జాబ్ మేళా ను యువత వినియోగించుకోవాలి


Ens Balu
22
2022-10-13 15:27:58

విద్యావంతులైన నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో నిర్వహిస్తున్న జాబ్ మేళా లను యువత వినియోగించుకొని మంచి కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు పొందాలని జిల్లా కలెక్టర్ ఏ శ్రీమతి సూర్యకుమారి కోరారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ జాబ్ మేళా శుక్రవారం స్థానిక కస్పా మునిసిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న నేపధ్యంలో దీనికి సంబంధించిన పోస్టర్ ను జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విడుదల చేశారు. రిలయన్స్, ఫ్లిప్ కార్ట్, వరుణ్ మోటార్స్, జయభేరి ఆటోమోటివ్, అరబిందో ఫార్మా, హెటేరో లాబ్స్, డెక్కన్ ఫైన్ కెమికల్స్, ఆదిత్య బిర్లా ఇన్సూరెన్స్, అపోలో ఫార్మసీ, డిక్సన్ టెక్నాలజీస్ వంటి 22 సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయనీ నియోజక వర్గంలోనీ యువత వినియోగించుకొని ఉద్యోగాలు పొందాలని ఆకాంక్షించారు.

 పదో తరగతి నుంచి పి.జి. వరకు విద్యార్హతలు గల యువత ఈ జాబ్ మేలాలో ఉద్యోగాలు పొందే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివద్ధి అధికారి గోవింద రావు, జిల్లా ఉపాధి కల్పన అధికారి అరుణ కుమారి, సి డాప్ అధికారి మార్టిన్ తదితరులు పాల్గొన్నారు.