ఇంటర్వ్యూలో 60 మంది సాగర మిత్రాలు ఎంపిక..


Ens Balu
2
Srikakulam
2021-03-04 13:51:53

సాగర్ మిత్ర పోస్టులకు మౌకిక పరీక్షలు సంయుక్త సుమిత్ కుమార్ అధ్యక్షతన గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగాయి.మొదటి విడతలో భర్తీచేయనున్న 60మంది సాగర్ మిత్ర పోస్టుల కొరకు జిల్లావ్యాప్తంగా దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి విదితమే. అందులో భాగంగా 682 మంది అభ్యర్ధులు ఈ పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకోగా, అర్హతల మేరకు 190 మందిని ఎంపికచేయడం జరిగిందని మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు పి.వి.శ్రీనివాసరావు తెలిపారు. వీరిలో 100 మందిని పూర్తి అర్హులుగా  గుర్తించి వారందరికీ గురువారం మౌకిక పరీక్షలకు నిర్వహించడం జరిగిందని, వారిలో 60 మందిని సాగర్ మిత్ర పోస్టుల కొరకు ఎంపికచేసినట్లు ఆయన చెప్పారు. ఎంపికైన 60 మంది అభ్యర్ధులలో 9 మంది డిప్లమో ఇన్ ఫిషరీస్ చేసిన వారు ఉన్నారని, వీరందరికి నియామక పత్రాలను సంయుక్త కలెక్టర్ చేతుల మీదుగా అందించనున్నట్లు ఆయన చెప్పారు. కాంట్రాక్ట్ పద్దతిలో కొనసాగే ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.15 వేలు పారితోషికం ఉంటుందని, 2025 మార్చి వరకు ఈ పోస్టులు కొనసాగనున్నాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డా. ఎం.ప్రసాదరావు, మత్స్య శాఖ సహాయ సంచాలకులు సత్యనారాయణ, గోపీకృష్ణ, ఎఫ్.డి.ఓలు గంగాధర్, ధర్మరాజు పాత్రో , ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.