ఆప్కో ద్వారా నేత దుప్పట్లను కొనుగోలు..


Ens Balu
4
Srikakulam
2021-03-17 18:09:33

 ఆప్కో ద్వారా నేత దుప్పట్లను కొనుగోలు చేయుటకు చర్యలు చేపట్టడం జరిగిందని చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు డా. వి. పద్మ తెలిపారు. జిల్లాలో చేనేత కార్మికులకు అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు, కార్యక్రమాలను, ఆప్కో ద్వారా నేత దుప్పట్లను కొనుగోలు చేసే కార్యక్రమంను బుధవారం రాజాం ప్రాంతంలో ఎడి పరిశీలించారు. రాజాంలో శ్రీ మల్లిఖార్జున చేనేత సహకార సంఘం, బొద్దాంలో శ్రీ రామలింగేశ్వర చేనేత సహకార సంఘాల్లో ఆప్కో ద్వారా నేత దుప్పట్లను కొనుగోలు చేయడాన్ని తనిఖీ చేసారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 2020 సంవత్సరానికి వై.ఎస్.ఆర్.నేతన్న నేస్తం పథకం క్రింద జిల్లాలో 1,775 మంది చేనేత కార్మికులకు ఒక్కొక్కరికి రూ.24 వేలు చొప్పున రూ.4.26 కోట్లను చేనేత కార్మికుల బ్యాంకు ఖాతాలలో నేరుగా జమ చేయడం జరిగిందని ఆమె వివరించారు. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో 209 మంది చేనేత కార్మికులకు ఒక్కొక్కరికి రూ.50 వేలు చొప్పున రూ.1.04 కోట్లను ముద్ర రుణాలుగా వివిధ బ్యాంకు శాఖల ద్వారా మంజూరు చేయడం జరిగిందని వివరించారు. జిల్లాలో చేనేత సహకార సంఘాలలో నిల్వ వున్న రూ.50 లక్షల విలువగల నేత దుప్పట్లను ఆప్కో ద్వారా ఈ నెల కొనుగోలు చేయించడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. కోవిడ్ 19 లాక్ డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన పొందూరుకు చెందిన శ్రీ సాయిబాబా చేనేత సహకార సంఘంలోని 115 మంది చేనేత కార్మికులకు,  సింగపురం శ్రీ హటకేశ్వర చేనేత సహకార సంఘంలోని 123 మంది చేనేత కార్మికులకు ఒక్కొక్కరికి రూ.2 వేలు చొప్పున సికింద్రాబాద్ లో గల దస్తకర్ ఆంధ్ర సంస్థ సహకారముతో రూ.4.76 లక్షలను అందించడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి అధికారి వి.శంకర రావు, సహాయ అభివృద్ధి అధికారి ఆర్.శేఖర్ పాల్గొన్నారు.