1 ENS Live Breaking News

సచివాలయ మహిళా పోలీసులకు డిపార్ట్ మెంట్ స్లైడింగ్..?!

గ్రామ, వార్డు సచివాలయశాఖలో ఉద్యోగుల బాలరిష్టాలకు కూటమి ప్రభుత్వం పరిష్కారం చూపే విధంగా అడుగులు వేస్తోంది.. తలా తోకా లేకుండా గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయశాఖలో ఉద్యోగులకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా పరమైన చర్యలు తీసుకోవడానికి ఉపక్రమిస్తోంది.. నాలుగు పోస్టులకి కలిపిఒకే పోటీపరీక్ష రాసి పోలీసుశాఖలోని మహిళా పోలీసులుగా విధుల్లో చేరిన వీరిని కోర్టు కేసులు వెంటాడుతున్నాయి. దీనితో వీరికి ఎలాంటి ప్రభుత్వశాఖ కేటాయించకుండా అనామతు ప్రభుత్వశాఖ ఉద్యోగులుగా విధు లు మాత్రం చేయించుకుంటుందీ ప్రభుత్వం.. దానితో వీరంతా సర్వీస్ రూల్స్, ప్రమోషన్ ఛానల్, డిపార్ట్ మెంట్ అన్నీ కోల్పోయారు. అదే సమయంలో వీరితో పాటు చేరిన వారందరికీ పదోన్నతులు ఇస్తున్నది ప్రభుత్వం. ఇపుడు వారికి న్యాయం చేసేందుకు వీలుగా ప్రభు త్వం యోచన చేస్తుండటంతో వారికి రెండు లేదా మూడు ప్రభుత్వశాఖలను స్లైడింగ్ ఇచ్చి వారికి ఖాళీలున్న సచివాలయ పోస్టులను భర్తీచే యాలని ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తున్నది. అదే జరిగితే మహిళా పోలీసుల కష్టాలు గట్టెక్కినట్టే..!

గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ రెండేళ్లుకు పెంచేయడంతో.. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత 75 ప్రభుత్వశాఖల్లోని వేల సంఖ్యలో ఉద్యోగులు రిటైర్ అయిపోతున్నారు. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం కూడా కొత్త నోటిఫికేషన్లు విడుదల చేసి ఖాళీలను భర్తీచేసే పరిస్థితి కూడా లేదు. ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం ముందున్న రెండు ఉపయోగకరమైన అంశాలేంటంటే.. ఒకటి రేషనలైజేషన్, రెండవది డిపార్ట్ మెంట్ స్లైడింగ్. మొదటిది ఎలాగూ అమలు చేసి మిగులు ఉద్యోగులను ఇతర ప్రభుత్వశాఖల్లో వినియోగించుకునే విధంగా జీఓనెంబరు-1 విడుదల చేసింది. ఇపుడు కోర్టుకేసులు, గత ప్రభుత్వం ఏమీ చేయకుండా వదిలేసిన గ్రామ, వార్డు సచివాలయశాఖలోని మహిళా పోలీసులకు డిపార్ట్ మెంట్ స్లైడింగ్ ఇచ్చి వారిని ఖాళీగా ఉన్న పోస్టుల్లో భర్తీ చేయయడం. 

దానికోసం ఇపుడు ప్రభుత్వం వేగంగా చర్యలు మొదలు పెట్టింది. కోర్టు కేసులు ఎప్పుడు తేలతాయో తెలీదు.. అలాగని ప్రభుత్వశాఖల్లో సిబ్బంది లేకపోతే పరిపాలనా పరమైన చిక్కులు రౌండప్ చేసేస్తాయి. వీటి నుంచి బయట పడాలంటే ఖాళీగా ఉన్న ప్రభుత్వశాఖల్లో ప్రస్తుతం ఏ ప్రభుత్వశాఖకూ చెందని మహిళా పోలీసులకు స్లైడింగ్ ఇవ్వడం ద్వారా సదరు ఖాళీల్లో భర్తీచేయడానికి వీలుపడుతుంది. అదే సమయంలో మహిళా పోలీసుల సమస్య కూడా పరిష్కారం అవుతుంది. దానికోసం రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోనేి 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సుమారు 14వేల మంది మహిళా పోలీసులకు డిపార్ట్ మెంట్ స్లైడింగ్ ఇవ్వడం ద్వారా వారికి ఒక ప్రభుత్వ శాఖ కేటాయించినట్టు అవుతుంది. అంతేకాకుండా పదోన్నతులు కల్పించడాకి కూడా వీలు పడుతుంది.

ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాకు అనుబంధ శాఖలుగా ఉన్న పంచాతీయతీరాజ్ శాఖలోని పంచాయతీ కార్యదర్శిలు, పురపాలకశాఖలోని వార్డు అడ్మిన్లు సాంఘిక సంక్షేమశాఖలోని డిజిల్ అసిస్టెంట్లు, రెవిన్యూ శాఖలోని విఆర్వో పోస్టులు భారీ ఎత్తున ఖాళీలు ఉన్నాయి.. వాటికి తోడు మరో 5 నెలల్లో ఉద్యోగ విరమణ చేయబోయే ఉద్యోగులతో తో మరింత ఎక్కువ ఖాళీలు ఏర్పడబోతున్నాయి. ఖాళీ అయిన పోస్టుల్లో మహిళా పోలీసులకి డిపార్ట్ మెంట్ స్లైండింగ్ ఇవ్వడం ద్వారా ప్రాధాన్యత కలిగిన పోస్టులను భర్తీచేయడానికి అవకాశం ఏర్పడుతుంది. చాలా వార్డు సచివాలయాలు, గ్రామ, సచివాలయాలు ఇన్చార్జి సెక్రటరీలతోనే నడుస్తున్నాయి. ఖాళీలను భర్తీచేయడానికి ఇటీవలే గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు మెరిట్ బేస్డ్ గ్రేడ్-4 పంచాయతీకార్యదర్శిలుగా పదోన్నతులు కల్పించింది ప్రభుత్వం(ప్రస్తుతం ఎన్నికల కోడ్ కారణంగా అవి నిచిలిపోయాయి తరువాత పదోన్నతులు చేపడతారు) 

అయినప్పటి ఇంకా చాలా ఖాళీలు మిగిలిపోతున్నాయి.  వాటిని భర్తీచేయాలంటే ప్రభుత్వానికి కొత్త నోటిఫికేషన్లు తీయడం ఒక్కటే శరణ్యం. కానీ రాష్ట్రప్రభుత్వంలోని ఒక ఉన్నతస్థాయి అధికారి గతంలో ఓ సారి టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసిన డిపార్ట్ మెంట్ స్లైడింగ్ అంశాన్ని తెరమీదకు తీసుకు రావడంతో ప్రభుత్వం ఆ విధంగా చేస్తే ఎలావుంటుందో పరిశీలించాలని  ఆదేశించిందట. అలా వచ్చిన ఆలోచన ద్వారానే ఉద్యోగులకు డిపార్ట్ మెంట్ స్లైడింగ్ ఇస్తారని చెబుతున్నారు. అది కూడా అధికారిక ఉత్తర్వులు వస్తే తప్పా క్లారిటీ వచ్చే పరిస్థితి లేదు. కాకపోతే గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులకి ప్రభుత్వశాఖ లేకుండా వారికి గాల్లో పెట్టి ఉద్యోగాల్లో కొనసాగించడం కూడా ప్రభుత్వ తప్పే అవుతుంది. దానిని నుంచి బయట పడాలన్నా ప్రభుత్వం డిపార్ట్ మెంట్ స్లైడింగ్ ని అమలు చేయాల్సి వస్తుంది. 

అదే జరిగితే రాష్ట్రంలోని అన్ని పంచాయతీలకు సెక్రటరీలు నియామకంతోపాటు, వార్డుల్లోని అడ్మిన్ సెక్రటరీల నియామకం, వీఆర్వో ఖాళీల బర్తీ, డిజిటల్ అసిస్టెంట్ల భర్తీ అన్ని జరిగిపోతాయి. దీనితో ప్రభుత్వం కూడా ఈ విధంగా చేయాలని ప్రాధమికంగా ఆలోచనకు వచ్చినట్టు సమాచారం అందుతుంది. కాగా మార్చిలో ఎమ్మెల్సీ ఎన్నికల తంతు పూర్తయిన తరువాత రాష్ట్రప్రభుత్వం సచివాలయ మహిళా పోలీసులకు డిపార్ట్ మెంట్ స్లైడింగ్ ఇచ్చే అంశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎన్ని ప్రభుత్వశాఖలకు స్లైడింగ్ ఇస్తుంది.. ఏ పోస్టుల్లో భర్తీచేస్తుంది అనేది మాత్రం తేలాల్సి వుంది..?!


visakhapatnam

2025-02-14 14:05:35

రేషనలైజేషన్ దెబ్బ...40వేల ఉద్యోగాలు అబ్బా..?!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయశాఖలో చేపట్టిన రేషనలైజేషన్ తో ఏకంగా ప్రభుత్వం 40వేల మంది ఉద్యోగులను.. 74 ప్రభుత్వశాఖల్లో సర్దుబాటు చేసుకోవడానికి వీలు కల్పించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెంచేసిన రిటైర్ మెంట్ ఏజ్ 62ఏళ్లు పూర్తైన వారం తా వరుసగా మూడు నెలల్లో వేల సంఖ్యలో రిటైర్ అయిపోతున్నారు. ఆ ఖాళీల్లో ఉద్యోగులను కొత్తగా నియమించాలంటే ప్రభుత్వానికి కొం డంత భారం. దానితో లక్షా 30వేలకు పైగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ శాఖను రేషనలైజేషన్ చేస్తే.. కొత్తగా ఉద్యోగాలు భర్తీచేసే పనిలే కుండా.. సిబ్బందిని అవసరం ఉన్న ఖాళీలున్న శాఖ్లల్లోకి భర్తీచేసుకోవచ్చునని భావించింది. మూడు కేటగిరీల క్రింద గ్రామ, వార్డు సచివా లయాలను విభజిస్తే.. ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల్లో సుమారు 40వేల మందికి పైగా ప్రభుత్వానికి కలిసొచ్చారు.. వారందరికీ ఇపుడు రిటైర్ అయిపోతున్న ఖాళీల్లో అవసరమైన చోట డిప్యూటేషన్ పై నియమిస్తున్నారు..!

రాష్ట్రప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించమంటే మీన మేషాలు, రాజ్యాంగంలోని చట్టాలను, కోర్టు కేసులను , ఆర్ధిక ఇబ్బందులను బూచిగా చూపిస్తుంది కానీ.. ప్రభుత్వానికే అవసరం అనుకుంటే అనుకున్నది చేయడానికి గంటల వ్యవధిలో జీఓలు విడుదల చేసి.. వారం రోజుల్లోనే ఉద్యోగులను అనుకున్న చోటుకి పంపించగలరు. ఇపుడు కూడా అదే చేసింది కూటమి ప్రభుత్వం రేషనలైజేషన్ చేసి గ్రామ, వార్డు సచివాలయాల్లోని సిబ్బందిని ఇతర  ప్రభుత్వశాఖల్లోని ఖాళీలను భర్తీచేయడానికి వినియోగిస్తున్నది. వాస్తవానికి చాలా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న సిబ్బందికి పూర్తిస్థాయిలో పనులు లేవు. అయినా గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం సర్వేలు, సమాచార సేరకరణ, ప్రభుత్వ పథకాల పంపిణీ పేరుతో వీరితో సాధారణ ప్రభుత్వ విధుల కంటే అదనంగానే పనులు చేయిస్తూ వచ్చింది. 

ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రప్రభుత్వంలోని 74 ప్రభుత్వశాఖల్లో ఏ శాఖలోనూ లేనివిధంగా వీరి ఉద్యోగాల భర్తీ, శాఖల కేటాయింపూ.. పలానా శాఖ పనులనే కాకుండా అన్ని ప్రభుత్వశాఖ ల పనులూ చేయించడం మొదలు కొని.. తలా తోకా లేనివిధంగా కనీసం సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ కూడా ఏర్పాటు చేయని శాఖ ఏదైనా ఉందంటే అది ఇదేనని చెప్పొచ్చు.  ఇదంతా ప్రభుత్వ సౌలభ్యం కోసమే చేసుకుంటుందంటే అతిశయోక్తి కాదు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు భర్తీచేపట్టి ఐదేళ్లు దాటిపోతున్నా.. నేటికీ వీరి మాతృశాఖలు ఏంటి..? సదరు మాతృశాఖలోని సర్వీసు నిబంధనలు వీరికి కూడా వర్తిస్తారా అంటే ఆ ఒక్కటీ అడక్కు అనే అంటోంది రాష్ట్ర ప్రభుత్వం. అలాగని కొత్తగా ఏర్పాటు చేస్తారా అంటే.. రాజ్యాంగంలోని ఏ నిబంధనల క్రింద మీకు సర్వీసు నిబంధనలు ఇవ్వాలని తిరిగి ప్రశ్నిస్తున్నది.

 చచ్చీ చెడీ రాజ్యాంగంలోని కొన్ని నిబంధన ప్రకారం మాకూ మా మాతృశాఖల్లోని నిబంధనలే వర్తింపచేయొచ్చనే వెసులు వాటు ఉందీ అంటే... ఇప్పుడప్పుడే కాదు తరువాత చూద్దాం అంటోంది. అంటే ఉద్యోగులకు చట్టబద్ధంగా, న్యాయ బద్ధంగా ఇవ్వాల్సిన ప్రయోజనాల విషయంలో మీనమేషాలు లెక్కపెట్టుకుంటూ వచ్చిన ప్రభుత్వం.. ఇపుడు అత్యవసరంగా కొత్తగా ఉద్యోగాల భర్తీ చేయాల్సి వస్తుందని మాత్రం రేషనలైజేషన్ పేరుతో ఉద్యోగులను కుదించేసింది. అదేమంటే ప్రభుత్వం అనుకుంటే ఏమైనా చేస్తుంది.. పరిపాలనా సౌలభ్యం కోసం ఏ నిర్ణయమైనా తీసుకును అధికారం ప్రభుత్వానికి ఉందని ప్రత్యేక జీఓలు వెలువరించి మరీ చెబుతున్నది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో  15 వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లోని లక్షా 35వేల మంది ఉన్న ఉద్యోగులు గత ప్రభుత్వంతో పాటు, ఇపుడు కూటమి ప్రభుత్వంలోనూ హెచ్చరికలు, బెదిరింపులు, టార్గెట్ లకు గురవుతూనే ఉన్నారు. ఐదేళ్ల నుంచి ఈశాఖ ఉద్యోగులకు విధినిర్వహణలో సమయపాలన లేదంటే అతిశయోక్తి కాదు. 

కనీసం రెండవ శనివారాలు, ఆదివారాలు, పండుగ సెలవులు అనేవి కూడా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులతో పనులు చేయించుకుంటూ వస్తున్నది. అయితే ప్రభుత్వంలో రెగ్యులర్ ఉద్యోగమనే ఒకే ఒక్క కారణంతో విధులు చేస్తున్న ఉద్యోగుల విషయంలో గత ప్రభుత్వం మాదిరిగానే కూటమి ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసింది. దీనితో వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని కాదని.. అనవసరంగా కూటమి ప్రభుత్వానికి చేయూతనిచ్చామని.. కనీసం గత ప్రభుత్వం అధికారంలో ఉంటే ఇప్పటికైనా తమకు పదోన్నతులు, సర్వీసు నిబంధనలు వచ్చి ఉండేవని సామాజకి మాద్యమాల్లో పెద్ద చర్చలకు తెరలేపుతున్న ఉద్యోగులు. ఎవరు ఎన్ని చేసినా వచ్చే నాలుగున్నరేళ్లు కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఆధారంగా గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులు పనిచేయక తప్పదు. 

