుత్వం ఎక్కడా మహిళా పోలీసులను ఏం చేస్తుందనే విషయాన్ని మాత్రం ఎక్కడ ఉటంకించలేదు. కారణం వీరి నియామకాల విషయంలో కోర్టులో కేసులు నడుస్తుండటమే. అయినా.. వీరిని సముచిత స్థానాలు కల్పించి.. వారి చదువులు, హోదాకి తగ్గట్టుగా వారిని ప్రత్యేక స్థానాల్లో కూర్చోబెడతామన్న హోం మంత్రి చేసిన ప్రకటనలు, అసెంబ్లీలో సచివాలయ ఉద్యోగుల విషయంలో చేసిన హడావిడి ఏమైపోయిందో హోం మంత్రి ప్రకటించాల్సి వుంది.

రాజ్యాంగ బద్దంగా ఒక ప్రభుత్వశాఖను ఏర్పాటు చేసినపుడు సదరు ఉద్యోగులకు జాబ్ క్యాడర్, సర్వీస్ రూల్స్, ప్రమోషన్ ఛానల్, పేస్కేలు వర్తింపజేస్తారు. దాని ప్రకారం సర్వీసులోకి వచ్చిన తరువాత రెండేళ్ల తరువాత ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తారు. కానీ విచిత్రంగా ఒక్క గ్రామ, వార్డు సచివాలయ శాఖ విషయంలో అవేమీ లేకుండా ఆరేళ్లు సర్వీసు చేయించాయి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం, నేటి కూటమి ప్రభుత్వం. విధుల్లోకి చేరిన ఉద్యోగుల ప్రొబేషన్ రెగ్యులర్ చేసే సమయంలో రెండు ఇంక్రిమెంట్లు వేస్తారు. కానీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నియామకాలే సెపరేటేమో.. అలాంటివేమీ చేయకుండానే వీరి ఉద్యోగాలను అదనంగా 9నెలలు అంటే రెండేళ్ల 9నెలలు పనిచేయించుకున్నారు. అదీ తొలుత ప్రకటించిన ఆ రూ.15వేలు జీతానికే. తరువాత రెగ్యులర్ చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. అసలు మీ ఉద్యోగాలు రెగ్యులర్ చేయడమే ఎక్కువ అన్నట్టుగా ఇవ్వాల్సిన రెండు ఇంక్రిమెంట్లు కోత విధించేసింది. ఆ తరువాత పేస్కేలు అమలు చేసే సమయంలో హెచ్ఆర్ఏ, డీఏలను పూర్తిగా కుదించేసి.. ఆతరువాత మళ్లీ సరిచేసి వీరికి పేస్కేలు వర్తింపజేసింది.. 

అంటే కుదించిన హెచ్ఆర్ఏ ఆధారంగానే సుమీ.. సవరించిన పాత విధానంతో కాదు. అదే సమయంలో పీఆర్సీని అన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగులకు అమలు చేసి.. వీరికి మాత్రం ప్రత్యేకంగా పేస్కేలు వరకూ అమలు చేసి.. సాధారణ ప్రభుత్వ ఉద్యోగికి రావాల్సిన అరియర్సుని ఎగ్గొట్టారు. సరిగ్గా ఉద్యోగులకు పదోన్నతలు కల్పించే సమయానికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో మహిళా పోలీసు నియామకాలపై కోర్టులో కేసులు పడ్డాయి. దానితో అసలు మహిళా పోలీసులకు పోలీసుశాఖకు సంబంధమే లేదని హైకోర్టుకి పోలీసుశాఖ లిఖిత పూర్వకంగా రాసిచ్చేసింది. కానీ విధులు మాత్రం అనధికారికంగా పోలీసు స్టేషన్లు, ఎన్నికల విధులు, ఇతర ప్రభుత్వశాఖల్లో సహాయకులుగానేవినియోగించుకుంటున్నది. ఈ లోగా ఉద్యోగులకు ఐదేళ్లు పూర్తయిపోయింది. కొన్ని శాఖల ఉద్యోగులకు నియామకాల సమయంలో పేర్కొన్న ఉత్తుత్తి  ప్రమోషన్ ఛానల్ ఆధారంగా పదోన్నతులు కల్పించాలి.. కానీ అదిగో ఇదిగో అనేసరికి వైఎస్సార్సీ ప్రభుత్వ టైమ్ అయిపోయింది. వీరు మాత్రం అలా గాల్లోనే ఉండిపోయారు.

ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లోనే సచివాలయ ఉద్యోగుల సమస్యలన్నీ తీర్చేస్తాం.. పదోన్నతులు కల్పించేస్తాం.. ఖాళీలు భర్తీచేస్తాం.. జాబా చార్ట్, జ్యాబ్ కేడర్ రూపొందిస్తామంటే ఉద్యోగులు కూడా అంతా నిజమని నమ్మేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఆరు నెలల పాటు అసెంబ్లీలో ఒకటే చర్చలు దానికి ప్రాతినిథ్యం వహించిన హోం మినిస్టర్.. గ్రామ, వార్డు సచివాలయ శాఖకు తలా తోకా లేదని.. కూటమి ప్రభుత్వం అన్నీ సెట్ చేసేస్తుందని ప్రకటించారు. ప్రకటించి సుమారు రెండేళ్లు దగ్గర పడుతున్నా.. వారి విషయం అతీ గతీ లేదు. కారణం గ్రామ, వార్డు సచివాలయశాఖకు గత ప్రభుత్వమే చట్టబద్దత కల్పించడం మానేసింది. ఏ ప్రభుత్వశాఖకైనా చట్టబద్దత కల్పించకపోయినా.. సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయకపోయినా.. ప్రభుత్వం కాదు కదా.. సుప్రీం కోర్టులో కేసులు వేసినా అవెందుకూ పనిచేయవు. సరిగ్గా కూటమి ప్రభుత్వానికి అదే కలిసొచ్చింది. అదిగో ప్రమోషన్ ఇదిగో ప్రమోషన్ అంటూ..కాలయమాప చేసి.. ఒక దశలో ఈ శాఖలు పూర్తిగా రద్దు చేసే స్థితికి వచ్చింది.

 అలా చేస్త ప్రజల నుంచి ప్రభుత్వం నుంచి ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించిన ప్రభుత్వం ఈ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసే చర్యలకు పూనుకుంది. అందులో భాగంగానే రేషనలైజేషన్, క్లస్టర్ విధానాలు తెరమీదకు తీసుకొచ్చింది.  అయితే ఈలోగా గత ప్రభుత్వం పెంచేసిన రెండేళ్ల అదనపు జాబ్ సర్వీసు పూర్తయిన ఉద్యోగులు వేల సంఖ్యలో రిటైర్ అయిపోతుంటే కంగారు పడిన ప్రభుత్వం.. సచివాలయ ఉద్యోగులను ఆయా శాఖల్లోకి నేరుగా కాకుండా అదనపు విధుల పేరుతో పంపేయాలని సిద్ద పడింది. దానికోసం డిప్యూటేషన్లు అంటే మళ్లీ వ్యతిరేత వస్తుందని ఆలోచించిన ప్రభుత్వం... ప్రమోషన్ అనే పదాన్ని ముందు చేర్చి.. ఆతరువాత డిప్యూటేషన్, ఓడీ అరేంజ్ మెంట్స్ పేరుతో జీఓ జారీ చేసింది. దాని ప్రకారం డిఎస్సీ కమిటీ చైర్మన్ గా ఉన్న జిల్లా కలెక్టర్లు ప్రస్తుతం ఉన్న సచివాలయ ఉద్యోగులను వారి శాఖల ఆధారంగా మాత్రుశాఖలు, లేదా వాటి అనుబంధ శాఖల్లోకి డిప్యూటేషన్ పై పంపించడానికి చర్యలు మొదలు పెట్టింది. 

అయితే ఇవేమీ తెలియని సచివాలయ ఉద్యోగులు మాత్రం తమకు ప్రమోషన్లు వచ్చేస్తున్నాయనే త్రిశంఖు స్వర్గంలో ఊగిస లాడుతున్నారు. సచివాలయ ఉద్యోగులను ఆయా మాత్రుశాఖలకు బదిలీ చేస్తే అక్కడి రెగ్యులర్ ఉద్యోగులకు ఇచ్చే పేస్కేలు, ఇతర ప్రయోజనాలు ఇవ్వాల్సి వుంటుంది. అదీ ప్రభుత్వానికి భారం అనుకున్న కూటమి ప్రభుత్వం..తెలివిగా డిప్యూటేషన్ ఓడీ అరేంజ్ మెంట్స్ పేరుతో జీఓ జారీ ఉద్యోగులను ఇతర శాఖలకు బదలాయించనున్నది. ప్రభుత్వ అవసరాలకోసం ఏ జీఓ అయినా వెంటనే వస్తుంది.. అదే ఉద్యోగుల సమస్యలు, వారికి రాజ్యాంగ బద్దంగా కల్పించాల్సిన ప్రయోజనాల విషయంలో అయితే మాత్రం ఆ ఒక్కటీ అడక్కు.. దానికి చాలా సాంకేతిక కారణాలు అడ్డున్నాయని చెప్పి తప్పించుకుంటున్నట్టుగానే కనిపిస్తున్నది. మాట్లాడితే తమకు పదోన్నతలు ఇచ్చేయండన నానా గోల చేస్తున్న సచివాయల ఉద్యోగ సంఘాలు అసలు.. చట్టబద్దత ఇవన్నీ ఎలా సాధ్యపడయోననే విషయాన్ని ఆలోచించడంలేదు. వారి వెర్రి ఆలోచనలను మాత్రం ప్రభుత్వం చాల చక్కగా క్యాష్ చేసుకుంటూ.. కాలయాపన చేస్తున్నది తప్పి ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగుల్లా సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్, జాబ్ చార్టు మాత్రం ఏర్పాటు చేయడం లేదు.  చూడాలి ప్రభుత్వం జారీ చేసిన జీఓఆర్టీ నెంబరు 12 ఆధారంగా గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులను ప్రభుత్వం ఏ రీతిలో బదలాయింపు చేపడుతుందనేది...?!

visakhapatnam

2025-08-19 19:01:49

ప్రజలను చైతన్య పరిచే ఫోర్త్ ఎస్టేట్ ను పట్టించుకునే నాధుడేడి..?!

ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోతే.. జర్నలిస్టులు.. మీడియాకి మన బాధలు చెప్పుకుంటేనైనా అపుడుగాని ఎవరూ దారిలోకి రారు..అని ఎంతో దైర్యంతో, నమ్మకంతో  మీడియా దగ్గరకి వస్తారు ప్రజలు.. తాము అధికారంలో ఉండగా చేసిన పనులు ప్రజలకి తెలియాలన్నా కూడా అదే ప్రజాప్రతినిధులు కూడా మీడియా ద్వారా ప్రచారం పొందుతారు.. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చేసే సంక్షేమ కార్యక్రమాలు అన్ని వార్గాలకు తెలియజేయాలన్నా ప్రభుత్వాల గొప్ప తెలియాలన్నా కూడా మీడియా, జర్నలిస్టులే అవసరం. అలాంటి మీడియాలో పనిచేసే జర్నలిస్టుల భవిష్యత్తు ఇపుడు ప్రశ్నార్ధకం అయ్యింది. అన్నివర్గాలకు అవసరాలను, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ల జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించుకోవడంలో అత్యంత దారుణంగా విఫలం అవుతున్నారు. సాధారణ ప్రజల కంటే దారుణంగా వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చుట్టూ అర్జీలు పట్టుకొని తిరుగుతున్నా నేటికీ జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. 

ఒకప్పుడు జర్నలిస్టు అంటే ఎంతో రాజభోగం, కానీ నేడు పరిస్థితి పూర్తిగా పోయింది. సాంకేతిక విప్లవం తీసుకొచ్చిన టెక్నాలజీ, సోషల్ మీడియా జర్నలిస్టుల భవితవ్యాన్ని త్రిశంఖు స్వర్గంలో పడేశాయి. ఇపుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి మీడియా కంటే సోషల్ మీడియా అంటనే మక్కువ పెరిగిపోయింది. దానితో జర్నలిస్టులు, వారి సమస్యలను పరిష్కరించడాన్ని ప్రభుత్వాలు లైట్ తీసుకుంటున్నాయి. ఒకప్పుడు ఏదైనా మీడియాలో పనిచేసే జర్నలిస్టుకి అత్యంగ గౌరవంగా ప్రెస్ అక్రిడిటేషన్ కార్డు వచ్చేది. సదరు పత్రికకు క్రమం తప్పకుండా ప్రభుత్వ ప్రకటనలు వచ్చేవి. కానీ ఇపుడు మీడియా కూడా రాజకీయం అయిపోవడంతో..ఎవరి సామాజిక వర్గం అధికారంలో ఉంటే సదరు సామాజిక వర్గం మీడియాకి అగ్రతాంబూలం ఇచ్చి స్థానిక పత్రికలను పూర్తిగా ప్రక్కన పెట్టేస్తున్నారు. దానికి ప్రభుత్వాలు చెప్పే కారణం కూడా ఒక్కటే మీ పత్రికకు డిఏవీపీలేదు, ఎంపానల్ మెంట్ లేదని.

