ఆ పోస్టుల భర్తీ మున్సిపల్ కౌంటింగ్ తరువాతే..
Ens Balu
3
Tadepalle
2021-03-12 12:53:44
ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయశాఖలో భర్తీకాకుండా మిగిలిపోయిన 8402 పోస్టులను రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావిడీ పూర్తయిన తరువాత భర్తీచేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిగిలిపోయిన ఈ పోస్టుల చార్జును ఏపీపీఎస్సీకి అందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఎత్తివేయగానే ఈ ఉద్యోగాలకు సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ప్రభుత్వం ఈ ఉద్యోగాలు కూడా భర్తీచేసేస్తే రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయశాఖలోని అన్ని ఉద్యోగాలను భర్తీచేసినట్టు అవుతుంది. ఇప్పటికే రెండు దఫాలుగా గ్రామసచివాలయ శాఖకు ఉద్యోగాలు భర్తీచేయాలని చూసినా ఇంకా కొన్ని పోస్టులు మిగిలిపోయాయి. అలా మిగిలిపోయిన అన్నిపోస్టులనూ భర్తీచేసి ప్రజలకు గ్రామస్థాయిలోనే ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. ఆసమయానికి ఇంకా ఎవరైనా సచివాలయ సిబ్బంది రిటైర్ అయినా, సదరు ఖాళీలను కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీచేయాలని మంత్రి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈపోస్టుల భర్తీ అనంతరం ఎంపీడీఓల పదోన్నతులకు కూడా మర్గం సుగమం అవుతుంది. ఎన్నో ఏళ్ల నుంచి ఎంపీడీఓ పదోన్నతులు జరగకుండా ఉండిపోయాయి. దీనితో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ప్రమోషన్లకు కూడా లైన్ క్లియర్ అయ్యింది.