గత ప్రభుత్వమే కాదు.. ఈ ప్రభుత్వంలోనూ సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావనే విషయం జీఓనెంబరు 1 విడుదల (రేషనలైజేషన్) తో తేలిపోయింది. ఇక్కడ ఉద్యోగులను తీసుకెళ్లి ఇతరశాఖల్లో ఇన్చార్జిలుగా నియమిస్తే.. ఆ శాఖలో పనిచేయడానికి తప్పా.. ప్రభుత్వ ప్రయోజనాలు ఏ మాత్రం రావనే విషయం, ప్రభుత్వం అమలు చేయదనే విషయం సచివాలయ ఉద్యోగులకు తెలిసినట్టు లేదంటున్నారు విశ్లేషకులు. చూడాలి అవసరం కోసం రేషనలైజేషన్ చేసిన ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలు నెరవేస్తుందా..? గత ప్రభుత్వం మాదిరిగా గాలికొదిలేస్తుందా..? అనేది..?!


viskahapatnam

2025-01-30 15:34:56

సచివాలయ ఉద్యోగులు ఇతర శాఖల్లోకే..!

నో డౌట్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో ఈరోజు-ఈఎన్ఎస్ ప్రత్యేక కథనాల్లో చెప్పిందే..కూటమి ప్రభుత్వం తూచా తప్ప కుండా అధికారికంగా చేసి చూపించింది.. దీనితో ప్రభుత్వం చేయబోయే విధానాలను ఈరోజు-ఈఎన్ఎస్ ముందుగా  గెస్ చేసి వార్త కథనాలు ఏ విధంగా ప్రచురించగలిగిందీ అంటూ.. ప్రధాన మీడియా సంస్థలు తలలు పట్టుకుంటున్నాయి.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెంచేసిన రిటైర్ మెంట్ వయస్సు అదనపు రెండేళ్లు కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత తీరిపోయింది.. వేల సంఖ్యలో 74 ప్రభుత్వశాఖల్లోని ఉద్యో గులు రిటైర్ అయిపోతున్నారు. వారి స్థానంలో కొత్తగా ఉద్యోగాలు భర్తీచేయాలంటే ఇప్పట్లో జరిగే పనికాదు..దానితో 2వ అతిపెద్ద ప్రభుత్వశా ఖగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయశాఖలోని ఉద్యోగులను రేషనలైజేషన్ పేరుతో మదింపు చేస్తే.. ఇప్పట్లో కొత్తగా ఉద్యోగాలు తీసే పనుండ దు..అందుకోసం ఆఘమేఘాలపై కూటమి ప్రభుత్వం క్యాబినెట్ లో చర్చించి దానిని వెనువెంటనే అమల్లోకి తెచ్చేవిధంగా జీఓఎంఎస్ నెంబ రు-1ని విడుదల చేసింది.  దీనితో ఈరోజు-ఈఎన్ఎస్ రాసిన రేషనలైజేషన్ పేరుతో ఉద్యోగుల మదింపు జరుగుతుందని రాసిన ప్రత్యేక కథనం మరోసారి నిజమని రుజువైంది..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగుల రేషనలైజేషన్ కోసం ఇచ్చిన జీఓనెంబరు-1లో ఉద్యోగలను మూడు కేటగిరీల క్రింద విభజించి.. మిగులు ఉద్యోగులను ఇతర ప్రభుత్వశాఖల్లో ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ నియమి స్తామని పక్కాగా పేర్కొంది. కానీ  ప్రస్తుత సచివాలయశాఖలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులకు నేటికీ సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ లేదు. ఆ విషయంలో ఏం చేయబోతుందనే అంశం మాత్రం ఎక్కడా పేర్కొనలేదు.  ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల విషయంలో ఎన్నేళ్లు ఆలస్యం చేస్తే అన్నేళ్లూ ఇక్కడ ఉద్యోగులకు పదోన్నతులు రావు. ఒక వేళ పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వం భావించినా.. ఏ ప్రభుత్వ శాఖలోని సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ వినియోగించి చేపడుతుందనే అంశం ఉత్పన్నమవుతుంది. 

బహుసా ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకున్న గత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జీవితాంతం పదోన్నతులు రాకుం డా..ఒకే దగ్గరే ఒకే క్యాడర్ లో ఉద్యో గ విరమణ చేయించేద్దామని బావించి వుంటుంది. గత ప్రభుత్వం అమలు చేయని సర్వీస్ రూల్స్, ప్రమో షన్ ఛానల్ విషయంలో కూటమి ప్రభుత్వం కూడా అంతే తాత్సారాన్ని ప్రదర్శిస్తున్నది. ఇదే సమయంలో ఇతర ప్రభుత్వశాఖల్లో ఉద్యోగులు రిటైర్ అవుతున్న సమయంలో మాత్రం పరిపాలనలో ఎక్కడా ఇబ్బందులు రాకుండా గ్రామ, వార్డు సచివాలయశాఖలోని ఉద్యో గులను అవరం ఉన్న శాఖలకు డిప్యూటేషన్లపై పంపిస్తున్నది. అంటే ఇక్కడ ఉద్యోగులతో పనిచేయించుకోవడానికి సౌలభ్యం కుదురు తోంది కానీ.. ఉద్యోగులకు రాజ్యాంగ బద్దంగా అమలు చేయాల్సిన సర్వీస్ రూల్స్, ప్రమోషన్ ఛానల్ పై మాత్రం ప్రభుత్వం నోరు మెదపడం లేదు. భారత దేశంలో 29 రాష్ట్రాల్లోని ఏ ప్రభుత్వంలోనూ లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే గ్రామ, వార్డు సచివాలయశాఖ లో తలా తోకాలేని నియమాకాలు జరిగాయంటే అతిశయోక్తి కాదేమో. 

ఇదే విషయాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సచివాలయ మహిళా పోలీసుల విషయంలో జరిగిన తేడాతనాన్ని, వీరికి జరిగి న అన్యాయాన్ని అసెంబ్లీ, శాసన మండలి సాక్షిగా ప్రశ్నించారు. పెద్ద  చర్చకి కూడా తీసుకు వచ్చారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో చర్చ లు అయితే జరిగాయి కానీ వీరిని ఏం చేస్తారనే విషయంలో మాత్రం నేటికీ పోలీసుశాఖ నుంచి కూడా ఎలాంటి క్లారిటీ లేదు. ఇప్పట్లో వస్తుందనే నమ్మకం కూడా లేదంటున్నారు మహిళా పోలీసులు చాలా నీరసంగా. ఇదిలా ఉంటే తమ శాఖ మత్స్యశాఖ ఉద్యోగులను మాకిచ్చే యండని మత్స్య, వ్యవసాయశాఖ మంత్రి కించజరాపు అచ్చెన్నాయుడు ప్రభుత్వానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి..సదరు శాఖ కమిష నర్ ద్వారా జిఏడికి రాసిన లేఖపై కూగా ప్రభుత్వం నుంచి నేటికీ అతీ గతీలేదు. ఇక్కడ  ఒక అంశం చాలా క్లియర్ గా కనిపిస్తున్నది. సచివాల యాల్లోని 19విభాగాల ఉద్యోగులను గత ప్రభుత్వం ఆయా మాతృశాఖల ద్వారానే నియామకాలు చేపట్టింది. కానీ.. ఆ మాతృశాఖలోని లేని క్యాడర్ ని వీరికి ఇచ్చింది. 

సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ కూడా ఏర్పాటు చేయలేదు. దీనితో ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు ఏ క్యాడర్ కి చెందిన వారో నేటికీ ప్రభుత్వానికే తెలియని విధంగా ఉంది. ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వంలో అటెండర్ తరువాత ఉద్యోగలు గ్రేడ్-4 నుంచి ప్రారంభం అవు తారు. కానీ గత ప్రభుత్వం కొత్తగా గ్రేడ్-5 అనే క్యాడర్ ని సృష్టించింది. అలా వీరి సర్వీసు కొనసాగితే.. పక్కాగా సర్వీసు నిబంధనలు, ప్రమో షన్ ఛానల్ ఉంటే.. వీరి పదోన్నతులు పదేళ్లు వెనక్కి వెళ్లిపోతాయన్నమాట. అపుడు మళ్లీ కొత్తగా ఉద్యోగాలు తీసే పనుండదు. అందులోనూ సాంకేతిక సమస్యలు, కోర్టు కేసులు ఉంటే చెప్పాల్సిన పనేలేదు. మరో పదేళ్లు ఉద్యోగులకు పదోన్నతులు కల్పించే పనే ఉండ దు. సరిగ్గా ఆ అంశమే ప్రభుత్వానికి కలిసి వచ్చింది.  సచివాలయ మహిళా పోలీసుల విషయంలో కోర్టుకేసుల నెపంతో వారి పదోన్నతులకు సంబంధించి ప్రభుత్వం చెబుతున్న మాట కూడా అదే. మీ విషయం కోర్టు పరిధిలో ఉంది.. ఆ కేసులు క్లియర్ అయ్యేవరకూ ప్రభుత్వం కోర్టు కేసులను కాదని ఏమీ చేయడానికి లేదు అని చెబుతోంది. 

ఒక్క మహిళా పోలీసుల విషయంలోనే కాదు.. సర్వీసు నిబంధనలు లేని ఇతర విభాగాల ఉద్యోగుల విషయంలోనూ ప్రభుత్వశాఖల జిల్లా అధికారులు చెబుతున్న మాట కూడా అదే. ప్రభుత్వం ఎలాంటి డైరెక్షన్స్ ఇవ్వకుండా ఏవిధంగా మీకు పదోన్నతులు కల్పించాలని ఉద్యోగులనే తిరిగి ప్రశ్నిస్తున్నది. అలాగని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల అంశాలన్ని జిఏడీ కానీ, ఈశాఖ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ గానీ చొరవ తీసుకొని ఇతర ప్రభుత్వశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిలతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరిస్తారా అంటే అదీ జరగడంలేదు.  కానీ ఒక్కటి మాత్రం గత ఐదేళ్ల నుంచీ జరుగుతూనే ఉంది.  ఎక్కడైతే ఇతర ప్రభుత్వశాఖల మాదిరిగా వీరికి కూడా అన్నీ సక్రమంగా ఉంటే ప్రభుత్వ ప్రయోజనాలు ఇవ్వాల్సి వస్తుందోనని.. ఏమీ చేయకుండానే వీరితో సాధారణ విధుల కంటే అదనపు సమయం కూడా విధులు గత ప్రభుత్వంతో పాటు.. ఈ ప్రభుత్వం కూడా చేయించుకుంటూ వస్తున్నది.

ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను కూడా ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులుగా గుర్తిస్తే.. రాజ్యాంగ బద్ధంగా వీరికి అమలు చేయాల్సిన సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేసి వీరికి కూడా పదోన్నతులు కల్పించాలి. అలా పదోన్నతులు కల్పించినా కూడా ఉద్యోగులు ఎక్కడికీ వెళ్లడానికి వీలుపడదు. ఇక్కడే అదే సచివాయాల్లోనే ఉద్యోగాలు చేయక తప్పదు. పదోన్నతులు ఇచ్చి.. ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగుల మాదరిగా ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాలను వీరికి కూడా కల్పించాలి. ప్రభుత్వం ఇప్పట్లో ఆ సాంకేతిక కారణాలను సరిచేయకపోతే రేపు పీఆర్సీ వేసే సమయంలో మళ్లీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.

 దీని ప్రభావం ఉద్యోగుల పే స్కేలుపై పడుతుంది. ఇప్పటికే గత ప్రభుత్వం చేసిన మోసం వలన ఉద్యోగులు సర్వీసు రెగ్యులర్ అయిన తరువాత పొందాల్సిన రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు కోల్పోయారు. పీఆర్సీ ఇచ్చారు గానీ.. అరియర్స్ నష్టపోయారు. ఇదే పద్దతి కొనసాగితే భవిష్యత్తులో కూటమి ప్రభుత్వంలో కూడా మరోసారి ఉద్యోగులు ప్రభుత్వ ప్రయోజనాలను నష్టపోక తప్పదు. చూడాలి కూటమి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్, కోర్టుకేసుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుని ఉద్యోగులకు మేలు చేస్తుందనేది..?!

visakhapatnam

2025-01-27 06:09:21

సచివాలయ ఉద్యోగులకు పదోన్నతి పండుగ..! ఈరోజు-ఈఎన్ఎస్ కథనాలకు స్పందన

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సంక్రాంతి వెళ్లిన తరువాత అసలైన పెద్ద పండుగ వచ్చింది..  పదోన్నతుల కబురు మోసుకొచ్చింది.. పండుగ ముందే తీపి కబురు చెబుదామనుకున్నా.. అనివార్య కారణాలతో ఆలస్యమైంది.. ఈరోజు-ఈఎన్ఎస్ ప్రత్యేక కథనాలు ఫలితాలు ఇవ్వడం మొదలు పెట్టాయి.. అసలు ఈరోజు పేపర్, ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీలో వార్తలొస్తే.. ప్రభుత్వం స్పందిస్తుందా..? అని బీరాలు పోయిన వారందరికీ కూటమి ప్రభుత్వంలోనూ.. ప్రభుత్వమే ప్రత్యేక జీఓలు, ప్రొసీడింగ్ ఆర్డర్లు వెలువరించడంతో తేడాగా మాట్లా డిన వారంతా బిక్క మొహం వేస్తున్నారు.. మరికొందరు ఈ ఘనత మాదేనని ప్రచారాలూ చేసుకుంటున్నారు.. ఎవరు ఏవిధంగా ఏం చేసు కున్నా.. అల్టిమేట్ గా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు న్యాయం జరగాలన్నదే ఈరోజు-ఈఎన్ఎస్ లక్ష్యం. ఇపుడు అది గ్రామ సచివాల యాల్లోని గ్రేడ్-5 కార్యదర్శిలకు గ్రేడ్-4 కార్యదర్శిలుగా పదోన్నతి లభించడంతో ప్రారంభమైంది.. ఒక రకంగా సచివాలయంలో పంచాయతీ కార్యదర్శిలకు పండగైతే నేటికీ సర్వీస్ రూల్స్ నోచుకోని ఉద్యోగులకు ఇది చేదు వార్తే..!

ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం గ్రామ సచివాలయ ఉద్యోగుల పట్ల కరుణ చూపించింది. డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ చొరవతో సచివాలయ కార్యదర్శిలకు ప్రమోషన్ కి లైన్ క్లియర్ అయ్యింది. త్వరలో భారీగా ఏర్పడుతున్న ఖాళీలు, ఇన్చార్జి కార్యదర్శిలతో నడుస్తున్న పంచాయతీలకు మోక్షం కల్పించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో గ్రేడ్-5 ఉద్యోగులకు మొదటి పదోన్నతి లభించింది. ఈ విషయంలో ఈరోజు-ఈఎన్ఎస్ అందించిన ప్రత్యేక కథనాలు కూడా ప్రభుత్వాన్ని కూడా ఆలోచింప జేశాయి.  ఉద్యోగాలిచ్చి పదోన్నతులు ఇవ్వకుండా దారీ తెన్నూలేకుండా వదిలేసిన గత ప్రభుత్వ పరిపాలనకు భిన్నంగా కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు ఇస్తూ తీపి కబురు చెప్పింది. 

గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏర్పాటైన దగ్గర నుంచి ఈశాఖ ఉద్యోగులు, వారి ఇబ్బందులు, ప్రభుత్వం చేస్తున్న కార్యకలాపాలు, పరిపాలన ఇలా అన్ని కోణాల్లోనూ ఏ మీడియా సంస్థ రాయని విధంగా ఈరోజు-ఈఎన్ఎస్ ప్రత్యేక కథనాలు ప్రచురిస్తూ వస్తున్నది. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రప్రభుత్వంలోని జిఏడి(జనరల్ అడ్మిస్ట్రేషన్ డిపార్ట్) ని ప్రతీ విషయంలోనూ తట్టి లేపుతున్నది. ఉద్యోగుల సర్వీసుల క్రమబద్దీకరణ దగ్గర నుంచి వీరికి సర్వీసు రూల్స్ లేని విధానం, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయని విధానం, పీఆర్సీ ఇచ్చినా ప్రయోజనాలు కల్పించని అంశం, సర్వీసు రెగ్యులర్ అయిన తరువాత ఇవ్వాల్సిన రెండు నోషనల్ ఇంక్రిమెంట్ల విషయం ఇలా అన్ని విషయాల్లో ఉద్యోగులకు జరిగిన అన్యాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలోనూ.. సంబంధిత శాఖ మంత్రులు, జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్ల దృష్టికి తీసుకెళ్లడంలో కూడా ఎంతో బాధ్యత వహించింది. 