 అలాగని ఎంపానల్ మెంట్ కి, డిఏవీపికి సరిడేంత కాలం పత్రికలు దిగ్విజయంగా నడిపి దరఖాస్తు చేసుకున్నా వాటిని పట్టించుకునే నాధుడే లేడు. ప్రభుత్వం తీవ్ర ఆర్ధిక సంక్షోభంతో కొట్టిమిట్టాడుతుందని చెప్పి ఒకసారి.. ప్రస్తుతం ప్రజల సమస్యలపై దృష్టిపెట్టామని మరోసారి.. పదేళ్లపాటు డిఏవీపీ, ఎంపానల్ మెంట్ పై బ్యాన్ విధించామని మరోసారి, మీ పత్రికకు కావాల్సిన అనుబంధ పత్రాలు సక్రమంగా లేవని మరోసారి చెబుతూ కాలం వెల్ల దీస్తున్నారు తప్పితే అన్నీ సక్రమంగా ఉన్న పత్రికలకు కూడా ప్రభుత్వ ప్రకటనలు వచ్చే ఎంపానల్ మెంట్ మాత్రం సక్రమ మార్గంలో చేయడం లేదు. మరోవైపు స్థానిక పత్రికలను పూర్తిగా పాతాలళ లోకానికి తొక్కేసే విధంగా ప్రభుత్వ జీఓలు రూపొందించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2019 జర్నలిస్టులకి ఇచ్చే ప్రెస్ అక్రిడిటేషన్లను కుదించేశాయి. ఒకప్పుడు మండల విలేఖరికి కూడా ఇచ్చే ప్రెస్ అక్రిడిటేషన్ ఇపుడు నియోజకవర్గానికి ఒకటి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. 

పెద్ద పత్రికలు, ఎడిషన్లు ఎక్కువగా వుంటే ఒకలా, స్థానిక పత్రికలు అయితే మరోలా... 8పేజీలు పేపర్ అయితే ఒకలా, నాలుగు పేజీల పేపర్ అయితే ఇంకోలా.. 12 పేజీల డమ్మీసైజ్ పేపర్ అయితే వేరే రకంగా అక్రిడిటేషన్లు మంజూరు చేసి జర్నలిస్టులకు అసలు మీడియా అంటేనే విరక్తి పుట్టేలా చేసి.. స్థానిక పత్రికలపై భారం మోపుతున్నారు. అలాగనీ చచ్చీ చెడీ పెళ్లాం మెడలో పుస్తులు తాకట్టు పెట్టి కూడా పేపర్ నిర్వహణ సక్రమంగా చేసినా కూడా సమాచారశాఖ ద్వారా ఏవేవో కొర్రీలు వేస్తూ స్థానిక పత్రిక నిర్వాహకుల ఆత్మస్తైర్యం, రెగ్యులారిటీకి గాలి తీసేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు పాటించలేని స్థానిక పత్రికలు వారంటత వారే మూసేసుకుంటున్నారు. మరికొందరు అమ్మేసుకుంటున్నారు. ఇంకా మిగిలిన వారు చచ్చీ చెడీ అప్పులు చేసి మరీ పత్రికలను నడిపిస్తున్నారు. ప్రస్తుతం ప్రధాన పత్రికల్లో కూడా జర్నలిస్టులకు పనిచేసినందుకు జీతాలు లేకుండా పోయాయి..

కనీసం ప్రెస్ అక్రిడిటేషన్ గౌరవానికైనా నోచుకుందామని నిర్వహిస్తున్న పత్రికలకు ఆర్ఢిక భారం రోజు రోజు కీ పెరిగి పోతున్నది తప్పితే మరొకటి లేదు. ఉదాహరణకు సుమారు 20ఏళ్లుగా జర్నలిస్టులు కనీసం ఇంటి స్థలాలకు నోచుకోలేదంటే అతిశయోక్తి కాదు. ఇదే సమస్యపై జర్నలిస్టులు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా కలెక్టర్లు, ఆఖరికి ముఖ్యమంత్రికి విన్నవించినా ఫలితం లేకుండా పోతున్నది. ప్రస్తుతం జర్నలిస్టులు ప్రెస్ అక్రిడిటేషన్ కూడా పొందే అవకాశం లేకుండా పోతున్నది. అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు వారికి, వారి సామాజిక మీడయాలకి అనుగుణంగా నిబంధనలు మార్చేస్తున్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కూడా స్థానిక పత్రికలకు ఎన్ని అక్రిడిటేషన్లు వస్తాయో తెలియని పరిస్థితి. అయితే గతంలో టిడిపి అధికారంలో ఉన్న సమయంలో మాత్రం మండల జర్నలిస్టుకి ఒక అక్రిడిటేషన్ మంజూరు చేసింది.

కానీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని ఏకంగా పత్రికకు కేవలం 6 అక్రిడిటేషన్లతో కుదించేశారు. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇపుడైనా జర్నలిస్టుల ప్రధార గుర్తింపు ప్రెస్ అక్రిడిటేషన్, దీర్ఘకాలికంగా పరిష్కారం కాని సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ఇంటిస్థలం మంజూరు అవుతుందా..అనే ఆశతో ఉన్న జర్నలిస్టులు లేదంటే మళ్లీ సాధారణ ప్రజానీకం మాదిరిగానే అర్జీలు పట్టుకొని కలెక్టరేట్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎం వరకూ అర్జీలు పెట్టుకోవడమే జర్నలిస్టుల కర్తం అయిపోతుంది. అయినా జర్నలిజం వర్ధిల్లాలి..జర్నలిస్టు అభివృద్ధి చెందాలి.. లాంగ్ లివింగ్ మీడియా..జైహింద్ ఫోర్త్ ఎస్టేట్..!

visakhapatnam

2025-07-29 12:33:26

ఆంధ్రప్రదేశ్ లో వర్కింగ్ జర్నలిస్టులు అదృష్టవంతులు..?!

ఆంధ్రప్రదేశ్ లో వర్కింగ్ జర్నలిస్టులు చాలా అదృష్టవంతులు.. ఏ చీకూ చింతా లేదు. పనిచేసినంత కాలం పనిచేస్తారు.. 60ఏళ్లు దాటిన తరువాత  ప్రభుత్వం నుంచి ఏవిధమైన ప్రయోజనం లేకుండా.. పొందకుండా.. పొందే వీలు లేకుండా.. ఇంటిదగ్గే రెస్టు తీసుకుంటూ రామా క్రిష్ణా అని పిల్లలు పెట్టే ఏదో నాలుగు మెతుకులు తిని బ్రతుకు ఈడ్చేస్తారు. అదే బీహార్ రాష్ట్రంలో లాగా ప్రతీనెలా రూ.15 వేలు పెన్షన్ ఏమీ తీసుకోరు. అసలు అలాంటి ఊసే ఏపీలో లేదు.. రాదు.. రాబోదు. 60ఏళ్లపాటు ప్రజలకి, ప్రభుత్వాలకి మధ్య సమాచార వారధిగా పనిచేసి కూడా కనీసం పెన్షన్ కి కూడా నోచుకోని జర్నలిస్టులన్న రాష్ట్రంగా ఏపీ కీర్తికెక్కింది. జర్నలిస్టుల కనీస అవసరాలు తీర్చలేని, తీర్చుకోలేని, ఆ దిశగా పోరాటాలు చేయని జర్నలిస్టుల సంఘాలున్న రాష్ట్ర జర్నలిస్టుల సంఘాలున్న రాష్ట్రంగా  కూడా దేశంలోనే కీర్తి పొందింది. 

అదేదో బీహార్ రాష్ట్రమట. అక్కడ మాత్రం జర్నలిస్టులు ఏదో చేశారని.. సమాజం కోసం ప్రజలు, ప్రభుత్వం కోసం పనిచేశారని గుర్తించిన అక్కడి ప్రభుత్వం రిటైర్ అయిన జర్నలిస్టులకి ఇప్పటి వరకూ రూ.10వేలు ఇచ్చేది. ఇపుడు దానిని కాస్తా రూ.15వేలకి పెంచిందట. అంతే  మన రాష్ట్రంలో ఏమీ సాధించుకోలేని జర్నలిస్టులు, జర్నలిస్టుల సంఘాలు ఆ పెన్షనేదో ఇక్కడే తీసుకుంటున్నట్టు పత్రికా ముఖంగా ప్రకటనలు ఇచ్చి మరీ తెగ ఆనంద పడిపోతున్నారు.. బహుసా జర్నలిస్టులంటే అక్కడి రాష్ట్రప్రభుత్వానికి కాస్త గౌరవం కాబోలు. లేదంటే  జర్నలిస్టులకిచ్చే పెన్షన్ ను రూ.10వేల నుంచి రూ.15కి కి పెంచడమేంటి సిరాకు కాకపోతే. అదే మన ఆంధ్రప్రదేశ్ ని చూడండి.. ఒక్కసారి సారి ఆలోచించండి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులూ.. జర్నలిస్టుల సంఘాల నేతలు. నిజంగా జర్నలిస్టులంటే మనం.. జర్నలిస్టు సంఘ నేతలమంటే మనమే.. మనకి ఏ రాష్ట్రంలోని జర్నలిస్టులతోనూ పోలిక ఉండదు. 

కనీసం వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లలేం సరికదా.. కనీసం మండల విలేఖరికి ప్రభుత్వం ఇచ్చే ప్రెస్ అక్రిడిటేషన్ కూడా సాధించుకోలేం. ఇంతలా చేయడం అంటే మాటలా చెప్పండి.  ప్రభుత్వాలంటే బీహార్, ఒడిసా లాంటి  రాష్ట్రాలవినే కాదా..? చెప్పండి..! అదే ఆంధ్రప్రదేశ్ లో అయితే వర్కింగ్ జర్నలిస్టులకి ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు అదేనండీ ప్రెస్ అక్రిడిటేషన్ పొందాలన్నా దేశంలోనే లేని నిబంధనలన్నీ వర్తింపజేస్తారు. వాటిని ప్రశ్నించలేం.. సంక్షేమ పథకాలంటారా.. అవి ఒక్కటి కూడా జర్నలిస్టులకి ఉండవు.. ఒక వేళ ప్రజలను నమ్మించడానికి ఏ రాజకీయపార్టీ అయినా మేనిఫెస్టోలో పెట్టినా కూడా వాటిని అమలు చేయలేక ప్రత్యేక సబ్ కమిటీలు వేస్తాయి. అపుడూ మాట్లాడలేం.. సబ్ కమిటీ అంటే తెలుసుకదా..వాళ్లకున్నంత బిజీ మరే కమిటీకి ఉండదు. ఇచ్చే రిపోర్టులు కూడా అంతే త్వరగా ఇచ్చేస్తారు(ఎంత లేదనుకున్నా ఆరు నెలల నుంచి ఏడాదిలోపే లేదంటే మన ప్రెస్ అక్రిడిటేషన్ లాగా మరో ఆరు నెలలు ఎక్స్ టెన్షన్ చేసుకుంటూ పోతారు)..

 ఆ తరువాత వాటిపై జీఓలు రావడానికి మరో ఏడాది. ఈ లోగా ఏ జర్నలిస్టు సంఘమైనా కోర్టుకి వెళ్లకుండా ఉంటే అదీ కూడా సక్రమంగా జీఓ రావడానికి. కానీ బీహార్, ఒడిసా లాంటి రాష్ట్రాలు అలా కాదు. జర్నలిస్టులంటే ప్రభుత్వానికి ప్రజలకి మధ్య నిరంతర సమాచార సారధులుగా గుర్తించి వారికి 60ఏళ్లు నిండన వారికి పెన్షన్లు ఇస్తున్నాయి. కనీసం దానికోసమైనా అక్కడి రాష్ట్ర ప్రభుత్వాల కోసం జర్నలిస్టులు పనిచేస్తారు.. ప్రచారం చేస్తారు.. ప్రభుత్వ సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళతారు.. ఇంకేమనా చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ లాంటి పరిరిస్థితి ఏంటి.. ఇక్కడ ప్రభుత్వాలకి జర్నలిస్టులతో పనిలేదు. ప్రభుత్వం ఇచ్చే ప్రెస్ అక్రిడిటేషన్ కి కూడా నిబంధనలు మామూలుగా ఉండవు. అవి పాటించే మీడియా సంస్థలు వారి ఆస్తులు తాకట్టు పెట్టి పత్రికలను నడుపుకోవాలి. మళ్లీ ఇక్కడ మాత్రం మరో వెసులుబాటు వుంది. అదే సదరు రాజకీయపార్టీకి అనుకూలంగా ఉన్న పత్రికలు, మీడియా సంస్థలు ఉంటే మాత్రం వందల కోట్ల రూపాయలు ఒక్క ప్రకటనల ద్వారానే వారికి కట్టబెడతారు.

