1 ENS Live Breaking News

గ్రామ, వార్డు సచివాలయాలు మిన్న..వచ్చే ఆదాయం సున్నా..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేవశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రజలకు అంతంత మాత్రంగానే సేవలు అందుతున్నాయి. ఫలితంగా రోజూ అత్యంత పెద్ద మొత్తంలో ప్రభుత్వం ఆదాయం కోల్పోతున్నది.  గ్రామాల్లో 12 శాఖలు, పట్టణాల్లో 16 శాఖల సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో 14వేల 5 సచివాలయాల్లో సుమారు లక్షా 35వేల మంది ఉద్యోగులున్నా.. ప్రభుత్వ ఖజానికి ఆదాయం మాత్రం తక్కువగానే వస్తున్నది. సచివాలయాల ఆదాయాన్ని ఆది నుంచి మీ-సేవా కేంద్రాలు గండి కొట్టేస్తున్నాయి. ముఖ్యంగా రెవిన్యూ ఆధారిత సర్వీసులకు ప్రజలు ఎక్కువగా ఈ కేంద్రాలనే సంప్రదిస్తున్నారు. దీనితో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం, పేరూ పోతున్నాయి. సచివాలయాల్లో ప్రభుత్వం 545 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి చెందిన సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్రప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన సేవలు బాగానే అందుతున్నా మిగతా సేవలు అందించడంలో వెనుకబాటుగానే ఉన్నాయని చెప్పాలి. వాస్తవానికి ఏ ప్రభుత్వ కార్యాలయంలోనూ లేనంతగా గ్రామ, వార్డు సచివాయాల్లో ఇంటిముంగిటే ప్రభుత్వశాఖల సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ఇక్కడ అందే సేవలపై ప్రజలకు అవగాహన లేకుండా పోతున్నది. ఈ విషయమై మండల స్థాయిలో ఎంపీడీఓలు, డివిజన్ స్థాయిలో డిఎల్డీఓలు, జిల్లా స్థాయిలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు కూడా పూర్తిస్థాయిలో దృష్టిసారించిన పాపన పోలేదు. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన పనులు, ఆదాయం రాని పనులను అత్యధికంగా సచివాలయ సిబ్బందికి అప్పగిస్తున్న ప్రభుత్వం ఆదాయం వచ్చే పనులను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయాల్లో అందుబాటులో ఉన్న సేవలన్నింటిపైనా గ్రామాల్లోనూ, పట్టణాల్లో వార్డుల్లోనూ ప్రత్యేక అవగాహన కల్పిస్తే రోజుగకి సగటున ఒక్కో సచివాలయానికి రూ.5 వేల నుంచి 10వేల రూపాయల వరకూ ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఆదిశగా చర్యలు తీసుకోవడం లేదు.

సాంకేతిక ఇబ్బందులు మోకాలడ్డు..
గ్రామ, వార్డు సచివాయాల్లో 19శాఖల సిబ్బంది అందుబాటులో ఉన్నా ఒక్కో సచివాలయానికి కేవలం రెండు మాత్రమే కంప్యూటర్లు ఉండటం, అందులో ఒకటి రెగ్యులర్ గా డిజిటల్ అసిస్టెంటే వినియోగించడం, మరొకటి సెక్రటరీ లేదా వెల్ఫేర్ అసిస్టెంట్లు వినియోగిస్తుండటంతో ఇతర ప్రభుత్వ సేవలు అందించడానికి కంప్యూటర్లు లేకుండా పోతున్నాయి. ఇపుడు ఏ దృవీకరణ కావాలన్నా ఆన్ లైన్ లోనే వివరాలు నమోదు చేయాల్సి ఉండటం, దానికి కంప్యూటర్లు లేకపోవడం వలన క్రమ సంఖ్యలో ఉన్న డిజిటల్ అసిస్టెంట్లే ఒక రోజుకి ఎన్ని చేయగలరో అన్నే చేస్తున్నారు. దానికితోడూ ఆధార్ కేంద్రాలు కూడా సచివాలయాలకే ఇవ్వడంతో అధిక ఆదాయం వచ్చే ప్రధాన సేవలు అందించే వీలు లేకుండా పోతున్నది. గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని సచివాలయాల్లో ఒక్కో కంప్యూటర్ ఉన్నచోట మరీ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గత్యంతరం లేనివారంతా చచ్చినట్టు మీ-సేవా కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. అందులోనూ సచివాయాల్లో తీసుకునే ధరకంటే మీ సేవా కేంద్రాల్లో రెండింతలు అధికంగా ఉండటంతో ప్రజలకు ఆర్ఢిక ఇబ్బందులు కూడా తప్పడం లేదు. ఒక్కోసారి రెవిన్యూ ఆధారిత దృవీకరణ పత్రాలకు ఆమ్యామ్యాలు కూడా చెల్లించుకోవాల్సి వస్తున్నది.

రికార్డులకే పరిమితం అవుతున్న మిగులు సిబ్బంది..
సచివాలయాల్లో సరిపడినన్ని కంప్యూటర్లు లేకపోవడం, ఉన్నచోట స్టేషనరీలు సక్రమంగా లేకపోవడం, అన్నీ ఉన్నచోట సిబ్బంది లేకపోవడం తదితర కారణాల వలన ప్రధాన సేవలు గ్రామ స్థాయిలో అందకుండా పోతున్నాయి. గతంలో కంటే మిన్నగా సచివాలయాల్లో సేవలు అందుతున్నా..ఆదాయం మాత్రం రావడం లేదు. ప్రభుత్వానికి ఆదాయం కూడా సచివాలయాల ద్వారా వస్తే మరిన్ని సేవలు ప్రజల ముందుకి తీసుకురావడానికి వీలుపడుతుంది. సాంకేతి పరమైన ఇబ్బందులున్న చోట మిగిలిన సిబ్బంది రికార్డుల పనికే పరిమితం కావాల్సి వస్తున్నది. వాస్తవాని ఈ విషయాలన్నీ జిల్లా స్థాయిలో కలెక్టర్లు, మండలస్థాయి అధికారులకు తెలిసినప్పటికీ ప్రభుత్వం దృష్టికి అసలు విషయాన్ని తీసుకెళ్డం లేదు. దీనితో ప్రభుత్వం అందించాలనుకున్న సేవలు ప్రజలకు చేరడం లేదు. అటు ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరడం లేదు.

సచివాలయాలను వేధిస్తున్న సిబ్బంది కొరత
రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది కొరత వేధిస్తున్నది. ప్రభుత్వలు అందించడానికే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డిజిటల్ అసిస్టెంట్ పోస్టులు చాలా చోట్ల ఖాళీగా ఉండిపోయాయి. ప్రభుత్వం కొన్ని చోట్ల కారుణ్య నియామకాల ద్వారా ఖాళీలు భర్తీచేసినప్పటికీ అత్యంత అవసరం ఉన్న డిజిటల్ అసిస్టెంట్, పంచాయతీ సెక్రటరీ లాంటి పోస్టులు భర్తీ కావడంలేదు. దీనితో ఉన్న సిబ్బందే పక్క సచివాయాలకు వెళ్లి అత్యవసర సేవలు ఏ విధంగా ఆన్ లైన్ ద్వారా చేయాలో తెలుసుకొని వాటిని చేస్తున్నారు. చాలా మంది పంచాయతీ కార్యదర్శిలకు ఒక్కొక్కరికి రెండు మూడు పంచాయతీలు ఇన్చార్జిలు అప్పగించడంతో ప్రధాన అవసరాలు గ్రామపరిధిలో తీరడం లేదు. అలాగని కొన్నిచోట్ల సిబ్బంది ఉన్నా పనులు జరగడం లేదు. దీనింతటికీ పర్యవేక్షణ లోపమే ప్రధానంగా కనిపిస్తున్నది. జిల్లా స్థాయిలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డివిజన్ స్థాయిలో డిఎల్డీఓలు, మండల స్థాయిలో ఎంపీడిఓలు పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తే ఉన్న కొద్దిపాటి సిబ్బందితోనైనా పూర్తిస్థాయిలో సవలు అందించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్ని కూడా పెంచే ఏర్పాటు చేయవచ్చు. కానీ ఆదిశగా ఎక్కడా చర్యలు తీసుకుంటన్న దాఖలాలు కనిపించడం లేదు. దానికితోడు సిబ్బందికి ఎన్నికల విధులు అదనంగా వచ్చి చేరడం కూడా సేవల విధులకు ఆటంకం ఏర్పడుతుంది. ఈ మొత్తం వ్యవహారం రాష్ట్ర అధికారులు దృష్టి సారిస్తే తప్పా పరిపాలన, తద్వారా సేవలు.. ఆపై ప్రభుత్వానికి ఆదాయం సమకూరే అవకాశం లేదు..!

Visakhapatnam

2023-11-28 17:40:04

ఆ శాఖలకే పదోన్నతుల యోగ(శాప)ం..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని గ్రామ, వార్డు సచివాలయశాఖలో కొందరు ఉద్యోగులకు పదోన్నతుల యోగం వరిస్తే..మరికొందరిని పదోన్నతి వ్యవస్థలేని శాపం వెంటాడుతోంది. ఏంటి ఈ వింత అనుకుంటున్నారా..అవును మీరు చదువున్నది అక్షర సత్యం. భారతదేశంలోనే ఆంధ్రపదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయశాఖలోని కొన్ని లోపాలను సరిచేయకపోవడం వలన ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. మరికొందరు ఉద్యోగులు అమితానందం చెందిన పరిస్థితీ నెలకొంది. సచివాలయ శాఖలో మొత్తం 19 ప్రభుత్వ శాఖల ఉద్యోగులు పనిచేస్తుంటే..అత్యధికంగా వైద్యఆరోగ్యశాఖలో పనిచేసే ఏఎన్ఎం లకు ఇన్ సర్వీసు క్రింద స్టాఫ్ నర్స్ ట్రైనింగ్ ఇచ్చారు. ఇక హార్టికల్చర్, పశుసంవర్ధకశాఖ సహాయకులకు పదోన్నతులు ఇచ్చారు. అయితే సచివాలయశాఖలో రెండేళ్లు సర్వీసు ప్రొబేషన్ పూర్తిచేసుకున్న రెగ్యులర్ ఉద్యోగులందరికీ ఈశాఖలో సర్వీసు నిబంధనలు, పదోన్నతుల వ్యవస్థలను ఏర్పాటు చేయలేదు. ఆ కోవలోకే ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వస్తున్నారు. ఇక మహిళాపోలీసులకు సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఉన్నప్పటికీ వీరి వ్యవహారం కోర్టులో ఉన్నందున వీరికి కూడా పదోన్నతులు వరించలేదు.  అంతేకాదు వీరి ఉద్యోగాలు ఇపుడు ఉంటాయా..వేరే ప్రభుత్వ శాఖలో విలీనం అవుతాయోకూడా తెలియని పరిస్థితి నెలకొంది. అటు వ్యవసాయశాఖ, ఉద్యానవన శాఖ ఉద్యోగులకు ఇన్ సర్వీసు వ్యవస్థ ఏర్పాటు చేస్తారో లేదో తెలియకపోయినా..వీరికి పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కావడంతో వీరంతా ఆనందంగా ఉన్నారు.

 రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వో ఖాళీలు చాలా ఉండటంతో ఆ ఖాళీలను విఆర్ఏలుగా పనిచేస్తున్నవారికి పదోన్నతి కల్పించి విఆర్ఏలుగా మార్చింది. ఇక పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్నవారిలో గ్రేడ్-6 పంచాయతీ కార్యదర్శిలు అనగా ప్రస్తుతం డిజిటల్ అసిస్టెంట్లు, తరువాత ప్రస్తుత గ్రేడ్ గ్రేడ్-5 పంచాయతీకార్యదర్శిలు, సర్వేయర్లు, వీఆర్వోలు, నగర పరిధిలో వార్డు సెక్రటరీలు, శానిటేషన్ అసిస్టెంట్లు, మహిళా పోలీసులు, సెరీ కల్చర్ అసిస్టెంట్లు ఉన్నారు. వీరంతా తమ పదోన్నతుల మాట ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం రెండు మూడుశాఖల ఉద్యోగులకే పదోన్నతులు కల్పించడం ద్వారా తమకు ఎప్పుడు పదోన్నతులు ఇస్తారని అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. వ్యవసాయశాఖ, ఉద్యానవన శాఖ, పట్టుపరిశ్రమశాఖ, పశుసంవర్ధకశాఖ ఉద్యోగులు కనీసం ఇన్ సర్వీస్ ఛానల్ ఏర్పాటు చేస్తే దానితోనైనా పొందడానికి ఆస్కారం వుంటుందని వాపోతున్నారు. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయశాఖలో ఒక్క ఏఎన్ఎంలకు మాత్రమే ఇన్ సర్వీసులో స్టాఫ్ నర్స్ ట్రైనింగ్ ఇచ్చి మళ్లీ వారి విధులను సచివాలయాల పరిధిలోనే పనిచేసే విధంగా వెనక్కి పంపారు. రానున్న రోజుల్లో వీరికి పదోన్నతులు వస్తే వీరు పీహెచ్సీల్లోని స్టాఫ్ నర్సులుగా వెళ్లే అవకాశాలుంటాయని, వీరి స్థానంలో కొత్త ఏఎన్ఎంల భర్తీ జరగవచ్చునని చెబుతున్నారు. 

ప్రస్తుతం 22460 పేస్కేలు తీసుకునే సచివాలయ ఉద్యోగులకు పదోన్నతి లభించిన తరువాత ఏకంగా రూ.34 వేలు దాటి పేస్కేలు తీసుంటున్నారు. దీనితో పదోన్నతులు రాని ఉద్యోగులంతా తామంతా సచివాలయ శాఖలో శాపగ్రస్తులం అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు పదోన్నతుల వ్యవస్థకే నోచుకోని డిజిటల్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ల బాధలైతే వర్ణణాతీతంగా ఉన్నాయి. కనీసం కొన్ని శాఖలకు ప్రమోషనల్ ఛానల్ ఏర్పాటు చేశారు..మేము దానికి కూడా నోచుకోకుండా అన్ని రకాల ఇంజనీరింగ్ పనులనూ చేయాల్సి వస్తుందని కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎన్నో వేల రూపాయల జీతాలు వచ్చే ప్రైవేటు ఉద్యోగాలను వదులుకొని ఈ శాఖలోకి రెగ్యులర్ ఉద్యోగమనే ఆశతో వచ్చిన మాకు తీవ్ర నిరాస మిగిలిందని వాపోతున్నారు. ఇప్పటికే రెండేళ్లలో రెగ్యులర్ కావాల్సిన తమ సర్వీసులు అదనంగా 9 నెలలు పనిచేసినపుడు అపుడు పేస్కేలు, సుమారు రెండు డిఏలు కోల్పోయామని, పీఆర్సీ వర్తించినట్టు పేస్కేలు పెంచినా..అందరు రెగ్యులర్ ఉద్యోగులు మాదిరిగా తమకు పేస్కేలు అరియర్స్ కూడా అందుకోలేకపోయామని చెబుతున్నారు. అసలు పీఆర్సీ అరియర్స్ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనా రాకపోవడం తమను తీవ్ర నిరాశకు గురిచేసిందని వాపోతున్నారు.

 గ్రామ, వార్డు సచివాలయశాఖలో చేరిన దగ్గర నుంచి ఇప్పటి వరకూ ఒక్కో ఉద్యోగి సుమారు రూ.2.50లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ ప్రయోజనాలు కోల్పోయామని, ఇపుడు పదోన్నతుల విషయంలో కూడా తీవ్ర అన్యాయం జరుగుతోందని అంటున్నారు. మొత్తం 19శాఖల ఉద్యోగుల్లో రెండు శాఖల ఉద్యోగులకు పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కాగా, ఒక శాఖ ఉద్యోగులకు ఇన్ సర్వీస్ వ్యవస్థ ప్రారంభమై వారి శిక్షణ కూడా పూర్తిచేసుకున్నారు. మిగిలిన శాఖల్లో కూడా అవకాశం ఉన్నమేర ఇన్ సర్వీస్, ప్రమోషన్ ఛానల్ వర్తిపంజేస్తే ఇతర శాఖల ఉద్యోగులకు కూడా ప్రయోజనం చేకూరే అవకాశం వుంది. లేదంటే అంతర్ జిల్లాల బదిలీల్లో జిల్లాలు మారిన వారికి, అసలు పదోన్నతుల ప్రక్రియే ప్రారంభం కాని శాఖల ఉద్యోగులకు తీవ్ర నష్టం జరిగే అవకాశం వుంది. ఈ విషయంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి..!

Visakhapatnam

2023-11-25 07:23:20

చంద్రబాబు ఆరోగ్యం కోసం తిరుమల శ్రీవారికి ఆడారి కిషోర్ పూజలు

చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని..జైలు నుంచి తిరిగి వస్తే తిరుమల వస్తానన్న మొక్కును టిడిపి యువనేత ఆడారి కిషోర్ కుమార్ శ్రీవారికి పూజలు చేసి తీర్చుకున్నారు. ఈ మేరకు ఆదివారం కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు ఒక విజన్ ఉన్న జాతీయ నాయకుడని..ఆయన బయట ఉంటే 2024ఎన్నికల్లో ఎక్కడ వైఎస్సార్సీపి ఓడిపోతుందోనని భయపడి అక్రమ కేసులు పెట్టి జైల్లోకి నెట్టిందని ఆడారి ఆరోపించారు. వైఎస్సార్సీపి కక్షరాజకీయాన్ని ప్రజల అంతా నిసితంగా గమనిస్తున్నారని, త్వరలనే సీఎంజగన్ ఊహించని రిటన్ గిఫ్ట్ తీసుకుంటారని అన్నారు. చంద్రబాబు ఆరోగ్యంగాలని ఆ శ్రీనివాసుడుని బలంగా కోరుకున్నానని అన్నారు. చంద్రబాబుకోసం శ్రీవారిని కోరుకున్న మొక్కులో నా కుటుంబ సభ్యులు కూడా భాగస్వామ్యం కావడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఆయన ఎందరికో స్పూర్తిగా నిలుస్తున్నారన్న ఆయన రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకి తీసుకెళ్లడానికి, అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. వైఎస్సార్సీపి చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను అన్ని వర్గాలకు తెలియజేసే చైత్యవేధిక సేవ్ డెమోక్రసికి శ్రీవారి ఆశీస్సులు కావాలని ఆవదేవదేవుడిని కోరుకున్నానని చెప్పారు. అదేవిధంగా చంద్రబాబుని వైఎస్సార్సీపి పెట్టిన అక్రమ కేసుల నుంచి కడిగిన ముత్యంలా బయటకు తీసుకురావాలని శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశామన్నారు.   ఆడారి కిషోర్ వెంట సేవ్ డెెమోక్రసి ప్రతినిధులు పాల్గొన్నారు.

Tirumala

2023-11-19 07:09:14

డెమోక్రసీ ఇన్ డేంజర్ తో ప్రజలను చైతన్యవంతం చేయాలి

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపడుతున్నప్రజా వ్యతిరేక విధానాలు, అరాచకాలు, కక్షసాధింపు వ్యవహారాలన్నింటినీ ప్రజలందరూ తెలుసుకునేలా డెమెక్రసీ ఇన్ డేంజర్ కార్యక్రమం ద్వారా చైతన్యపరచాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చన్నాయుడు పేర్కొన్నారు. గురువారం విజయవాడలో తెలుగు యువత నాయకులు ఆడారి కిషోర్ కుమార్ ఆధ్యర్యంలో ఉద్యమంలా సాగుతున్న డెమెక్రసీ ఇన్ డేంజర్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను ఆయన టిడిపి నేతలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఎక్కడుందని..దానిని ఎప్పుడో ప్రభుత్వ విధానాలతో బంగాళాఖాతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కలిపేసిందన్నారు. ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే ప్రభుత్వం అలుపెరగకుండా శ్రమిస్తోందన్నారు. ఇలాంటి సమయంలో ప్రజలను ఉత్తేజపరచడానికి, ఆలోచించే విధంగా చేయడానికి డెమెక్రసీ ఇన్ డేంజర్ కార్యక్రమాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు ఎంతగానో ఆలోచిపంచేస్తున్నాయని, మంచి కార్యక్రమం తలపెట్టిన కిషోర్ కుమార్ ను అభినందించారు. ఈ కార్యక్రమానికి తమవంతు సహకారం ఉంటుందన్నారు. యువనాయకులు ఆడారి కిషోర్ కుమార్ మాట్లాడుతూ, అధికారం చేతిలో ఉందనే ఒకే ఒక్క గర్వంతో అరాచకపరిపాలన చేస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయన్నారు. ముఖ్యంగా యువతను ఆలోచింపచేయడానికి, ఉద్యోగులు, మేధావుల యొక్క అభిప్రాయాలను తెలుసుకోవడానికి, వారిలో చైతన్యం నింపడానికి డెమెక్రసీ ఇన్ డేంజర్ కార్యక్రమాలను అన్ని నియోజవర్గ కేంద్రాల్లోనూ నిర్వహిస్తున్నామన్నారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందితే ఇపుడు వైఎస్సార్సీపీ పాలనలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఈ పరిస్థితి మారాలంటే ప్రజల్లో మార్పురావాలన్నారు. దానికోసం విశాఖ జిల్లా మొదలుకొని అన్ని ప్రాంతాల్లోనూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో, అమరావతి, విజయవాడకు చెందిన టిడిపి రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

