మరోసారి అనంతబాబు బెయిల్ పెండింగ్


Ens Balu
4
Rajamahendravaram
2022-07-14 06:08:44

ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ విషయంలో మరోసారి గురువారం చుక్కెదురైంది. ఎమ్మెల్సీ కేసులో రెండవ బెయిల్ పిటిషన్ పై రాజమండ్రి ఎస్సి,ఎస్టీ కోర్టులో వాదనలు మగిసాయి. బాధిత కుటుంభం తరుపున ప్రముఖ న్యాయవాది, ఆంద్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ళ సుబ్బారావు వాదనలు వినిపించారు. ముద్దాయి అనంత బాబుకు బెయిల్ మంజూరు చేస్తే బాధిత కుటుంబానికి ప్రాణ హాని ఉంటుందని కోర్టులో వాదించారు. అంతేకాకుండా ముద్దాయి గత నేర చరిత ను, రౌడీ షీట్ ఉన్న విషయాలను న్యాయస్థానం ముందుంచారు. ఈ కేసులో మిగిలిన ముద్దాయిలను విచారణాధికారి ఇంత వరకు గుర్తించలేదని సైతం న్యాయస్థానానికి వివరించారు. ఇలాంటి సమయంలో నేరస్థుడికి బెయిల్ మంజూరు చేస్తే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కాబట్టి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందిని కోర్టుకి తెలియజేశారు. ఒక చట్ట సభ సభ్యుడు ..ఒక వ్యక్తిని కిరాతకంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసిన సంఘటన దేశ చరిత్రలో ఇదే ప్రధమం అని కూడా పేర్కొన్నారు. ఇరు పక్షాలు వాదనలు అనంతరం ముద్దాయి రెండవ బెయిల్ అప్లికేషన్ మీద ఆదేశాలు ఇచ్చేవిషయాన్ని న్యాయమూర్తి ఎమ్.నాగేశ్వరరావు ఈ నెల 18 కి  వాయిదా వేశారని ముప్పాళ్ల మీడియాకి వివరించారు.