 అందులో ఒక్కశాతం కూడా స్థానిక పత్రికలకి ఇవ్వాలంటే మాత్రం ప్రభుత్వాలు, రాజకీయపార్టీలు కూడా ఎక్కడలేని నొప్పులన్నీ పడిపోతుంటాయి. వాటికే అంతా నొప్పులు పడగా లేనిది.. ఇక 60ఏళ్లు దాటిన రిటైర్డ్ జర్నలిస్టులకి పెన్ష్లు ఏమిస్తారు చెప్పండి..? అసలే ఖజానాలో డబ్బులు లేవు. అలాంటి సమయంలో జర్నలిస్టులకి పెన్షన్లు, ప్రెస్ అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు, యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ లు, ఇళ్ల స్థలాలు, హౌసింగ్ స్కీములు, ఎటాక్స్ కమిటీలు అంటే అది అసలు జరిగే పనికూడా కాదు. అలాంటివేమీ అడక్కూడదు. అదే స్థానిక పత్రికలకు  ప్రెస్ అక్రిడిటేషన్లు కుదించేయడానికి, స్థానిక పత్రికలు నడవకుండా ఎక్కడలేని నిబంధనలు పెట్టడానికి, ఇచ్చే ప్రకటనలకు ఎంపానల్ మెంట్ నిబంధనల ముడిపెట్టడానికి,  జీఓలు తెమ్మంటే మాత్రం రాత్రికి రాత్రి జీఓలు వచ్చేస్తాయి. క్షణాల్లో నే అమల్లోకి కూడా వచ్చేస్తాయి. స్థానిక పత్రికలకు గుదిబండాలా మారిన ఆ నిబంధనలను అమలు చేసే వరకూ ప్రభుత్వం కూడా ఊరుకోదు. 

 సరికదా మీడియాకోసం పనిచేసే సమాచారశాఖ ద్వారా జీఓని అమలు చేసి దానిని పర్యవేక్షించి గంగ గంటకీ నివేదికలు ఇమ్మని చెబుతుంది. అదే మండలంలో పనిచేసే వర్కింగ్ జర్నలిస్టుకి కనీసం ప్రెస్ అక్రిటేషన్ ఇవ్వండని ప్రభుత్వానికి జర్నలిస్టుల సంఘాలు ఆర్జీ పెట్టాయనుకోండి.. అబ్బే ఆ ఒక్కటీ అడక్కు అంటాయి. కనీసం ఇంటి స్థలం ఇస్తే కనీసం కమ్మలతోనైనా ఇల్లు కట్టుకుంటామని అని అడిగితే.. దానికోసమే కమిటీ వేశాం.. ఆ కమిటీ రిపోర్టు రాగానే ఇస్తామని గుక్కతిప్పుకోకుండా చెబుతాయి. కాకపోతే ఆ లోగా ప్రభుత్వానికే టైమ్ అయిపోతుంది. ఎందుకంటే ఈలోగా ఐదేళ్లు గడిచిపోతాయ్ కదా.. కావాలంటే గత ప్రభుత్వ విధానాలు ఒక్కసారి గుర్తుచేసుకోండి. ఇళ్ల స్థలాలు ఇస్తామని ఎన్నికలకు ఏడాది ముందు హడావిడి చేసేస్తారు. అదిగో ఇదిగో అనేసరికి ఎన్నికలు వచ్చేసి ప్రభుత్వాలే మారిపోయాయి. ఇపుడు ప్రభుత్వం ఏకంగా జర్నలిస్టులకోసం మేనిఫెస్టోలోనే హామాలిచ్చింది. 

ఇచ్చినట్టుగానే అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తరువాత బ్యాబినెట్ సబ్ కమిటీ వేసింది. ఆ రిపోర్టు ఇంకా రావాల్సి ఉంది. అది ఆంధ్రప్రదేశ్ లోని పరిస్తితి. అదే బీహార్, ఒడిసా లాంటి రాష్ట్రాల్లో ఈ పరిస్థితి లేదు కదా.. జర్నలిస్టుగా పనిచేసి రిటైర్ అయితే చాలు బీహార్ లో ఇపుడు రూ.15వేలు పెన్షన్ ఇస్తున్నారు. అలాంటి పరిస్థితులు, అవకాశాలు, ఉపయోగాలు లేని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులు అదృష్టవంతులా కాదా చెప్పండి..పైగా మన అదృష్టం మనల్నే వెక్కిరించేలా ఎక్కడో బీహార్ లాంటి రాష్ట్రంలో జర్నలిస్టుల పెన్షన్ రూ.10 వేల నుంచి రూ.15వేలకి పెంచి అక్కడి జర్నలిస్టులకి మేలు జరిగితే ఆంధ్రప్రదేశ్ లో మన జర్నలిస్టులంతా.. యూనియన్ల పేరుతో హర్షం ప్రకటిస్తాం అదీ పత్రికా ముఖంగా?!

viskahpatnam

2025-07-27 07:38:48

రాజకీయపార్టీల మీడియా సంస్థలు.. జర్నలిస్టులే సమిథలు..!

మీడియారంగలోకి రాజకీయపార్టీల రంగ ప్రవేశంతో జర్నలిస్టులే సమిథలైపోతున్నారు.. జర్నలిజం విలువలు మచ్చుకైనా కనపించకుండా పోతున్నాయి. ఒక పార్టీ అంటే మరో పార్టీకి పడకపోవడంతో వీళ్లలో వీళ్లే ఒకరు పచ్చపత్రిక అని.. మరొకరు పచ్చకామెర్ల పత్రికలంటూ దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ తరుణంలో ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్లడం మాని రాజకీయపార్టీల ముష్టియుద్ధాలకు జర్నలిస్టులు గొడవలు పడాల్సి వస్తున్నది. రాజకీయపార్టీలకోసమే జర్నలిస్టుగా పనిచేయక తప్పని దుస్థితి కూడా వచ్చేసింది. అలాగని మీడియా రంగంలో వర్కింగ్ జర్నలిస్టులకు రక్షణ అయినా ఉంటుందా అదీ లేదు. కొన్ని సంస్థలు జీతాలిస్తే.. మరికొన్ని సంస్థలు ప్రజా సేవ చేయమంటున్నాయి. జర్నలిజం ఆశక్తి ఉన్నవారు తప్పితే మరెవరూ ఈ రంగంలోకి అడుగుపెట్టడానికి సాహసం చేయడం లేదు. తెల్లవారు లెగిస్తే ప్రజా సమస్యలు ఎక్కడా పత్రిలూ టీవీ ఛానల్స్ లో కనిపించడం లేదు. ఒకప్పుడు పత్రికలంటే ప్రభుత్వాలకి రాజకీయపార్టీలకు కాస్త భయం ఉండేది. ఇపుడు అది పోయింది. కారణం రాజకీయపార్టీలకే మీడియా సంస్థలు రావడం వాటినే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకే నిధుల సర్ధుబాటు ప్రభుత్వ ప్రకటనల ద్వారా అడ్డగోలుగా చేసుకోవడం అలవాటైపోయింది.

మరికొన్ని మీడియా సంస్థలు మనుగడ కోసం అధికాపార్టీలకు తొత్తుల్లా మారాల్సి వస్తున్నది. ఎటొచ్చీ రాజకీయపార్టీల మీడియా ఆదిపత్యంలో స్థానిక పత్రికలు మట్టికొట్టుకు పోతున్నాయి. అంతేకాదు స్థానిక పత్రికలను పూర్తిగా అణగదొక్కేయడానికి రక రకాల జీఓలు తీసుకువచ్చి ఇక వారంతట వారే పత్రికలు, మీడియా సంస్థలు మూసేసుకునే చర్యలకు దిగుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఒకప్పుడు తెల్లవారుజామున లేచే సరికి బాహ్య ప్రపంచంలో ఎం జరుగుతుందనే తాజా సమాచారంతో పత్రికలు ప్రజలను చైతన్య పరిచేవి. ఇపుడు పేపర్ తిరగేస్తే మూడొంతులు రాజకీయపార్టీ ముష్టియుద్దాలకు జర్నలిస్టులు బలపోయి, పొట్టగూటికోసం ఉద్యోగాలను నిలుపుకోవడం రాసిన కథనాలే కనిపిస్తున్నాయి. మీడియా సంస్థలకు ప్రభుత్వాలు ఇచ్చే గుర్తింపు ఇస్తే ఎక్కడ ప్రయోజనాలు ఇవ్వాల్సి వస్తుందోనని కనీసం పత్రికలకు ఎంపానల్ మెంట్ చేయడం లేదు. ఉన్నవాటికి కూడా రెగ్యులారిటీ పేరుతో నిబంధనలు విధించి ప్రభుత్వ ప్రకటనలు కూడా ఇవ్వడం లేదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం డిఏవీపీ ప్రకనటలు ఇవ్వడం తగ్గించేసింది.. కాదు కాదు ఇవ్వడమే మానేసింది. ఇచ్చినా కూడా ఇందులో కూడా అడ్డగోలు రాజకీయాలు చేస్తూ.. స్థానిక పత్రకలను ప్రక్కకు నెట్టేస్తున్నారు. ఈ విషయంలో కూడా రాజకీయపార్టీల పత్రికలే మొత్తం ప్రకటనల్లో అగ్రభాగాన్ని లాగేస్తున్నాయి.

ఒకప్పుడు జర్నలిజం అంటే ప్రభుత్వాన్ని, ప్రజలను వారి వార్తలతో చైతన్యపరచడం.. దాని ఇపుడు వాటి స్వరూపం మారిపోయి ఒక పార్టీ పేపరులో, మరోపార్టీ రాజకీయాలకే అగ్రతాంబాలం, పేజ్-1 ఆర్టికల్స్ కి ప్రత్యేక స్థానాలను కేటాయిస్తున్నారు. సమాజంలో తమవంతు పాత్ర పోషించి ప్రజలను చైతన్యం చేయడానికి జర్నలిజం, మీడియారంగంలోకి అడుగుపెడుతున్న జ్నలిస్టులు సమిధలుగా మారి రాజకీయ క్రీడలో ఆటగాళ్లు అవుతున్నారు. యాజమానం ఏం చెబితే అదే రాయాలి. ఎలా చెబితే అలా రాయాలి.. ఎక్కడా జర్నలిస్టులకి ప్రజా సమస్యలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలు రాసే స్వేచ్చ పోయి చాలా కాలమే అయ్యింది. ఆ స్వేచ్చ మళ్లీ వస్తుందనే నమ్మకం కూడా లేదు. ఉన్న కొద్దిపాటి స్థానిక పత్రికలైనా వాస్తవాలను బయటపెడితే ఆ లోకల్ పేపర్ మన పార్టీది కాదు.. ప్రభుత్వానికి అనుకూలంగా కూడా లేదు. అలాంటి వాటిని పట్టించుకోవాల్సిన పనిలేదంటూ ప్రభుత్వంలో ఉన్నవారే స్థానిక పత్రికలను ప్రక్కన పెట్టేస్తున్నారు. ఎంతదారుణం అంటే జర్నలిస్టులకి, పత్రికను అందంగా తీర్చి దిద్దే డెస్కు జర్నలిస్టులకి, వాస్తవాలను చిత్ర రూపంలో చిత్రించే ఫోటో జర్నలిస్టులకి, కదిలే బొమ్మలు వీడియోలు చిత్రీకరించే వీడియో జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చే ప్రెస్ అక్రిడిటేషన్ కి కూడా ప్రపంచంలో ఏ దేశంలో లేని నిబంధనలు భారతదేశంలోనూ, అందునా ఆంధ్రప్రదేశ్ లోనే అమలు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో.

ఇపుడు ఇంకో అడుగు ముందుకి వేసి. యావత్ మీడియానే నియంత్రించే పని ప్రారంభించారు. సోషల్ మీడియా అభివృద్ధి చెందడంతో ఏ పార్టీకి ఆ పార్టీ, కార్పోరేట్ సంస్థలు సైతం సోషల్ మీడియాని సొంతంగా ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఎంత దారుణమైన పరిస్థితులు ఇపుడు తెరపైకి వచ్చాయంటే.. సోషల్ మీడియాకి కూడా ప్రెస్ అక్రిడిటేషన్లు ఇవ్వాలనే సూచనలు ప్రభుత్వాలు చేస్తున్నాయంటే వర్కింగ్ జర్నలిస్టులకు వచ్చే ఆ కొద్దిపాటా గౌరవం కూడా ప్రెస్ అక్రిడిటేషన్ రూపంలో సోషల్ మీడియాకి వెళ్లిపోతుందనే భయానక పరిస్థితులు వచ్చాయి. మీడియా రంగంలో ఏం జరిగినా.. ఏం చేసినా రాజకీయపార్టీలు మాత్రమే శాసిస్తున్నాయి. దానికి అధికారం కూడా ఒక అవకాశం అవుతుంది. ఇప్పటికై మీడియా పతన దశకి చేరుకుంది. రానున్న రోజుల్లో మీడియా అనే పదం, వార్తలు కనుమరుగు అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే ఎవరు ఎన్ని సంస్థలు పెట్టుకున్నా అందులో పనిచేసేది.. రాసేది..రాయించేది..రాటుదేలి ప్రజలను, ప్రభుత్వాలను చైతన్య పరిచిదే జర్నలిస్టులు మాత్రమే..జర్నలిస్టులకి పూర్వవైభవం రావాలి.. జర్నలిజం వర్ధిల్లాలి..!

visakhapatnam

2025-07-24 07:45:54

ఎందుకు దండగ.. జర్నలిస్టులకెందుకు సంక్షేమ పథకాలు పెన్షను..?!