Vijayawada

2023-11-16 09:05:32

ప్రభుత్వ ఉద్యోగుల్లో సిపిఎస్ రద్దు ప్రకంపన

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల చిరకాల కోరిక సిపిఎస్ రద్దు.. పాత పెన్షన్ విధానం ముద్దు. ఇపుడు అదే విషయాన్ని తెలుగుదేశం-జనసేన పార్టీలు ఉమ్మడిగా ఈ నిర్ణయాన్ని అమలుచేయాలని చూస్తున్నాయి. ఏపీలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాల ఓట్ల ద్వారా సుమారు 25 నుంచి 35 సీట్లు గెలిచేటన్ని ఓట్లు రాబట్టొచ్చు ఏ రాజకీయ పార్టీ అయినా. అయితే గత ఎన్నికల్లో వైఎస్.జగన్ సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ ఇస్తానని చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తరువాత జిపిఎస్ ను అమలు చేయడంతో ప్రభుత్వ ఉద్యోగులు దానిని జీర్ణించుకోలేకపోతున్నారు. నిరసనతో రగిలిపోయిన ఉద్యోగులు తమ ఓటు యొక్క బలమేంటో రాష్ట్రంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజం చేసి చూపించారు కూడా. అయితే ఇపుడు మళ్లీ సిపిఎస్ రద్దు చేస్తే ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాల ఓట్లన్నీ నేరుగా టిడిపి-జనసేన ఓటు బ్యాంకుగా మలుచుకోవచ్చుననే పవన్ కళ్యాణ్ ఆలోచనకు టిడిపి అధినేత ఆమోదం తెలిపినట్టు వార్తలొస్తున్నాయి. ప్రధాన మీడియాలో వచ్చిన ఈ వార్త ఆదివారం ఒక్క రోజే అతి పెద్ద చర్చకు సామాజిక మాద్యలో తెరలేపింది. 

అంతేకాదు సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ అమలు చేస్తారనే విషయానికి సంబంధించిన వీడియో క్లిప్పింగులు, పేపర్ కటింగ్ లు, మొబైల్ యాప్ న్యూస్ కార్డ్ లు ఉద్యోగుల సోషల్ మీడియా మాద్యమాల్లో విపరీతంగా ట్రోల్ అయ్యాయి. అదే సందర్భంలో ఉపాధ్యాయులు, ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులు కూడా వారి వారి జిల్లాల్లో అంతర్గతంగా సమావేశాలు కూడా పెట్టుకొని సిపిఎస్ రద్దు చేసే పార్టీలకే తమ మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు కూడా నిఘా వర్గాలకు సమాచారం అందిందని చెబుతున్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత రివర్స్ పీఆర్సీ ఇవ్వడాన్ని ఉద్యోగులు ప్రధాన నష్టంగా భావిస్తున్నారు. కనీసం గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని ఉద్యోగుల మద్దతు అయినా లభిస్తుందా అంటే వారి సర్వీసులు కూడా రెండేళ్లకు రెగ్యులర్ చేయాల్సింది తొమ్మిది నెలలు అదనంగా పనిచేయించుకున్న తరువాత రెగ్యులర్ చేశారు. దీనితో వారికి రెండు డిఏలు, తొమ్మిది నెలల పుల్ పేస్కేలు కోల్పోయారు. పైగా ఉద్యోగాలు రెగ్యులర్ అయిన తరువాత ఇవ్వాల్సిన రెండు ఇంక్రిమెంట్ల విషయంలో కూడా ప్రభుత్వం నేటికీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. అంతేకాకుండా వీరికి పీఆర్సీ అమలు చేస్తున్నామని చెప్పిన ప్రభుత్వం అరియర్స్ మాట ఎత్తకుండా స్థబ్దుగా ఉండిపోయింది. 

ఈ విషయాన్ని కూడా ఉద్యోగ సంఘాల సమావేశాల్లో తీవ్రంగా చర్చించి జనసేన పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడంతో ఈ ప్రభుత్వ శాఖను కూడా అభివద్ధి చేయడంతోపాటు, మరికొన్నిశాఖల ఉద్యోగాలను ఈ శాఖకు అనుసంధానం చేసి ఉద్యోగాల సంఖ్య పెంచాలని కూడా వారి సమావేశంలో చర్చకు వచ్చినట్టు చెబుతున్నారు. మొన్నటి వరకూ టిడిపి అధికారంలోకి వస్తే గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉంటుందా..? ఊడుతుందా..? అని ప్రచారం చేశారంటూ అపవాదు మూటగట్టుకున్న టిడిపీయే ఇపుడు ప్రస్తుతం ఉన్న 19విభాగాలను, 23 విభాగాల సిబ్బందికి పెంచాలని నిర్ణయించే దిశగా చర్యలు తీసుకుంటారనే ప్రచారం ఆదివారం పెద్ద ఎత్తున ఉద్యోగులకు చేరింది. ప్రస్తుతం ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు పదోన్నతుల విషయంలో ఒక విధి విధానం లేకుండా ఇస్తున్న అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు వద్ద ప్రత్యేకంగా చర్చించగా, ప్రభుత్వ పరిపాలనా విధానాలపై మంచి పట్టు సాధించారని  చాలా ముఖ్యమైన సూచనలు, సలహాలు ఇచ్చారని చంద్రబాబు పవన్ ను మెచ్చుకున్నారట. గతంలోనే పవన్ కళ్యాణ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు వారి సమస్యలు మాకు చెప్పినా చెప్పకపోయినా మా ప్రభుత్వం ఏర్పాటైతే ఖచ్చితంగా వాటిని నెరవేస్తామని ప్రకటించారు. 


ఆ క్రమంలో ఇపుడు చంద్రబాబుతో మేనిఫెస్టో విషయమై చర్చించినపుడు ముఖ్యంగా ఉద్యోగుల సిపిఎస్ రద్దు, ప్రతీ ఏటా జాబ్ కేలండర్ లో ఉపాధ్యాయ డిఎస్సీ, ఏపిపిఎస్సీకి విశేష అధికారాలు ఇస్తూ నోటిఫికేషన్లు, అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ ఉద్యోగులకు పదోన్నతులు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాల విధానం రద్దు, అధికారంలోకి వచ్చిన వెంటనే పిఆర్సీ తదితర అంశాలు చర్చించారనే విషయాన్ని తెలుసుకున్న ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తూ ఆలోచనకు, చర్చకు తెరలేపారని తెలిసింది. వీరిద్దరి కలయికలో వచ్చిన చర్చ ఇంత పెద్దగా రాష్ట్రవ్యాప్తంగా దావానంలా వ్యాపించడం విశేషం. అయితే వీరి ఉమ్మడి మేనిఫస్టో వచ్చేంత వరకూ ప్రస్తుతానికి ఈ ట్రోలింగ్స్ ఆగేటట్టుగా  కనిపించడం లేదు. పైగా నవంబరు నెల కావడం పిక్నిక్ లు జరిగే సమయం కావడంతో ఉద్యోగులంతా ఒకే చోటకు చేరి ఈ విషయంలో పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. చూడాలి ఏం జరుగుతుందనేది..!

Visakhapatnam

2023-11-05 17:58:33

గ్రామ, వార్డు సచివాలయశాఖలో పదోన్నతుల రగడ..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయశాఖలో ఇపుడు పదోన్నతుల రగడ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో 15వేల4 గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమారు 1.30లక్షల మంది ఉద్యోగులు 19శాఖల్లో పనిచేస్తున్నారు. 2 రెగ్యులర్ నోటిఫికేషన్ల ద్వారా నేరుగా ఉద్యోగాలు భర్తీచేసిన ప్రభుత్వం, ఆ తరువాత కారుణ్య నియామకాల ద్వారానే మిగిలిన ఉద్యోగాలు భర్తీచేస్తూ వస్తున్నది. ఈ క్రమంలో మూడేళ్లు దాటిన సచివాలయ ఉద్యోగుల్లో కొన్ని శాఖలకు పదోన్నతులు కల్పిస్తోంది. ప్రభుత్వం ఇటీవల, అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ హజ్బండరీ శాఖల్లోని ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి వారికి పేస్కేలు కూడా పెంచింది. ఏ ప్రభుత్వశాఖలోని ఉద్యోగులకు రాని విధంగా ఈ శాఖలోని ఉద్యోగులకు కేవలం ఐదేళ్ల లోపులోనే పదోన్నతులు రావడం ఒకరకంగా చెప్పుకోదగ్గ శుభపరిణామం. అయితే ప్రస్తుతం ఉన్న 19శాఖల్లోని ఉద్యోగుల్లో ఇంకా కొన్ని శాఖల ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ ఫ్రేమ్ చేయలేదు. అదే సమయంలో కొన్ని శాఖల ఉద్యోగులకు మాత్రం పదోన్నతులు కల్పించడం ఇపుడు ఇతరశాఖల ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకతకు కారణం అవుతోంది. ఒకేసారి విధుల్లోకి చేరిన ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించాలి. అలాకాకుండా కొన్నిశాఖల్లో ఉద్యోగులకు మాత్రమే పదోన్నతులు కల్పించడంపై ఉద్యోగులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు ఆరోగ్యశాఖలోని ఏఎన్ఎంలకు కూడా ఇన్ సర్వీస్ ఇచ్చి జిఎన్ఎం(స్టాఫ్ నర్స్) శిక్షణలు ప్రభుత్వం పూర్తిచేస్తోంది. 

