ఆంధ్రప్రదేశ్ లో గ్రామ స్వరాజ్యం అంటే ఏంటో త్వరలోనే కార్యరూపంలోకి వచ్చి కనిపించనుంది.. ఒక కొత్త ప్రభుత్వశాఖను తలా తోకాలేకుండా ఏర్పాటు చేసి ఉద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడిన గత ప్రభుత్వ విధానాలు, పరిపాలనపై కూటమి ప్రభుత్వం నిశితంగా పరిశీలన మొదలు పెట్టింది. ఒక ప్రభుత్వశాఖను ఏర్పాటుచేసిన గత ప్రభుత్వం ఉద్యోగులను అదిరించి, బెదిరించి, ఒక శాఖ ఉద్యోగితో ఖాళీగా ఉన్న అన్నిశాఖల పనులూ చేయించి ఉద్యోగులందరినీ ఉసూరు మనిపించింది. ఇంత చేసినా వారికి న్యాయం చేసిందా అంటే.. అన్యాయం చేసి..రావాల్సిన ప్రభుత్వ ప్రయోజనాలన్నింటికీ కోత విధించి ఉద్యోగులు వారంత వారే చేస్తున్న జాబులకు రిజైన్ చేసేలా వ్యవహరించింది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని 13,313 గ్రామ పంచాయతీల పరిధిలోని 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.25 లక్షల మంది ఉద్యోగాలకు దిశ, దశ లేకుండా చేసింది. తమ ప్రభుత్వ హాయంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వశాఖలో ఏమైనా..ఎపుడైనా..ఎలాగైనా చేసుకోవచ్చుననే ధోరణిని ప్రదర్శించి ఉద్యోగుల జీవితాలతో ఆటాటడుకుందంటే అతిశయోక్తి కాదేమో. అలాంటి తేడా విధానాలను ఉద్యోగులు, వారి కుటుంబాలుతో 2024 ఎన్నికల్లో ఓటుతో సమాధానం చెప్పారు అన్ని ప్రభుత్వశాఖ ఉద్యోగులతోపాటు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా. దానిని గుర్తించిన కూటమి ప్రభుత్వం సచివాలయ వ్యవస్థలో మార్పు తీసుకువచ్చి అసలైన ప్రభుత్వ సేవలు ఇంటిముంగిటే ఏ విధంగావచ్చుననే దానిపై లోతుగా పరిశీలన చేయడం ప్రారంభించింది.
దానికి ఈరోజు-ఈఎన్ఎస్ ప్రత్యేక కథనాలు కూడా తోడయ్యాయి. సచివాలయ వ్యవస్థలో జరుగుతున్న తంతును ఎప్పటి కప్పుడు ఈఎన్ఎస్-ఈరోజు ఇటు ప్రజలు, అటు ప్రభుత్వం ముందు ఉంచడంలో ప్రత్యేక పాత్రపోషించింది. ఆ మాటకొస్తే ఈ శాఖ ఏర్పాటైన దగ్గర నుంచి ఏ మీడియా బయటపెట్టని విషయాలన్నీ ఈఎన్ఎస్ మీడియా ప్రజలముందుంచింది. అయితే గత ప్రభుత్వంలోనూ కొన్ని చర్యలు తీసుకున్నా..ప్రధాన అంశాలను మాత్రం అలాగే పక్కన పెట్టేశారు. ప్రతిపక్షంలో ఉండగా సచివాలయ ఉద్యోగుల సమస్యలపై గొంతెత్తిన టిడిపి, జనసేన, బీజేపి లు ఇపుడు అధికారంలోకి వచ్చిన తరువాత వారి సమస్యలపు పరిష్కించేందుకు ప్రత్యేకంగా కార్యాచరణతో ముందుకి సాగుతున్నారు. అందులో ఇపుడు డిప్యూటీ సీఎం పవన్, కళ్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనితలు అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. వారి చర్యలకు సీఎం చంద్రబాబు తోడవటంతో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో మార్పు తధ్యమనే వాదన బలంగా వినిపిస్తోంది. అంతేకాదు గత ప్రభుత్వం కావాలని చేసిన తప్పులను, దారుణాలను పూర్తిగా పరిశీలించి ఈశాఖను పూర్తిస్థాయిలో గాడిలో పెట్టడానికి ముఖ్య మంత్రి చంద్రబాబు నేతృత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనితలు ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నారు. ఇప్పటికే ఈ శాఖకోసం మీడియా ముందు ప్రస్తావించారు కూడా.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, ఈ ప్రభుత్వశాఖలోని లోపాలు, సమస్యలు, ఉద్యోగుల ఇబ్బందులను ఒక్కసారి క్రమ సంఖ్యలో గత ప్రభుత్వం కావాలని చేసిన తప్పులను, ఉద్యోగులను ఇబ్బంది పెట్టే చర్యలు ఏంటనేవి క్రమ సంఖ్యలో ఒక్కసారి తెలుసుకుంటే...