75ఏళ్ల స్వాతంత్ర్య భారత దేశంలో నేటికీ వర్కింగ్ జర్నలిస్టులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మనుషులులా కనిపించడం లేదు. వేల సంఖ్యలో ఉన్న జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఈరోజుకి ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రవేశపెట్టలేదంటేనే జర్నలిస్టులంటే ప్రభుత్వాలకి ఏ విధంగా కనిపిస్తున్నారో అర్ధమవుతుంది. ప్రభుత్వం ఇచ్చే ఆ ఒక్క ప్రెస్ అక్రిడిటేషన్ పొందాలన్నా 2017 నుంచి నిబంధనలు పూర్తిగా మార్చేశారు. తల్లులకి, ఆటో, కార్ డ్రూవర్లు, రైతులు, న్యాయవాధులు, మఠాధిపతులు, మసీదు గురువులు, చర్చి ఫాదర్ లు, రజకులు, క్షరకులు, ఆఖరికి కూరగాయలు అమ్ముకునే వారికి, రోడ్డుపై తోపుడు బండి వ్యాపారాలు చేసుకునేవారికి రాష్ట్ర ప్రభుత్వంలో సంక్షేమ పథకాలున్నాయి ఒక్క జర్నలిస్టుకి తప్పా. విశేషం, విచిత్రం ఏంటంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ఈ సంక్షేమ పథకాలు, ఎన్నికల మేనిఫెస్టోలు పత్రికలు, మీడియాలోనూ ప్రచారం చేసేది మళ్లీ జర్నలిస్టులే. ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు అడుగు తీసి అడుగు వేసినా, ప్రజలకోసం ఏం చేయాలనుకున్నా.. వారికి తెలియజేయడం కోసం మళ్లీ జర్నలిస్టులే కావాలి.. 

కానీ మళ్లీ జర్నలిస్టులకు మాత్రం ఎలాంటి సంక్షేమ పథకాలు వర్తింపచేయకూడదు, ప్రభుత్వం ద్వారా ఇచ్చే ప్రెస్ అక్రిడిటేషన్ కి కూడా ఏ స్థానిక పత్రిక, టీవీలు అందుకోలేనన్ని నిబంధనలు ప్రత్యేక జీఓలతో మాత్రం అమలు చేయాలి. అదేంటో ఏ ఒక్క జర్నలిస్టుల సంఘం కూడా ఈ విషయాన్ని ప్రభుత్వాల దగ్గర ప్రస్తా వించదు. ఎప్పుడూ మీడియాలో ప్రచారాల కోసం చేసే ఉత్తుత్తి ఆందోళనలు తప్పా. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 55 వేల మందికి పైగా జర్నలిస్టులు పెద్ద పత్రికల దగ్గర నుంచి స్థానికపత్రికలు, టీవీఛానల్స్ లో పనిచేసేవారు వారుంటే వారి కుటుంబంలోని సభ్యులు ఓటు హక్కు ఉన్నవారు ఎంత మంది ఉంటారో ఒక్కసారికూడా ఆలోచన చేయడం లేదు కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు. ప్రభుత్వం మాత్రం మీడియా సంస్థల ద్వారా లేఖలు ఇస్తే...ముక్కుతూ మూలుగుతూ ఒక్క ప్రెస్ అక్రిడేషన్ మాత్రం ఇస్తుంది. దానితో ఉచితంగా బస్సుపాసు మాత్రమే వస్తుంది. అదీ కూడా రద్దీ సమయంలో కండక్లర్లే క్రిందికి దించేస్తూ ఉంటారు. ఈ విషయం తెలిసినా అధికారులూ ఏమీ అనరు. ఎందుకంటే జర్నలిస్టులంటే బాగా సంపాదించేవారని ఒక ప్రగాఢ నమ్మకం ఒకటి ఏడ్చి చచ్చింది.

 చాలా రాజకీయ పార్టీలు అధికారం కోల్పోయిన తరువాత కూడా అదే ప్రెస్, మీడియా, జర్నలిస్టులు అవసరం పడతారు. ట్వంటీస్ కి వచ్చిన తరువాత చాలా రాజకీయపార్టీలు సొంతంగానే మీడియా సంస్థలు ఏర్పాటు చేసుకున్నాయి. ఎన్నిచేసుకున్నా.. పార్టీల్లో నాయకులు వచ్చి పనిచేయరు కదా.. మళ్లీ అక్కడ కూడా వర్కింగ్ జర్నలిస్టులు లేకపోతే మీడియా సంస్థలు నడవవు. ఏం జరుగుతుందో, ఏ విషయాన్ని తెలియజెప్పాలనుకున్నామో మళ్లీ జర్నలిస్టుల ద్వారానే చేయాలి. అలా చేసిన సందర్భంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చినా.. మళ్లీ అదే నిరంకుసత్వం.. అంటరాని తనం.. బయట మీడియాని తొక్కేయాలి. సొంత మీడియాని అభివృద్ధి చేసుకోవాలి, ఆస్తులు సంపాదించాలనే తత్వం. ఈ నేపథ్యంలో సమిధలువుతున్నది ఒక్క జర్నలిస్టు మాత్రమే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జర్నలిస్టులకోసం ముసలి కన్నీరు కార్చే రాజకీయపార్టీలన్నీ, అధికారంలోకి వచ్చిన తరువాత నియంతలా వ్యవహరించడం రివాజుగా మారిపోతూ వస్తున్నది. ఇన్నేళ్ల కాలంలో జర్నలిస్టుల కోసం ఒక్క సంక్షేమ పథకం ఏ రాజకీయపార్టీ అయినా తన మేనిఫెస్టోలో పొందుపరిచిందా అనే విషయాన్ని 1920 నుంచి చూసుకున్నా 2024 వరకూ కనిపించదు. 

అదేంటి హెల్త్ కార్డులు ఇస్తున్నారు కదా అంటే.. సాధారణ ప్రజలకు  ఇచ్చే కార్డులకంటే రెండు మూడు రోగాలు పెంచి స్కీములో సగం డబ్బులు కట్టించుకొని కార్డులిస్తున్నారు. అవి ఎప్పుడు పనిచేస్తాయో.. వాటిని ప్రైవేటు ఆసుపత్రుల వాళ్లు ఎప్పుడు ఆపేస్తారో తెలీదు. కేంద్రం ఇచ్చే ఒకేఒక్క సదుపాయం 50శాతం రిబేటుతో ఇచ్చే రైల్వే పాసు. అది రిబేటు స్కీములు వర్తింపచేయలేమని చెప్పి కోవిడ్ కి ముందే తొలగించేసింది. రాష్ట్రప్రభుత్వం కూడా యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ తొలగించేసింది. జర్నలిస్టుల సంక్షేమ నిధిని రద్దు చేసేసింది. బీపీఎల్ ఫ్యామిలీలకు ఇచ్చే ఇంటి స్థలం కూడా 2015 నుంచి ఇవ్వడమే మానేసింది. 60ఏళ్లపాటు సేవలు అందించిన జర్నలిస్టులకు కనీసం పించను అందించాలనే ఆలోచన కూడా ప్రభుత్వాలకి రాలేదు. కానీ ఓట్లేసిన ప్రజలకు, 50ఏళ్లు దాటిని వారికి మాత్రం ప్రతీనెల రూ.4వేలు పెన్షన్ ఇస్తోంది. వాళ్లకి ఇవ్వడం తప్పుకాదు. ప్రభుత్వల కోసం పనిచేసే జర్నలిస్టులకి ఎందుకు ఇవ్వడం లేదనేదే ఇక్కడ ప్రశ్న. కనీసం ఆ తరహా పించనుకి కూడా జర్నలిస్టులు నోచుకోలేపోతే సమాజంలో నాల్గవ స్థంబంగా జర్నలిస్టులకు ప్రభుత్వాలు ఇచ్చే విలువ ఏంటో నేటికీ జర్నలిస్టులే గుర్తించడం లేదు. 

మాకేటి సిగ్గు అన్నట్టుగానే వ్యవహరిస్తూ.. మళ్లీ ఆహా ఓహో అంటూ ఉదయం లేచిన దగ్గర నుంచి అదే కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాల కోసం కీర్తిస్తూ, పొగుడుతూ వార్తలు రాస్తున్నాం. ఇదే వాళ్లకి జర్నలిస్టుల విషయంలో చులకనైంది. మనం పథకాలు ఇచ్చినా, ఇవ్వకపోయినా, మీడియాని తొక్కేయాలని చూసినా, సోషల్ మీడియాను పెంచుకోవాలని చూసినా జర్నలిస్టుల నుంచి అందునా జర్నలిస్టుల సంఘాల నుంచి వ్యతిరేకత రాలేదూ అంటే జర్నలిస్టులకు ఏమీ చేయాల్సిన పనిలేదు, ఒక్క స్కీము కోసం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదనే నమ్మకానికి వచ్చేశాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇంత జరుగుతున్నా.. ఇలాంటి వార్తలు చదువున్న సమయంలో కూడా జర్నలిస్టులన్నవాళ్లు వీటిని చదివి.. ఓహో మన సమస్యల కోసం ఈరోజు భలే వార్త వచ్చిందనుకుని మురిసి పోయి.. మళ్లీ అదే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోసం వార్తలు రాయడానికి ఉదయాన్నే లేచి మళ్లీ వెళ్లిపోతాం. 

అదే కదా జర్నలిస్టు అంటే.. ఇక జర్నలిస్టుల కోసం ప్రభుత్వాలు ఎందుకు ఆలోచిస్తాయి.. కాదాంటారా..? ఎపుడైనా ప్రజాప్రతినిధులనైనా జర్నలిస్టులు మనుషుల్లా కనిపించలేదా..? కనీసం ఒక్క సంక్షేమ పథకం అయినా జర్నలిస్టుల కోసం ప్రవేశాపెట్టారా అని అడిగే దైర్యం ఉందా అంటే.. ఆ ఒక్కటీ అడక్కు అంటారు..! అందుకే జర్నలిజం వర్ధిల్లాలి.. జర్నలిస్టులు జర్నలిస్టులుగానే ఉండిపోవాలి.. మన సమస్యలపై ప్రభుత్వాలు ప్రచారం చేసుకోవాలి.. కొన్ని రాజకీయపార్టీల వలన మీడియా పాతాళానికి తొక్కేయబడాలి.. జర్నలిస్టుకి భవిష్యత్తులో ఒకూ ఒక్క పథకం కాదు కదా మరేమీ అందకూడదు, దానికోసం ఏ జర్నలిస్టు సంఘంమూ అడకూడదు.. అదీ విషయం..?!

visakhapatnam

2025-07-06 15:04:52

ప్రెస్ అక్రిడిటేషన్ కోసం జర్నలిస్టులకి ఇన్ని అగచాట్లా..?!

వర్కింగ్ జర్నలిస్టుల హక్కు ప్రెస్ అక్రిడిటేషన్. అలాంటి అక్రిడిటేషన్ జర్నలిస్టులు లెక్కలేనన్ని అగచాట్లు పడుతున్నారు. దానికి తొలి కారణం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. దేశవ్యాప్తంగా ప్రధాన పత్రికలు పదుల సంఖ్యలో ఉంటే.. స్థానిక పత్రికలు వందల సంఖ్యలో ఉన్నాయి. ప్రధాన పత్రికల నుంచి స్థానిక పత్రికల వరకూ నిర్వహణ భారం ఒక్కటే. కానీ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఎక్కువ ఎడిషన్లు ఉన్న పత్రికలను ఒకలా, స్థానికంగా ఉన్న చిన్న పత్రికలకు ఒకలా గుర్తిస్తున్నది. గత ప్రభత్వంలో స్థానిక పత్రికలను నిర్వీర్యం చేసేందకు తీసుకు వచ్చిన జీఓనెంబరు 38 వలన స్థానిక పత్రికలు పిట్టల్లా రాలిసోయాయి. జిఎష్టీ, ఎనిమిదిపేజీలు, ప్రింటింగ్ ప్రెస్ ల తనిఖీ పేరుతో చిన్న పత్రికల పాతాలానికి తొక్కేసింది. కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం కాస్త వెసులుబాటు ఇచ్చినా.. గత ప్రభుత్వ విధానాలే అమలు చేస్తున్నట్టు కనిపిస్తున్నది. గతంలో టిడిపి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో స్థానిక దినపత్రికలకు నాలుగు పేజీల బ్రాడ్ షీట్ ముద్రించి పంపిణీ చేస్తే.. మండలానికి ఒక ప్రెస్ అక్రిడిటేషన్ ఇచ్చేది. 

అదే టిడిపి ప్రభుత్వం మళ్లీ నిబంధనలు కఠిన తరం చేసి వాటిని కుదించేసింది. తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం  దానిని ఆరు అక్రిడిటేషన్లకు కుదించేసింది. అదీ ఆ ప్రభుత్వానికి అనుకూలంగా రాస్తే ఒకలా.. ప్రతికూలంగా రాస్తే ఒకలా వ్యవహరించింది. కొన్ని ప్రధాన పత్రికలకు కూడా అక్రిడిటేషన్లు కోత కూడా పెట్టేసింది. ఇపుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎడిషన్లు ఎక్కువగా ఉన్న పత్రికలతోపాటు, స్థానిక పత్రికలకు కూడా ఎంపానల్ ఉంటే ప్రకటనలు ఇవ్వడం మొదలు పెట్టింది. దానివలన స్థానిక పత్రికలకు ప్రింటింగ్, పత్రిక పంపిణీ ఖర్చుల భారం కొద్దిమేర తగ్గినట్టు అయ్యింది. అయినా కూడా చాలా కాలంగా చేయని స్థానిక పత్రికల ఎంపానల్ మెంట్ విషయంలో కూడా గతంలో నిబంధనలు ఉన్నా టిడిపి ప్రభుత్వం స్థానిక పత్రికలకు చేయూత ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఎంపానల్ మెంట్ కి దరఖాస్తు చేసుకుంటే చిన్నా చితకా లోపాలున్నా ఎంపానల్ మెంట్ సమాచార పౌర సంబంధాల శాఖ ద్వారా చేసేది. 