ఇప్పటికే ఉద్యోగాల్లోకి చేరిన తరువాత రెండేళ్లకి సర్వీసు రెగ్యులర్ చేస్తామన్న ప్రభుత్వం అదనంగా 9నెలలు పనిచేయించుకున్న తరువాత ప్రత్యేకంగా టెస్టులు పెట్టి అవి పాసైన వారికి మాత్రమే సర్వీసు రెగ్యులర్ చేసింది. అక్కడ 9నెలలో పేస్కేలు, 2 డిఏలు కోల్పోయిన ఉద్యోగులు సర్వీసు రెగ్యులర్ అయిన తరువాత రావాల్సిన 2 ఇంక్రి మెంట్లు కూడా కోల్పోయారు. పీఆర్సీ అమలు చేస్తున్నామంటూ చెప్పిన ప్రభుత్వం వీరికి పేస్కేలు రివైజ్ చేసి అమలు చేసినా..రావాల్సిన అరియర్స్ విషయంలో ఏలాంటి ప్రకటన చేయలేదు. దానితో అవి వస్తాయో రావో కూడా తెలియనని పరిస్థితి. అదీ కూడా సచివాలయ ఉద్యోగులకు పిఆర్సీ అమలు చేసే సమయంలోనే హెచ్ఆర్ఏ, డిఏలను కుదించిన తరువాతన పిఆర్సీ అమలు చేసింది. ఇలా ఒక్కో సచివాలయ ఉద్యోగి సుమారు రూ.2 లక్షల వరకూ ప్రయోజనాలు కోల్పోవాల్సి వచ్చింది. అయినా కూడా సచివాలయ ఉద్యోగులందరికీ ఒకే విధానం అమలు చేయకుండా కొన్నిశాఖల ఉద్యోగులకే పదోన్నతులు కల్పించి మిగిలిన శాఖల ఉద్యోగుల విషయంలో ఎలాంటి ప్రకటనా చేయకపోవడం పట్ల ఉద్యోగులల్లో తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్నది. ఇప్పటికే పలు ప్రయోజనాలు కోల్పోయిన ఉద్యోగులు ఇపుడు పదోన్నతులు కూడా  దూరం అవుతున్నామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని ఉద్యోగుల సామాజిక మాద్యమాల్లో పెద్ద ఎత్తున చర్చకు తెరతీస్తున్నారు. పదోన్నతులు వచ్చిన వారి ఆర్డర్లు చూస్తూ, వారికి పెరిగిన జీత భత్యాలు చూసి ఒకింత ఆనంద పడుతూ, తాము ఇంకా దానికి నోచుకోలేదంటూ తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. సర్వీసు రెగ్యులర్ అయ్యే సమయంలో మెటర్నటీ లీవ్ లు పెట్టిన వారికి ఆ సెలవుల సమయం పూర్తయిన తరువాత మాత్రమే ప్రభుత్వం నిబంధనల ప్రకారం రెగ్యులర్ చేసింది. కానీ నిబంధనల ప్రకారం ఉద్యోగుల సర్వీసు మాత్రం రెండేళ్లకే రెగ్యులర్ చేయలేదు. ప్రభుత్వానికి ఆర్ధిక పరమైన అంశాల విషయంలో నింబంధనలు పాటిస్తున్న ప్రభుత్వం ఉద్యగులకు ప్రయోజనాలు చేకూర్చే విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన, నిబంధనలు పాటించకపోవడం విశేషం.

కొత్త పోస్టుల భర్తీలేకుండా చేసేందుకే పదోన్నతులు తెరపైకి..
ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఏర్పాటు కాకముందు వ్యవసాయశాఖలో ఏఈఓ, ఉద్యానవనశాఖ శాఖలో హెచ్ఈఓ, పశు సంవర్ధక శాఖలో సహాయకులు, ఫిషరీష్ ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆరోగ్యశాఖ లో స్టాఫ్ నర్సులు, విద్యుత్ శాఖలో లైన్ మేన్ లు, మండల సర్వేయర్లు, తదితర పోస్టులు ఉండేవి. సచివాలయశాఖ ఏర్పాటు చేసిన తరువాత రెండు మూడు శాఖలకు కలిపి ఒక పోస్టును ప్రభుత్వం క్రియేట్ చేసింది. ఇపుడు సదరు పోస్టులు నేరుగా భర్తీచేయాలంటే వారికి పేస్కేలు అదనంగా వుంటుంది. సచివాలయ శాఖలోని ఉద్యోగులకే పదోన్నతులు కల్పిస్తే సదరు పోస్టులను మళ్లీ భర్తీచేసే అవకాశం వుండదు. దీనితో ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న సచివాలయశాఖలో ఉన్న పలు శాఖల ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తోంది. దీనితో ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు కొత్త పోస్టులు తీసే అవకాశం లేకుండా ఉద్యోగులకు మేలు చేస్తున్నట్టుగా పదోన్నతులు కల్పిస్తున్నది ప్రభుత్వం. అయితే ఏ ప్రభుత్వ శాఖలోనూ లేని విధంగా ఒక్క సచివాలయశాఖలోనే ఐదేళ్ల లోపునే ఉద్యోగులకు పదోన్నతులు రావడం అనేది ఒక చరిత్రగానే చెప్పాలి. అదే సమయంలో చాలా ఉద్యోగాల భర్తీకి ఈ విధానం అడ్డుగా మారుతోంది. అలాగని అన్నిశాఖల ఉద్యోగులకు సమానంగా పదోన్నతులు కల్పిస్తుందా అదీ లేకుండాపోయింది. ప్రస్తుతం సచివాలయశాఖలోని ఇంజనీరంగ్ అసిస్టెంట్లు హౌసింగ్, ఆర్అండ్ బి, పంచాయతీరాజ్ తదితర ఇంజనీరింగ్ శాఖల పనులు చేస్తున్నారు. వెల్పేర్ అసిస్టెంట్లు, సోషల్ వెల్ఫేర్, ఎడ్యుకేషన్ శాఖలు చూస్తున్నారు. డిజిటల్ అసిస్టెంట్లు కార్యాలయ పనులతోపాటు, ఆధార్, ఇతర సర్వీసులు పనులు చేస్తున్నారు. మహిళా పోలీసులు హోంశాఖ, ఐసిడిఎస్, ఎస్ఈబి, రెవెన్యూశాఖ(బిఎల్వో) విధులు చేస్తున్నారు.  ప్రభుత్వంలోని పలు శాఖల విధులు చాలా వరకూ సచివాలయ ఉద్యోగులతోనే జరిగిపోతున్నాయి. అలాంటి సమయంలో అన్నిశాఖల ఉద్యోగులకు సమానంగా పదోన్నతులు కల్పించాల్సిన ప్రభుత్వం కొన్నిశాఖల వారికే 
పదోన్నతులు కల్పిండం పట్ల ఉద్యోగులు లోలోన మదన పడిపోతూ, తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తీవ్ర మనోవేదన అనుభవిస్తున్నారు.

పదోన్నతులు వ్యవహారం ఎన్నికలపై ప్రభావం..
గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని కొన్నిశాఖల ఉద్యోగులకే పదోన్నతులు కల్పించి మిగిలినశాఖ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించని వైనం 2024 ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం గట్గిగా వుంటుందంటున్నారు. అదే సమయంలో అగ్రికల్చర్, హార్టికల్చర్, షిషరీష్, పశుసంవర్ధకశాఖల్లోని రెగ్యులర్ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించకుండా కేవలం సచివాలయ ఉద్యోగులను తమతో సమానంగా పదోన్నతులు ఇవ్వడాన్ని మిగిలిన శాఖల ఉద్యోగులు తప్పు పడుతున్నారు. ప్రస్తుతం ఖాళీలు ఉన్నచోట కొత్త ఉద్యోగాలు భర్తీచేయకుండా ప్రభుత్వం ఏఈఓ, హెచ్ఈఓ, షిషరీష్ పీల్డు అసిస్టెంట్లను గ్రామ, వార్డు సచివాలయాలకు అనుసంధానం చేసేస్తూ ఖాళీలు ఉన్న ప్రదేశాలకు ఉద్యోగులను బదిలీలు చేస్తున్నది. గతంలో రెవిన్యూ శాఖలో విఆర్ఏలుగా ఉన్నవారికి వీఆర్వోగా పదోన్నతి ఇచ్చి సచివాలయాలకు పంపేసింది. దానితో ఇప్పటి వరకూ కార్యాలయాలకే పరిమితం అయిన ఉద్యోగులు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు బదిలీ కావాల్సి వస్తున్నది. అలాగని వారికి రావాల్సిన పదోన్నతులు మాత్రం రావడం లేదు. మరోవైపు గ్రామసచివాలయ మహిళా పోలీసుల పరిస్థితి గాల్లో దీపంలా ఉంది. హైకోర్టుకి సమర్పించిన అఫడవిట్ తో వీరు పోలీసుశాఖ సిబ్బందిగానే ఉన్నా, వీరి విధులు మాత్రం బిఎల్వో, ఐసిడిఎస్, ఇతర సచివాలయ ఉద్యోగుల పనులే ఉన్నాయి. పలు కోర్టు కేసులు కూడా ఉన్నందున మహిళా పోలీసులకు సీనియర్ మహిళా పోలీసుల పదోన్నతులు వచ్చే అవకాశాలు కనింపించడం లేదు. మరికొన్ని శాఖల ఉద్యోగులకు ప్రమోషన్ ఛానలే ఏర్పాటు కానుందున వారికి పదోన్నతులు వస్తాయో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో సచివాలయ ఉద్యోగుల తోపాటు, ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులు కూడా ప్రభుత్వం చేసే చర్యలకు తగ్గట్టుగా పనిచేయాల్సి వస్తున్నది. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయశాఖలో రాజుకున్న పదోన్నతుల రడగ ఏ స్థాయికి చేరుతుంది..ప్రభుత్వం మిగిలిన శాఖల సిబ్బందికి ఎలాంటి న్యాయం చేస్తుందనేది వేచి చూడాలి..!

Tadepalli

2023-10-31 03:03:20

చంద్రబాబు ఆరోగ్య నివేదికలు వాస్తవాలేనా?!

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం, ఏపీ‌ అసెంబ్లీ ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర వ్యాప్తంగా రకరకాల అనుమా నాలు, మీడియా, సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. ఈ దశలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, తనయుడు లోకేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‌నిజంగానే చంద్రబాబు నాయుడు ఆరోగ్యం క్షీణిస్తోందా లేక ఇవన్నీ అపోహలు, అవాస్తవాలేనా అనేది ఎవరికీ తెలియడం లేదు. కాకపోతే చంద్రబాబు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని భువనేశ్వరి, లోకేష్, టీడీపీ నేతలు పదే పదే చేస్తున్న విమర్శలు.. విమర్శలు కావని, నిజమని వైద్యుల నివేదికలను పరిశీలిస్తే స్పష్టం అవుతుంది. యస్..చంద్రబాబు ఆరోగ్యం మునుపటిలా లేదు. అనేక అనారోగ్య సమస్యలు ఆయనను చుట్టుముడు తున్నాయి.  స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును సీఐడీ సెప్టెంబరు 9న అరెస్టు చేసింది. విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించింది. దీంతో గత 48 రోజులుగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైలులో 'స్నేహా' బ్లాక్ లో రిమాండ్ ఖైదీగా కాలం వెళ్ళదీస్తున్నారు. 