రాజ్యాంగ బద్దంగా సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం కల్పించాల్సిన సర్వీస్ రూల్స్, ప్రమోషన్ ఛానల్, పేస్కేలు అమలు వంటి అంశాలను ప్రభుత్వం చేస్తున్న ఆలస్యం విషయంలో ప్రత్యేక  కథనాలతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతూ వచ్చింది. దాని ఫలితంగా ఇపుడు గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు ఇపుడు గ్రేడ్-4 కార్యదర్శిలుగా పదోన్నతులు లభిస్తున్నాయి. ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీచేసింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకి గత ప్రభుత్వంలోనూ ఒకరిద్దరికి పదోన్నతులు ఇచ్చి మిగిలిన విభాగాల ఉద్యోగులను ఊరిస్తూ వచ్చి ఆఖరికి చేతులెత్తేసింది. తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు సచివాలయాలను రేషనలైజేషన్ చేయడంతోపాటు, ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని మొదటిగా  ఇన్ సర్వీసు పూర్తి చేసుకున్న ఏఎన్ఎంలకు స్టాప్ నర్సులుగానూ, ఇపడు  గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు గ్రేడ్-4 కార్యదర్శిలుగా పదోన్నతులు కల్పించింది. 

ఈ క్రమంలో ఇంకా సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ లేని సుమారు మహిళా పోలీసులు, వెల్ఫేర్ అసిస్టెంట్లతో సహా పది విభాగాల ఉద్యోగులు ఉసూరు మంటున్నారు. అయితే సచివాలయశాఖలోని ఉద్యోగులకు పదోన్నతులు మొదలైతే మిగిలినశాఖల సిబ్బందికి కూడా పదోన్నతులు రాజ్యాంగం ప్రకారం కల్పించాల్సి వుంటుంది. కానీ మహిళా పోలీసుల అంశం కోర్టు కేసుల్లో ఉండిపోవడంతో వారికి ఇప్పట్లో పదోన్నతులు వచ్చే పరిస్థితి లేదు. అలాగని సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ లేని వివిధ విభాగాల ఉద్యోగులకు కూడా ప్రమోషన్ ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు కూడా రేషనలైజేషన్ ద్వారా ప్రస్తుతం ఉన్న సచివాలయ సిబ్బంది తగ్గిపోతారు. అలా తగ్గిపోయిన సిబ్బందిని వారి మాతృశాఖల్లో అదనపు సిబ్బందిగా వినియోగించుకునే అవకాశాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నది. దానికి కారణం వేల సంఖ్యలో ఉద్యోగులు రిటైర్ అయిపోవడమే. ప్రస్తుతం ప్రభుత్వం కొత్త ఉద్యోగాలను భర్తీచేయలేక.. రేషనలైజేషన్ పేరుతో ఉద్యోగులను కుదించడంతోపాటు, అవకాశం ఉన్నవారికి పదోన్నతులు కల్పిస్తే.. ఉద్యోగులకు కాస్త ఉపసమనం లభిస్తుందని.. ఉద్యోగుల నుంచి వ్యతిరేక రాదని భావించి అనుకున్నదే తడువుగా పదోన్నతులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది.

అసెంబ్లీకే పరిమితమైన హోం మంత్రి వ్యాఖ్యలు..
గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని మహిళా పోలీసుల అంశం హోం మంత్రి అనిత రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తావిస్తే వారికి ఉపసమనం కలుగుతుందని ఉద్యోగులంతా భావించారు. కానీ ఆ తరువాత మహిళా పోలీసుల విషయంలో హోంశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దానికి తోడు వీరి నియమాకాల విషయంలో కోర్టు కేసులు కూడా ఉండటం, ప్రభుత్వం కౌంటర్ ఫైల్ దాఖలు చేసే విషయంలోనూ ముందడుగు వేయకపోవడంతో మహిళా పోలీసుల అంశం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు అయిపోయింది. దానితో హోం మంత్రి లేవనెత్తిన అంశం అసెంబ్లీకే పరిమితం అయిపోయినట్టైంది.

మత్స్యశాఖ సహాయకులకు లైన్ క్లియర్ అయ్యే అవకాశాలు..
గ్రామ, వార్డు సచివాలయశాఖలోని ఒక విభాగం ఉద్యోగులుగా ఉన్న గ్రామీణ మత్స్య సహాయకులకు కూడా ప్రమోషన్ ఛానల్ విషయంలో లైన్ క్లియర్అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పిటికే ఈ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తమశాఖ ఉద్యోగులందరికీ తమ మాతృశాఖకు తిరిగి అప్పగించేయాలని జిఏడికి లేఖ కూడా రాశారు. అయితే వీరి నియామకం విషయంలో గ్రేస్ పాయింట్లు కొందరు ఉద్యోగులకు గత ప్రభుత్వం కలిపిన తరువాత నియామకాలు చేపట్టింది. కానీ పదోన్నతులు ఇచ్చే సమయంలో వాటిని మత్స్యశాఖ పరిగణలోనికి తీసుకోకపోవడంతో అన్యాయమైపోతున్న ఉద్యోగులు ప్రభుత్వాన్ని ఆశ్రయించడంతో పదోన్నతుల అంశం నిలిచిపోయింది. అయితే తాజాగా మళ్లీ ఎవరికి అయితే గ్రేస్ పాయింట్లు కలిపారో వాటిని కలుపుకుని సీనియారిటీ జాబితాలు తయారు చేసి వారికి కూడా ప్రమోషన్ ఇవ్వాలని మత్స్యశాఖ భావిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది.

సర్వీస్ రూల్స్ రానంత కాలం పదోన్నతులు రావు..
గ్రామ, వార్డు సచివాలయశాఖలోని నేటికీ  ఆయా మాతృశాఖల ద్వారా నియామకాలు జరిగినా వారికి సర్వీసు నిబంధనలు లేకపోవడం, ప్రమోషన్ ఛానల్ వర్తింపచేయని ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశం లేదు. దానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటే తప్పా వీరికి మోక్షం కలుగదు. అలా జరగాలంటే సదరు శాఖల మంత్రులు ప్రత్యేక చొరవ తీసుకుంటే తప్పా జిఏడీ నుంచి వీరికి నిర్ధిష్టమైన ఆదేశాలు వచ్చే అవకాశం లేదు. ఈ విషయంలో సచివాలయ ఉద్యోగ సంఘాలు ఎన్ని ఆందోళనలు చేసినా.. ప్రభుత్వానికి అర్జీలు పెట్టినా ప్రయోజనం మాత్రం నేటికీ రాలేదు. అన్నిశాఖల కంటే ముందుగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతీసుకోవడంతో పంచాయతీ కార్యదర్శిలకు మాత్రం మొదటి ప్రమోషన్ వచ్చేస్తున్నది. ఇదే విధంగా మిగిలినశాఖల మంత్రులు కూడా వారి శాఖ ఉద్యోగుల కోసం చొరవ చూపాల్సి ఉంది.

 అయితే అందరి కంటే ముందుగా హోం మంత్రి అసెంబ్లీలోనూ, శాసన మండలిలోనూ మహిళా పోలీసుల అంశాన్ని  లేవనెత్తినా.. తరువాత ఎలాంటి చర్యలు లేవు అలా వదిలేసినా విభాగాల ఉద్యోగులకు కూడా పదోన్నతులు వచ్చే అవకాశం లేదు. కాగా ఒకేసారి విధుల్లోకి చేరిన ఉద్యోగుల్లో కొందరికే పదోన్నతులు దక్కి మిగిలినశాఖల ఉద్యోగులకు పదోన్నతులు రాకపోవడంతో మిగిలిన విభాగాల ఉద్యోగులు మాత్రం కన్నీటి పర్యంతం అవుతున్నారు. వాళ్లు ఏం ఎక్కువ.. మేము ఎక్కువ అంటూ ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం మిగిలిన ఉద్యోగుల పదోన్నతులు, సర్వీసు నిబంధనల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనేది ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.?!

visakhapatnam

2025-01-22 16:50:30

అక్షర సత్యమైన ఈరోజు-ఈఎన్ఎస్ కథనాలు.. సచివాలయాల రేషనలైజేషన్ షురూ..!

ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలు రేషనలైజేషన్ చేయడానికి క్యాబినెట్ లో నిర్ణయం తీసుకుంది.. ఈ విధంగా జరగితీరక తప్పదని.. సిబ్బంది విభజన కూడా చేస్తుందని..ఈరోజు-ఈఎన్ఎస్ గ్రామ, వార్డు సచివాలయాల విషయంలో పరిశోధ నాత్మక కథనాలను ప్రచురిచింది.. చెప్పినట్టుగానే నేడు కూటమి ప్రభుత్వం సచివాలయాలను ప్రజలకు పూర్తిస్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా మార్పులు, చేర్పులకు ఎట్టకేలకు ముందడుగు వేసింది. పరిపాలనకు అనుగుణంగా అయితే మార్పులు చేస్తున్నట్టు ప్రకటించింది తప్పితే సచివాలయ ఉద్యోగుల సర్వీసు నిబందనలు, ప్రమోషన్ ఛానల్, నోషనల్ ఇంక్రిమెంట్లు, పీఆర్సీ ప్రయో జనాల పై మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు. కానీ జవాబుదారీ తనం పెంచేందుకు గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శిలకు, వార్డుల్లో అడ్మి న్ సెక్రటరీలకు సచివాలయాల బాధ్యతను అప్పగించేందుకు నిర్ణయించింది. వేల సంఖ్యలో రిటైర్ అవుతున్న ఉద్యోగుల వలన పరిపాల నలో ఇబ్బందులు రాకుండా మార్పులైతే చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది తప్పితే ఉద్యోగుల ప్రధాన సమస్యలకు మాత్రం ఒక్కదా నికీ పరిష్కారం చూపలేదు..!

గ్రామ, వార్డు సచివాలయాల విషయంలో ఈరోజు-ఈఎన్ఎస్ ప్రచురించిన పరిశోధనాత్మక కథనాల ఆధారంగా కూటమి ప్రభుత్వం విభజన చేయడానికి నిర్ణయించుకుంది. మూడు విభాగాలుగా విభజించి.. దానికి తగ్గట్టుగా ఒక్కో సచివాలయాలనికి కేటరిగీ వారీగా 6 నుంచి 8 మంది సిబ్బంది ఉండే విధంగా మార్పులు చేయడానికి క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. మిగులు సిబ్బందిని మల్టీ పర్పస్  సర్వీసుల క్రింద ఆయా మాత్రుశాఖల్లో వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయాలను జిఏడీ(జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్) పూర్తిస్థాయిలో మార్పులు, చేర్పులు చేసి జీఓ జారీ చేస్తే తప్పా తీసుకున్న నిర్ణయాలకు చట్టబద్దత రాదు. అయితే ఇక్కడ గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శిలను, వార్డుల్లో వార్డు అడ్మిన్ సెక్రటరీలకు పరిపాలన బాధ్యతలు అప్పగించి ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించడాలని ప్రభుత్వం భావిస్తున్నది. 

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న 1.28 లక్షల ఉద్యోగులు సర్ధుబాటు ఆయా సచివాలయాల పరిధిలోని జనాభా ప్రాతిపధిక విభజన చేస్తారు. అలా విభజన చేసే సమయంలో ప్రధాన ప్రభుత్వశాఖల సిబ్బందిని ఉంచి టెక్నికల్ సిబ్బందిని మాత్రం ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఇతర విభాగాల్లోని ఖాళీగా ఉన్న పోస్టుల స్థానంలో కలిపి సేవలు అందించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే సిబ్బంది మార్పులు చేర్పుల వలన జనాభా ఆధారంగా చాలా మంది సిబ్బందికి స్థానచలనం కలిగే అవకాశం కూడా వస్తుంది. ఇప్పటిగే గ్రామాల్లో చాలా సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శిల ఖాళీలు భారీగా ఉన్నాయి. దీనితో వాటిని భర్తీచేసేందుకు మేజర్ పంచాయతీల్లో మూడు సచివాలయాల్లో ఉన్న గ్రేడ్-5 కార్యదర్శిలకు చిన్నపంచాయతీలను అప్పగించింది ప్రభుత్వం. 

అయినప్పటికీ ఇంకా చాలా ఖాళీలు ఉన్నాయి. వాటిని ప్రస్తుతం గ్రేడ్-4, గ్రేడ్-2 పంచాయతీ కార్యదర్శిలకి ఇన్చార్జిలు ఇచ్చి పరిపాలన కొనసాగిస్తున్నది. ఇపుడు చాలా మంది సచివాలయ ఉద్యోగులకు విద్యార్హతలు సరిపోవడం, పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మిన్ కార్యదర్శి పోస్టులకు అర్హతలు సరిపోవడంతో ఖాళీల్లో వారిని భర్తీచేసే అవకాశాలను కూడా ప్రభుత్వం యోచేన చేస్తున్నది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఆరునెలల తర్వాత గ్రామ, వార్డు సచివాలయాల విషయంలో తీసుకున్న నిర్ణయం కారణంగా పరిపాలనా పరమైన మార్పులు అయితే తీసుకు వచ్చింది గానీ.. ఉద్యోగుల సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ విషయంలో ఒక నిర్ధిష్టమైన ప్రకటన చేయకపోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర నిరశా పెరిగిపోతున్నది. దానికి తోడు 74 ప్రభుత్వశాఖల్లో వేల సంఖ్యలో ఉద్యోగులు గత ప్రభుత్వం పెంచిన రిటైర్ మెంట్ ఎక్స్ టెన్సన్ రెండేళ్లు నిండిపోవడంతో ఉద్యోగ విరమణలు చేస్తున్నారు. 

అలాంటి సమయంలో కొత్త ఉద్యోగాలు భర్తీ ప్రభుత్వానికి ఆర్ధిక భారం. అదే రేషనలైజేషన్ చేపడితే ఉద్యోగుల కుదింపుతోపాటుగా.. మిగులు సిబ్బందిని ఖాళీలు ఏర్పడ్డ ప్రభుత్వ శాఖల్లో వినియోగించుకోవడానికి వీలుపడుతుందని ప్రభుత్వం ఆలోచన చేసింది. అనుకున్నట్టుగానే క్యాబినెట్ లో సచివాలయాల ను ఒక అంశంగా చేర్చి రేషనలైజేషన్ ప్రక్రియ మొదలు పెట్టింది కూటమి ప్రభుత్వం. 2025 జూన్ నాటికి రాష్ట్రవ్యాస్తంగా కేవలం నాల్గవ తరగతి ఉద్యోగులే 10వేలకు పైగా రిటైర్ కాబోతున్నట్టు రాష్ట్రప్రభుత్వశాఖల్లో ఉద్యోగుల ఎస్ఆర్ లు చెబుతున్నాయి.  భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే 75వ ప్రభుత్వశాఖ గా ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయ శాఖలో ఉద్యోగులకు క్యాడర్, సర్వీస్ రూల్స్, ప్రమోషన్ ఛానల్ కూడా సక్రమంగా ఏర్పాటు చేయకుండా ఐదేళ్లుగా ఉద్యోగులతో ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగుల విధులకంటే అధనంగా పనులు చేయిస్తోంది.

 పరిపాలన విషయంలో ప్రభుత్వానికి అనుకూలంగా అదనపు పనిగంటలు, సెలవు దినాల్లో పనిచేయిస్తున్న ప్రభుత్వం ఉద్యోగులకు రాజ్యాంగ బద్ధంగా కల్పించాల్సిన ఉద్యోగ ప్రయోజనాల విషయంలో మాత్రం నోరు మెదపడం లేదు. ఇప్పటికే మొదటి పదోన్నతి పొందాల్సిన గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులు సర్వీసు నిబంధనలు సక్రమంగా లేకి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఉండిపోయారు. ఇదే పద్దతి కొనసాగితే ఉద్యోగులు రిటైర్ అయిపోయినా వీరికి మాత్రం పదోన్నతులు మాత్రం రావు.  పదోన్నతులు రావాలంంటే సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వారి మాతృశాఖల ఉద్యోగుల ఉన్న సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయాలి. 