1)గ్రామ, వార్డు సచివాలయ శాఖను ఏర్పాటు చేసి, కేబినెట్ లో ఆమోదించి కూడా అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించకపోవడం
2)రెండేళ్లుకు సర్వీసు ప్రొబేషన్ చేయాల్సి ఉండగా అదనంగా మరో 9నెలలు అదే రూ.15వేలకు పనిచేయించడం, ఆ కాలానికి పేస్కేవు వర్తింపచేయకపోవడం
3)సుమారు 19శాఖల్లో పది శాఖలకు పైగా ఉద్యోగులకు నేటికీ సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయకపోవడం
4)మహిళాపోలీసులకు హోంశాఖ విధులకు సంబంధం లేదని హైకోర్టుకి అఫడవిట్ ఇచ్చేసి వారికి నేటికీ ప్రభుత్వశాఖను కేటాయించకపోవడం
5)పీఆర్సీ బెనిఫిట్స్, ఫుల్ పేస్కేలు సచివాలయ ఉద్యోగులందరికీ ఇవ్వాల్సి వస్తుందని ప్రొబేషన్ కి రెండు నెలల ముందు హెచ్ఆర్ఏ, డిఏలను కుదించడం
6)రెండేళ్లు సర్వీసు ప్రొబేషన్ పూర్తిచేసుకొని రెగ్యులర్ అయిన ఉద్యోగులకి ఇవ్వాల్సిన రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా రెండేళ్లు కాలం గడిపేయడం
7)సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు వర్తించకుండా కేటగిరీ ఏర్పాటు చేయకపోవడం, డిపార్ట్ మెంటల్ టెస్టులకి సిబంధించి స్పష్టత ఇవ్వకపోవడం
8)కోవిడ్ సమయంలో విధినిర్వహణలో మృతిచెందిన సచివాలయ ఉద్యోగుల కుటుంబాలకు నేటికీ ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం
9)ఎనర్జీ అసిస్టెంట్లకు విధినిర్వహణలో అంగవైక్యలం అయినవారికి, మృతిచెందిన వారికి నేటికీ నష్టపరిహారం చెల్లింకపోవడంచ, ఉద్యోగ ఇవ్వకపోవడం
10)ఏఎన్ఎంలకు జిఎన్ఎం ఇన్ సర్వీసు శిక్షణ ఇచ్చి అదే ఏఎన్ఎంలుగా విధులు నిర్వహించేలా చేయడం, వారికి పేస్కేలు వర్తింపజేయకపోవడం
11) ప్రభుత్వ సంక్షేమ పథకాలకు డేటా సమకూర్చే ఎడ్యుకేషన్, అండ్ వెల్పేర్ అసిస్టెంట్లకు నేటికీ సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయకపోవడం
12)ఒక్క ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టు భర్తీచేసి తో అన్శి సుమారు 7 విభాగాల ఇంజనీరింగ్ పనులకు, విధులకు వీరినే అదనంగా వినియోగించేయడం
13)గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు ఖాళీగా ఉన్న పంచాయతీలను కేటాయించకపోవడం, వారికి డ్రాయింగ్ పవర్ వర్తింపచేయకపోవడం
14)కంప్యూటర్ ఎఫిషియన్సీ టెస్టు పాసైతే తప్పా సర్వీసులు రెగ్యులర్ చేసేది లేదంటూ వీఆర్వోలను చాలా కాలం పక్కనపెట్టేయడం
15)గ్రామ, వార్డు సచివాలయశాఖలో మిగిలిపోయిన ఖాళీలను భర్తీచేయకుండా వదిలేసి, ఉన్నవారితో అదనంగా పనిచేయించడం
16)సచివాలయ ఉద్యోగులకు కేటగిరీని ఏర్పాటు చేయకపోవడం..దానితో వీరు అటెండర్లకు ఎక్కువ జూనియర్ అసిస్టెంట్ కి తక్కువగా మిగిలిపోయారు
17)ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేసిన సచివాలయ ఉద్యోగులకు నియామకాల సమయంలో కలిపిన గ్రేస్ మార్కుల మెరిట్ కావాలనే కలపకపోవడం