అయితే గత పదీ పదిహేను రోజుల క్రితం రిమాండ్ ఖైదీ చంద్రబాబుతో ములాఖత్ తీసుకుని ఆయన సతీమణి భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి పరామర్శించారు. ఆ సమయంలో చంద్రబాబు శరీరంపై ఉన్న దద్దుర్లను కుటుంబ సభ్యులు గమనించారు. ‌ఈ విషయాన్ని కోర్టుకు న్యాయవాదుల ద్వారా తెలియజేయగా ఏసీ సమకూర్చడంతో పాటు రాజమండ్రి నగర ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను ఒక బృందంగా ఏర్పాటు చేసి..నిత్యం చంద్రబాబు ఆరోగ్యాన్ని పరిశీలించాల్సిందిగా విజయవాడ కోర్టు ఆదేశించింది. ఆనాటి నుంచి వైద్య బృందం చంద్రబాబు ఆరోగ్యాన్ని పరీక్షించి హెల్త్ బులెటిన్ ను జైళ్ళ శాఖ అధికారుల‌ ద్వారా విడుదల చేస్తున్నారు. అయితే వైద్య పరీక్షలలో కొన్ని అంశాలను ప్రస్తావించకుండా హెల్త్ బులెటిన్ ను విడుదల చేయడాన్ని చంద్రబాబు కుటుంబ సభ్యులు, ఆయన తరపు న్యాయవాదులు తప్పుబడుతున్నారు. తమకు కూడా వైద్య పరీక్ష నివేదికలు అందజేయాలని కోరడంతో కోర్టు ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 25వ తేదీ బుధవారం చంద్రబాబును పరీక్షించిన ప్రభుత్వ వైద్యుల బృందం జైళ్ళ శాఖ అధికారులకు ఒక నివేదిక అందజేసింది. అయితే ఆ మేరకు జైలు అధికారులు బులెటిన్ విడుదల చేయకపోవడం గమనార్హం. చంద్రబాబు ఆరోగ్య విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం కనబరుస్తోందని, ఆయన ఆరోగ్య సమస్యలను కావాలనే దాచి పెడుతోందని‌ టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 చంద్రబాబును పరీక్షించిన ప్రభుత్వ ఆసుపత్రి నేత్ర వైద్యులు కంటి సమస్యతో‌ ఆయన బాధపడుతున్నారని, చికిత్స అవసరమని జైలు అధికారులకు నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. అయితే ఇప్పట్లో ఎలాంటి చికిత్సా అవసరం లేదని ఆ నివేదికలో మార్చి ఇవ్వాలని‌ ప్రభుత్వ వైద్యులపై జైలు శాఖ అధికారులు వత్తిడి తెస్తున్నట్టు టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఇదే వార్త సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. బుధవారం జైలు అధికారులు విడుదల చేసిన చంద్రబాబు హెల్త్ బులెటిన్లో‌ కంటి సమస్యను ప్రస్తావించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని గూర్చి, బయట షికార్లు చేస్తున్న వార్తలపై జైలు సూపరింటెండెంటు స్పందిస్తూ.. చంద్రబాబుకు నాలుగు నెలల క్రితమే ఒక కంటికి కేటరాక్ట్ ఆపరేషన్ చేశారని, రెండో కంటికి ఆపరేషన్ అవసరం లేదని ఆయనను పరిశీలించిన వైద్యులు చెప్పారన్నారు. సరే వైద్యులు తెలిపారు..మరి కనీసం కంటి సమస్యను ఎందుకు హెల్త్ బులెటిన్ లో చూపలేదని టీడీపీ నేతలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ‌ఒక్క కంటి సమస్య మాత్రమే కాదు..చంద్రబాబు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని‌ తెలుస్తోంది. వంటిపై దద్దుర్లు, విరేచనం అయ్యే ప్రాంతంలో నొప్పి, వెన్ను కింద భాగం నొప్పి తదితర సమస్యలతో చంద్రబాబు బాధపడుతున్నట్టు  ప్రభుత్వ వైద్య బృందం‌ భువనేశ్వరికి తెలిపినట్టు సమాచారం. మూత్ర పరీక్ష, ఛాతీ ఎక్స్ రే తదితర పరీక్షలు చేయించాలని వైద్య బృందం సూచించినట్టు టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. క్రోగ్యలేషన్ ప్రొక్టివ్ అనే పరీక్షను చేయించాలని వైద్యులు సూచించారు. ‌


చంద్రబాబుకు దద్దుర్లు వల్ల మంట వస్తోందని, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని‌ కోర్టు దృష్టికి తీసుకు రావడంతో టవర్ ఏసీ‌ ఏర్పాటు చేశారు. అయితే పలు అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్న చంద్రబాబుకు మెరుగైన వైద్యం అత్యవసరమని వైద్యులు సూచిస్తున్నారు. పూర్తి పరీక్షలు చేయిస్తే ఏయే లోపాల కారణంగా అనారోగ్యానికి గురవుతున్నారో స్పష్టమవుతుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.‌ కేవలం రెగ్యులర్ చెకప్ వల్ల ఫలితం ఉండదని, అశ్రద్ధ చేస్తే మొత్తం శరీరానికే ఇబ్బంది కలుగుతుందని చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జైలు అధికారులు చంద్రబాబు అనారోగ్య సమస్యలను దాచాల్సింది ఎందుకనే అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. పైపెచ్చు కంటి సమస్యను హెల్త్ బులెటిన్ లో చూపించవద్దని‌ జైలు అధికారులు ప్రభుత్వ వైద్య బృందాన్ని ఎందుకు కోరిందో తెలియడం లేదు.

 అంటే కావాలనే ప్రభుత్వం వెనుక ఉండి జైలు అధికారులతో‌ ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని‌ టీడీపీ శ్రేణులు చేస్తున్న అనుమానాల్లో ఎంతో కొంత వాస్తవం లేకపోలేదు. ప్రస్తుతం చంద్రబాబు ఆరోగ్య విషయంలో ప్రభుత్వ వైద్యుల బృందం, జైలు అధికారుల మధ్య విభేదాలు పొడచూపే అవకాశం కనిపిస్తోంది. వైద్యులు వారి విధులు వారు సక్రమంగా నిర్వర్తిస్తున్నా..జైలు అధికారులు కూడా వారి విధులను ఎవరి ఆదేశాలకు అనుగుణంగా నిర్వర్తిస్తున్నారనే అనుమానాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. ఒక మాజీ ముఖ్యమంత్రికి జైలులో అందుతున్న వసతులు, అతని వయస్సు, ఆరోగ్యం, ప్రస్తుతం వస్తున్న చర్మవ్యాధులు, కంటి సమస్యలు ఇవన్నీ చంద్రబాబుపై ఆరోగ్యం తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మరో వైపు వాయిదాలు పడుతున్న కోర్టుకేసులతో చంద్రబాబు సార్వత్రిక ఎన్నికలకు బయటకు వచ్చే అవకావాలు కనపించడంలేదు. ఈ పరిస్థితి ముందు ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి..!

Rajamahendravaram

2023-10-28 02:41:13

జగనన్న ఆరోగ్య సురక్ష..అంగన్ వాడీలకు ఆర్ధిక శిక్ష

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో అంగన్ వాడీ స్టాల్స్ చాలా చక్కగా కనిపించాలి..అన్ని రకాల ఆకుకూరలు, బరలవర్ధక ఆహారం ప్రదర్శనలు ఏర్పాటు చేయాలి.. గర్శిణిలకు సీమంతాలు చేయాలి..బట్టలు పెట్టి, పూలు గాజులు ఇవ్వాలి..ఇవీ అంగన్ వాడీలకు జిల్లా అధికారుల నుంచి వచ్చే ఆదేశాలు. ఆదేశాలొస్తే..సదరు కార్యక్ర మాలకు నిధులు కూడా వస్తాయనుకునుకుంటే మీరు పొరపాటు పడినట్టే..నిధులా.. ఆ ఒక్కటీ అడక్కు అంటున్నారు ఐసిడిఎస్ అధికారులు...! ఏం ఆ మాత్రం పెట్టు కోలేరా..? జగనన్నకోసం ఒక్కరోజు ఖర్చుకూడా మీరు భరించలేరా..? ప్రతీదానికి నిధులు అంటే ఎక్కడి నుంచి వస్తాయ్..కొన్నింటిని సిబ్బంది మీ బాధ్యతగా నిర్వర్తిం చే యాలి..ఇలా చిన్న కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులంటూ ఏమీ ఇవ్వదు అని సన్నాయి నొక్కుల్లు నొక్కుతున్నారు అధికారులు. జిల్లా కలెక్టర్, ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ ల నుంచి ఆదేశాల రావడంతో అంగన్ వాడీలు ఆరోగ్య సురక్ష కార్యక్రమాల్లో అయ్యే ఖర్చుమొత్తం వీళ్లే భరించాల్సి వస్తున్నది. అందులోనూ ఐసిడిఎస్ పౌష్టి కాహార ప్రదర్శన అంటే మామూలుగా ఉండదు. ఇవన్నీ నిజంగా గర్భిణిస్త్రీలు తింటే ఆరోగ్యం వీరికి ఖచ్చితంగా సిద్ధిస్తుంది అనేలా అన్ని రకాల వంటకాలు, ఆకు కూర లు, ఇతర పౌష్టికాహారం మొత్తం ప్రదర్శనకు ఉంచుతారు. 

ఇలా ఒకరోజు కార్యక్రమం చేసి, వచ్చినవారికి సీమంతాలు చేయాలన్నా ఒక్కో అంగన్ వాడీకి రూ.3 నుంచి 5వేల వరకూ ఖర్చు అవుతుంది. ఇదంతా ప్రభుత్వం మంజూరు చేస్తుందా అంటే అదీలేదు. అంగన్ వాడీ కేంద్రాల్లో కేవలం, బియ్యం, గ్రుడ్లు, కందిపప్పు, పాలు, బెల్లపు చక్కీలు, కర్జూరం ప్యాకెట్లు, మంచినూనె మాత్రమే ఉంటాయి. ఇతర వస్తువలన్నీ వీళ్లు సొంత డబ్బులు వెచ్చించి కొనుగోలు చేసుకోవాల్సిందే. పోనీ ప్రభుత్వం సరఫరా చేసే వస్తువులతో ప్రదర్శన పెట్టాలని చూస్తే మాత్రం వారికి హెచ్చరికలు వచ్చేస్తున్నాయి. ప్రభుత్వం సరఫరా చేసే వస్తువులతోపాటు, రకరకాల పిండివంటలు, ఆకు కూరలు, పౌష్టికాహారానికి సంబంధించిన మొత్తం వంటకాలు తేవాలంటూ హుకం జారీ చేస్తున్నారు. ఏం చేయాలతో పాలపోని పరిస్థితిలో అప్పలు చేసి మరీ గ్రామాల్లో ఆరోగ్య శిభిరాలు ఏర్పాటు చేస్తే ఇద్దరు ముగ్గు అంగన్ వాడీలు కలిపి వారి చేతి డబ్బులు పెట్టుకొని కార్యక్రమాలు చేయాల్సి వస్తున్నది. ఈ విషయం జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్లకు తెలిసినప్పటికీ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం లేదు. కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు వస్తున్నందున భారీగా కార్యక్రమాల్లో ప్రదర్శనలు చేయాలని మాత్రం హుకుం జారీచేస్తున్నారు.