ఆ విధంగా చేస్తే ప్రభుత్వానికి ఆర్ధిక భారం పెరుగుతుందని.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆ ఫైలుని పక్కనపెట్టేసింది. ఇపుడు కూటమి ప్రభుత్వం కూడా ఉద్యోగులతో అదనపు సేవలు చేయించుకుంటుంది తప్పితే వారి ప్రయోజాలు అడిగితే మాత్రం ఆ ఒక్కట్టీ అడక్కు అన్నట్టుగా వ్యవహరిస్తున్నది. కనీసం రేషనలైజేషన్ తరువాతనైనా సచివాలయ ఉద్యోగులకు జిఏడీ ద్వారానైనా పూర్తిస్థాయిలో సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్, పీఆర్సీ బెనిఫిట్స్, నోషల్ ఇంక్రిమెంట్లు, ఇతర ప్రభుత్వశాఖల మాదిరిగా ప్రయోజనాలు కల్పిస్తుందో లేదో వేచి చూడాలి..?!

visakhapatnam

2025-01-17 14:09:03

గ్రామ, వార్డు సచివాలయశాఖే శరణ్యం.. మార్పులు అనివార్యం..?!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని 75 ప్రభుత్వశాఖల్లోని ఉద్యోగులు భారీ సంఖ్యలో రిటైర్ కాబోతున్నారు.. గత ప్రభుత్వం పెంచిన రెండేళ్ల రిటైర్ మెంట్ గడువు పూర్తవడంతో ఉద్యోగులు వేల సంఖ్యలో ఖాళీ అయిపోతున్నారు.. ఉన్నఫలంగా కొత్త ఉద్యోగాలను భర్తీచేయాలంటే ప్రభుత్వానికి తలకి మించిన ఆర్ధిక భారం.. ఆ ఇబ్బందులను అదిగ మించాలంటే ఇపుడు గ్రామ, వార్డు సచివాలయ శాఖ మాత్రమే కూటమి ప్రభుత్వానికి శరణ్యంగా కనిపిస్తున్నది.. ఖాళీ అయిపోతున్న శాఖల్లో ప్రస్తుతం రాష్ట్రంలో 1.25 లక్షల మంది సచివాలయ ఉద్యోగులనే ఆయా ప్రభుత్వశాఖల్లోకి సర్ధుబాటు చేయాలి.. లేదంటే కొత్తనోటిఫికేషన్లు ఇచ్చి  ఉద్యోగాలు భర్తీచేయాలి.. ఆ పని ఇప్పట్లో దగ్గరలో లేకపోవడంతో.. సచివాలయ వ్యవస్తలో మార్పులు చేసి ఉద్యోగులను విభజించనున్నారు.. ప్రస్తుతం ఉన్న సచివాలయాల్లో ఎంతమందిని ఉంచితే బాగుంటుంది.. మరెంత మందిని ఇతర శాఖల్లో విలీనం చేస్తే కొత్త ఉద్యోగుల భారంత తగ్గుతుందనే విషయమై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయశాఖలో ఇపుడు ఖచ్చితంగా మార్పులు, చేర్పులు చేయాల్సిన సమయం ఆశన్నమైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేయాల్సి వస్తుందని భావించి సచివాలయశాఖ ను ఏర్పాటు చేసి.. ఇందులో పనిచేసే ఉద్యోగులకు తలా తోకా లేకుండా చేసింది. ఐదేళ్లు దాటిపోతన్నా ఇక్కడ పనిచేసే ఉద్యోగులకు సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయలేదంటే గత ప్రభుత్వం ఏవిధమైన తేడా ఆలోచన చేసిందో అర్ధం చేసుకోవచ్చు. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా.. ఏ రాష్ట్ర ప్రభుత్వమూ అమలు చేయని తేడా విధానాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసి ఉద్యోగులను భర్తీ చేసింది.

 ఒక ప్రభుత్వశాఖ ఉద్యోగితో పది ప్రభుత్వశాఖల విధులు నిర్వహించేలా చేయడానికి ఏర్పాటు చేయడమే కాకుండా వారికి ఎలాంటి పదోన్నతులు కల్పించే వీలు లేకుండా సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయకుండా చేతులు దులిపేసుకుంది. దీనితో పదిశాఖల విధులు నిర్వర్తిస్తున్న సచివాలయ ఉద్యోగులు ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగుల మాదిరిగా ప్రభుత్వ ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. పైగా శని, ఆదివారాలు, ఇతర సెలవు రోజులు, పనిగంటలు అయిపోయిన తరువాత కూడా ప్రభుత్వం కోసం పనిచేయాల్సి వస్తున్నది. వేళా పాలా లేకుండా కావాల్సినట్టుగా పనిచేస్తున్నా.. ఉద్యోగుల సమస్యలు మాత్రం గత ప్రభుత్వంతోపాటు.. ఈ ప్రభుత్వం కూడా పరిష్కరించడమే మానేసింది.

అలాంటిది ఇపుడు ఇతర ప్రభుత్వశాఖల్లో వేల సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగవిరమణలుచేయడంతో ప్రభుత్వానికి గ్రామ, వార్డు సచివాలయశాఖ మాత్రమే శరణ్యం అవుతోంది. దీనితో ఇపుడు సచివాలయశాఖలోని కొన్ని విభాగాల ఉద్యోగులను మాత్రుశాఖలకు బదిలీ చేసి.. కొద్ది మందితోనే సచివాలయాలను నడిపించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. అయితే ఇపుడు అలా చేయడానికి సచివాలయశాఖలోని ఉద్యోగుల సర్వీసునిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఇదే కూటమి ప్రభుత్వానికి ప్రతిబంధకంగా మారింది. ఉన్న ఉద్యోగులను మాత్రుశాఖల్లోకి విలీనం చేయాల్సి వస్తే సాధారణ పరిపాలన శాఖ నుంచి సచివాలయ శాఖ ఉద్యోగులకు సర్వీసు నిబంధనలు అమలు చేయాలని.. లేని వారికి మాతృశాఖలోని నిబంధనలు అమలు చేయడానికి ప్రత్యేక జీఓ ఇవ్వాల్సి వుంటుంది. 

అలా చేయకపోతే ఉద్యోగులను ప్రభుత్వశాఖల్లోకి విలీనం చేసినా.. సదరు ప్రభుత్వశాఖలోని ఉద్యోగుల ప్రయోజనాలు, ఇతన నిబంధనలు సచివాలయ ఉద్యోగులకు అమలు కావు. తరువాత నష్టాన్ని కూడా సచివాలయ ఉద్యోగులే  భరించాల్సి  వుంటుంది. అలాగని ముందుగా ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల సర్వీసునిబంధనల కోసం ఏమైనా చర్యలు తీసుకుంటుందా అంటే ఆ ఏర్పాటు కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఇపుడు ఖాళీ అయిపోతున్న ప్రభుత్వశాఖల్లో ఉద్యోగులను సర్దుబాటు చేయడానికి మాత్రమే ప్రభుత్వం చూస్తున్నది.

రాష్ట్రప్రభుత్వం సచివాలయశాఖలోని కొన్ని విభాగాల ఉద్యోగులకు సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయకపోతే.. జీవితాంత ఉద్యోగలకు పదోన్నతులు రావు. అలాగే మాతృశాఖలోని ప్రయోజనాలు కూడా వీరికి వర్తించవు. ప్రభుత్వ సౌలభ్యం కోసం ఉద్యోగులను విలీనం చేయడం ద్వారా ప్రభుత్వానికి కొత్త ఉద్యోగాల భర్తీచేసే భారం అయితే తప్పుతుంది కానీ సచివాలయ ఉద్యోగులకు మాత్రం ఎలాంటి మేలూ జరగదు. ప్రభుత్వం ఉద్యోగులను ప్రభుత్వశాఖల్లోకి విలీనం చేసి.. ఏశాఖలో అయితే సచివాలయ ఉద్యోగులను విలీనం చేస్తుందో సదరు శాఖలోని సర్వీసు నిబంధనలు వీరికి అమలు చేయాలి. ఇపుడు ప్రభుత్వం ఆవిధంగా చేస్తుందా..లేదా అనేది మాత్రం తెలియడం లేదు. కానీ ఉద్యోగులను విభజించి నలుగురు లేదా ఐదుగురు ఉద్యోగులతోనే సచివాలయాలు నడిపించడానికి మాత్రం ప్రభుత్వం రంగం సిద్దం చేస్తున్నది. గత వైఎస్సార్సీపీ తేడా విధానాల వలన సచివాలయ ఉద్యోగులు చాలా ప్రయోజనాలు కోల్పోయారు.

ఇపుడు కూటమి ప్రభుత్వం కూడా అదే తప్పుని చేస్తూ ఉద్యోగుల పొట్టగొడుతున్నది. ఎన్నికల ముందు ఇచ్చి హామీల విషయంలో కూటమి ప్రభుత్వం నేటి వరకూ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అంతేకాదు ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన మహిళాపోలీసుల విషయంలో తీసుకున్న నిర్ణయాలు, చర్చల విషయంలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులను ఖాళీ అవుతున్న ప్రభుత్వశాఖల్లో విలీనం చేసే సమయంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేస్తుందనే విషయంలో మిలియన్ డాలర్ల ప్రశ్నలకు జావాబులు లేవు. చూడాలి కూటమి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో ఏ తరహా సర్వీసు నిబంధనలు అమలు చేస్తుంది. వీరికి ఏ విధమైన పదోన్నతులు కల్పిస్తుంది.. సమయపాలన అమలు చేస్తుందా..? అనేది వేచి చూడాలి..?!

visakhapatnam

2025-01-11 15:48:33

ఆయుష్ నిబంధనలు పక్కదారి.. ఇన్చార్జి ఆర్డీడిలది దొడ్డిదారి..?!

 ఆయుష్ శాఖలో కాదేదీ అక్రమాలకు అనర్హం.. ఇక్కడి అధికారులు తలచుకుంటే.. నిభందనలన్నీ పక్కకి వెళ్లిపోతాయి.. అనుకున్నవారిని అందలం ఎక్కించేసి.. అర్హతులన్నవారిని తొక్కేస్తారు.. కాసులిస్తే చాలు సీనియారిటీని కూడా కాదని అవకాశం లేనివారిని సైతం అనుకున్న సీట్లో కూర్చోబెడతారు.. సరిగ్గా ఆర్డీడిల నియామకాల విషయంలోనూ అదే జరిగింది. రెగ్యులర్ ఆర్డీడిలకైతే ప్రభుత్వ నిబంధనలు అమలు చేయాల్సి వస్తుందని.. తాము అనుకున్నవారికి అవకాశం రాదని భావించిన ఆయుష్ కమిషనరేట్ అధికారులు దొడ్డిదారిన ఇన్చార్జి ఆర్డీలను కాసులకి కక్కుర్తిపడి నియమించేశారు. అదీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొని ప్రభుత్వశాఖ నుంచి వెదొలగిన గత కమిషనర్ డా.ఎస్బీ.రాజేంద్ర కుమార్ లంగిశెట్టి ఆధ్వర్యంలోనే జరిగిపోవడం విశేషం. ఫలితంగా సీనియారి జాబితాలో ఉన్న యునానీ, హోమియో సీనియర్ మెడికల్ ఆఫీసర్లకు పదోన్నతులు రాకుండాపోయాయి..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ఆయుష్ శాఖలోని కమిషనరేట్ అవినీతి అక్రమాలు పెచ్చుమీరి పోతున్నా.. కూటమి ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. సీనియర్ మెడికల్ ఆఫీసర్లు, పదోన్నతులకు అర్హత ఉన్నవారిని కాదని కాసులిచ్చిన వారికి దొడ్డిదారిలో ఇన్చార్జి ఆర్డీడి పోస్టులు కట్టబెట్టేశారు గత అవినీతి ఆయుష్ కమిషనర్ అదీ కూడా ఆయన సదరు శాఖనుంచి అక్రమాల కేసు విషయమై వైదొలగి పోతూ.. ఎవరికీ అనుమానం రాకుండా ముందుగానే కొందరు సినియర్ మెడికల్ ఆఫీసర్లతో ములాఖత్ అయి.. పదోన్నతులు ఇవ్వాల్సిన వారిని కాకుండా రాష్ట్రంలోని నాలుగు జోన్లలోనూ ఆయుర్వేద డాక్టర్లనే ఇన్చార్జి ఆర్డీడిలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. 

దీనితో పదోన్నతులు రావాల్సి యునాని, హోమియో సీనియర్ మెడికల్ ఆఫీసర్లకు తీవ్ర అన్యాయం జరిగింది. ఈ ఇన్చార్జి నియమాకాల కోసం కొందరు ఆర్డీడిలు రూ.5 లక్షల వరకూ గత కమిషనర్ కు ముడుపులు ఇచ్చినట్టు చెబుతున్నారు. ఆ కారణంగా డిప్యూటేషన్లు రద్దు చేసి మరీ ఇన్చార్జి  ఆర్డీడిలుగా నియామకాలు జరిపారని అర్హత ఉన్న సీనియర్ మెడికల్ ఆఫీసర్లు నెత్తీ నోరూ కొట్టుకుంటున్నారు. ఆయుష్ శాఖలో జరిగిన ఈ అవినీతి వ్యవహారాలపై అధికారిక సమాచారం, సీనియారిటీ, రోస్టర్ విధానం, పదోన్నతి ఎవరికి రావాలి.. మరెవరికి ఇచ్చారనే విషయంలో సీనియర్ మెడికల్ ఆఫీసర్లు కమిషనరేట్ లోని అధికారులను ప్రశ్నిస్తే.. అలాంటివారిపై వేధింపులకి దిగుతున్నారని సమాచారం వస్తోంది. ముఖ్యంగా విశాఖ రీజియన్ పరిధిలోని ఆర్డీడి డాక్టర్లను టార్గెట్ చేస్తూ వేధిస్తున్నట్టు సిబ్బంది, వైద్యులు వాపోతున్నారు.

 వాస్తవానికి ఇక్కడ ఆర్డీడి పోస్టు ఇన్చార్జి విధానంలో నియామకం జరిగింది. అంటే సదరు వైద్యాధికారిణి చేస్తున్న మెడికల్ ఆఫీసర్ పోస్టు చేస్తూనే ఇన్చార్జి ఆర్డీడిగా విధులు నిర్వహించాలి. అలాకాకుండా మెడికల్ ఆఫీసర్ గా చేయాల్సి కెజిహెచ్ లోని పోస్టుని గాలికొదిలేసి ఫుల్ టైమ్ ఆర్డీడిగా పనిచేసేస్తున్నారు. అంతేకాకుండా సంబంధం లేని విషయాల్లోనూ వేలుపెట్టి ఎడాపెడా మామూళ్లు బెదిరించి వసూళ్లకు పాల్పుడుతున్నారని కూడా ప్రైవేటు మెడికల్ షాపులు నిర్వాహకులు ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే వారి ఫిర్యాదులన్నీ కమిషనరేట్ లో బుట్టదాఖలవుతున్నాయని.. అడ్డదారిలో వచ్చిన ఆర్డీడిలపై ఎవరు ఏ ఫిర్యాదు చేసినా పనిగట్టుకొని వాటిని కమిషనర్  వరకూ చేరకుండా అక్కడ ఇద్దురు అధికారులు, ముగ్గురు క్రిందిస్థాయి సిబ్బంది పనిచేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

సీనియారిటీ లిస్టుని కాదని.. అనుకున్నవారికి ఇన్చార్జి ఆర్డీడి పోస్టులు కట్టబెట్టినందుకు కావాలని ఫిర్యాదులు చేస్తున్నారని కమిషనర్ ను కూడా తప్పుదారి పట్టిస్తున్నారని కూడా సమాచారం అందుతుంది. అయితే గత కమిషనర్ హయాంలో జరిగిన అవినీతి ఆరోపణలకు సహకారం అందించిన వారికి, కాస్త కాసులు గట్టిగా ఇచ్చినవారికే ప్రస్తుతం ఇన్చార్జి ఆర్డీడిలుగా నియామకాలు ఇచ్చారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వ్యవహారం సీఎంఓ వరకూ వెళ్లింది. ఇటు డిప్యూటీ సీఎం కార్యాలయంతోపాటు వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయం, డిప్యూటీ సీఎం కార్యాలయానికి ఫిర్యాదులు అందడటంతోపాటు, వాటి నకలను మీడియాకి కూడా  బాధితులు పంపడం విశేషం.

