పోలీసు కేసుల్లో పురోగతి నమోదు చేయాలి


Ens Balu
14
Vizianagaram
2022-07-29 12:20:45

విజయనగరం జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లు, సర్కిళ్ల పరిధిలో నమోదైన కేసుల విషయంలో పురోగతి నమోదు చేయాలని జిల్లా ఎస్పీ  ఎం.దీపిక పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం పోలీసు కార్యాలయంలో మాసాంతర నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, గతంలో నమోదై, దర్యాప్తులో ఉన్న చీటింగ్, తీవ్రమైన, సాధారణ కేసులను సమీక్షించి, దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. త్వరితగతిన కోర్టుల్లో అభియోగ పత్రాలను దాఖలు చేయాలని పోలీసు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎన్ఫోర్స్మెంట్ కేసులు పెద్ద ఎత్తున నమోదు చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ  పి.సత్యనారాయణ రావు, ఎస్.ఈ.బి. అదనపు ఎస్పీ కుమారి ఎన్.శ్రీదేవీ రావు, డిఎస్పీలు టి.త్రినాథ్,  బి.మోహనరావు,  ఆర్.శ్రీనివాస రావు,  ఎల్.మోహనరావు, ఎల్.శేషాద్రి, ఎపిపిలు, పలువురు సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.