 వచ్చే జీతాలే సక్రమంగా రాక అప్పులు చేసి మరీ అంగన్ వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్న వర్కర్లు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా మరింతగా అప్పులు చేయాల్సి వస్తున్నది. మండల కేంద్రాల్లో నిర్వహించే కార్యక్రమాలు కాస్త భారీగా చేపడుతుండటంతో మండలంలోని అందరు అంగన్ వాడీలకు చేతి చమురు వదిలిపో తున్నది. ఇది ఏ ఒక్క ప్రాంతానికో అనుకుంటే కాదు..రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అందులోనూ ఐసిడిఎస్ జిల్లా అధికారులు, ప్రాజెక్టు ఆఫీ సర్లు, సూపర్ వైజర్లు కూడా కార్యక్రమాలకు హాజరవుతుండటంతో వారికి మళ్లీ ప్రత్యేకంగా మధ్యాహ్నాం భోజనాలు కూడా వీరే ఏర్పాటు చేసుకోవాల్సి వస్తున్నది. తమ అధికారులకు తాము ఏ విధంగానైనా భోజనాలు పెట్టుకోగలం కానీ, ప్రభుత్వ కార్యక్రమానికి తమతో ఖర్చులు పెట్టించి మరీ కార్యక్రమాలు చేయమంటే తాము ఎక్కడి నుంచి తేవాలంటూ అంగన్వాడీలు వాపోతున్నారు. విషయం ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు తెలిసినా వీళ్లు కూడా ప్రభుత్వానికి ఈ సమస్యను నేరుగా చెప్పే పరిస్థితి లేదు. దీనితో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు మాత్రం ఐసిడిఎస్ సిబ్బందికి ఆర్ధిక శిక్షగానే మారుతున్నాయి. ఇప్పటికై ప్రభుత్వం స్పందించి అధికారిక కార్యక్రమాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని అంగన్వాడీలు ముక్త కంఠంతో కోరుతున్నారు.

Amaravati

2023-10-27 02:42:41

ఉద్యోగులకు జీతాలులేని ‘సమగ్ర దసరాపండుగ శిక్ష’..!

దసరా పండుగవేళ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష లో పనిచేసే కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఒకటి కాదు, రెండుకాదు ఏకంగా మూడు నెలల నుంచి జీతాలు రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లోని 25వేలమంది క్లస్టర్ రిజర్వు మొబైల్ టీచర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఎంఐఎస్ కోఆర్డినేటర్ మండల్ లెవెల్ అకౌంటెంట్స్ పార్ట్ టైం ఇన్స్పెక్టర్స్, కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో పనిచేస్తున్న సిఆర్టిలు, ఎస్ఓలు గాపనిచేస్తున్నారు. విద్యాశాఖలోపెద్ద సంఖ్యలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేసే వారికి ప్రభుత్వంసక్రమంగా నెలనెలా జీతాలు విడుదల చేయడంలేదు. ఎన్ని సార్లుతమ సమస్యను జిల్లా అధికారులకు మొరపెట్టుకున్నా, జగనన్నకు చెబుదాం, స్పందన లాంటి కార్యక్రమాల్లో అర్జీలు పెట్టినా ఫలితంలేకుండాపోతుందని వీరంతా చెప్పుకొస్తున్నారు. అయినప్పటికీ తాము క్రమం తప్పకుండా విధులు నిర్వహిస్తూ ఉన్నప్పటికీ, నేటికీ  మాకు రావాల్సినజీతాల బకాయిలను ప్రభుత్వం విడుదల చేయలేదని ఉద్యోగులు వాపోతున్నారు. ఇప్పటికే అప్పులు చేసుకొనిమరీవిధులు నిర్వహిస్తున్న వీరి విషయంలో ప్రభుత్వం మరీ దారుణంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన సర్వశిక్షా అభియాన్ లోని అందరూ చదవాలి..అందరూ ఎదగాలి..అనే సంకల్పంతో ప్రారంభమైన ఈస్కీములో పనిచేస్తున్న మాకు ఇచ్చే అరకొరజీతాలుకూడాసమాయానికి ఇవ్వడం లేదని విద్యాశాఖ అనుబంధంగాపనిచేస్తున్న వీరంతా తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తాముపనిచేసవన్నీ ఫీల్లుతరహా పనులని..ఎక్కడికి వెళ్లాలన్నా పైసాలేనిదే పనిజరగడంలేదని ఉద్యోగులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. జీతంతక్కువే అయినా జీవితానికి భరోసా ఉంటుందని భావించి విధులునిర్వహిస్తున్నామని, అయినా ప్రభుత్వం తమపై కనీసం జాలి చూపించడంలేదని వాపోతున్నారు.తమకు రావాల్సిన జీతాల బకాయిలను ప్రభుత్వం వెంటనే మంజూరు చేస్తే తప్పా తమకు ఏడాది దసరాపండుగ  చేసుకునే భాగ్యం కూడా కలగదని చెబుతున్నారు. సమగ్ర శిక్ష లో పనిచేసే ఉద్యోగులంతా రాష్ట్ర వ్యాప్తంగా తమ సమస్యలు,బకాయిజీతాల విషయమై మండల విద్యాశాఖ అధికారి నుంచి విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వరకూ అర్జీలు పెట్టుకున్నారు. తొలుత నాలుగు నెలలు జీతాలు బకాయిలు ఉంటే ఒక నెల జీతం ఇచ్చారు. ఇంకా పూర్తిగా రెండు నెలలు బకాయిఉంది. ఈపదిరోజులు  పూర్తయితే(ప్రభుత్వ శాఖల్లో 25వ తేది నుంచి 25వతేదికి నెలగాపరిగణిస్తారు,ప్రతీ నెలా 20 నుంచి 25వ తేదీలోగా సాలరీ బిల్లులు పెడతారు) పూర్తిగా మూడు నెలలు జీతాలు ఉద్యోగులకు అందాల్సి వుంటుంది.

 ప్రతీసారి ఉద్యోగులు జీతాల కోసంప్రభుత్వం చుట్టూ, విద్యాశాఖలోని ఉన్నతాధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది. వచ్చే అరకొర జీతాలు కూడా సమయానికి ఇవ్వకపోతే తాము ఎలాబ్రతకగలమని,  పెరిగిపోతున్న నిత్యవసర సరుకుల ధరలు కూడా తమ ఆర్ధిక ఇబ్బందులకు తోడవుతున్నాయని వీరంతా గగ్గోలుపెడుతున్నారు. పండుగ వేళ పస్తులుంటున్న ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష లో పనిచేసే కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తుల ఆర్ధిక ఇబ్బందులు,కుటుంబ పోషణలను ద్రుష్టిలో ఉంచుకొని విద్యాశాఖ అధికారులు ప్రభుత్వం ప్రభుత్వం ద్రుష్టికి ఈసమస్యనుతీసుకెళ్లి కు జీతాల సమస్యను పరిష్కరించాలని ఉద్యోగులంతా ముక్తకంఠంతో  సమగ్ర శిక్ష ఉద్యోగుల జీతాలు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది.

Tadepalli

2023-10-21 03:58:24

ఈఎన్ఎస్ చెప్పిందే నిజమైంది..ఏపీలో అధికారిక కులగణన..!

ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ(ఈఎన్ఎస్) అధికారికి మొబైల్ న్యూస్ యాప్ Ens Live, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net చెప్పింది ఎప్పుడూ ఒమ్ముకా లేదు..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా సామాజిక కులగణన చేపట్టనుందనే విషయాన్ని ప్రత్యేక కథనంగా ప్రజల ముందుంచాం. దానిపై స్పందించిన ఏపీ ప్రభుత్వం ఇపుడు ఆ మాటను నిజం చేస్తూ కులగణన చేపట్టడానికి ఏర్పాట్లు చేస్తోంది.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకప్పుడు కేవలం కులసంఘా లు మాత్రమే చేసుకునే కుల గణన ఇపుడు నేరుగా ప్రభుత్వమే చేపట్టనుంది. దీని ద్వారా ఆయా కులాలకు ఏర్పాటు చేసిన కార్పోరేషన్ల ద్వారా అభివ్రుద్ది కార్యక్రమాలు, రాజకీయం, ఓటు బ్యాంకు ఇలా అన్నింటికీ సదరు డేటా పనిచేస్తుందని భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఏ కులంలో ఎంత మంది ఉన్నారు..? మగవారు ఎంతమంది..? ఆడవారు ఎంతమంది..? పిల్లలు ఎంతమంది..? వారి వయస్సులు.. వారి ఆర్ధిక పరిస్థితి, సొంతిల్లు, ఉద్యోగం, వ్యాపారం, కూలీపనులు, సెల్ నెంబర్లు, ఆధార్ నెంబర్లు ఇలా సమస్త సమాచారం ఈ డేటాలో సేకరించాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. తద్వారా రాష్ట్రంలో ఏ కులంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి..? ఎంతమంది జనాభా ఉన్నారు..? ఏ కులానికి ఏఏ సంక్షేమ పథకాలు అందుతున్నాయి..ఇంకా ఎవరెవరికి అందలేదు..అందులో ధనికులు, పేదవారు ఇలా అన్ని వివరాలు పొందుపరచనున్నారు. ఈ వివరాలు 2024 ఎన్నిక సమయానికి పూర్తి సమాచారం ప్రభుత్వం దగ్గర ఉండనుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో 14వేల5 గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.30లక్షల మంది ఉద్యోగులు, మరో నాలుగు లక్షల మంది గ్రామ వాలంటీర్ల ద్వారా ఈ డేటాను నవంబరు 14 నుంచి ప్రభుత్వం సేకరించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదే సమయంలో రాష్ట్ర జనాభా సంఖ్య కూడా ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలిసే అవకాశం ఏర్పడుతుంది. అనధికారికంగా రాష్ట్రంలో కుల గణన 2023 మార్చినాటి కే పూర్తయి పోయి నట్టు సమాచారం. వాటిని ఆయా కుల సంఘాలు చేపట్టేశాయి. కానీ ఇపుడు అధికారికంగా సేకరించే సమాచారంలో రాష్ట్రంలో ఎంతమంది ప్రజలున్నారు..? ఎన్ని కులాలు ఉన్నాయి..? ఏఏ కులంలో ఎంతమంది జనాభా ఉన్నారనే విషయం అధికారికంగా తెలియనుంది. ఈ కుల గణన వలన అన్ని రాజకీయపార్టీలకు మేలు, కీడు రెండూ జరగనున్నాయని చెబుతున్నారు. కులంలో జనాభా ప్రాతిపధికన కూడా రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, రాజ్యసభ, జెడ్పీ చైర్మన్లు, కుల కార్పోరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు ఇలా ఇతర నామినేటెడ్ పోస్టులు కూడా ప్రభుత్వాలు కుల బలాన్ని బట్టి భర్తీ చేసే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకూ రెడ్డి, కమ్మ రెండు సామాజిక వర్గాలు మాత్రమే ప్రభుత్వాలను నడుపుతూ వచ్చాయి. ప్రభుత్వం చేపట్టే కులగణనతో ఏ కులం బలం ఎంతుందో తేలిపోయి..వారి వారి కుల బలాన్ని బట్టి పదవులు దక్కే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మాకులంలో అత్యధిక జనాభా, ఓట్లు, ఉద్యోగులు, వ్యాపారులు ఉన్నారని ఏ కులానికి ఆ కులం బల ప్రదర్శన చేసేది.

