పోకో ఎఫ్5 సరికొత్త మొబైల్ సేల్స్ ఎప్పటి నుంచంటే..


Ens Balu
18
Mumbai
2023-04-27 07:21:25

చైనా మొబైల్ కంపెనీ POCO భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. భారత్ సెల్ మార్కెట్ ను యావత్తు తన చేతుల్లోకి తీసుకునే లక్ష్యంగా సరికొత్త ఫీచర్లతో ఈ ఫోన్ ను లాంచ్ చేసింది. POCO F5 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ సేల్స్‌ మే9 వ తేదీ నుంచి సేల్స్‌ ప్రారంభంకానుంది. కాగా ఈ ఫోన్ ఫీచర్లు అందరినీ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి లాంచ్ చేయడానికి పోకో ఇప్పటికే కర్టన్ రైజర్ ప్రమోషన్ ప్రారంభించింది. ఇక ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 7+ జెన్‌ 2 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 8,12 GB RAMతో పాటు 256 స్టోరేజ్‌ వేరియంట్‌లో లాంచ్‌ చేశారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ బేస్‌ ధర రూ. 29,000 గా ఉంది. ఇంచు మించుగా ఐఫోన్ తరహా లుక్ లోనే దీనిని దించడం విశేషం. ప్రస్తుతం సెల్ ఫోన్ మార్కెట్ ప్రతీ ఏడాదీ పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో తక్కువ ధరతో ఎక్కువ ఫీచర్లు, అంతకంటె ఎక్కువ స్టోరేజీ ఇవ్వడం ద్వారా మొబైల్ ప్రేమికులను ఆకట్టుకోవాలని పోకో దీనిని లాంచ్ చేసింది.