అది చాలాకాలంగా నిలిపివేయడంతో నిరాటకంగంగా పత్రికలు నడుతుపున్న వారికి ఎంపానల్ మెంట్ లైసెన్సు రాక నిత్యం పత్రిక ముద్రిస్తున్నా ప్రభుత్వ ప్రకటనలు రావడం లేదు. అంతేకాదు.. అక్రిడిటేషన్ల విషయంలో కూడా ఎంపానల్ మెంట్ ఒకలా, లేకపోతే మరోలా ఇవ్వడం కూడా వర్కింగ్ జర్నలిస్టులకు ఇబ్బందులను తెచ్చి పెడుతున్నది. పత్రికలను ఎక్కడా ఆపకుండా నడపడానికి జర్నలిస్టులు భార్యల మెడలో పుస్తులు అమ్మి కూడా పత్రికలు నిర్వహించిన దాఖలాలు ఉన్నాయి. అయినా జర్నలిస్టుల ఇబ్బందులు ఏమీ పట్టకుండా ప్రభుత్వం ప్రెస్ అక్రిడిటేషన్ దేశంలో లేని విధంగా నిబంధనలు పెట్టి వాటిని తొలుత కుదించేసి.. తరువాత పూర్తిగా రద్దు చేసే యోచనలో ఉన్నట్టు కనిపిస్తున్నది. ఒకరకంగా పెద్ద పత్రికలతో పాటు, సమాచారశాఖ కూడా స్థానిక, చిన్న పత్రికలను అంటరానివారిగా చూడటం కూడా ఆందోళన కలిగిస్తున్నది. స్థానిక పత్రికలకైనా, పెద్ద పత్రికలకైనా ఆర్ఎన్ఐ నుంచి లెసెన్సు వచ్చి నిరాటంకంగా పత్రిక ముద్రిస్తేనే గుర్తింపు. 

అలాంటి గుర్తింపు కోసం అనాదిగా స్థానిక పత్రికలు ఇబ్బందులు పడుతూనే ఉన్నాయి. అలాగని పెద్ద పత్రికలకు సాంకేతిక ఇబ్బందులు, ప్రభుత్వ జీఓలో పొందు పరిచిన అంశాల్లోని లోటు పాట్లు లేకుండా ఉన్నాయా అంటే అక్కడ కూడా ఉన్నాయి. ఒక్కోచోట ప్రధాన పత్రికల కంటే స్థానిక పత్రికలు చక్కగా నిర్వహిస్తున్న ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కార్డు ప్రెస్ అక్రిడిటేషన్ కి నానా పాట్లు పడాల్సి వస్తున్నది. గతంలో టిడిపి ప్రభుత్వంలో ఎన్నడూ ప్రెస్ అక్రిడిటేషన్లు జారీ ఆలస్యం కాలేదు. కానీ ఈసారి కూటమిగా వచ్చిన సందర్భంలో సోషల్ మీడియాకి కూడా ప్రెస్ అక్రిడిటేషన్లు ఇవ్వాలని నిర్ణయించి క్యాబినెట్ సబ్ కమిటీ వేయడంతో ఆ రిపోర్టుకోసం మరింత ఆలస్యం అవుతున్నది. కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలోని జీఓ నెంబరు 38 లా నిబంధనలు ఇస్తుందా.. లేదంటే గతంలో మాదిరిగా సడలింపులతో ఇస్తుందా అనే విషయం తెలియాలంటే క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్టు ఇచ్చి కొత్త ఉత్తర్వులు వచ్చే దాకా తెలీదు..!

visakhapatnam

2025-07-04 21:58:44

కూటమిలో అధికారుల కంత్రీ పనులు.. వార్డు సచివాలయ ఉద్యోగుల కౌన్సిలింగ్ లో రచ్చ..?!

గ్రామ, వార్డుు సచివాలయ శాఖ ఉద్యోగులను ముప్పుతిప్పలు పెట్టాలని చేస్తున్నారో లేక.. కూటమి ప్రభుత్వంపై సచివాలయ ఉద్యోగుల ద్వారా తిరుగుబాటు రావాలని  అధికారులు చేస్తున్నారో తెలీదుగానీ.. సచివాలయ ఉద్యోగుల బదిలీల విషయంలో కొత్త రకం విధానాలను తెరమీదకు తీసుకు వస్తున్నారు. బదిలీల కోసం ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోమని చెప్పి.. మూడు ఆప్షన్లు ఇచ్చి వెళ్లిపోమనడంతో.. మెరిట్ లిస్టులు పెట్టకుండా రూల్ పొజిషన్ పాటించకుండా బదిలీలు చేయడం ఏంటని వార్డు సచివాలయ ఎమినిటీస్ ఎదురు తిరగడంతో చేసేది ఏం లేక.. మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్పి బదిలీలు చేసే అధికారులు చెప్పుకొచ్చారు., కావాలని ప్రభుత్వం, అధికారులు సచివాలయ ఉద్యోగులకు నష్టం వాటిల్లే చేస్తున్నారంటూ అధికారులను నిలదీసిన ఉద్యోగులు విశాఖలో బాయ్ కట్ చేసి.. జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదుచేశారు.. ఒక్క విశాఖలోనే రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో చాలా చోట్ల బదిలీలు నిలిచిపోయాయి..!

గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులను కూటమి ప్రభుత్వం అంతా తిరకాసుగా చూస్తుందనే విషయం మారోమారు బదిలీల విషయంలో బయట పడింది. వాస్తవానికి ఉద్యోగులకు బదిలీలు చేయాల్సి వస్తే.. ఉద్యోగుల నియామకం సమయంలో వచ్చిన మార్కులు అధారంగా చేసిన మెరిట్ లిస్టుని బదిలీలు జరిగే టపుడు ఆన్ లైన్ చూపిస్తారు. సదరు ఖాళీలను ఉద్యోగులు వారి మెరిట్ లిస్టు ఆధారంగా ప్రదేశాలు ఎంచుకొని జాయిన్ అవుతారు. కానీ కూటమి ప్రభుత్వంలో మునుపెన్నడూ లేని విధంగా బదిలీలు ఆన్ లైన్ లో చేసుకోమని చెప్పి.. తీరా బదిలీలు జరిగే ప్రదేశానికి వెళ్లిన ఉద్యోగులకు అక్కడి అధికారులు తేడా వ్యవహారం చూసి కళ్లు బైర్లు కమ్మాయి.. ఒకఫారం ఇచ్చి అందులో మూడు ప్రదేశాలు ఎంచుకొని సంతకం చేసి ఇచ్చి వెళ్లిపోయి.. మూడు రోజుల తరువాత వస్తే మీకు బదిలీలు జరిగిపోతాయని చెప్పడంతో ఉద్యోగులంతా అధికారులపై తిరగబడ్డారు. 

తామేమీ చిన్నపిల్లలం కాదాని.. బదిలీలకు ఇతర ప్రభుత్వశాఖల మాదిరిగా మెరిట్ లిస్టు అంటూ ఉంటుందని.. దాని ప్రకారం చేయాలి తప్పితే మీకు నచ్చినట్టు చేయడం ఏంటని అధికారులను పట్టుకొని దులిపేశారు. ఆ మాటలను వీడియోలు తీసి 75 ప్రభుత్వశాఖల ఉద్యోగులు, అధికారులకు పంపడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా తెగ వైరల్ చేశారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా విశాఖతోపాటు చాలా చోట్ల బదిలీలను సచివాలయ ఉద్యోగులు బాయ్ కట్ చేశారు. అంతేకాదు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తమకు జరిగిన అన్యాయంపై మెమోరాండం కూడా సమర్పించారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులు మాట్లాడుతూ, ప్రభుత్వం తామంతట తామే ఉద్యోగాలను వదిలి వెళ్లిపోయే విధంగా వ్యవహరిస్తుందని.. దానికోసమే మునుపెన్నడూ లేనివిధంగా తేడా బదిలీలు జరుపుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి పరిపాలన వస్తే తమ బ్రతుకులు మారతాయనుకుంటే.. గత ప్రభుత్వం కంటే పరిస్థితి దారుణంగా ఉందని వాపోయారు. 

బదిలీలకంటే ముందు రేషనలైజేషన్ పేరుతో వార్డుల్లో 8 మంది ఉద్యోగులు మాత్రమే ఉండాలని కొన్ని పోస్టులు రద్దు చేశారని. వారిని ఖాళీలున్న సచివాలయాల్లో నియమించకుండా.. వారిని గాల్లోనే పెట్టి ఇపుడు సాధారణ బదిలీలు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేస్తున్న బదిలీలు కూడా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా చేపడుతున్నారని దీనిపై డిఎస్సీ కమిటీ చైర్మన్ గా జిల్లా కలెక్టర్ కలుగజేసుకుంటే తప్పా, బదిలీల్లో జరుగుతున్న తేడా విధానానికి తెరపడేలా లేదని చెప్పుకొచ్చారు. అయితే జిల్లా కలెక్టర్లు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని కాదని ఏమీ చేయడానికి లేదు. ఇప్పటికే క్లస్టర్ విధానం కోసం జీఓలు వచ్చిన తరువాత రెండు సచివాలయాలు కలిపి ఒక సచివాలయ చేస్తూ.. రెండు సచివాలయాల్లోని సిబ్బందిని ఒక సచివాలయానికి మాత్రమే 8 మంది ఉండేలా చేసి కొందరు ఉద్యోగులను గాల్లో పెట్టారని కలెక్టర్లు, ఎమ్మెల్యేలకు వివరించారు ఉద్యోగులు. 

అంతేకాదు ఈ తేడా విధానంపై మీడియాలో పెద్ద ఎత్తు కథనాలు కూడా వెలువడ్డాయి. దానిపై స్పందించిన అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వం చేసే పనులకు వ్యతిరేకంగా తాము ఏమీ చేయలేమని చేతులు ఎత్తేశారు. ఇపుడు తీరా సాధారణ బదిలీల్లో కూడా మెరిట్ లిస్టు లేకుండా చేపడుతున్న విధానాన్ని ఉద్యోగులు వ్యతిరేకించడం, అధికారులు తేడాగా చేపడుతున్న బదిలీలను వీడియోలు తీసి మరీ వైరల్ చేయడంతో ప్రభుత్వం బదిలీల్లో చేస్తున్న తిరకాసు విధానం అందరికీ తెలిసింది. అందునా సచివాలయ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో 15.4 గ్రామ,వార్డు సచివాలయాల్లో సుమారు 1.30 లక్షల మంది ఉండటంతో విషయం క్షణాల్లో వైరల్ అయ్యింది. ఈ విషయాన్ని అటు అధికారులు కూడా జిల్లా కలెక్టర్ కి, మీడియాకి  తెలియజేసినా ఫలితం లేకుండా పోయింది. 

బహుసా సచివాలయశాఖ రాష్ట్ర కార్యాలయం నుంచి నిర్ధిష్ట ఆదేశాలు, మెరిట్ లిస్టులపై సూచనలు వస్తే తప్పా... ఉద్యోగులు బదిలీల కౌన్సిలింగ్ లో పాల్గొనే అవకాశాలు కనిపించడం లేదు.  ఇతర శాఖల్లో వేల సంఖ్యలో రిటైర్ అయిన ఉద్యోగుల ఖాళీలను సచివాలయ ఉద్యోగులతో భర్తీచేయడం కోసం ఉద్యోగులను కుదించి.. వారిని వేరే ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేయడానికి చేపట్టిన క్లస్టర్ విధానం, ఆ పై మెరిట్ లిస్టు లేకుండా జరుగుతున్న బదిలీల ప్రక్రియ ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య ఇప్పటికే చాలా దూరాన్ని పెంచేసింది. దీని ప్రభావం రానున్న రోజుల్లో పరిపాలనపై చాలా దారుణంగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందునా దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఒక్క ఆంధ్రప్రేదేశ్ లో మాత్రమే ఒక ప్రభుత్వ శాఖకు చట్టబద్దత లేకుండా, నిర్ధిష్టమై శాఖ లేకుండా, క్యాడర్ లేకుండా సర్వీసు నిబంధనలు , ప్రమోషన్ ఛానల్ లేకుండా నడుస్తున్న ఏకైన శాఖ గ్రామ, వార్డు సచివాలయ శాఖ మాత్రమే. 

ఇప్పటి వరకూ ఆన్ని విషయాల్లో  ఉద్యోగులనుంచి తీవ్ర వ్యతిరేకత మూటకట్టుకున్న ప్రభుత్వం ఇపుడు మెరిట్ లిస్టు లేకుండా అడ్డదారిలో వారికి కావాల్సిన వారికోసమే అన్నట్టు గా చేస్తున్న బదిలీల వ్యవహారంలో  చేస్తున్న పనులు మరింతగా సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం అంటే వ్యతిరేక కలిగేలా చేశాయి. ఇంత జరుగుతున్నా సచివాలయశాఖను ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ కిమ్మనడం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసిన తేడా విధానాల కంటే కూటమి ప్రభుత్వంలో మరింత తేడాగా వ్యవహరిస్తున్నారు అధికారులు.. ఈనేపథ్యంలో సచివాలయ ఉద్యోగుల బదిలీల విషయంలో ప్రభుత్వం ఏం క్లారిటీ  ఇస్తందనేది ఆశక్తి కరంగా మారింది..?!

visakhapatnam

2025-06-28 18:48:32

కూటమి ప్రభుత్వానికి షాక్.. రోడ్డెక్కనున్న సచివాలయ ఉద్యోగులు..?!