 అయితే ఇపుడు ప్రభుత్వం చేపట్టే అధికారిక కుల గణనతో ఏ కులంలో ఎంత మంది ఉన్నారనే విషయం ప్రభుత్వమే అన్నికులాల వారికీ తెలియజేయనున్నది. ఇది ఒక రకంగా శుభపరిణామం అనే చెప్పాలి. తద్వారా ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు, వర్గాలు వారీగా జాబితా మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ తెలియనున్నది. తద్వారా ఇకపై రాజకీయాలు కూడా రసవత్తరంగా మారే అవకాశాలు బలపడనున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ అధికారులకు గానీ, రాజకీయనాయకులకు గానీ ఏ ఏ కులాల్లో ఎంతమంది జనాభా ఉన్నారనే విషయం తెలీదు. ఇపడు అనకాపల్లి నుంచి అమెరికా వరకూ ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారు ఎక్కడున్నారో కూడా తేలిపోతుంది. ప్రస్తుతం రాజకీయాల్లోకి సివిల్ సర్వీస్ ఆఫీసర్లు, ఇతర జిల్లా శాఖల అధికారులు, రిటైర్డ్ ఉన్నతాధికారులు వస్తుండం వలన వారికి ఈ కుల గణన జాబితా ఎంతో చక్కగా ఉపయోగపడనున్నది. ఇప్పటి వరకూ కులాభిమానం చూపించేవారికి, చూపించలేని వారికి, చూపించాలనుకునేవారికి కూడా ఈ జాబితా ఒక వేదిక కానున్నది. ఒక రకంగా కులగణన అనేది కత్తిమీద సాములాంటి వ్యవహారం అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాహసం ప్రదర్శించి చేపట్టనున్న కులగణనపై భారీ అంచనాలు అపుడే నమోదు అవుతున్నాయి. అదేస్థాయిలో అన్ని వర్గాల్లోనూ చర్చలు కూడా ప్రారంభం అయ్యాయి. చూడాలి రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎలాంటి ఫలితాలు కులగణన విషయంలో నమోదు చేస్తుందనేది..!

Visakhapatnam

2023-10-15 04:56:45

ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్ లు ఆలోచనలో పడ్డారా..?!

ఆంధ్రప్రదేశ్ లోని ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అధికారులు ఆలోచనలా పడ్డారా..? ప్రభుత్వ విధానాలు, ఎన్నడూలేనివిధంగా జీతాలు ఆలస్యం కావడం, కొత్తజిల్లాల్లో పనిచేసే సివిల్ సర్వీస్ అధికారులకు వసతి సౌకర్యాలు లేకపోవడం, మాట్లాడితే కోర్టులకు నేరుగా అధికారులే హాజరు కావడం, ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ ఉద్యోగులు నుంచి వస్తున్న ఒత్తిడి, సహకారం లేకపోవడం ఇవన్నీ చూస్తుంటే బ్యూరోక్రాట్ లు వేరే లెవల్ లో ఆలోచన చేస్తున్నట్టుగానే కనిపిస్తున్నది. దానికి తోడు రాష్ట్రంలో ఏర్పడ్డ కొత్త జిల్లాలకి నియమితులైన కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్పీ, ఏఎస్పీ, ఫారెస్ట్ ఆఫీసర్లకు నేటికీ ప్రభుత్వ వసతి గృహాలు లేకపోవడం, వారంతా సాధారణ ఉద్యోగులు మాదిరిగా ప్రైవేటు ఇళ్లల్లో అద్దెకు ఉండటం ఇతర జిల్లాశాఖల అధికారులు సొంతిళ్లల్లో ఉంటం కూడా ఉన్నతాధికారులకు ఇబ్బందిగా ఉంది. రాష్ట్రప్రభుత్వం అయితే గవర్నర్ గెజిట్ ద్వారా జిల్లాలను విభజించింది తప్పితే, ఇంకా కొత్త జిల్లాలకు రాష్ట్రపతి ఆమోదం, కేంద్ర ప్రభుత్వం గుర్తింపు రాలేదు.

దీనితో కొత్తజిల్లాల్లోని సివిల్ సర్వీస్ అధికారుల కేడర్ జిల్లా రాష్ట్రం వరకూ మాత్రమే పరిగణలోకి వస్తున్నది. కేంద్రం దృష్టిలో మాత్రం వీరంతా దిగువస్థాయి అధికారులుగానే లెక్క. ఇలాంటి సందర్భంలో ఉద్యోగాలు చేస్తున్నా..ఎందుకనో లోలోన అధికారులంతా మనసులో తీవ్రవమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టుగా వార్తలొస్తున్నాయి. కొత్తజిల్లాల్లోని సివిల్ సర్వీస్ అధికారులు ఇటీవల కాలంలో అత్యంత ఎక్కువగా వారి సమస్యలను వారే సహచరులతో చెప్పుకొని బాధపడుతున్నట్టు తెలిసింది. ఒకప్పుడు జిల్లా కలెక్టర్ అన్నా, జిల్లా ఎస్పీ అన్నా, జిల్లా ఫారెస్టు అధికారి అన్నా ఒక గుర్తింపు ఉండేదని, ఇపుడు సాధారణ ఉద్యోగులు మాదిరిగా అధికారులంతా ప్రతినిత్యం ప్రజల్లోనే ఉండాల్సి వస్తుందన్న ఇబ్బందిని వ్యక్తపరచుకుంటున్నట్టుగా చెబుతున్నారు. ప్రభుత్వం పరిపాలనా విధానాన్ని మార్పులు చేసిన క్రమం తొలుత దాని ప్రభావం జిల్లా కలెక్టర్లపైనే పడినట్టు కనిపిస్తున్నది. జిల్లాలు అయితే పెంచిన ప్రభుత్వం దానికి తగ్గట్టు గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 ఇతర కేడర్ పోస్టులను పూర్తిస్థాయిలో భర్తీ మాత్రం చేయలేదు. దీనితో ఉన్నతాధికారులు సైతం అధికారుల లేమితో ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. 2024 మార్చి దాటితో ఉద్యోగులు, మినిస్టీరియల్ సిబ్బంది కొరత మరీ తీవ్రతరం కానుంది. వేల సంఖ్యల ఉద్యోగులు ఉద్యోగ విరమణలు చేయబోతున్నారు. ప్రస్తుతం ఒక్కో జిల్లా అధికారి ఉమ్మడి జిల్లాతోపాటు, విభజన జిల్లాలను కూడా పర్యవేక్షించాల్సి వస్తున్నది.

రిటైర్ మెంట్లు జరిగితే ఒక్కోశాఖ అధికారి అదనంగా ఇతర శాఖలను చూసే పరిస్థితి కూడా వచ్చే అవకాశాలున్నాయి. ఈ తరుణంలో జిల్లా అధికారులు కూడా కలెక్టర్, ఎస్పీల మాటలు వినే పరిస్థితి కనిపించడం లేదనేది ప్రధాన వాదనగా కనిపిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎన్నడూలేనివిధంగా సివిల్ సర్వీస్ అధికారుల పరిస్థితి తయారైందని, సాధారణ జిల్లాశాఖల ఉద్యోగులకు, తమకు పెద్దగా వ్యత్సాసం కనిపించలేదని యువ కలెక్టర్లు లోలోన మధన పడుతున్నారట. అలాగని విశేష అధికారాలను వినియోగించి అభివృద్ధి పనులు చేయాలన్నా, తమ మార్కు చూపించుకోవాలన్నా నిధుల కొరత తీవ్ర స్థాయిలో వెంటాడుతోంది. గతంలో ప్రతీ జిల్లా కలెక్టర్ కు ప్రత్యేకంగా జిల్లాకు నిధులు ఉండేవి. వాటితో కలెక్టర్లే ప్రత్యేక అవసరాలకు ఆ నిధులను వెచ్చించే వారు. ఇపుడు ఏపీలో ఆ పరిస్థితి లేదు. దీనితో సివిల్ సర్వీస్ అధికారులు కూడా డమ్మీలైపోయినట్టుగా వాళ్లంతట వాళ్లే భావిస్తున్నారని సమాచారం. మరో వైపు రాష్ట్రంలోని శాఖాధిపతులుగా ఉన్నవారు రాష్ట్ర సర్వీసులకు నమస్కారం పెట్టి కేంద్ర సర్వీసులకు వెళ్లిపోవడానికి ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు ముమ్మరంగా చేసుకుంటున్నారని చెబుతున్నారు. ఎప్పుడూ లేనంతగా ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే ఇలాంటి పరిస్థితి ఎదరైందనే వాదన కూడా బ్యూరోక్రాట్ లలో బలంగా వినిపిస్తోందట. రాష్ట్ర సమీక్ష సమావేశాల్లో ఏ ఇద్దరు సీనియర్ ఐఏఎస్ లు కలిసినా ఇదే విషయంపై చర్చలు జరుగుతున్నాయనే విషయం నిఘా వర్గాలకు సైతం వెళ్లిందని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్టుగానే ఐఏఎస్ లకు జీతాలు ఆలస్యం గా ఇవ్వడం, అదే స్థాయిలో కొన్నిశాఖల ఉద్యోగులకు నెల నెలా ఇవ్వాల్సిన జీతాలు 45 రోజులకి ఒకసారి ఇస్తుండటం కూడా సీనియర్ ఐఏఎస్ లకు మింగుడు పడటం లేదు. జిల్లా అధికారులు, ఉపాధ్యాయులకు జీతాలు ఆలస్యంగా వచ్చినట్టే మనకీ ఆలస్యంగానే అందుతున్నాయి..రేపు ఈ పరిస్థితి మరింతగా పెరగొచ్చని ఓ ఐఏఎస్ అధికారి ఒకరు వ్యాఖ్యానించండం కూడా చర్చనీయాంశం అవుతుంది. ప్రభుత్వాన్ని నడిపించే సివిల్ సర్వీస్ అధికారుల పరిస్థితి ఇలాఉంటే సాధారణ ఉద్యోగుల పరిస్థితి రానున్న రోజుల్లో ఎలా ఉంటుందనేది వేయి డాలర్ల ప్రశ్న. చూడాలి ముందు ముందు ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అధికారుల మనోగతం మరెంతగా మారుతుందనేది..!

