మత్స్యకారులకు విశేషంగా సేవలందించాలి..


Ens Balu
2
Vizianagaram
2021-03-01 16:52:55

విజయనగరం జిల్లాలో మత్స్యకార కుటుంబాలకు సాగర మిత్రాలు విశేషంగా సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ సూచించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో సాగర మిత్రాలుగా ఎంపికైన 14 మందికి మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్. నిర్మలకుమారి తో కలిసి నియామకపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మత్స్యకారులకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను వారికి తెలియజేయడంతోపాటు, శాఖపరమైన సమస్యల పరిష్కారంలోనూ సాగరమిత్రాలు కీలకంగా వ్యవహరించాలన్నారు. మత్స్యాకారులకు సేవలందించేందుకు శక్తివంచన లేకుండా కష్టపడాలన్నారు.  డిప్యూటీ డైరెక్టర్ నిర్మలకుమారి మాట్లాడుతూ, జిల్లాకు ప్రభుత్వం 16 పోస్టులు కేటాయించిందన్నారు. ఇంటర్వ్యూలలో కేవలం 14 మంది మాత్రమే ఎంపికయ్యారని చెప్పారు. మిగిలిన రెండు సాగర మిత్రాలను జిల్లాకలెక్టర్ ఆదేశాల మేరకు తరువాత భర్తీచేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.