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు రోడ్డెక్కనున్నారు.. నిరసనలతో మొదలై.. పెన్ డౌన్ వరకూ తీసుకెళ్లే కార్యాచరణకు సిద్దపడు తున్నా రు..ఆరేన్నరేళ్లుగా కనీసం సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ ఇవ్వకపోగా.. నేడు క్లస్టర్ విధానంతో పోస్టులను కుదించి ఉద్యోగులను గాల్లోనే తమను పెట్టి నేడు సాధారణ బదిలీలు చేపడుతున్న ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు సిద్దమవుతు న్నారు..ఆంధ్రప్రదేశ్ లోని 75 ప్రభుత్వ శాఖలుంటే 74 ప్రభుత్వశాఖల ఉద్యోగులు వారికి శాఖలకు చెందిన విధులు మాత్రమే నిర్వహి స్తుంటే.. ఒక్క గ్రామవార్డు సచివాలయశాఖ ఉద్యోగులు మాత్రం మిగిలిన అన్ని ప్రభుత్వశాఖల విధులు చేయాల్సి వస్తున్నది.. ఆఖరికి కార్యాల యంలోని స్టేషనరీ ఖర్చులు, సెల్ ఫోన్లు, ఇంటర్నెట్ ఇవ్వకుండా ఒకేసారి నాలుగైదు సర్వేలు సొంత ఖర్చులతో చేయడం, వేళా పాలా లేకుండా అదనపు విధులు అప్పగించడం.. కనీసం వారంతంలో కూడా సెలవులు ఇవ్వకుండా.. ఇచ్చినా ఇంటి దగ్గర కూడా ప్రశాం తంగా లేకుండా అదనపు పనులు చెబుతున్న విధానాలపై ఉద్యోగులు ఒంటి కాలిపై లేస్తూ నేడు రాష్ట్రవ్యాప్త నిరసనకు సిద్దమయ్యారు..!

భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ చూడని ప్రభుత్వ శాఖను ఒక్క ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వంలోనే చూడవచ్చు. ఈ శాఖలో పనిచేసే ఉద్యోగులకు వారి శాఖ పనుల కంటే మిగిలిన శాఖల పనులు, సర్వేలు, ప్రభుత్వ పథకాల పంపిణీ మొత్తం వీరే చేసే విధులుంటాయి. ఇవన్నీ చేసినందకు ప్రభుత్వం అదనంగా ఇస్తున్న ప్రయోజనాలు తెలుసుకుంటే ఎవరికైనా దిమ్మ తిరిగి కళ్లు బైర్లుకమ్మాల్సిందే.. ప్రభుత్వ నిర్ధేశించిన సర్వేలు సమాయినికే చేసేయాలంటారు.. సెల్ ఫోన్లు, ఇంటర్నెట్ ఇవ్వరు..  రేషన్ కార్డులు, ఆధార్ కార్డ్, ఓటరు కార్డు, ఇతర పథకాలకు  ప్రజలచేత దరఖాస్తులు చేయించ మంటారు కార్యాలయంలో స్టేషనరీ ఇవ్వరు.. ఆ ఖర్చులనే ఉద్యోగులనే పెట్టుకోమంటారు.. కార్యాలయాల్లో పాడైన ప్రింటర్లు బాగు చేయించరు.. వాటిని కూడా ఉద్యోగుల ఖర్చుతోనే బాగుచేయించుకోమంటారు.. చీటికి మాటికి మండల కేంద్రాలు, జోనల్ కార్యాలయాల్లో సమావేశాలకు రమ్మంటారు టీఏ డీఏలు ఇవ్వరు కానీ కార్యాలయానికి పిలిచి అమ్మనా బూతులతో చీవాట్లు, తిట్ల పురాణం మొదలెడతారు..పైగా  షోకాజ్ నోటీసులు ఫ్రీ.. వార్నింగ్ లు ఆపై బోనసులే.. ప్రతీ నెలా పించన్లు ఉదయం పదగంటలకే ఇచ్చేయాలి.. అంటే ఉద్యోగులు తెల్లవారుజామున ఐదు గంటలకే విధులకు వెళ్లాలి.. సర్వేలు చేయాలి ఆ యాప్ లన్నీ విచిత్రంగా ఉద్యోగుల విధులు సాయంత్రం 5గంటలకి అయిపోతే ఆరో గంట నుంచి పనిచేయడం మొదలు పెడతాయి.. 

సమయానికి సర్వే రిపోర్టులు పర్శంటేజీలు రాకపోతే మండల అధికారులకి, జోనల్ అధికారులకి మనిషికొచ్చినంత కోపం వచ్చేస్తుంది.. ఆపై తెగ ఫీలపై ప్రెస్టేషన్ అంతా ఉద్యోగులపైనే చూపించేస్తారు.. కార్యాలయాలు చెత్తా చెదారంతో నిండిపోతే మహిళా ఉద్యోగులైతే చీపుర్లు పట్టుకొని వారే ఊడ్చుకోవాలి.. మగవాళ్లైతే చెత్తను బయట పారేయాలి.. ఆయాలు, చెత్త ఊడ్చే పనివారు ఉండరు.. మాత్రం పనులు చేసుకోలేరా.. పైగా అది మంచి ఎక్స ర్ సైజు ఉచిత సలహాలు ఇస్తారు.. పెట్టిన ఖర్చులకి బిల్లులు పెడితే  ఆ ఒక్కటీ అడక్కు అంటారు. ఇంతలా అధికారులు ప్రోత్సహించినా చచ్చో చెడో విధులు నిర్వహిస్తే వీడియో కాన్పరెన్సు, టెలీ కాన్ఫరెన్సు కాల్స్ లో పేరు పేరునా తిట్ల దండకం, పరువు తీయడం... అక్కడికీ అధికారులు జేబులో డబ్బులు జీతాలుగా  సచివాలయ ఉద్యోగులకు ఇచ్చేస్తున్నట్టు.. పాపం వారే ఉద్యోగాలు దయతలచి ఇచ్చినట్టు, ప్రభుత్వంలో ఏశాఖలోనూ లేని అధికారిగా తానే ఉన్నట్టు ఫీలైపోతుంటారు ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే..

ఇక రెండో వైపు చూస్తే.. ఆరున్నరేళ్లుగా కనీసం ఉద్యోగులకు పదోన్నతులు కల్పించని ప్రభుత్వశాఖగా గిన్నీస్ రికార్డు కూడా సంపాదించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని 75వ ప్రభుత్వశాఖ అయిన గ్రామ, వార్డు సచివాలయశాఖ. ప్రభుత్వశాఖ ఉద్యోగులకు సర్వీసు నిబంధనలు, క్యాడర్, ప్రమోషన్ ఛానల్ లేకుండా ఇన్నేళ్లు ఏ విధంగా పనులు చేయించారనే విషయం తెలిస్తే వార్త చదువుతున్నవారికే కాదు.. ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులకు కూడా గుండెళ్లో రైళ్లు పరిగెడతాయి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సర్వీసు నిబంధనలు, జ్యాబ్ క్యాడర్, ప్రమోషన్ ఛానల్, పీఆర్సీ ఫుల్ బెనిఫిట్స్ , నోషల్ ఇంక్రిమెంట్లు, సర్వీసు రెగ్యులరైజేషన్ ఇంక్రిమెంట్లు.. ఇవ్వాలంటే ముందుగా ఈ ప్రభుత్వ శాఖకు చట్టబద్ధత కల్పించాలి. అలా కల్పించాలంటే అసెంబ్లీలో ఆమోదం పొంది గెజిట్ నోటిఫికేషన్ రావాలి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అదిగో ఇదిగో అంటూ ఐదేళ్లు గడిపేసింది. రెండేళ్లు దాటినా ఉద్యోగాలు రెగ్యులర్ చేయకపోతే.. మీడియాలో వచ్చిన వరుస కథనాలతో పరువుపోతుందని భావించి రెండు సంవత్సరాల తొమ్మిదినెలలకు గానీ గత ప్రభుత్వం ఉద్యోగుల సర్వీసుని రెగ్యులర్ చేయలేదు. ఆ సమయంలో 9నెలల పేస్కేలు ఉద్యోగులకు నష్టం కలిగించి, సర్వీసు రెగ్యులర్ చేసిన తరువాత ఇవ్వాల్సిన రెండు ఇంక్రిమెంట్లు కూడా కోత విధించింది. 

అంతేకాదు పీఆర్సీ ఇస్తున్నామని చెప్పి పేస్కేలు పెంచి ఇతర ప్రయోజనాలు ఎగ్గొట్టింది.. ఆ తరువాత సచివాలయ ఉద్యోగులకు న్యాయం చేస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వ పాచికనే చక్కగా, పక్కాగా ఫాలో అవుతోంది. కనీసం సచివాలయ శాఖకు చట్టబద్దత కల్పించేందకు ఇన్నిసార్లు జరిగిన క్యాబినెట్ సమావేశాల్లో ఒక్కసారి కూడా వీరి అంశాలను చేర్చలేదు. అలా చేర్చి అసెంబ్లీలో చట్టబద్దత కల్పిస్తే ఖచ్చితంగా ఐదేళ్లు దాటిన ప్రభుత్వ ఉద్యోగులకు వీరందరికీ పదోన్నతులు ఇవ్వాలి. అలా ఇస్తే ఉద్యోగులకు రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి, పెంచిన పేస్కేలు అమలు చేయాలి. ఇవన్నీ చేస్తే ప్రభుత్వంపై అదనపు భారం పడుతుంది. దానికి బదులు సచివాలయ ఉద్యోగుల విషయంలో ఏమీ చేయకుండా ఎన్నికల హామీల్లా అది చేస్తాం.. ఇది చేస్తాం అని చేప్పి ఏమీ చేయకుండా వదిలేస్తే ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చే పనుండదు.. సరికదా ఖాళీగా ఉన్నఉద్యోగాలను భర్తీచేసే పని అసలే ఉండదు. ప్రభుత్వానికి మేలు జరగని అంశం కాబట్టి గత ప్రభుత్వంలోనూ, నేడు కూటమి ప్రభుత్వంలోనూ రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని 15 వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లోని సుమారు 1.30 లక్షల మంది ఉద్యోగులకు ప్రమోషన్ ఇవ్వకుండా, కనీసం సర్వీస్ రూల్స్ కూడా అమలు చేయకుండా అలాగే ఉంచేసింది.. 

వాస్తవానికి 2024 ఎన్నికల్లో సచివాలయ ఉద్యోగుల సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చిన కూటమి పరిపాలనలో ఏడాది పూర్తవుతున్నా వీరికోసం కనీసం పట్టించుకోకపోవడం వలనే.. ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయి సంబరాలు జరుపుతున్నవేళ ఉద్యోగులు నిరసన చేయడానికి పూనుకున్నారు. మొన్నటి వరకూ సచివాలయ మహిళా పోలీసుల అర్హతలను బట్టి వారిని సముచిత స్థానాల్లో కూర్చోబెడతామని చెప్పిన హోంశాఖ మంత్రి ప్రకటన తరువాత క్లస్టర్ విధానంతో అదే మహిళా పోలీసుల పోస్టులు రద్దు చేసి గాల్లో పెట్టినా నేటికీ హోం మంత్రి ఈ విషయంలో ఒక్క ప్రకటన కూడా చేయలేదు. రద్దు చేసిన పోస్టుల్లోని మహిళా పోలీసులను ముందుగా ఖాళీలు ఉన్న చోట భర్తీ చేయకుండానే సాధారణ బదిలీలకు తెరలేపారు. అంటే సాధారణ బదిలీలు జరిగితే.. క్లస్టర్ విధానంలో  పోస్టులు రద్దై గాల్లో ఉన్న మహిళా పోలీసులందరినీ ఎక్కడ నియమిస్తారో తెలియని పరిస్థితి. అన్ని ప్రభుత్వశాఖల్లో అటెండర్ల దగ్గర నుంచి గ్రూప్-1 అధికారుల వరకూ పదోన్నతులు కల్పిస్తున్న ప్రభుత్వం తమను మాత్రం గాలికొదిలేసి.. పదోన్నతులు, పీఆర్సీ ప్రయోజనాలు, సర్వీసు నిబంధనలు కూడా అమలు చేయకుండా వదిలేసిందని ఉద్యోగులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. 

తమ సమస్య ప్రభుత్వానికి తెలియజేసేందుకు వీలుగా నేటి నుంచి ఆందోళనకు సిద్దమవుతున్నామని చెబుతున్నారు. ప్రభుత్వానికి ఉపయోగపడేవిధానాలపై రాత్రికి రాత్రే జీఓలు ఇస్తున్నారని కానీ తమ ఉద్యోగులకు భద్రత కల్పించే విషయంలో మాత్రం ఎన్ని వినతులు సమర్పించినా కనీసం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు ఉద్యోగులు. ఈసారి ప్రభుత్వం స్పందించి పదోన్నతులు కల్పించి ఇతర 74 ప్రభుత్వ శాఖల ప్రభుత్వ ఉద్యోగుల  మాదిరిగా సర్వీసు నిబంధనలు అమలు చేయకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. కాకపోతే ఇవన్నీ గత ప్రభుత్వంలోనూ చూశాం.. మన ప్రభుత్వంలోనూ చూసి ఏవీ అమలు చేయకుండానే ఉద్యోగులతో ఇంకా అదనపు పనులు చేయిస్తున్నాం అన్నట్టుగానే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఉద్యోగులను మరింత ఆవేదనకు గురిచేస్తున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తుందా..? లేదంటే ప్రభుత్వానికి ఇష్టంలేని పనులు, నిరసనలు చేస్తున్నందుకు వీరిని టార్గెట్ చేసి జిల్లాల్లో కలెక్టర్లును, మున్సిపాలిటీల్లో కమిషనర్లను, మండలాల్లో ఎంపీడీఓలను, మున్సిపాలిటీల్లో జోనల్ కమిషనర్లు ఉసిగొల్పుతుందా అనేది వేచి చూడాలి..?!