Visakhapatnam

2023-10-13 06:13:32

స.హ.చట్టం దరఖాస్తుపై కదిలిన 3జిల్లాల యంత్రాంగం

గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులు, 19శాఖల సిబ్బంది యొక్క సర్వీసు నిబంధనలు, ఇంక్రిమెంట్లు, డిఏలు, ప్రమోషన్ ఛానల్, బదిలీలు, ఇన్ సర్వీస్, భర్తీకానీ ఉద్యోగాల ఖాళీలు, తదితర అంశాలపై ఈఎన్ఎన్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ బ్యూరోచీఫ్ పి.బాలభాను(ఈఎన్ఎస్, బాలు) దాఖలు చేసిన సమాచారహక్కు చట్టం దరఖాస్తుపై  ఉమ్మడి విశాఖజిల్లా, విభజన మూడు జిల్లా అధికారులు కదిలారు. సుమారు 20 అంశాలతో కూడిన నివేదిక వివరాలు కావాలని సమాచారహక్కుచట్టం దరఖాస్తు దాఖలు చేసిన వెంటనే విశాఖజిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి సమాచారం కోసం జిల్లా పరిషత్ కు నివేదించామని మూడు రోజుల క్రితం తిరుగు టపా వచ్చింది. నిన్న జిల్లా పరిషత్ లో భాగంగా ఉన్న మూడు జిల్లాల అధికారులకు సమాచారం కోసం దరఖాస్తు పంపినట్టుగా తిరుగు టపా జిల్లా పరిషత్ అధికారులు పంపారు. మీరు కోరిన సమాచారం కోసం అల్లూరిసీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లా, విశాఖపట్నం జిల్లా, నర్సీపట్నం డిఎల్డీఓలకు ఆర్టీఐ దరఖాస్తు పంపినట్టుగా తిరుగు జవాబులో వర్తమానం పంపించారు. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగాల్లో కెల్లా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు, వారి విధులు భిన్నంగా ఉన్నాయి. అంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్గాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగుల విషయంలో ఏఒక్క అంశమూ ఇతర ప్రభుత్వశాఖల సిబ్బంది మాదిరిగా జరగడం లేదు.

ఈ ప్రభుత్వశాఖ ఏర్పాటు చేసి నాలుగేళ్లు దాటుతున్నా నేటికీ చాలాశాఖల సిబ్బందికి సర్వీసు నిబంధనలు పొందు పరచలేదు. ప్రమోషన్ ఛానల్ కూడా ఏర్పాటు చేయలేదు. ఇంకా చాలా మంది ఉద్యోగులకు కనీసం సర్వీస్ కూడా రెగ్యులర్ కాలేదు. సుమారు ఆరు నెలల క్రిందట క్యాబినెట్ లో తీసుకున్న చట్టభద్దత నిర్ణయానికి నేటికీ అతీ గతీ లేకుండా పోయింది. సచివాలయశాఖ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేశామని చెప్పిన ప్రభుత్వం వారికి అరియర్స్ ఇవ్వలేదు, సర్వీసు రెగ్యులర్ చేసిన 
రేండేళ్ల 9 నెలలకు ఇవ్వాల్సిన సుమారు మూడు ఇంక్రిమెంట్ల విషయంలోనూ ఇప్పటికీ ఏమీ మాట్లాడలేదు. వీరికి ఏ తరహా డిపార్ట్ మెంటల్ టెస్టులు పెడతారు. ఏఏ పరీక్షలు పాసైతే వీరికి పదోన్నతులు వస్తాయి అనే క్లారిటీ కూడా లేకుండా పోయింది. రాష్ట్రప్రభుత్వంలోని 76 ప్రభుత్వశాఖల్లో ఏ శాఖలోనూ చేయని సేవలు సచివాలయ ఉద్యోగులు చేస్తున్నారు. ఏదైనా ప్రభుత్వశాఖ అయితే సదరు శాఖ విధులు మాత్రమే నిర్వహిస్తారు. కానీ గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని ఉద్యోగులు మాత్రం సుమారు ఐదారు ప్రభుత్వశాఖలకు చెందిన విధులు నిర్వహించాల్సి వస్తున్నది. ఇంత చేస్తున్నా, వీరికిప్రభుత్వం ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులకు రాజ్యాంగ బద్దంగా ఇవ్వాల్సిన ప్రయోజనాలను సక్రమంగా కల్పించడం లేదు.

ఈ శాఖ ఏర్పాటైన దగ్గర నుంచి ఏ ఒక్క కార్యక్రమం ఉద్యోగుల విషయంలో సక్రమంగా జరిగిన దాఖలాలు లేవు. దానికితోడు గ్రామపంచాయతీ కార్యదర్శి నుంచి ఎంపీడీఓల వరకూ ఉద్యోగులను పలు రకాల వేధింలపులకు గురిచేస్తున్నారు. ఈ తరుణంలో ఉద్యోగులకు చెందాల్సిన ప్రయోజాలను ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను, ఇతర సదుపాయాలను బహిర్గతం చేసేందుకు, వాటిని సచివాలయ ఉద్యోగులు, ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులకు తెలియజేసేందుకు వీలుగా సమాచార హక్కుచట్టం దరఖాస్తు ద్వారా వివరాలు సేకరిస్తోంది ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ. ప్రభుత్వం ఇచ్చే లిఖితపూర్వ వివరాలతో ఇప్పటి వరకూ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో ఏంచేసిందనే విషయం ప్రభుత్వశాఖలే తేటతెల్లం చేయనున్నాయి. ఈ తరుణంలో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ దాఖలు చేసిన సహచట్టం దరఖాస్తుపై జిల్లా అధికారులు స్పందించి సమాచారం త్వరలోనే అందజేస్తామని లిఖితపూర్వకంగా దరఖాస్తుదారునికి లేఖల ద్వారా తెలియజేశారు. సుమారు 20 అంశాల్లో అడిగిన సమాచారం బయటకు వస్తే సచివాలయ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఏం చేసిందనేది తేలనుంది. 

Visakhapatnam

2023-10-07 11:13:47

విజయదశమి నుంచే విశాఖ నుంచి పరిపాలన

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలో ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను ఆమోదించింది కేబినెట్. ఈ సందర్బంగా సీఎం జగన్‌ వచ్చే విజయదశమి నుంచి విశాఖ నుంచే పరిపాలన ప్రారంభిస్తామని సీఎం తెలిపారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సీఎం జగన్‌ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్బంగా పలు కీలక బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదించింది. ఈ సందర్బంగా పరిపాలనా రాజధాని విశాఖ గురించి ప్రస్తావిస్తూ సమావేశంలో సీఎం కీలక ప్రకటన చేశారు. విజయదశమి నుంచే విశాఖ నుంచి పరిపాలన కొనసాగుతుందని అన్నారు. అప్పటి వరకు కార్యాలయాలను తరలించాలని, విశాఖలో కార్యాలయాల ఎంపికపై కమిటీని నియమించాలని ఆదేశించారు. కమిటీ సూచనల మేరకు కార్యాలయాల ఏర్పాటు ఉంటుందన్నారు సీఎం జగన్‌. అలాగే ముందస్తు ఎన్నికలు, జమిలి ఎన్నికలపై కేంద్ర నిర్ణయం ప్రకారం ముందుకు సాగుతామన్నారు. 

Amaravati

2023-09-20 08:42:07

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త..!

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతంలో సేవింగ్స్ చేసుకునేందుకు వీలుగా ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లను ఉద్యోగులకు ప్రత్యేకంగా తెరిచి వారి శాలరీ బ్యాంకు ఖాతాలను కూడా లింక్ చేసింది. తద్వారా ఉద్యోగులు పెట్టుకున్న కటింగ్స్ నేరుగా పిపిఎఫ్ అకౌంట్ లోకి జమ అవుతా యి. వాస్తవానికి ఉద్యోగంలోకి చేరిన వెంటనే పిపిఎఫ్ అకౌంట్లు ప్రభుత్వం తెరవాల్సి వుంటుంది. కానీ ఉద్యోగాలు రెగ్యులర్ అయిన సుమారు ఆరు నెలలకు ఈ ఖాతాలను తెరిచింది. అయితే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ప్రకటించిన తొలి ఏడాది ఇంక్రిమెంట్ ఆర్డర్లు 19శాఖల సిబ్బందికీ పూర్తిస్థాయిలోరాలేదు. ఆయా ప్రభుత్వశాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయం ఉంచి జిల్లా నేరుగా వీరికి సమాచారం అందుతుంది. సర్వీసు రెగ్యులర్ అయిన తరువాత ప్రభుత్వం ఇవ్వాల్సిన 2 ఇంక్రిమెం ట్లను ఇవ్వలేదు. కొత్తగా వేసిన ఇంక్రిమెంటుకి ఆర్ఢర్లు అందరికీ పూర్తిగా రాకపోవడం విశేషం.

Tadepalli

2023-09-08 11:55:27

రాష్ట్రంలో 10 మంది ఐపిఎస్ లకు బదిలీలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 11 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఈ క్రమంలో విశాఖ సీపీగా డా. రవిశంకర్‌ అయ్యన్నార్‌, వైఎస్సార్‌ కడప జిల్లా ఎస్పీగా సిద్ధార్థ్‌ కౌషల్‌,  అన్నమయ్య జిల్లా ఎస్పీగా బొడ్డేపల్లి కృష్ణారావు బదిలీ అయ్యారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా విశ్వజిత్‌, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా త్రివిక్రమ వర్మ, అనంతపురం ఎస్పీగా అన్బురాజన్‌,విశాఖ లా అండ్‌ ఆర్డర్‌ డీసీపీగా కే. శ్రీనివాసరావు, గ్రేహౌండ్స్‌ ఎస్పీగా విద్యాసాగర్‌ నాయుడు, అనంతపూర్‌ 14వ బెటాలియన్‌ కమాండెంట్‌గా ఆర్‌. గంగాధర్‌రావు, ఏసీబీ ఎస్పీగా అద్నాన్‌ నయిం అస్మీ, తూర్పు గోదావరి జిల్లా ఎస్పీగా పి. జగదీష్‌ నియామకం అయ్యారు. విశాఖ సిపి త్రివిక్రమ వర్మను అత్యంత తక్కువ సమయంలోనే బదిలీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అదే సమయంలో విశాఖ సిపీ ప్రభుత్వం అడిషనల్ రేంక్ అధికారిని నియమించింది.

Tadepalli

2023-09-05 09:47:20