ఒక్క ఇన్చార్జి ఆర్డీడిల నియామకాలకే లక్షల్లో మామూళ్లు తీసుకుంటే.. రెగ్యులర్ ఆర్డీడి పోస్టులు సినీయారిటి ప్రకారం ఇవ్వాలంటే ఇంకెంత డిమాండ్ చేస్తోరోననే చర్చ జరుగుతున్నది. పెద్ద మొత్తంతో ఖర్చుచేసి ఆర్డీడి సీట్ లోకి వచ్చామని.. పెట్టిన ఖర్చంతా మెడికల్ ఆఫీసర్ లనుంచి కాకుండా మెరెవరి దగ్గర నుంచి వసూలు చేస్తామని ఆర్డీడి కార్యాలయ సిబ్బంది తోనే ఆర్డీడి వారి పరిధిలోని మెడికల్ ఆఫీసర్లును బెదిరిస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. దొడ్డిదారిన వచ్చిన ఇన్చార్జి ఆర్డీడి నియామకాలపై ప్రస్తుత ఆయుష్ కమిషనర్ పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తే వాస్తవాలు వెలుగు చేసే అవకాశాలున్నాయి..!

visakhapatnam

2025-01-04 13:25:08

కూటమి పాలనకు 6నెలలు.. అమలుకి నోచని హామీలు..?!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు పగ్గాలు చేపడితే పరిపాలన మొత్తం మారిపోతుంది.. ప్రభుత్వ ఉద్యోగాలు కొలువుదీరుతాయి.. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయి.. అదనపు పనిభారం తగ్గి.. వేధించే అధికారులపై చర్యలు ఖచ్చితంగా ఉంటాయి.. పదోన్న తలు లభిస్తాయి..డీఏలు, ఇంక్రిమెంట్లు సమయానికి వస్తాయి.. ఇవన్నీ ఎన్నికల ముందు ప్రభుత్వ ఉద్యోగులు కన్నకలలు.. సామాజిక మాద్యమాల్లో పెద్ద ఎత్తున చేసిన ప్రచారాలు.. ఎలాగైనా భారీ మెజార్టీ గెలిపించాలని పట్టుదలతో 75 ప్రభుత్వశాఖ ల ఉద్యోగులు చేసిన ప్రయత్నాలు.. కట్ చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. కానీ నాటి చంద్రబాబు మార్కు పరిపాలన మాత్రం ఎక్కడా కనపిం చలేదు కానీ అధికారులు వేధింపులు ఎక్కువయ్యాయి.. ఆరు నెలలు తిరిగే లోపే గత ప్రభుత్వమే నయమే స్థితికి వచ్చేశారు ఉద్యోగులు.. వారి ఆవేదనను సామాజిక మాద్యమాల వేదికగా పంచుకుంటున్నారు.. చంద్రబాబు మార్కు లేని పరిపాలనను ఉద్యోగులు వ్యతిరేకి స్తున్నా రు.. ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్..!

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. గత ప్రభుత్వ విధానాలే ఇంకా కనసాగుతున్నాయని ప్రభుత్వశాఖల ఉద్యోగులు వాపోతున్నారు. చంద్రబాబు మార్కు పరిపాలనపై ఎంతో ఊహించుకున్నా.. ఆరునెలలు గడిచిపోతున్నా ఇంకా పరిపాలన గాడిలో పడకపోగా.. అధికారుల వేధింపులతో నరకం చూస్తున్నామంటున్నారు క్రింది స్థాయి ఉద్యోగులు. ప్రయోజనం లేని అధనపు పనిభారం మోపి.. సర్వేలు, జియో ట్యాగింగ్లు.. సెలవురోజుల్లో పనిచేయిస్తూ అధికారులు పైశాచిక ఆనందం పొందుతున్నారని గగ్గోలు పెడుతున్నారు.

 కనీసం ఉద్యోగులకు ఆరోగ్య సమస్యలు, ఇతరత్రా కారణాలకు కూడా ప్రభుత్వమే కేటాయించిన సెలవులుకూడా పెట్టుకోవడానికి వీలులేకపోవడంతో జిల్లా అధికారుల నుంచి క్రింది స్థాయి సిబ్బంది వరకూ ఒక్కొక్కరికీ సుమారు 15 ప్రభుత్వ సెలవులు వినియోగించుకోవడానికి అవకాశం లేకుండా పోయిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులకైతే అసలు పనివేళలతో సంబంధం లేకుండా విధులు అప్పగిస్తున్నారని ఉద్యోగుల కుటుంబ సభ్యుల గగ్గోలు పెడుతున్నారు. పనిఒత్తిడి కారణంగా ఉద్యోగులు గుండెపోటుతో మృతిచెందిన సంఘనటు, కావాలని ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు అధికంగా ఉమ్మడి విశాఖజిల్లాలో జరగడం ఒక ప్రత్యక్ష నిదర్శనం. 

సచివాలయ ఉద్యోగులతో పనివేళల్లో కాకుండా.. సాయంత్రం 5 దాటిన తరువాత, వారాంతపు సెలవుల్లోనూ జిల్లా అధికారులు సర్వేలు, వివరాల నమోదు పేరుతో విధులు అప్పగిస్తున్నారు. ఇంత చేసినా.. అవసరం అయినపుడు సెలవులు అడిగితే మాత్రం అధికారులు షోకాజు నోటీసులు ఇస్తున్నారని, కార్యాలయాలకు పిలిపించి వారి సొంత జేబుల్లో నుంచి జీతాలు ఇస్తున్నట్టుగా తెగ ఫీలైపోయి తెగ తిడుతున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులు ఒక శాఖ పనులు చేస్తే.. తామ సచివాలయ శాఖలో మాత్రం సుమారు పది ప్రభుత్వశాఖల విధులు తమతో చేయిస్తున్నారని కన్నీటి పర్యంతం అవుతున్నారు. రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగమని.. భవిష్యత్తు బాగుంటుందని కష్టమైనా పనిచేస్తున్నా అధికారుల వేధింపులు మాత్రం ఎక్కడా ఆగడం లేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

పని ఒత్తిడికారణంగానే ఉద్యోగులు విధినిర్వహణలో గుండెపోటుతో మృతిచెందుతున్నారని వాపోతున్నారు.  ఇతర ప్రభుత్వశాఖల మాదిరిగా తమ సచివాలయశాఖలోని ఉద్యోగుల్లో చాలా విభాగాలకు సర్వీసు నిబంధనలు లేవని.. ప్రమోషన్ ఛానల్ అసలే లేదని.. కనీసం సర్వీసులు రెగ్యులర్ అయిన తరువాత ఇవ్వాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లకి కూడా తాము నోచుకోవడం లేదని.. తమ సమస్యను అసెంబ్లీలో ఎమ్మెల్యేలు.. మంత్రులు ప్రస్తావించినా.. క్యాబినెట్ సమావేశాల వరకూ తీసుకెళ్లి పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని చెబుతున్నారు. 

అన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగులకు పీఆర్సీ వలన ప్రయోజనాలు వస్తే.. కేవలం తమకు మాత్రం పెంచిన అదనపు జీతం తప్పా.. ఇతర ప్రయోజనాల ఊసేలేదని చెబుతున్నారు. ఈ విషయమై ఉద్యోగ సంఘాల సామాజిక మాద్యమాలో పెద్ద ఎత్తున చర్చలు లేవనెత్తుతున్నారు. అయితే ఉద్యోగుల సమస్యలు, ఇబ్బందుల విషయాన్ని జిల్లా అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించినా.. తమకు జరిగిన అన్యాయంపై ఆందోళన చేస్తే మాత్రం టార్గెట్లు చేసి కార్యాలయాలకి పిలిపించుకొని అమ్మనా బూతులు తిడుతున్నారిని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మిగిలిన 74 ప్రభుత్వశాఖల్లోని అటెండర్ల దగ్గర నుంచి గ్రూప్-1 అధికారుల వరకూ పదోన్నతుల వస్తాయని ఎంతో ఆశపడినా.. ఆరునెలలు దాటిపోతున్నా ఇంకా పదోన్నతుల విషయంలో అతీగతీ కనిపించడం లేదు. 

ఈ క్రమంలో చాలా మంది ఉద్యోగులు పదోన్నతులు పొందకుండానే రిటైర్ అయిపోతుండటం విశేషం. వాస్తవానికి పదోన్నతులు ఇవ్వడం వలన ప్రభుత్వంపై పెద్దగా ఆర్ధిక భారం కూడా పరిస్థితి ఉండదు. మహా అయితే ఒకటి లేదా..రెండు ఇంక్రిమెంట్లు ఉద్యోగికి కలుస్తాయి.. అవీ కూడా వెంటనే ఇవ్వరు. ఆ మాత్రం దానికి ఉద్యోగుల పదోన్నతుల విషయంలో కూడా కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం.. చాలా ప్రభుత్వశాఖల్లోని కమిషనర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు పదోన్నతుల విషయాన్ని ప్రభుత్వం దుష్టికి తీసుకెళ్లకపోవడం వలన కూడా పదోన్నతులు నిలిచిపోయాయి. ప్రభుత్వ విధానాలతో క్రింది స్థాయి ఉద్యోగులే కాకుండా జిల్లా, మండల స్థాయి అధికారులు కూడా సెలువులు పెట్టినా.. జూమ్ మీటింగులతో ఇంట్లో ఉండే విధులు నిర్వహించాల్సి వుస్తున్నది అధికారులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇక నిరుద్యోగుల విషయంలో కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే వున్నది. అధికారంలోకి రాగానే ప్రకటిస్తామన్న జాబ్ క్యాలెండర్ కి అతీ గతీ లేదు. మధ్యలోనే ఉండిపోయి డిఎస్సీ ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు.. కొత్త నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారో తెలియదు.. గత ప్రభుత్వం పెంచిన రెండేళ్ల సర్వీసు చాలా మంది ఉద్యోగులకు పూర్తయిపోవడంతో అన్ని ప్రభుత్వశాఖల్లోనూ వేలాదిగా ఉద్యోగాలు ఖాళీలు ఏర్పడుతున్నాయి. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కూడా లేదని నిరుద్యోగులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతం ప్రభుత్వం అన్నిప్రభుత్వశాకల్లోని క్రిందిస్థాయి ఉద్యోగాల ఖాళీలను ప్రాధాన్యత క్రమంలో భర్తీచేస్తూ వచ్చేది. 

గత ప్రభుత్వం నుంచి ఈ పద్దతి పూర్తిగా మారిపోయి.. ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులతోనే వారంత వారే ఉద్యోగాలుకి రాజీనామా చేయించే విధంగా పనులు, ప్రత్యేక విధులు అప్పగించి మరీ వేధిస్తున్నదని నిరుద్యోగులే పెద్ద ఎత్తు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి చంద్రబాబు పరిపాలన మార్కుపై నేటికీ ప్రజల్లో విశ్వాసం ఉన్నా.. దానికి ప్రభుత్వంలోని కొందరు అఖిలభారతస్థాయి అధికారులు మోకాలు అడ్డువేస్తున్నారనే సమాచారం కూడా అందుతున్నది. అంతేకాకుండా ఉన్నవారికి అదనపు భాద్యతలు అప్పగిస్తే.. ప్రభుత్వంపై ఆర్ధిక భారం తప్పుతుందనే సలహాలు కూడా ప్రభుత్వానికి ఇస్తున్నారని జిల్లాస్థాయి అధికారులు చెబుతుండటం విశేషం. 

మొత్తానికి ఆరునెలల కూటమి పరిపాలనలో సీఎం చంద్రబాబు మార్కు పరిపాలన ఎక్కడా కనిపించలేదని.. ఎన్నికల ముందు ప్రభుత్వశాఖ ఉద్యోగులు, అధికారులకి ఇచ్చిన ఒక్క హామీ కూడా ప్రభుత్వం నెరవేర్చలేదని ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. ఇప్పటి పరిస్థితి ఇంకా ముందు ముందుకి కొనసాగుతుందా.. లేదంటే ప్రభుత్వం ఉద్యోగులకి ఇచ్చిన హామీలు నెరవేర్చి చంద్రబాబు మార్కు పరిపాలన మళ్లీ తీసుకు వస్తారా..? గత ప్రభుత్వ పాలనే బాగుందని అంటున్న ఉద్యోగులతోనే మళ్లీ కూటమి పరిపాలన చాలా బాగుంది అనిపిస్తారా..? లేదా..? అనేది వేచి చూడాల్సి వుంది..?!

visakhapatnam

2025-01-03 19:06:43

సీఎం కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ కార్తికేయ మిశ్రా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  సీనియర్‌ ఐఏఎస్, ఐపీఎస్‌లకు పదోన్నతులు  కల్పించింది. 2009 సంవత్సరపు బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌లు కార్తికే య మిశ్రా , వీరపాండ్యన్‌, శ్రీధర్‌కు కార్యదర్శి హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎంవో సహాయ కార్యదర్శిగా ఉన్న కార్తికేయ మిశ్రా కు సీఎం కార్యదర్శిగా పదోన్నతిని కల్పించింది. డైనమిక్ ఐఏఎస్ గా.. ముక్కుసూటి అధికారిగా ఈయనకు మంచి పేరుంది.  దీనితో సీఎం కా ర్యదర్శిగా పదోన్నది దక్కినట్టు చెబుతున్నారు. ఇక గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈవోగా వీర పాండ్యన్‌ను , వైఎస్‌ఆర్‌ జిల్లా కలెక్టర్‌గా శ్రీధర్‌ను కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఐపీఎస్‌లు విశ్రాంత్‌ పాటిల్‌, సిద్ధార్థ్‌ కౌశల్‌కు పదోన్నతులు కల్పించింది.


amaravathi

2024-12-31 14:26:16

ఏపీ సమాచారశాఖలో ఏసీబీ విచారణ షురూ.. ఈరోజు-ఈఎన్ఎస్ చెప్పిందే నిజమైంది..!

ఆంధ్రప్రదేశ్ సమాచార పౌరసంబంధాలశాఖ కమిషనర్ విజయకుమార్ రెడ్డిపై రాష్ట్రప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించడం ఇపుడు ప్రభుత్వశాఖల్లో చర్చనీయాంశం అవుతున్నది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఈయనను ఢిల్లీ నుంచి సమాచారశాఖకు డిప్యూటేషన్ పై గత ప్రభుత్వం తీసుకు వచ్చింది. అయితే అప్పటికే ఈశాఖలో ఉద్యోగాలు ఖాళీగా ఉండటంతో అడ్డగోలుగా 150 మంది వరకూ ఔట్ సో ర్సింగ్, కాంట్రాక్టు పద్దతిలో ఒక మీడియాకి చెందిన జర్నలిస్టులను నియమించారు. అంతేకాకుండా ఒకే మీడియా సంస్థకు కోట్లాది రూపాయ ల ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చి.. స్థానిక పత్రికలను పూర్తిగా అణగదొక్కారు. వర్కింగ్ జర్నలిస్టులకి ప్రెస్ అక్రిడిటేషన్ కూడా రాకుండా జీఓ నెంబరు 38ని తీసుకు వచ్చి చిన్న, మధ్య తరహా పత్రికల మనుగడ ప్రశ్నార్ధకం అయ్యేలా చేశారు. గత ప్రభుత్వ హయాంలో సమాచారశాఖ కమిషనర్ చేసిన అడ్డగోలు వ్యవహారాలకు  అడ్డూ అదుపూ లేకుండా పోయింది. 

రెగ్యులర్ నియామకాలు చేయాల్సి వస్తే తమ వర్గానికి చెందిన వారికి ఉద్యోగ అవకాశాలు రావని.. వాటిని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలోకి మార్చి అర్హతలు లేకపోయినా పోస్టులు కట్టబెట్టడంలో కీలకంగా వ్యవహారించారు. ఇదే విషయమై సమాచార హక్కు చట్టం క్రింద పలువురు జర్నలిస్టులు వివరాలు కోరినప్పటికీ సమాచారం ఎక్కువగా ఉందని చెప్పి రాష్ట్ర కమిషనరేట్ సదరు ఆర్టీఐ దరఖాస్తులను వెనక్కి తిప్పి పంపేసింది కూడా. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సదరు కమిషనర్ విజయకుమార్ రెడ్డి బిచానా మొత్తం సర్దేసి.. ఆగమేఘాలపై మళ్లీ ఢిల్లీ వెళ్లిపోయారు. అయినా గత ప్రభుత్వం అధికారంలో ఉండగా చేసిన వ్యవహారాలన్నింటినీ ఆధారాలతో సహాయ బయటకు తీయడానికి కమిషనర్ పై ప్రభుత్వం విచారణ మొదలు పెట్టింది. 