Visakhapatnam

2025-06-22 19:12:20

కూటమి షాక్.. రద్దైన సచివాలయ మహిళా పోలీసు పోస్టులు.. మళ్లీ గాల్లోనే..?!

ఆంధ్రప్రదేశ్ సర్కారు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు చేపడుతున్న బదిలీలకు ఓ లెక్కుంది.. ఆ లెక్కలోనే కొన్ని చిక్కులు కూడా ఉన్నాయి.. ఆ చిక్కుముడులు విప్పే నాధుడు మాత్రం లేడు సరికదా.. బాధితులుగా మారిన మహిళా పోలీసులు వారి సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది.. ఐదేళ్లు దాటిన వారిని ఖచ్చితంగా స్థాన చలనం చేస్తామని ప్రకటించిన సర్కారు.. క్లస్టర్ విధానం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా కొన్ని సచివాలయాల్లో మహిళా పోలీసు పోస్టులను రద్దు చేసింది.. అలాగని వారికి ఖాళీలున్న స్థానాల్లో కూడా పోస్టింగ్ ఇవ్వలేదు.. వీరిని గాల్లోనే ఉంచి ఇపుడు సచివాలయ ఉద్యోగులకు బదిలీలు చేపడుతున్నది. ఈ నేపథ్యంలో ఉన్న స్థానాలన్నీ భర్తీ జరిగిపోతే.. రద్దైపోయిన పోస్టుల్లో ఉన్నవారిని ఎక్కడ నియమిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో ఎలాంటి విధి విధానాలు జిల్లా కలెక్టర్లకు కూడా రాలేదు. దీనితో వీరి సమస్య ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియనని పరిస్థితి నెలకొంది..!

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో ఇపుడు కొందరు మహిళా పోలీసులు గాల్లో ఉన్నారు.. రాష్ట్రప్రభుత్వం ఇటీవల క్లస్టర్ విధానం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా కొన్ని మహిళా పోలీసు పోస్టులను సచివాలయాల నుంచి తొలగించింది. ఎంతమందిని తొలిగించారో ఆ జాబితా కూడా గ్రామ సచివాలయాలకు సంంధించి ఎంపీడీఓ కార్యాలయాలకు, వార్డు సచివాలయాలకు సంబంధించి జోనల్ కార్యాలయాలకు  పంపింది. అలా రద్దైన పోస్టుల్లో ఉన్నవారికి ఖాళీలు ఉన్నట సచివాలయాల్లోనూ భర్తీచేయలేదు. అలాగని వారిని ఏ ప్రభుత్వ శాఖకు పంపిస్తారో కూడా చెప్పలేదు. ఈ లోగా వచ్చిన సాధారణ బదిలీలు వీరిని కలవర పాటుకి గురిచేస్తున్నాయి. ప్రస్తుతం రద్దైన మహిళా పోలీసులు క్లస్టర్ లో కలిసేందుకు వీలుగా కొన్ని సచివాలయాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ ప్రభుత్వం అక్కడ కూడీ వీరిని నియమించలేదు. ప్రస్తుతం ఐదేళ్లు దాటిన వారంతా బదిలీలకు దరఖాస్తులు చేసుకుంటున్నారు. అలా చేసుకున్నవారికి ఖాళీలను బట్టి ఆయ స్థానాలు ఆన్ లైన్ లో చూపించాల్సి వుంటుంది.

 అలాగని పోస్టులు రద్దు చేసిన వారిని ఏం చేస్తారో కూడా ప్రభుత్వం ప్రకటించలేదు. ఇందులో కొందరు మహిళా పోలీసులు బదిలీలపై వచ్చి విధుల్లో చేరారు. అలా చేరిన వారిలో కూడా కొంత మంది రద్దైన పోస్టుల్లో ఉన్నారు. అలాగని వీరు క్లస్టర్ లో కలిసే సచివాలయాల్లోని ఖాళీ పోస్టుల్లో బదిలీకి దరఖాస్తు చేసుకోవాలన్నా వీరికి ఆప్షన్ ఇవ్వలేదు. ఇపుడు వీరేం చేయాలో తెలియక ఆందోళన పడుతూ తమకు న్యాయం చేయాల్సిందిగా ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. అధికారుల ముందు ఈ విషయాన్ని పెడితే తమకు కూడా ఎలాంటి విధి విధానాలు లేవని.. ముందు ఐదేళ్లు దాటిన వారికి మాత్రం బదిలీలు చేస్తామని చెబుతుండటంతో మహిళా పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఐదేళ్లు దాటిన మహిళా పోలీసులందరూ బదిలీలకు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకుంటున్నారు. వీరికి బదిలీలు చేపడితే గాల్లో ఉన్న మహిళా పోలీసులకు మళ్లీ పోస్టింగ్ లు ఇవ్వడానికి కూడా ఖాళీలు ఉండవు. 

ఉన్నా ఎక్కడ ఏ జిల్లా చివరన ఉన్న స్థానాలు ఇస్తారో కూడా తెలియడం లేదని మహిళా పోలీసులు వాపోతున్నారు.  అలాగని క్లస్టర్ విధానం ఇంకా మొదలు కాలేదని చెబుతున్నా.. క్లస్టర్ పరిధిలోకి వచ్చే సచివాలయాల్లో కైనా తమకు పోస్టింగులు ఇవ్వలేదని చెబుతున్నారు. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతం అవుతున్నామని అంటున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఒక నిర్ధిష్ట సమాచారం లేకపోతే ప్రస్తుతం పోస్టులు రద్దై జాబితాలు వచ్చిన మహిళా పోలీసులకు బదిలీల అనంతరం ఎక్కడి స్థానాలు దక్కుతాయో తెలియని పరిస్థితి.  ప్రతస్తుతానికి గాల్లో ఉన్న మహిళా పోలీసులు తమ ఇబ్బందులను ప్రజాప్రతినిధులకు తెలియజేద్దామంటే విశాఖజిల్లాలో అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, జిల్లా అధికారులు అందరూ యోగాంధ్ర కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉన్నారని, తమ పరిస్థితి ఏంటో తమకు అర్ధం కవాడం లేదని వాపోతున్నారు. 

కాగా  ఈ విషయమై ఈరోజు-ఈఎన్ఎస్ విశాఖజిల్లా కలెక్టర్ ఎంఎన్.హరేంధిర ప్రసాద్ ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు. అయినప్పటికీ సచివాలయ మహిళా పోలీసులు పడుతున్న ఇబ్బందులను.. క్లస్టర్ విధానంలో పోస్టులు రద్దైన వారి సాంకేతిక సమస్యలను జిల్లా కలెక్టర్ చరవాణి దృష్టికి సమాచారాన్ని ఈరోజు-ఈఎన్ఎస్ ప్రతినిధి చేరవేశారు. విశాఖజిల్లాలో యోగాంధ్రా కార్యక్రమం పూర్తయ్యేవరకూ ఏఒక్క ప్రభుత్వ అధికారి గానీ, ప్రజాప్రతినిధిగానీ అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు. ఈలోగా ఇప్పటికే మహిళా పోలీసులు ఇచ్చిన వినతులపై ఏమైనా ప్రభుత్వం నుంచి స్పందన వస్తుందేమోనని మహిళా పోలీసులు అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు.

visakhapatnam

2025-06-17 16:00:34

ఆదివారాల్లోనూ విధులంటే మాసిన బట్టలెవరు ఉతుకుతారు..?!

ప్రభుత్వ ఉద్యోగమంటే వారికేం.. నెల అయ్యే సరికి టంచనుగా జీతం వస్తుంది. ప్రతీ ఆరు నెలలకు ఒక ఇంక్రిమెంటు వస్తుంది.. ఆపై ఐదేళ్లకొకసారి పీఆర్సీ వచ్చి జీతం పెరుగుతంది. అసలు, సిసలు లక్ అంటే అనుకుంటారు అంతా. కానీ ప్రభుత్వ ఉద్యోగంలో వేళా పాలా లేని విధులు, కనీసం వారంతంలో ఒక్కరోజు కూడా సెలవు లేనితనం, సెలివిచ్చినా ఇంటిదగ్గర కూర్చొని కూడా చేసేంత పని ఇవ్వడం ప్రభుత్వం ఇపుడు పరిపాటి అయిపోయింది. పురుషులకైతే పెరిగిన గెడ్డం, మాసిన తల కటింగ్ చేయించుకోవడానికి ఖాళీ ఉండటం లేదు. మహిళా ఉద్యోగులకైతే ఆదివారాల్లో మాసిన బట్టలు సైతం ఉతుక్కోవడానికి సమయం దొరకడం లేదు. అదేమంటే రాష్ట్రప్రభుత్వంలో పేరుకి, పేపరు మీద మాత్రమే రెండవ శనివారాలు, ఆదివారాలు, పండుగరోజులు, ప్రత్యేక రోజులు సెలవు రోజులు. ప్రభుత్వ రికార్డుల్లో కూడా సెలవులుగానే నమోదు చేసి ఉంటాయి. 

కానీ వీరికి వారమంతా పనే వుంటుంది. ఒక్కోసారి అదనంగా పనిచేయాల్సి వస్తే ఏ సమయంలో కార్యాలయంలో కూర్చొని పనిచేయాలో వారం రోజులు ముందుగానే వీడియో కాన్ఫరెన్సు, టెలీ కాన్ఫరెన్సు పెట్టి చెప్పేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకి కుటుంబాలు, పనులు ఉండావా ఉంటాయి. కానీ ప్రభుత్వానికి, ప్రజలకి మాత్రం కావాల్సిన సమయానికి పనులు చేయాలి. ప్రజలకు నిరంతరం పనులు చేస్తూ పోతే.. వీరికెప్పుడు సెలవులు రావాలి..? అంటే వస్తాయ్ కేవలం కాగితాలపైనే. రాష్ట్రప్రభుత్వంలోని 75 ప్రభుత్వ శాఖలు, 26 జిల్లాల్లోని లక్షల మంది ఉద్యోగులను రాష్ట్రప్రభుత్వం చెప్పినట్టు చేయాల్సిందే. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం చూస్తామని ఎప్పుడూ బాకాలు ఊదే ప్రభుత్వం ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగులకు ఏం చేసిందో ఆలోచిస్తే.. అసలు విషయం తెలుసిసొస్తుంది అంటున్నారు ఉద్యోగులు. నిజంగా ప్రభుత్వం ఉద్యోగులకు సంక్షేమం చేయాలనుకుంటే.. ప్రభుత్వ సెలవు దినాల్లో పనులు పురమాయించకుండా.. అదనపు విధులు ముందుగానే అప్పగించకుండా ఉందే అదే ప్రభుత్వ ఉద్యోగులకు అసలైన సంక్షేమం చేసినట్టుగా బావిస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. 

ప్రభుత్వానికి నచ్చినట్టుగా వేళా పాలా, సెలవు దినాల్లోనూ అదిరించి, బెదిరించి పనులు చేయించుకుంటున్నా.. ఉద్యోగులకు మాత్రం వారి సర్వీసు నిబంధనల ప్రకారం పదోన్నతులు,  ఇంక్రిమెంట్లు, ఖాళీల్లో సిబ్బంది నియమాకాలు మాత్రం చేపట్టడం లేదు. పేరుకే ప్రభుత్వ ఉద్యోగి అయినా సాధారణ ప్రజలు మాదిరిగా వారి తరహాలో వారు ఆందోళన చేస్తే తప్పా వారి సమస్యలు పరిష్కారినికి నోచుకోవడం లేదు. నాల్గవ తరగతి ఉద్యోగి నుంచి ఐఏఎస్ అధికారి వరకూ ఇపుడు ఖాళీకూడా లేకుండా పనులు పురమాయిస్తున్నది ప్రభుత్వం. ఒక రకంగా ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల్లో అవినీతి పెరిగిపోవడానికి కూడా రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే అంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. ఇంట్లో కుటుంబాలతో వారంలో ఒక్కరోజు కూడా గడపలేని ప్రభుత్వం ఉద్యోగం చేసి ప్రజలకి ప్రభుత్వానికి ఊడిగం చేయడానికి కాదు అన్నట్టుగా చేసిన పనికి.. అందునా వేగంగా చేసే పనులకు లంచాలకు అలవాటు పడుతున్నారు. వినడానికి, చదవడానికి వింతగా ఉన్నా ఇది పక్కా నిజం. కనీసం వారాంతంలోనైనా సెలవు ఇవ్వకపోతే ఇంట్లో మాసిన బట్టలు ఎప్పుడు ఉతుక్కోవాలంటూ వాపోతున్నారు. 

