5 రోజులు కోర్టు ఉద్యోగులకు కంప్యూటర్ పరీక్ష


Ens Balu
25
Visakhapatnam
2022-12-07 13:13:13

కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామనే నకిలీ ప్రచారాలను, అభ్యర్ధులు నమ్మవద్దని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి గుత్తాల గోపి సూచించారు. ఈ మేరకు విశాఖలో  మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ఏపీలోని జిల్లా కోర్టులలో ఉద్యోగ ఖాళీల భర్తీ నిమిత్తం జరుగుతున్న ప్రక్రియ లో భాగంగా అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత 
పరీక్షను డిసెంబర్ 21, 22, 23, 29 మరియు జనవరి 2వ తేదీలలో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. స్టెనో గ్రాఫర్ గ్రేడ్ -3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ , ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఉమ్మడి పరీక్షను 21-12-2022, 22-12-2022, 23-12-2022, 29- 12-2022, 09-01-2023 న, కాపీయిస్ట్ ఎగ్జామిన ర్, రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ కొరకు . ఉమ్మడి పరీక్ష ను 26-12-2022న, డ్రైవర్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీ కి. ఉమ్మడి పరీక్ష ను 26 -12-2022, 27-12-2022, 28-12-2022, 29-12-2022 న తేదీలలో జరుగుతాయి. హాల్ టిక్కెట్లను 16-12-2022 నుండి హైకోర్టు వెబ్ సైట్ hc.ap.nic.in డిస్ట్రిక్ట్ కోర్టు వెబ్ సైట్ districts.ecourts.gov.in/andhrapradesh లో నుంచి తీసుకోని పరీక్ష తేదీ సమయం తెలుసుకోవాలన్నారు. హెల్ప్ డెస్క్ ల్యాండ్ లైన్ Number: 0863-2372752  అక్రమార్కులకు సంబంధించిన ఫిర్యాదులు చేయవచ్చునన్నారు. అభ్యర్ధుల పరీక్షలన్నీ పరీక్షలు ఆన్ లైన్  
పద్దతి లో జరుగుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.