ఈ నేపథ్యంలో ఆశక్త కరమైన సంఘటనలు ప్రాధమికంగానే బయట పడటంతో పూర్తి వివరాలు బయటకు తీయడానికి ఏసీబీ డి. జి  గుంటూరు ఏసీబీ  ఏ ఎస్ పి మహేంద్ర ని దర్యాప్తు అధికారిగా నియమించారు. గత కమిషనర్ సమయంలో కొన్ని కేడర్ ఉద్యోగాలు లేకపోవడం, అదే సమయంలో జిల్లాల విభజన జరడగంతో విభాగాలకు, విభాగాలకు సంబంధం లేని వారిని జిల్లా అధికారులుగా నియమించడంలో కమిషనర్ చక్రం తిప్పారు. దానితో అపుడే కమిషనర్ తేడా వ్యవహారాలపై ఈరోజు-ఈఎన్ఎస్ వరుస కథనాలు కూడా ప్రచురించింది. అయితే ఒక అఖిల భారత స్థాయి అధికారిపై ప్రభుత్వం విచారణ చేయదని.. ఇవన్నీ వార్తలకే పరిమితం అవుతాయని కొట్టిపారేసిన సమాచారశాఖ అధికారులు, సిబ్బందికి కూటమి ప్రభుత్వం ఏకంగా  ఏసీబీ ఏఎస్పీని విచారణ అధికారిగా నియమించడంతో గతంలో కమిషనర్ చర్యలకు వంతపాడిన వారికి ఇపుడు తడిచిపోతున్నది. ఇపుడు విచారణలో విజయకుమార్ రెడ్డిపై ఈరోజు-ఈఎన్ఎస్ కథకాలు కూడా కీలకంగా మారాయి.

-ఏపీ ఫైబర్ నెట్ మాదిరిగానే అందరూ వెనక్కి వచ్చేస్తారా..?
ఇటీవలే ఏపీ ఫైబర్ నెట్ లో అడ్డగోలుగా నియమించిన 400 మందిని తొలగించినట్టుగానే.. సమాచార పౌర సంబంధాల శాఖలో కూడా అర్హతలు లేకపోయినా.. సిఫారసులు, కమిషనర్ పలుకుబడితో నియామకాలు చేసిన వారందరినీ ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తారనే ప్రచారం జరుగుతున్నది. మాజీ కమిషనర్ విజయకుమార్ రెడ్డి హయాంలో నియమించిన కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒక్కొక్కరికీ రూ.35 వేలు వరకూ జీతాలు ఇస్తూ వస్తున్నది సమాచారశాఖ. అయితే పోస్టులు ఖాళీలు చూపిస్తే పదోన్నతులు ఇవ్వాల్సి వస్తుందని.. అదే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో పోస్టు భర్తీ చేపడితే పదోన్నతులు కూడా ఇవ్వకుండా తొక్కిపెట్టవచ్చుననే కారణంతోనే అడ్డగోలుగా ఔట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించినట్టు ప్రాధమిక విచారణలో తేలినట్టుగా సమాచారం అందుతుంది. 

అంతేకాకుండా ఏఏ క్యాడర్ ఉద్యోగులు, అధికారులను ఏఏ క్యాడర్లకు పంపారు.. ఏఏ జిల్లాల్లో ఎంతమంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీచేశారు..? వారి విద్యార్హతలేంటి..? వారి నియామకం ఏ విధంగా జరిగింది..? ఎవరి సిఫారసు లేఖలతో జరిగింది..? దాని వెనుక ఉన్నది ఎవరు..? కమిషనరేట్ లో గత కమిషనర్ కి చెప్పింది చెప్పినట్టు చేసిన అధికారులు ఎవరు..? ఏ ప్రాతిపదిక ఒకే మీడియాకి కోట్లాది రూపాయలు ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చి వెంటనే బిల్లులు మంజూరు చేశారు..? తదితతర విషయాలన్నీ ఇపుడు ఏసీబీ విచారణలో బయటకు రానున్నాయి. దీనితో గత కమిషనర్ సమయంలో వివిధ క్యాడర్ లలోకి అర్హతలు లేకపోయినా వెళ్లిన వారంతా ఇపుడు ముందుగానే వారి పాత స్థానాలకు వెళ్లిపోవడానికి మార్గాలు వెతుకుతున్నారని సమాచారం అందుతుంది. చూడాలి.. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరీ ఏసీబి విచారణ చేపడుతున్నసమాచారశాఖ కమిషనర్ విజయకుమార్ రెడ్డి విషయంలో ఏ విధమైన వ్యవహారాలు బయటపెడుతుందనేది..?!

visakhapatnam

2024-12-25 13:30:27

కరుణించిన కూటమి..బిఎల్వో నిధులు విడుదల.. ఈరోజు-ఈఎన్ఎస్ కథనాలపై ప్రభుత్వం స్పందన

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ సొంత ఖర్చులుతో స్టేషనరీ కొనుగులు చేసి, ప్రత్యేక ఇంటర్నెట్ ప్యాకేజీలు వేసుకొని మరీ వైఎ స్సార్సీపీ ప్రభుత్వంలో ప్రత్యేకంగా బిఎల్వో(బూత్ లెవల్ ఆఫీసర్) విధులు నిర్వహిస్తే ఐదేళ్లుగా వారికి ఇవ్వాల్సిన అలవెన్సులు ఇవ్వలేదు.. ఆ విషయమై ఈరోజు-ఈఎన్ఎస్ ప్రత్యేక కథనాలు ప్రచురించడంతో నేడు కూటమి ప్రభుత్వం స్పందించింది.. అదే సమయం లో విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్.హరేంధిర ప్రసాద్, విజయవాడ జిల్లా కలెక్టర్  డా. లక్ష్మీషాలు కూడా స్పందించి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇవ్వా ల్సిన ప్రత్యేక బిఎల్వో వేతనంపై ప్రభుత్వానికి  నివేధించడంతో కూటమి ప్రభుత్వం(ఎలక్షన్ కమిషన్) జీఓఆర్టీ నెంబరు 2200ని విడుదల చేసింది.

తద్వారా ఒక్కో ఉద్యోగికి సుమారు రూ.12,250 వరకూ బిఎల్వో విధులు చేసినందుకు వేతనం రానుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కష్టాన్ని తెలుసుకున్న ప్రభుత్వం బిఎల్వో నిధులు విడుదల చేయడం.. వారి కష్టాలను ఈరోజు-ఈఎన్ఎస్ ప్రత్యేక కథనాలు ప్రచురించ డంతో రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని సుమారు 1.28వేలకు పైగ సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీడియా కార్యాలయానికి ఫోన్లు చేసి తమ ఆనందం పంచుకున్నారు..!

కూటమి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కోసం..వారు పడుతున్న కష్టం కోసం ఆలోచించడం మొదలు పెట్టింది. గత ప్రభుత్వంలో సొంత ఖర్చులు పెట్టుకొని బిఎల్వో విధులు చేసినా.. వారికి ఇవ్వాల్సిన వేతనం మాత్రం ఇవ్వలేదు. దీనితో రంగంలోకి దిగిన ఈరోజు-ఈఎన్ఎస్ సచివాలయ ఉద్యోగుల కష్టాలను.. వారి ఆర్దిక ఇబ్బందులను ప్రత్యేక కథనాల రూపంలో ప్రచురించి ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లింది.   ఈ విషయంలో విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్.హరేంధిరప్రసాద్, ఎన్టీఆర్ విజయవాడ జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీషాలు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన ప్రత్యేక బిఎల్వో వేతనం విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ఉద్యోగులకు రావాల్సిన రూ.12, 250 విడుల చేస్తూ 24 డిసెంబర్ 2024న జీఓ జీఓఆర్టీ నెంబరు 2200ని ( చీఫ్ ఎలక్ట్రోలర్ ఆఫీసర్ వివేక్ యాదవ్) జారీ కావడానికి మార్గం సుగమం అయ్యింది.

2019 అక్టోబర్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటైన దగ్గర నుంచి ఉద్యోగుల సమస్యలను ఈరోజు-ఈఎన్ఎస్ ప్రత్యేక కథనాలు ప్రచురిస్తూ ప్రభుత్వం దృష్టికి వారి సమస్యలను తీసుకెళుతున్నది. అయితే గత ప్రభుత్వం 75వ ప్రభుత్వశాఖగా సచివాలయాన్ని ఏర్పాటు చేసినా వీరికి ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగుల మాదిరిగా సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయలేదు. ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగుల మాదిరిగా సర్వీసు రెగ్యులర్ అయిన తరువాత ఇవ్వాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వలేదు. దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మాత్రమే ఒకప్రభుత్వశాఖ ఉద్యోగులకు సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఐదేళ్లు దాటిపోతున్నా ఏర్పాటు చేయలేదంటే అతిశయోక్తి కాదేమో. 

దానితో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో జరుగుతున్న అన్యాయంపై ఈరోజు-ఈఎన్ఎస్ వాస్తవాలను తరచుగా  ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నది. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం కూడా ఉద్యోగుల పక్షాన ఆలోచిస్తూ.. ఒక్కో సమస్య పరిష్కరిస్తూ వస్తున్నది. ఇటీవలే విశాఖలోని జివిఎంసీ కమిషనర్ డా.సంపత్ కుమార్ వార్డు సచివాలయాల అడ్మిన్ల ఆర్ధిక కష్టాలు తెలుసుకొని..వారు సొంతంగా పెడుతున్న స్టేషనరీ ఖర్చుల భారం వారిపై పడకూడదని.. వారికి రూ.1000 నెలకి స్టేషనరీ బిల్లులు చెల్లించడానికి ముందుకి వచ్చారు. ఒక రకంగా గ్రామ, వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ గా డా.లక్ష్మీషా ఉన్న సమయంలోనే సచివాలయశాఖలోని కొన్ని శాఖల సిబ్బందికి ప్రమోషన్లు కూడా వచ్చాయి. 

ఆయనను శాఖ మార్పు చేసిన తర్వాత ప్రభుత్వం కూడా  సచివాలయ ఉద్యోగులను గాలికి వదిలేసింది. ఆతర్వాత కూటమి ప్రభుత్వం ఆధికారంలోకి రావడంతో సచివాలయ ఉద్యోగుల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరానికి నోచుకుంటన్నాయి. ఉద్యోగాల్లో  చేరిన దగ్గర నుంచి నేటి వరకూ ఉద్యోగులకు వివిధ రకాల సర్వేలు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు  సచివాలయ ఉద్యోగులే ఇంటర్నెట్, స్టేషనరీ, వైట్ పేపర్లు ఖర్చు పెట్టుకుంటున్నా.. వాటికి మాత్రం ఇంకా మోక్షం కలుగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ఈరోజు-ఈఎన్ఎస్ ప్రచురిస్తున్న ప్రత్యేక కథనాలపై స్పందన రావడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ప్రకటించిన విధంగా.. కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల విషయంలో ప్రత్యేకంగా స్పందించం కూడా ఇపుడు ఇతర శాఖల్లో చర్చనీయాంశం అవుతున్నది..?!

visakhapatnam

2024-12-24 16:17:19

సచివాలయ ఉద్యోగులను పొమ్మనకుండా పొగపెడుతున్నారు..?!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పరిపాలను బ్రష్టు పట్టించేందుకు రాష్ట్రంలో కొందరు అధికారులు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను దారుణంగా వేధిస్తున్నారు. సీఎం మాటను స్వచ్చందంగా స్వీకరించి గ్రామాలు, వార్డుల్లో రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్న ఉద్యోగుల ద్వారా ఎలాగైనా ప్రభుత్వంపై బురద చల్లించే విధంగా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ సర్వీసు నిబంధ నలను అతిక్రమిస్తూ సొంత నిర్ణయాలు, వేధింపులతో ఉద్యోగులను ఉసూరు మనేలా చేస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఎప్పుడు ప్రభుత్వ సెలవు, రెండవ శని, ఆదివారాలు వచ్చినా ఆ రోజుల్లోనే ప్రత్యేకంగా విధులు అప్పగించి మనశ్శాంతి లేకుండా ఉద్యోగులు వారంతట వారే ఉద్యోగాలను వదిలి వెళ్లేపోయేవిధంగా వేధింపులకు గురి చేస్తున్నారు.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ప్రభుత్వ సేవలు, పథకాలు ప్రజలకు సకాలంలో అందుతున్నాయి. దానిని జీర్ణించుకోలేని కొందరు అధికారులు. సచివాలయ ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వేలకు విధులకు రావడం లేదనే నెపంతో అర నిమిషం ఆలస్యంగా వచ్చినా ఆరోజు జీతం కట్ చేసేస్తున్నారు. పైగా ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి ఆదాయంగా చూపిస్తున్నామనే కోణాన్ని ప్రభుత్వం ముందుకి తీసుకెళుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకి ఇచ్చిన సెలవులను ఆరోగ్య కారణాల రీత్యా కూడా వినియోగించుకోకుండా సెలవు పెట్టిన రోజే ప్రత్యేక విధులు అప్పగిస్తున్నారు. రాష్ట్రంలోని ఈ పరిస్థితి ఏ ఒక్క జిల్లాకో పరిమితం  చేయకుండా.. ముఖ్యంగా పట్టణ పురపాలక శాఖలోని జోనల్ కమిషనర్లు, కొన్ని చిన్న మున్సిపాలిటీల్లో కమిషనర్లు, మండలాల్లో ఎంపీడీఓలు కావాలని ఉద్యోగులను వేధిస్తూ వారంతట వారే ఇదేం ఉద్యోగం రాబాబు అనే విధంగా వేధింపులకు గురిచేస్తున్నారు.

 పెట్టుకున్న సెలవులన్నింటిని కావాలన్ని రద్దు చేసి, ఆ సెలవులకి జీతం కూడా కట్ చేసేస్తున్నారు. మరో వైపు ప్రభుత్వమే ప్రత్యేక పనులు అప్పగించిం దని వాటిని సెలవు రోజుల్లో చేయించే పనులు చేపడుతున్నారు. రాష్ట్రంలోని 75 ప్రభుత్వశాఖలు ఉంటే ఏ శాఖలోనూ లేని నిభందనలను ఒక్క గ్రామ, వార్డు సచివాలయ శాఖలోనే కొందరు అధికారులు తమ సొంత నిర్ణయాలను అమలు చేస్తూ.. ఉద్యోగులను మానసికంగా కృంగ దీస్తున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారని నిఘా వర్గాలు కూపీ లాగితే ఆశ్చర్యకరమైన వాస్తవాలు వెలుగు చూస్తున్నాయని ఉద్యోగుల సామాజిక మాద్యమాల్లో పెద్ద ఎత్తున చర్చలు పెట్టుకుంటున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు వారి పనితోపాటు, తీసేసిన వాలంటీర్ల క్లష్టర్ల పనులు కూడా చేస్తున్నారని.. అలా నిత్యం చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేస్తుందని.. ఎలాగైనా ప్రభుత్వ పరిపాలనపై ఉద్యోగులతోనే బురద చల్లే విధంగా చేయాలంటే వారిని అదనపు విధుల పేరుతో వేధించడం తప్పా మరో మార్గం లేదనే విధంగా సొంత పైత్యాలను, అధికారాలను వినియోగిస్తున్నారని ఉద్యోగులు తీవ్ర మనో వేధనకు గురవుతున్నారు. 