అంతేకాదు  పేరుకి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ విధులు అని చెబుతున్నా, ప్రతీరోజూ ఏడు, ఎనిమిది వరకూ చేయాల్సి పనులు కార్యాలయాల్లో ఉంటున్నాయి. దానికి కారణం కూడా లేకపోలేదు. భారీగా ఏర్పడ్డ ఖాళీలను భర్తీచేయకపోవడంతో ఉన్న సిబ్బందే మిగిలిన పనులను వంతుల వారీగా వేసుకొని మరీ చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. గత ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయ శాఖను ఏర్పాటు చేసి సుమారు 1.30 లక్షల మంది ఉద్యోగులను 26 జిల్లాల్లో 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లో నియామకాలు చేపట్టినా.. ఇతర శాఖల ఉద్యోగుల కంటేవీరికి మరీ అప్పగించేస్తున్నది రాష్ట్రప్రభుత్వం. మరీ పనులు లేకుండా జీతాలు ఎలా ఇస్తారనే డౌట్ మీకు రావొచ్చు.. వీరితో విధినిర్వహణ సమయంలో పనులూ చేయించేసి.. అదనపు పని గంటలుగా సర్వేలు, ఆన్ లైన్ వివరాల నమోదులంటూ ఊరిమీదకి వదిలేస్తున్నారు. ఆ సమయంలో పనిచేసేందుకు మొబైల్ ఫోన్లు గానీ, ఇంటర్నెట్ గానీ ప్రభుత్వం ఏమీ మంజూరు చేయడంలేదు. 

అలాగని పనిచేయకపోతే బెదిరింపులు, అదిరింపులు, షోకాజ్ నోటీసులు.. ఈ మధ్య మరో అడుగు ముందుకేసి నెలలో రెండు మూడు రోజులు జీతాలు కటింగ్ చేయడం, కార్యాలయాలకి పిలిపించుకొని ప్రత్యేకంగా సమయం తీసుకొని మరీ తెలుగులో ఉన్న బూతులన్నీ తిట్టడం అబ్బో ఒకటి కాదు రెండు కాదు చాలా వ్యవహారాలే జరుగుతున్నాయంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. ఇవన్నీ ప్రభుత్వానికి తెలియవని బావిస్తున్నారా అంటే.. అన్నీ తెలిసే జరుగుతున్నాయి. ఇన్ని పనులు ఉద్యోగాలు తీసేస్తామని బెదిరించి చేస్తున్నారు కదా.. ఉద్యోగులకు సకాలం ఇవ్వాల్సిన ప్రయోజనాలు ఇస్తున్నారంటే.. ఇది రాష్ట్రప్రభుత్వం అలాంటివి ఉద్యోగులు అడక్కూడదు.. ఇచ్చినపుడు మాత్రమే తీసుకోవాలని మాత్రం తెలివి సమాధానమిస్తున్నది ప్రభుత్వం. పోనీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్లు అయినా కాస్త ముందుకి వచ్చి పరిష్కరిస్తారా అంటే అవి కూడా కాగితాలకే పరిమితం అవున్నాయి.

 భారతదేశంలోనే ఏ రాష్ట్రప్రభుత్వంలోనూ లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే సర్వీసు రూల్స్, ఉద్యోగికి క్యాడర్, ప్రమోషన్ ఛానల్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారంటే ఆశ్చర్యం కలుగక మానదు.  అలాంటి నూతన సంస్క్రుతికి తెరతీసిన ఘనత కూడా గత ప్రభుత్వానికి దక్కుతుంది. దానిని కొనసాగిస్తున్న కీర్తి ప్రతిష్టలు కూటమి ప్రభుత్వానికే దక్కుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతా చేసి ప్రభుత్వ ఉద్యోగులు 12నెలల్లో ఒక నెల జీతం ఇన్కం టాక్స్ లుగా ప్రభుత్వానికే చెల్లించేస్తారనే విషయం మీలో ఎంతమందికి తెలుసు. కొందరు జిల్లా అధికారులైతే రెండు నెలల జీతం కూడా ఐటి రిటర్న్స్ సమయంలో సమర్పించాల్సి వుంటుంది.

ఇంత చేసినా, ఏడాదికి నెల, రెండు నెలల జీతం కోల్పుతున్నా, సమయానికి ఇంక్రిమెంట్లు గానీ, పదోన్నతులు గానీ రాకపోయినా.. ఖచ్చితంగా ఆదివారాలు, రెండం శనివారాలు, ఇతర ప్రత్యేక శెలవు రోజుల్లోకూడా పనిచేయాల్సిందే. మేము ఇవ్వాల్సినవి చట్టపరంగా ఇవ్వడం కుదరదు కానీ.. మేము చెప్పినట్టుగా సెలవుల్లో పనులు చేయకపోతే మాత్రం కఠిన చర్యలు తప్పవని మాత్రం ఆదేశాలిస్తున్నది రాష్ట్రప్రభుత్వం.(ఇక్కడ మహిళా ఉద్యోగుల ప్రధనా సమస్యలపై రాయకూడని విషయాన్ని ప్రస్తావించలేకపోతున్నాం.. కానీ కొందరు మహిళా ఉద్యోగులు మాత్రం బహిరంగంగానే ప్రభుత్వ తీరుని చాలా దారుణంగా ఎండగడుతున్నారు. ఈ విధానం మంచిది కాదని మండి పడుతున్నారు)        

visakhapatnam

2025-06-13 14:12:32

కూటమి ప్రభుత్వంలోనూ వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలకు ఏడాది..!

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను పట్టించుకోలేదనుకుంటే.. నేడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలు ఏడాది కాలంలో పట్టించుకున్న దాఖలాలు అయితే కపించడం లేదు. జర్నలిస్టులు ఏం పాపం చేశారనో వారికి గత ప్రభుత్వమూ.. ఈ ప్రభుత్వమూ కనీసం ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయడానికి ముందుకి రాలేదు. కానీ ప్రభుత్వాలకు ప్రచారం కల్పించడానికి, రాజకీపార్టీల నిరసనలు తెలియజేయడానికి మాత్రం మీడియా కావాలి. అదే మీడియాని అధికారంలోకి వచ్చిన తరువాత వారి కోసం కనీసం పట్టించుకోరు. ప్రతిపక్షంలో ఉన్నంత కాలం తాము అధికారంలో వస్తే ఇక చూడండి అన్నపార్టీలన్నీ తీరా అధికారంలోకి వచ్చిన తరువాత.. ఆ ఒక్కటీ అడక్కు అన్నట్టుగానే వ్యవహరిస్తున్నాయి. గత ప్రభుత్వం జీఓ నెంబరు-38ని తీసుకొచ్చి స్థానిక పత్రికలను పాతాళానికి తొక్కేసి సొంత మీడియాకి వందల కోట్ల రూపాయలు ప్రకటనలు ఇచ్చుకుంటే.. ఇపుడు కూటమి ప్రభుత్వం కూడా అందుకు తీసీపోదునా అన్నట్టుగానే వ్యవహరిస్తున్నది. 

కాకపోతే గుడ్డిలో మెల్ల ఏంటంటే ఈసారి కూటమి ప్రభుత్వంలో స్థానిక పత్రికలకు అదీ ఎంపానల్ మెంటు ఉన్న పత్రికలకు మాత్రమే కొద్దో గొప్పో ప్రకటనలు ఇస్తున్నది. మళ్లీ ఎంపానల్ మెంట్ లేని పత్రికలను పూర్తిగా పక్కన పెట్టేసింది.  ఈ పరిస్థితి గత ప్రభుత్వంలో అస్సలు లేనే లేదు. ఒక దశలో జర్నలిస్టులు అనే వారిని  లేకుండా చేయాలని కూడా ప్రయత్నించింది. కనీసం వారికి ప్రభుత్వం ద్వారా ఇచ్చే గుర్తింపు కార్డు ప్రెస్ అక్రిడిటేషన్ కూడా రాకుండా చూడాలని శక్తివంచన లేకుండా కృషి చేసి సదరు ప్రభుత్వంలో తీసుకొచ్చిన జీఓలను పక్కాగా అమలు చేసింది. ఇపుడు ఆ జీఓలకు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వంలోనైనా జర్నలిస్టులకు, స్థానిక పత్రికలకు అనుకూలంగా కొత్త జీఓలు వస్తాయనుకుంటే వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఆది నుంచి టిడిపి ప్రభుత్వం మీడియామీద, పత్రికల మీద అంత కక్ష, కోపం అయితే పెట్టుకోలేదు. ఆ నమ్మకమే ఇంకా జర్నలిస్టుల్లో వుంది. కాని మీడియా అంటే పెద్ద పత్రికలు, శాటిలైట్ టీవీ ఛానళ్లే కాదు. స్థానికంగా ఉండే పత్రికలను కూడా పత్రికలుగా గుర్తించాలి. 

ఇక్కడ కనీసం కొలమానం దినపత్రికలను అచ్చువేసే విధానం సరిగ్గా జరుగుతుందా లేదా..? కేంద్ర, రాష్ట్రప్రభుత్వ నిబంధనల మేరకు రికార్డులు మెయింటేన్ చేస్తున్నారా..? పత్రికలు ప్రజల్లోకి వెళుతున్నాయా లేదా అనే విషయాలను ఖచ్చితంగా గుర్తించి నిబంధనలు పాటించే పత్రికలు చిన్నగా ప్రభుత్వ ప్రకటనల చేయూత అందిస్తే పత్రికల మనుగడ, జర్నలిస్టుల బ్రతుకు తెరువుకి కాస్త ఊపిరి వస్తుంది. కానీ ప్రభుత్వాలు మాత్రం ఈ విషయంలో కఠినంగానే వ్యవహరిస్తున్నాయి. 75ఏళ్ల స్వాతంత్ర్య భారత దేశంలో కేంద్రప్రభుత్వాలు మేలు చేస్తే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం రాయితీపై ఇచ్చిన రైల్వే పాసులును తొలగించింది. జర్నలిస్టులు ఒకటి అరా చేసే ప్రయాణాలకు రైల్వేకి అంతేమీ లాసు, నష్టం రాదు. కానీ ప్రజలకోసం, ప్రభుత్వ పథకాలకోసం, రాజకీయపార్టీల కోసం పనిచేసే జర్నలిస్టులకు రాయితీ రైల్వే పాసు ఎందుకు అనుకుందో ఏమో దానిని 2019లోనే తొలగించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకున్న నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్థానిక దినపత్రికలకు ప్రెస్ అక్రిడిటేషన్లు పొందకుండా దేశంలో ఎక్కడా లేని నిబంధనలు తీసుకొచ్చి.. అక్రిడిటేషన్లు పదుల సంఖ్య నుంచి నాలుగైదుకి కుదించేసింది. 

గతంలో మండల విలేఖరికి అక్రిడిటేషన్ ఉండేది. ఆ విధానాన్ని తొలగించి నియోజకవర్గ కేంద్రానికి ఒక అక్రిడిటేషన్ విధాన్నాన్ని తెరమీదకు తీసుకువచ్చారు. ఆ దెబ్బతో చాలా మంది కనీసం గుర్తింపు లేని మీడియా రంగంలో ఎందుకులే అని ఇక్కడి పూర్తిగా బయటకు వెళ్లిపోయారు. కనీసం జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ లు, 60ఏళ్లు దాటితే కనీసం పెన్షన్ వంటి చేయూతనిచ్చే స్కీములు కూడా లేవు. ప్రస్తుతం జర్నలిస్టులకు ప్రభుత్వ హెల్త్ కార్డులు ఉన్నా అదే ప్రభుత్వం నెట్వర్క్ ఆసుపత్రలుకు బిల్లులు చెల్లించకపోవడంతో అక్కడ సదరు కార్డులపై వైద్యం కూడా చేయడంలేదు. అటు జర్నలిస్టులపై దాడులను నియంత్రించడానికి గతంలో ఉండే అటాక్స్ కమిటీలు కూడా లేవు. జర్నలిస్టుల ప్రధాన సమస్యలపై జర్నలిస్టు సంఘాలను పోరాటాలు చేయమంటే..ఆయా పార్టీలకు అనుకూలంగా కేవలం ప్రచారాల కోసం మాత్రమే కార్యక్రమాలు చేస్తున్నాయి జర్నలిస్టు సంఘాలు. 

ప్రజల సమస్యలను ప్రభుత్వ కార్యక్రమాలను ఎప్పటి కప్పుడు అన్నివర్గాలకు అందించే జర్నలిస్టులు,మీడియా.. ఇపుడు వారి సమస్యలను కూడా వార్తలుగా రాసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రతిపక్షంలో ఉండగా ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అధికారంలోకి వచ్చిన తరువాత జర్నలిస్టులకోసం అమలు చేయకపోవడంతో ఇపుడు కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న సందర్భంగా పరిష్కారం కాని సమస్యలపై వార్తలు రాయాల్సి వస్తున్నది. ప్రజల్లోప్రజలుగా.. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉన్న జర్నరలిస్టుల సమస్యలు కూడా ప్రభుత్వం.. అందునా కూటమి ప్రభుత్వం పట్టించుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 65వేల మంది జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం ప్రభుత్వానికి పెద్ద కష్టమేమీ కాదు. లేదంటే వచ్చే ఏడాది కూడా ఈ సమాయానికి జర్నలిస్టుల సమస్యలకు రెండేళ్లు అని వార్త రాసుకోవడం తప్పా వర్కింగ్ జర్నలిస్టులు ఏమీ చేసుకోలేని స్థితి నేటి జర్నలిస్టులది..?!

visakhapatnam

2025-06-04 20:13:20