బుకింగ్స్ లో దుమ్ములేపుతున్న మారుతీ జిమ్నీ..


Ens Balu
21
Maharashtra
2023-01-23 07:51:15

ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి నుంచి సరికొత్త వాహనం వాహన ప్రేమికుల ముందుకి వచ్చింది. ‘జిమ్నీ’ పేరుతో వస్తున్న ఈ సరికొత్త వాహనం చూడగానే ఆకర్షించేలా ఉంది. దీనిని డిసెంబర్ లో నిర్వహించిన ఆటో ఎక్స్ పోలో దీన్ని లాంఛ్ చేశారు. ఈ వాహనానికి ఇటీవల బుకింగ్స్ ప్రారంభం కాగా 9 రోజుల్లోనే 9 వేల బుకింగ్స్ నమోదయ్యి రికార్డు సృష్టించింది. 5 డోర్లతో, ఆకట్టుకునే రూపంతో ఉన్న జిమ్నీలో అనేక ఫీచర్లు పొందుపరిచారు. కాగా, డిమాండ్ దృష్ట్యా అడ్వాన్స్ పేమెంట్ మొత్తాన్ని రూ.11 వేల నుంచి రూ.25 వేలకు పెంచారు. అయినప్పటికీ జిమ్నీని సొంతం చేసుకునేందుకు ఎగబడి మరీ బుకింగ్ లు చేసుకుంటున్నారు. దీనితో తక్కువ సమయంలో ఎక్కు క్రేజ్ సంపాదించుకున్న కార్ గా జిమ్నీ వార్తల్లో నిలుస్తున్నది.