అంతేకాకుండా ప్రభుత్వ పరంగా సరఫరా చేయాల్సిన కార్యాలయ స్టేషనరీ సరఫరా చేయకుండా.. వాటిని సొంత డబ్బులతో కొని ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని.. కంప్యూటర్లు, ప్రింటర్లు పాడైనా సొంత నిధులతోనే రిపేర్లు చేయించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారని ఉద్యోగులు అధికారులపై దుమ్మెత్తి పోస్తున్నారు. అలాగని ఈ విషయాలను జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లకు దృష్టికి తీసుకెళితే ఆ విషయాన్ని మనుసులో పెట్టుకొని మరింతగా కక్షసాధింపులకు పాల్పడుతున్నారని కూడా వాపోతున్నారు. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు కూడా ఉద్యోగులపై జోనల్ కమిషనర్లు చేస్తున్న ఉద్యోగ వేధింపులను చోద్యం చూస్తున్నట్టుగా చూసి పట్టించుకోవడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. దీనితో తమ సమస్యలు, వేధింపులు ఆపాలని ఉద్యోగులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల వద్దకు వెళ్లి వినతి పత్రాలు సమర్పించుకోవాల్సి వస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో సుమారు లక్షా 28 వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి ఇంచు మించుగా ఇలానే ఉందంటే అధికారుల వేధింపులు ఏ విధంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.

వాస్తవానికి ప్రభుత్వం తరపున ఉద్యోగులకు రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, సర్వీసు నిబంధనలు అమలు చేయకపోయినా..అత్యంత తక్కువగా జీతాలు ఉన్నా.. ఒక ఉద్యోగంతో అన్ని ప్రభుత్వ శాఖల పనులు చేయిస్తున్నా ఉద్యోగులకి సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తున్నా.. అధికారులకు మాత్రం ఇంకా కడుపు మండట చల్లారడం లేదని.. ఏదో ఒక కారణంతో తమను వేధిస్తున్నారని ఉద్యోగులు నెత్తీ నోరూ కొట్టుకుంటున్నారు. అత్యధికంగా పనులు అప్పగిస్తే గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగం మాకొద్దని మా అంతట మేమే ఉద్యోగాలకు రాజానామా చేసే విధంగా వేధింపులు చేస్తున్నారని వాపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన సెలవులు కూడా వినియోగించుకోకుండా, ఆరోగ్య సమస్యలు వచ్చినా.. కూడా వాటిని వినియోగించుకోకుండా అడ్డుపడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 

ఇదే పద్దతి కొనసాగితే ఉద్యోగులంతా రోడ్డెక్కాలని కూడా నిర్ణయించుకొని.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులంతా ఒక తాటిపైకి రావడానికి సామాజిక మాద్యమాల ద్వారా చర్చలు పెట్టడం ఇపుడు చర్చనీయాంశం అవుతుంది. ఈ విషయంపై ముఖ్యమంత్రితోపాటు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ రంగంలోకి దిగితే తప్పా.. ఉద్యోగులను వేధించే అధికారుల శాడిస్టు చర్యలకు అడ్డుకట్టే పడే అవకాశాలు కనిపిండచడం లేదు. చూడాలి సచివాలయ ఉద్యోగులను వేధించి.. సెలవుల రద్దు చేసి.. సెలవుల్లోనే అదనపు విధులు అప్పగించి.. ఉద్యోగులను మానసికంగా కృంగదీస్తున్న అధికారుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటుందనేది..?!

viskahapatnam

2024-12-18 18:54:17

సచివాలయ ఉద్యోగులకు రంగు పడుద్ది..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇవ్వనుంది..అదేనండీ లేట్ గా వస్తే ఒకరోజు జీతం కట్, కానీ వారు రోజంతా పనిచేయాలి.. ఆ విషయం నెలాఖరున జీతం వచ్చినపుడుగానీ వారికి తెలియదు.. అసలే ఒక ఉద్యోగం.. ప్రభుత్వంలోని అన్నిశాఖల విధులూ చేస్తున్న సచివాలయ ఉద్యోగులకు ఇదొక అదనపు బోనస్ గానే చెప్పాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే అనుకుంటే.. అంతకు మించి అదనపు పనులు కూటమి ప్రభుత్వంలో  చేయాల్సి వస్తుందని ఏకంగా అడ్మిస్ట్రేషన్ 2.0 ఎలా ఉంటుందో తమకు ప్రభు త్వం చూపిస్తుందని ఉద్యోగులు సామాజిక మాద్యమాల్లో పెద్ద చర్చకు తెరలేపారు.. అంతేకాదు కోరి మద్దతు ఇచ్చినందుకు ఆమాత్రం కూడా జీతాల్లో కోతలు, సెలవు రోజుల్లోనే విధులు, టార్గెట్లు పూర్తిచేయకపోతే మెమోలు ఇవ్వకపోతే ఎలా అంటూ సెటైర్లు కూడా వేసుకుంటు న్నారు. సీఎం చంద్రబాబు విజన్ పరిపాలన ఎక్కడా కనపడనీయకుండా  రాష్ట్ర అధికారులు అదనంగా పనిచేయించడానికే టార్గెట్ చేస్తున్నారంటూ మండి పడుతున్నారు..!

రాష్ట్రంలో రెండవ అతి పెద్ద ప్రభుత్వ శాఖగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర అధికారులు చుక్కలు చూపించడానికి సిద్దమవుతున్నారు. అదనంగా చేసిన పనిగంటలను లెక్కించ కుండా.. విధి నిర్వహణకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా.. ఇన్ అండ్ అవుట్, మిడిల్ బయోమెట్రిక్ సక్రమంగా వేయకపోతే మాత్రం ఆరోజుని సిఎల్ గా భావించడానికి సిద్దపడుతున్నారు. అసలే గత నెల జీతాల్లో జియో ట్యాగింగ్ సర్వేలు అనుకున్నంత స్థాయిలో అవలేదని సిబ్బందికి ఒకటి, రెండు రోజుల జీతం కట్ చేసి బిల్లులు పెట్టిన ప్రభుత్వం.. మరో భారీ కోతలకు సిద్దపడుతున్నదని ఉద్యోగులు సామాజిక మాద్యమాల్లో చర్చించుకుంటున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చి అన్ని శాఖల పనులూ చేయిస్తే.. కూటమి ప్రభుత్వం దానికి రెట్టించిన ఉత్సాహంలో చేసిన పనులకు నజరానాగా జీతాల్లో కోతలు పెట్టడానికి సిద్దమవుతున్నదని బావురు మంటున్నారు. 

గత ప్రభుత్వం  సచివాలయ ఉద్యోగుల విషయంలో చేసిన మోసాన్ని, కల్పించని ప్రయోజనాలను కూటమి ప్రభుత్వం చేస్తుందని నమ్మి మద్దతు ఇచ్చినందుకు ఆదిలోనే రిటర్న్ గిఫ్ట్ ఈ రేంజ్ లో ఇస్తుందనుకోలేదని ఉద్యోగుల వాట్సప్ గ్రూపుల్లో చర్చిస్తున్నారు. భారతదేశంలోని ఎక్కడా లేని విధంగా గ్రామ, వార్డు స్థాయిలో ప్రజలకు సేవలు అందించడానికి సచివాలయశాఖను ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే.. ఇదంతా ప్రజా సేవ అనుకున్నామని.. కానీ అన్నిశాఖల్లో ఉద్యోగాలు భర్తీచేయాల్సి వస్తుందని.. కేవలం సచివాలయశాఖ ద్వారా 19 విభాగాల ఉద్యోగాలు తీసి అన్ని శాఖల పనులూ చేయిస్తారని కలలో కూడా ఊహించలేదని వాపోతున్నారు. అలాగని ఈ శాఖకు చట్టబద్ధత గానీ, ఇతర ప్రభుత్వశాఖల మాదిరిగా సర్వీసు నిబందనలు, ప్రమోషన్ చార్టు ఏమైనా ఏర్పాటు చేశారా అంటే అదేమీ చేయకుండా.. కేవలం ఉద్యోగులను అన్నిశాఖల విధులకు, పనులకు వినియోగించడానికే చూస్తున్నారని ఉద్యోగులు తీవ్ర వేదనకు గురవుతున్నారు. 

గత ప్రభుత్వం చేయని పనులు కూటమి ప్రభుత్వం చేస్తుందని.. కనీసం మాతృశాఖలకు తమను అప్పగిస్తుందని భావించామని.. అదేం చేయకుండా ఇక్కడే ఉంచి సెలవు రోజులు, డ్యూటీ టైమ్ కాకుండా అదనపు పనిగంటలు విధులు చేయిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. చేసిన విధులే అదనం అనుకుంటే దానికి టార్గెట్లు, వేదింపులు కూడా బోనస్ గా వస్తున్నాయని మండి పడుతూ కూటమిపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఒకరకంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే నయమంటూ పశ్చాత్తప పడినట్టుగా వారి బావాలను గ్రూపుల్లో వ్యక్తం చేసు కుంటున్నారు. ఇంకా సూపర్ సిక్స్ పథకాలు ఏమీ అమలు కాకుండానే ఇంత పని ఒత్తిడి ఉంటే.. అన్ని పథకాలు అమలు చేస్తే.. ఈ ప్రభుత్వ ఉద్యోగం మాకొద్దంటూ మా అంతట మేమే ఉద్యోగాలకు రాజీనామాలు చేసిపోయేంతగా టార్గెట్లు పెట్టేలా ఉన్నారంటూ మండిపడుతున్నారు. 

ఈ లెక్కన వీరి నిరసన ప్రజల వరకూ చేరితే ఏడాది తిరిగేలోపు ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలా కాకుండా జరగాలంటే.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సచివాలయశాఖకు కల్పించని చట్టబద్దత ఏర్పాటు చేయడంతోపాటు, ఉద్యోగుల ను మాతృశాఖల్లో విలీనం చేసి, అన్నిప్రభుత్వశాఖల ఉద్యోగుల మాదిరిగా వీరికి కూడా పదోన్నతులు, ప్రభుత్వ ప్రయోజనాలు కల్పించి.. ఆపై అడ్మిస్ట్రేటషన్ 2.0 అమలు చేస్తే ఫలితాలొస్తాయని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. చూడాలి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల విష యంలో ఏ విధంగా వ్యవహరిస్తుందనేది..?!

Visakhapatnam

2024-12-02 16:17:49

పేరుకే అడ్మిన్లు.. చేసేవి బిల్ కలెక్టర్ పనులు..?!

ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎక్కడైనా ఒక శాఖ సిబ్బంది ఆ శాఖ పనులు మాత్రమే చేస్తారు..ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వంలో 75వ ప్రభుత్వశా ఖగా కొత్తగా ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయశాఖలో మాత్రం సిబ్బంది ఒక ఉద్యోగం.. అన్నిప్రభుత్వశాఖల పనులూ చేస్తారు.. ఇతరశాఖ ల్లో ఏశాఖ ఉద్యోగులకు ఆ శాఖ సర్వీసు నిబంధనలుంటే.. ఇక్కడ మాత్రం ఆరు విభాగాల సిబ్బందికి మాత్రం ఒకే రకమైన సర్వీసు నిబంధ నలుంటాయి.. కానీ ప్రమోషన్ ఛానల్ మాత్రం ఉండదు.. పైగా వార్డుల్లో పనిచేసే అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలకు వాళ్లు చేయాల్సి పనులను ప్రక్కన పెట్టి..బిల్ కలెక్టర్లు, ఇంటింటా సర్వేలు, బిఎల్వో విధులు, జియో ట్యాటింగ్ సర్వేలతో పాటు వార్డుల్లో ఏదైనా శాఖల సిబ్బంది ఖాళీలు ఉంటే వారి పనులు కూడా వీరే చేయాలి.

వార్డు అడ్మిన్ లకు ఇంకో బోనస్ ఏంటంటే వీళ్లు ప్రజా సేవచేయడానికి వారికిచ్చే జీతం నుంచే అన్నీ ఖర్చుచేయాలి.. కార్యాలయాల్లో స్టేషనరీ, రిజస్టర్లు, తెల్లకాగితాలు, పెన్నులు,పెన్సిళ్లు, వీళ్లే కొనాలి, సెల్ ఫోనుల్లో ఇంటర్నెట్ బ్యాలెన్స్ వీరే వేయించుకోవాలి, కంప్యూటర్లు, ప్రింటర్లు పాడైనా అవీ వీరే బాగుచేయించుకోవాలి.. ఇదెక్కడి ప్రభుత్వ ఉద్యోగమని ప్రశ్నిస్తే మాత్రం మున్సిపల్  అధికారులు వీరంతా టార్గెట్ అయిపోతారు.. మెమోలు, సస్పెన్లు, అధనపు పనుల షడన్ గా తెరమీదకు వచ్చేస్తాయి.. చదవడానికి వెరైటీగా ఉన్నాఇదే నిజం..!

వైఎస్సార్సీపీ ప్రభుత్వం నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల్లో చేరిన ఉద్యోగులకు వారి విధులే శాపాలుగా మారుతున్నాయి.. ఏ ప్రభుత్వశాఖలోనూ లేని తేడా సర్వీసు నిబంధనలు కనీసం అమలు కాని ప్రమోషన్ ఛానల్ ఒక్క సచివాలయశాఖలోనే ప్రభుత్వం అమలు చేసి వీరందరితోనూ పొందిన ఒక్క ఉద్యోగంతో అన్ని ప్రభుత్వశాఖల పనులూ చేయించింది గత ప్రభుత్వం.. ఆ ప్రభుత్వం చేయించగా లేనిది మనమేమన్నా తక్కువ తిన్నామా అంటూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా రెట్టించిన పట్టుదల, ఉత్సాహంతో మరిన్ని అదనపు విధులు వీరితో చేయిస్తోందని ఉద్యోగులు నెత్తీ నోరూ కొట్టుకుంటున్నారు. వీరందరికీ ఉద్యోగాల్లోకి రాకముందు తెలియదు. ఇచ్చిన ఒక ఉద్యోగం ఒకటే అయినా.. అన్ని ప్రభుత్వశాఖల పనులూ చేయాల్సి వస్తుందని.

 పైకి మాత్రం ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన ప్రభుత్వంగా కీర్తి ప్రతిష్టలు పొందిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. విధుల్లోకి చేరిన తరువాత ఉద్యోగుల తిట్లు, శాపనార్ధాలను  కూడా అదే స్థాయిలో మూట గట్టుకుంది. ఇపుడు కూటమి ప్రభుత్వ పరిస్థితి కూడా అదే వీరిని చేస్తామన్న న్యాయం చేయపోగా ప్రైవేటు సంస్థల కంటే దారుణంగా టార్గెట్లు, బెదిరింపులు, వేధింపులు.. వెరసీ ఉద్యోగులు ఒక్కక్కరుగా లాంగ్ లీవ్ పై వెళ్లిపోతుంటే మరికొందరు.. ఇతర పోటీ పరీక్షలకు సిద్దమవుతున్నారు.  75 ప్రభుత్వ శాఖల్లో ఒకేసారి ఖాళీలు ఏర్పడటంతో అన్ని ప్రభుత్వశాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేయాల్సి వస్తుందని.. మాస్టర్ ప్లాన్ వేసిన గత ప్రభుత్వం.. గ్రామ, వార్డు సచివాలయశాఖను తెరమీదకు తీసుకువచ్చింది. 

ఏకంగా ఒక ప్రభుత్వశాఖలో 1.30లక్షల ఉద్యోగాల కల్పన అంటే దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపే తొంగి చూసింది. కానీ ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తే.. అన్ని శాఖల పనులూ ఈశాఖ ఉద్యోగులే చేయాల్సి వస్తున్నది. కాదు కాదు చేయిస్తున్నారు. అలాగని వీరికి ప్రత్యేకంగా ఏమైనా సదుపాయాలు, ప్రయోజ నాలు కల్పించారా అంటే అదీ లేదు. ఇతర ప్రభుత్వశాఖల్లోని ప్రయోజనాలు, జీతాల కంటే తక్కువ. ఉన్నవి తీసేయడంతోపాటు ఇతర  ప్రభుత్వశాఖల ఉద్యోగులకు అమలు చేసే సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయకుండా..తలా తోకా లేని జీఓలతో ఉద్యోగుల నోట్లో మట్టి కొట్టింది.

 వాటిని సరిచేస్తామన్న కూటమి ప్రభుత్వం కూడా పరిపాలనా సౌలభ్యం కోసం గత ప్రభుత్వం అన్నిశాఖల పనులకు సచివాయల ఉద్యోగుల ను ఏ విధంగా వినియోగించిందో.. ఈ ప్రభుత్వం కూడా ఆ విధంగానే వినియోగిస్తున్నది. కనీసం ఇతర ప్రభుత్వశాఖల మాదిరి ఉద్యోగులుగా కూడా వీరిని చూడటం లేదు.  గ్రామ సచివాలయాల్లో గ్రేడ్-5 కార్యదర్శిలుంటే.. వార్డుల్లో అడ్మిస్ట్రేటివ్ సెక్రటరీలను నియమిం చింది. వీరంతా పేరుకి సెక్రటరీలు, అడ్మిన్ లు మాత్రమే. చేసేవన్నీ బిల్ కలెక్టర్, సర్వేపనులు, ఇతర కార్యాలయ పనులు, జియో ట్యాగింగ్ లు, ఖాళీగా ఉన్న సిబ్బంది అదనపు విధులూ. 

