సచివాలయ ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్


Ens Balu
20
Tadepalli
2023-01-04 16:21:48

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయశాఖలోని మిగులు ఉద్యోగాల భర్తీకి సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గత కొద్ది రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా 14వేల 5 సచివాలయాల్లోని ఖాళీల వివరాలను అధికారులు సేకరించారు. రెండు నోటిఫికేషన్ల ద్వారా సుమారు 1.22 వేల ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీచేయగా, మరికొన్ని ఉద్యోగాలను కారుణ్య నియామకాల చేపట్టారు. ఇంకా మిగిలిపోయిన ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీచేయనున్నారు. సీఎం ఉద్యోగాలకు పచ్చ జెండా ఊపిన నేపథ్యంలో సంక్రాంతి నాటికి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నాయని ఉన్నతాధికారి ఒకరు ఈఎన్ఎస్ కి తెలియజేశారు.