బ్యాంకు ఉద్యోగాలకి ఉచిత శిక్షణ..


Ens Balu
5
కాకినాడ
2021-07-13 09:44:06

ఇండియ‌న్ బ్యాంకింగ్ ప‌ర్స‌న‌ల్ స‌ర్వీసెస్ (ఐబీపీఎస్‌) ప‌రీక్ష‌ల ఔత్సాహిక ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ అభ్య‌ర్థుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఏపీ స్ట‌డీ స‌ర్కిల్ ద్వారా ఉచిత శిక్ష‌ణ అందించ‌నున్న‌ట్లు సాంఘిక సంక్షేమ శాఖ సంయుక్త సంచాల‌కులు జె.రంగ‌ల‌క్ష్మీ దేవి వెల్ల‌డించారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఆమె ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఈ ఏడాదికి సంబంధించి ఉచిత శిక్ష‌ణ అందించేందుకు ఆగ‌స్టు 1వ తేదీన కోవిడ్ కార‌ణంగా ఆన్‌లైన్‌లో అర్హ‌త ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. అభ్య‌ర్థులు ఈ నెల 22వ తేదీలోపు https://jnanabhumi.ap.gov.in/ వెబ్‌సైట్లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలని వెల్ల‌డించారు.