విశేషం ఏంటంటే ఏ ప్రభుత్వశాఖలోనూ లేనివిధంగా ఆరు విభాగాల్లోని ఉద్యోగులకు ఒకే రకమైన సర్వీసు నిబంధనలు అమలయ్యేవిధంగా జీఓనెంబరు-286 విడుదల చేసింది. గత ప్రభుత్వం. దానినే కొనసాగిస్తున్నది కూటమి ప్రభుత్వం కూడా. అదీ కూడా 74వ రాజ్యాంగ సవరణ చట్టానికి వ్యతిరేకంగా. ప్రస్తుతం ఉన్న అన్ని ప్రభుత్వశాఖల్లో ఆయా శాఖలు, ఉద్యోగులు వారి కేడర్ ఆధారంగా సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ ఉంటాయి. అదేంటో విచిత్రంగా వార్డు సచివాలయాల్లో ఏకంగా ఆరు ప్రభుత్వశాఖల ఉద్యోగులందరికీ కలిపి ఒకే విధంగా సర్వీసు నిబంధనలు ఏర్పాటు చేసింది. ఈ విషయమై ఉద్యోగులు ఎన్నిసార్లు ప్రశ్నించినా.. మరెన్నిసార్లు విలన్నవించుకున్నా వారి అర్జీలన్నీ బుట్టదాఖలే అవుతున్నాయి. మిగిలిన ప్రభుత్వశాఖల్లో ప్రభుత్వం స్టేషనరీకి నిధులు విడుదల చేస్తుంది. లేదంటే జిల్లా కార్యాలయాల నుంచి పంపిణీ చేస్తుంది. 

విచిత్రంగా గ్రామ, వార్డు సచివాలయశాఖలో మాత్రం కార్యదర్శిలు, అడ్మిన్లు వారికొచ్చే జీతంలో నుంచే స్టేషనరీ ఖర్చులన్నీ పెట్టుకోవాలి. అదేమంటే ప్రజల కోసం ప్రభుత్వం కోసం ఆ మాత్రం కూడా పెట్టుకోలేరా అంటూ అధికారులు ఉద్యోగులపై ఒంటికాలపై లేస్తున్నారు. సొంత శాఖ ఉద్యోగం కంటే ఇతర శాఖల్లో పనుల అధనంగా కేటాయించి అన్యాయం, స్టేషనరీలో జేబుల గుల్ల, సర్వీసు నిబంధనల్లో అన్యాయం, పేస్కేలు, పీఆర్సీ అమలులో అన్యాయం. ఇలా అడుగుడునా వీరికి కూడా అన్యాయమే జరుగుతూ వస్తున్నది. గ్రామవార్డు సచివాలయశా ఖలోని 19విభాగాల్లోని ఉద్యోగుల్లో కేవలం వ్యవసాయశాఖ, వాణిజ్యశాఖ, పంచాయతీరాజ్ విభాగాల ఉద్యోగులకు తప్పితే మరే ఇతర ఉద్యోగులకు సర్వీసు నిబంధనలు, ప్రమోషనల్ ఛానల్ సక్రమంగా లేవు.

 వారికి ఒకటి అరా పదోన్నతులు కూడా కల్పించింది గత ప్రభుత్వం. ఉద్యోగుల కష్టాలు తీరుస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులను వారి మాతృశాఖలకు బదిలీలు చేస్తామని కేబినెట్ లో తీర్మాణం చేసి ఆపై ఏమీ చేయకుండా కూర్చుంది. కూటమి ప్రభుత్వం లోనైనా సచివాలయ ఉద్యోగులకు ఒక దారీ తెన్నూ ప్రత్యేక జీఓ ద్వారా తీసుకురాకపోతే మాత్రం మరో ఐదేళ్లు వీరికి ఎలాంటి పదోన్నతులు, సర్వీసునిబంధనలు, ఉద్యోగ భద్రత కనిపించేట్టు లేదు..చూడాలి ఏం జరుగుతుందనేది..?!

Visakhapatnam

2024-11-25 18:36:01

మబ్బుల్లోనే మత్స్య సహాయకులు పదోన్నతులు..?!

ఒకరు చేసిన తప్పుకి మరొకరు బలైపోవడం అంటే ఏంటో గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులను చూస్తే కొట్టొచ్చినట్టు ఖచ్చితంగా కనిపి స్తుంది..అవును పేరుకి ప్రభుత్వంలోని 75వ ప్రభుత్వశాఖగా ఏర్పాటైనా.. ఈశాఖకు ఐదేళ్లు దాటిపోతున్నా కనీసం చట్టబద్దత లేదు.. కనీసం ఇందులో పనిచేసే ఉద్యోగులకు సక్రమమైన సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ కూడా లేదు.. ప్రభుత్వ ప్రయోజనాలు కల్పించడంలో గత ప్రభుత్వమే జాగు చేస్తుందనుకుంటే.. కూటమి ప్రభుత్వంలో మరింత ఆలస్యం అవుతున్నది.. కాదు. కాదు గత ప్రభుత్వం చేసిన తప్పు లను ఏ విధంగా సరిదిద్దాలో తెలియక కూటమి ప్రభుత్వం కూడా జుట్టుపీక్కుంటుంది..

జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు.. గత ప్రభు త్వం తేడా విధానాలు.. ముందుకి సాగని ఈ ప్రభుత్వ దిద్దుటబాటు చర్యలు ఫలితంగా గ్రామ, వార్డు సచివాలయశాఖలోని ఒక విభాగంగా వున్న గ్రా మీణ మత్స్య సహాయకులు కనీసం పదోన్నతులు లేకుండా పడిగాపులు కాస్తున్నారు.. మెరిట్ లిస్ట్ ఆధారంగా పదోన్నతులు కల్పిం చాలని చూసినా.. మత్స్యశాఖ కమిషనరేట్, జిల్లా కార్యాలయాల్లో చేసిన తప్పుల కారణంగా మెరిట్ నష్టపోయిన ఉద్యోగులకు ఉపస మనం కూడా దక్కలేదు..వెరసీ గ్రామీణ మత్స్య సహాయకుల పదోన్నతులతోపాటు.. జిల్లా అధికారులైన డిప్యూటీ డైరెక్టర్ల పదోన్నతులు కూడా పాత రోస్టర్ విధానం కాకుండా కొత్తగా కోర్టు తీర్పుల ఆధారం చేపట్టాలని ఓ వర్గం గట్టిగా ప్రయత్నిస్తుండటంతో పదోన్నతులు మబ్బుల్లోనే ఉండి పోయా యి..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సీరియస్ గా తలచుకున్నా ఈశాఖలోని గ్రామీణ మత్స్యసహా యకులు, ఇదేశాఖలోని డిప్యూటీ డైరెక్టర్ల పదోన్నతుల వ్యవహారం కనీసం ఒక్క అడుగు కూడా ముందుకి సాగడం లేదు. ఆఖరికి ఈశాఖ కమిషనర్  మంత్రి, ఇతర అధికారుల నిర్ణయాలు, ఉద్యోగుల అభ్యర్ధనలతో సచివాలయ శాఖ నుంచి మత్స్యశాఖలో విలీనం చేయాలని ప్రభుత్వానికి రాసిన సిఫారసు లేఖ కూడా పక్కన పడిఉంది. ప్రభుత్వంలో ఏవో సాంకేతిక కారణాలు చూపి అమరావతిలోని రాష్ట్ర అధికారులు ఈ పదోన్నతుల దస్త్రాలను, విఎఫ్ఏల విలీన అంశాలను ముందుకి కదపడం లేదు. గ్రామ, వార్డు సచివాలయశాఖలో విఎఫ్ఏ లుగా ఉన్న వారిని అసిస్టెంట్ ఇనెస్పెక్టర్ పదోతున్నలు ఇవ్వాల్సి వుంది. దానికోసం విఎఫ్ఏల మెరిట్ లిస్టు జాబితా సిద్దం చేయాలను కున్నారు. కానీ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో వీరి నియమాకాలు జరిగిన సమయంలో విఎఫ్ఏలకు ప్రభుత్వం కొన్ని గ్రేస్ మార్కులు కలిపింది. 

తద్వారా విఎఫ్ఏల్లో కొంత మందికి మెరిట్ జాబితాలో వారి పేర్లు జిల్లా పరిధిలో టాప్ టెన్ లోకి వెళ్లే అవకాశం వుంది. కానీ అలా ప్రభుత్వం ఇచ్చిన గ్రేస్ మార్కులు కొన్ని జిల్లాల్లో విఏఎఫ్ లకు కలపకపోవడంతో వారు జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, కమిషనరేట్లను ఆశ్రయించారు. వాస్తవానికి గ్రామ, వార్డు సచివాలయశాఖ డైరెక్టర్ డా.లక్ష్మీషా ఉన్న సమయంలోనే ఇక్కడ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడం మొదలు పెట్టారు. అంతేకాకుండా మిగిలిన అన్నిశాఖల సిబ్బందికి పదోన్నతులు కల్పించే పనులు జరుగుతున్న సమయంలో అనూహ్యంగా ఆయ నకు మరోశాఖకు బదిలీ జరిగిపోయింది. తరువాత ఈ శాఖలోకి వచ్చిన ఏ డైరెక్టర్ కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ గానీ సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల, సర్వీసు రూల్స్ విషయంలో కనీసం ఒక్క అడుగు కూడా ముందుకి వేసిన దాఖలాలు నేటికీ  కనిపించలేదు.

జిల్లా మత్స్య శాఖ కార్యాలయాల్లో నియమాకాల్లో సమయంలో ప్రభుత్వం ఇచ్చిన గ్రేస్ మార్కులతో కలిపి మెరిట్ లిస్టు జాబితాలను తయారు చేయాల్సిన అధికారులు గత ప్రభుత్వంలో నిర్లక్ష్యంగా వదిలేశారు. తీరా విఎఫ్ఏలకు పదోన్నతులు కల్పించాలని చూసిన సమయంలో ఈ సాంకేతిక అంశం తెరపైకి వచ్చింది. అలా మెరిట్ లిస్టులో తమపేర్లు లేవని..ప్రభుత్వం కలిపిన గ్రేస్ మార్కులు తమకు కలవలేదని మెరిట్ నష్టపోయిన విఎఫ్ఏలు జిల్లా కలెక్టర్, జిల్లా మత్స్యశాఖ అధికారులతోపాటు, అమరావతిలోని కమిషనరేట్ లో కూడా ఫిర్యాదులు చేశారు. ఉద్యోగు లు నష్టపోయిన అంశంలో స్పందన లేదు. కానీ గ్రేస్ మార్కులు కలపని విషయమై జిల్లాశాఖ అధికారులు తమ సమస్య  పరిష్క రించలేదని కమిషనరేట్ కి, ఇదేశాఖలోని ప్రిన్సిపల్ సెక్రటరీలను కలిసిన విఎఫ్ఏలకు మాత్రం మెమోలు ఇచ్చారు ఇదేశాఖ అధికారులు. 

అంటే ఇక్కడ చేయాల్సిన పనులు చేయకపోగా.. తమనకు అన్యాయం జరిగిందని రాష్ట్ర అధికారులకు మొరపెట్టుకుంటే చర్యలు తీసుకోవ డానికి అత్యంత వేగంగా ముందుకి కదిలిన జిల్లా అధికారులు, మెరిట్ లిస్టులో నష్టపోయిన విషయంలో విఎఫ్ఏలకు న్యాయం చేయడానికి మాత్రం ముందుకి రాలేదు. అలాగని జిల్లా అధికారులు పంపిన మెరిట్ లిస్టులపై కమిషనరేట్, ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయ అధికారులు కూడా చర్యలు తీసుకోలేదు. ఫలితంగా వీరి పదోన్నతుల వ్యవహారం ఇంకా మబ్బుల్లోనే తేలుతూ ఉంది.

మత్స్యశాఖలో పనిచేస్తున్న నాల్గవ తరగతి ఉద్యోగులకే కాదు.. జిల్లా అధికారుల పదోన్నతులపై కూడా రాష్ట్రప్రభుత్వం గానీ, ఇదేశాఖలోని కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీలు గానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. విఎఫ్ఏలకు మెరిట్ లిస్టుల్లో తేడాలున్నాయని వారి ప్రమోషన్ ఫైల్ పక్కన పెట్టేసినట్టే.. జిల్లా మత్స్యశాఖ అధికారులు(డిప్యూటీ డైరెక్టర్)ల పదోన్నతులు కూడా ఎప్పటి నుంచో వస్తున్న రోస్టర్ విధానం కాకుండా  కోర్టు తీర్పుల విషయాన్ని తెరమీదకు తీసుకొచ్చి పదోన్నతులను ముందుకి సాగనీయకుండా చేస్తున్నారు మత్స్యశాఖ కమిషనరేట్ అధికా రులు. ప్రభుత్వంలోని ఎప్పటినుంచో వస్తున్న రోస్టర్ విధానంలోనే పదోన్నతుల ఫైల్ పెట్టాలని మత్స్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అన్ని సామా జిక వర్గాల ఉద్యోగులకు న్యాయం చేయాలని చూస్తున్నా.. ఇదేశాఖలోని కొందరు రాష్ట్రస్థాయి అధికారులు మాత్రం కొన్ని సమాజిక వర్గాల అధికారులకు పదోన్నతులు రాకుండా చేయడానికి, రోస్టర్ విధానం కాకుండా కోర్టు అంశాలను తెరపైకి తీసుకొచ్చి పదోన్నతుల సవ్యంగా జరగకుండా అడ్డుపడుతున్నారు.

 ఫలితంగా ఇప్పటికే నలుగురు డిడిలు వారి సర్వీసులో జెడీ ప్రమోషన్ రాకుండానే రిటైర్ అయిపోయారు. అయినా మత్స్యశాఖ అధికారులు మాత్రం డిడి ప్రమోషన్ ఫైల్స్ ని ముందుకి సాగనీయడం లేదు. ఈ విషయంలో సాక్షత్తూ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కలుగజేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఇలా ఒక్క గ్రామీణ మత్స్యసహాయకుల పదోన్నతులే కాకుండా జిల్లా అధికారుల పదోన్న తులు కూడా ప్రస్తుతం గాల్లోనే ఉన్నాయి. మరో వైపు జిఏడీ నుంచి కూడా నిర్ధిష్టమైన ఆదేశాలు రాకపోవడ కూడా ఆయా ప్రభుత్వశా ఖల్లో కమిషనరేట్లలలో సర్వీస్ రూల్స్, ప్రమోషన్ ఛానల్, మెరిట్ లిస్టు జాబితా వ్యవహారాల పనులు జరగడం లేదు. గత ప్రభుత్వంలోనే విఎఫ్ఏల నుంచి డిడి ల వరకూ ప్రమోషన్లు రావాల్సి ఉన్నా.. ఒక వర్గం అధికారులు కావాలని చేస్తున్న తాత్సారం, అడ్డు పుల్లల చర్యల వలన అన్ని విభాగాల్లోని సిబ్బంది, అధికారులకు పదోన్నతులు లేకుండా పోతున్నాయి. 

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయం మేరకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మాతృశాఖల్లో విలీనం చేయాలనే నిర్ణయాలన్ని 19శాఖల్లో 18శాఖల కమిషనర్లు ముందుకి కదపకపోయినా.. ఒక్క మత్స్యశాఖ కమిషనర్ కదిపినా ప్రభుత్వం లో చర్యలు మాత్రం శూన్యం. ఇదే విధానం కొనసాగితే సచివాలయ గ్రామీణ మత్స్య సహాయకులు పదోన్నతులు లేకుండా సర్వీసు మొత్తం విఎఫ్ఏలుగానే ఉండిపోవాల్సి వుంటుంది..?!

visakhapatnam

2024-11-22 13:49:38