శ్రీకాకుళంలో రేపు జాబ్ మేళా..


Ens Balu
8
Srikakulam
2022-04-21 13:52:50

శ్రీకాకుళం జిల్లాలోని నిరుద్యోగ యువతకు డాక్టర్స్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ కంపెనీలో  ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు బి.శాంతిశ్రీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె గురువారం ఒక ప్రకటన జారీచేసారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మరియు సోసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఎంపిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. డిప్లమో ఇన్ ఎలక్ట్రికల్, డిప్లమో ఇన్ మెకానికల్, డిప్లమో  ఇనుస్ట్రమెంటేషన్ ఇంజనీరింగ్ తదితర విద్యార్హత కలిగి, 2021 సంవత్సరంలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్ధులు ఈ పోస్టులకు అర్హులని ఆమె స్పష్టం చేసారు. ఎంపిక కాబడిన అభ్యర్ధులకు ఏడాది శిక్షణ కాలం నందు రూ.2,00,000/-లు ఉపకార వేతనంతో పాటు భోజన, వసతి సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు. ఆసక్తి గల అభ్యర్ధులు తమ విద్యార్హత ధృవపత్రాలు, బయోడేటా, ఆధార్ కార్డుతో సహా ఏప్రిల్ 25న ఇచ్చాపురం ప్రభుత్వ హైస్కూల్ నందు ఉదయం 9.00 గం.ల నుండి సాయంత్రం 4.00 గం.ల వరకు నిర్వహించు ఉద్యోగాల ఎంపిక కార్యక్రమంలో పాల్గొనాలని ఆమె ఆ ప్రకటనలో కోరారు.