తూ.గో. రూ.1.5 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం.. ఎస్పీ ఎం.రవీంద్రనాధ్ బాబు


Ens Balu
6
Kakinada
2021-11-14 13:25:44

తూర్పుగోదావరి జిల్లా చింతూరు నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న కోటీ 50లక్షలు విలువచేసే 1500 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ రవీంధ్రనాధ్ బాబు తెలియజేశారు. ఆదివారం ఈ మేరకు కాకినాడలో జిల్లా ఎస్పీ కార్యాలయంలో పట్టుకున్న గంజాయిని మీడియా ముందు ప్రదర్శించారు. ఈ సంరద్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఈ తనిఖీలల్లో ఐషర్ వ్యాన్ తోపాటు ఉత్తర ప్రదేశ్ కి చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి,  నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ చెప్పారు. చింతూరు ఏఎస్సీ క్రిష్ణకాంత్ పర్యవేక్షణలో సిఐ యువకుమార్, ఎస్ఐ యాదగిరిగిలు దీనిని పట్టుకున్నారన్నారు. ఏఓబీ ప్రాంతం నుంచి అధికంగా ఈ గంజాయి రవాణా అవుతుందన్నారు. ముందుగా అందుకున్న సమాచారం ప్రకారం వాహనాలు తనిఖీ చేస్తుండగా రవాణా అవుతున్నగంజాయి పట్టుబడినట్టు వివరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గంజాయి రవాణా, నాటు తయారీలపై ఉక్కుపాదం మోపతున్నట్టు ఎస్పీ వివరించారు. గంజాయి ఏ రూపంలో రవాణా జరిగినా జిల్లా దాటి వెల్లకుండానే పట్టుకుని తీరతామని ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవలే ఏఓబీ క్యాంప్ పరిధిలో సుమారు ఐదు కోట్ల విలువైన గంజాయి తోటలను ధ్వంసం చేసినప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో గంజాయి రవాణా జరుగుతుందటం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. ఇకపై మరింతగా వాహన తనిఖీలు చేపట్ట నున్నట్టు ఎస్పీ వివరించారు. ఈ గంజాయి పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన పోలీసులను ఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కరణం కుమార్, ఎస్పీ కె.కుమారి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.