రైలు బాత్రూములో పేగుతెగని పసిబిడ్డ..
Ens Balu
11
Visakhapatnam
2022-05-11 17:06:44
ఆ తల్లిది నిజంగానే జాలీ, దయా లేని రాతి గుండె.. అక్రమ సంతానం పడక సుఖానికి సజీవ సాక్ష్యమైపోతుందనో.. తండ్రి ఎవరో సమాజానికి చెప్పుకోలేని ఒళ్లు పొగరుపట్టిన పైత్యమో. సక్రమం కాని ఆ బిడ్డ తన జీవితానికి అడ్డు తగులుతుందనో తెలీదుకానీ.. నవమాసాలు కడుపున మోసిన శిసువుని..అమ్మతనం గుర్తుచేసుకోకుండా.. అపుడే పుట్టిన పండంటి బిడ్డను పేగు తెంచకుండానే రైలుబోగీ బాత్రూములోనే మంచినీటి వాష్ బేసిన్ లో వదిలిపెట్టిపోయిందా కసాయి తల్లి.. సభ్య సమాజం తలదిం చుకునేలా జరిగిన ఘటన ప్రతీ తల్లి గుండెనూ ఎంతగానో కదిలించింది.. రైలులో శిశువు ఏడుపు విన్న రైల్వే పోలీసులు బాత్రూమ్ ని తనిఖీ చేయడంతో వాష్ బేసిన్ లో పండండి మగబిడ్డ పాలకోసం గుక్కపెట్టి ఏడుస్తూ కనిపించాడు.. తల్లికడుపునుంచి ఎలా పుట్టాడో అలానే రక్తపు మడుగులోనే పడిఉన్నాడు. నిరాశ్రయునిగా వున్న ఆ ఆ బిడ్డను పోలీసులు తక్షణమే చేరదీసి వైద్యపరీక్షలు చేయించారు. ప్రతీ తల్లిగుండెనూ కదిలించిన ఈ ఘటన విశాఖలోని రైల్వేస్టేషన్ లో చోటు చేసుకుంది. వివరాలు తెలుసుకుంటే.. విశాఖ రైల్వే స్టేషన్ ధన్బాద్-అల్లెపీ ఎక్స్ప్రెస్లోని టాయిలెట్లో వాష్ బేసిన్ లో అప్పుడే పుట్టిన శిశువు లభ్యం కావడంతో రైల్వే అధికారులు మానవతా దృక్పథంతో స్పందించారు. బుదవారం ఉదయం 8.25 గంటలకు రైలులో ఓ గుర్తు తెలియని మహిళ మగబిడ్డను ప్రసవించి, రైలు నెం. 13351 ధన్బాద్-అల్లెపీ ఎక్స్ప్రెస్లోని టాయిలెట్లో వదిలివేసిందని రైల్వే పోలీసులు మీడియాకి చెప్పుకొచ్చారు. బొకారో ఎక్స్ప్రెస్ రైలు సింహాచలం స్టేషన్ నుండి బయలుదేరిన తర్వాత సుమారు 8.20 గంటల సమయంలో బోకారో ఎక్స్ప్రెస్ రైలులోని ప్రయాణీకులు శిశువు గురించి ఆన్బోర్డ్ టీటీ ఈ వి.బ్రహ్మాజీ తెలియ జేయడంతో ఘటన వెలుగులోకి వచ్చిందని పేర్కొన్నారు. సమాచారం అందుకున్న ఆర్పిఎఫ్ పోలీసు లు రైలు వద్దకు చేరుకుని శిశువును విశాఖపట్నం డివిజనల్ రైల్వే ఆసుపత్రికి తరలించారని ప్రస్తుతం శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని, మెరుగైన చికిత్స,సంరక్షణ నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. కాగా తల్లి తల్లిదండ్రులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బిడ్డను సొంతం చేసుకుంటే వారి పెంపకానికి పూర్తి ఆర్థిక సహకారం అందిస్తామని పోలీసులు చెబుతున్నారు. రైలులోనే కని వదిలి వెళ్లిపోయిన తల్లికోసం రైల్వే పోలీసులు గాలిస్తున్నారు.