18)రెండు మూడుశాఖ సిబ్బందికి పదోన్నతులు కల్పించి మిగిలిన శాఖల సిబ్బందిని అమలు చేయని సర్వీసు రూల్స్ అడ్డుపెట్టి ప్రమోషన్ కల్పించకపోవడం
19)ఐదేళ్లుగా అదనంగా బిఎల్వో విధులు సొంత ఖర్చులతో స్టేషనరీలు కొనుగోలుచేసి మరీ పనిచేసినా..నేటికీ వారికి ఇవ్వాల్సిన అదనపు వేతనం ఇవ్వకపోవడం
20)నేటికీ సచివాలయాలు, పంచాయతీల్లో పాడైన కంప్యూటర్లు, ప్రింటర్లు, స్టేషరీ బిల్లులు చెల్లించకపోవడం, స్టేషనరీ సరఫరా చేయకపోవడం
21)సిబ్బంది విధులకు కూడా అన్నిశాఖల సిబ్బందిని సొంత ఖర్చులతో స్టేషనరీని కొనుగోలు చేసుకోమని ఆదేశాలు జారీచేయడం, వాటి బిల్లులు ఇవ్వకపోవడం
22) గ్రామీణ మత్స్య సహాయకులకు ఉద్యోగాల్లోకి చేరనపుడు కలుపుతామన్న గ్రేస్ మార్కులను నేటికీ కలపకోవడం వలన ప్రమోషన సీనియార్టీ కోల్పోవడం
23)భూముల రీ-సర్వే సమయంలో సర్వేయర్లను దూర ప్రాంతాలకు వారి సొంత ఖర్చులతోనే తిప్పి వారికి టిఏ, డిఏలు చెల్లించకపోవడం.
ఈ లోపాలతో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. ప్రజలకు నేటికీ ఇక్కడ అందే సేవలేంటో తెలియదంటే పరిస్థితి ఏవిధంగా అర్ధం చేసుకోవచ్చు. అధికారంలోకి రాగానే ప్రజలకు అత్యంత దగ్గరగా వున్న ఈశాఖను పూర్తిస్థాయిలో చక్కదిద్దితే ప్రజలకు ఇంటిముంగిట ప్రభుత్వసేవలు, పథకాలు అందుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. దానిని ఏవిధంగా గాడిలో పెట్టాలి, ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకు ఏవిధంగా న్యాయం చేయాలని లోతుగా సమాలోచనలు చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే క్యాబినెట్ సమావేశం నాటికి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ లోపాలు మంత్రిమండలి దృష్టికి వెళ్లే అవకాశం వుంది. అంతేకాకుండా ఈశాఖకు చట్టబద్దత, మహిళా పోలీసులకు శాఖ కేటాయింపు లేకుండా వదిలేసిన అంశాలపైనా ఒక స్పష్టత వచ్చే అవకాశం వుంది. ఈ విషయాన్ని ఇప్పటికే హోం మంత్రి వంగలపూడి అని పోలీసుశాఖ రివ్యూలోనే చాలా విషయాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిపక్షంలో ఉండగా సచివాలయవ్యవస్థలో లోపాలపై గట్టిగా తన వాణి వినిపించిన ఆమె ఇపుడు హోంశాఖ మంత్రిగా రావడం, పోలీసుశాఖ ప్రక్షాళనకు పూనుకోవడంతో ఫలితాలు వేగంగా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పైన పేర్కొన్న అంశాలను ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే అది ఎప్పుడుజరుగుతుందనే విషయంలో మాత్రం ప్రభుత్వం నుంచి మాత్రమే జవాబు రావాల్సి వుంది. కూటమి ప్రభుత్వంపై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు మాత్రం గంపెడు ఆశలు పెట్టుకున్నారు తమ సమస్యలకు పరిష్కార మార్గం లభిస్తుందని.