నేషనల్ న్యూస్ ఎక్స్ ప్రెస్ తెలుగు దినపత్రిక ఎడిటర్ కొయిలాడ పరశురామ్ పై జరిగిన దాడిని వివిధ జర్నలిస్ట్ సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. సంఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బుధవారం గాజువాక పోలీస్ స్టేషన్ లో సీఐ లంకా భాస్కర్రావు కు జర్నలిస్ట్ లు వినతి పత్రం సమర్పించారు. అనంతరం పరశురాం వైద్య సేవలు పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్బంగా ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్ అధ్యక్షులు డా. ఎం.ఆర్.ఎన్.వర్మ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వాదులు అందరూ ఇటువంటి సంఘటనలను ఖండించవలసిన అవసరం ఉందన్నారు .సంయమనం కోల్పోయి దాడులకు తెగబడుతున్న వారిని ఉపేక్షించరాదని అన్నారు.వార్తలు రాసే వారిని దాడులు చేయడం ద్వారా భయపెట్టాలనుకోవడం సరికాదన్నారు. ఇంకెవ్వరూ ఇలా బరితెగించకుండా సంఘ టనకు కారణమైన బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. జర్నలిస్ట్ లపై దాడులను నివారించేందుకు అటాక్స్ కమిటీ లను తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో పలు జర్నలిస్ట్ సంఘాల నాయకులు కె. రాము,పి. ప్రసాద్, నిట్టల, శ్రీనివాసరావు, పి, సత్యనారాయణ, కె. చక్రవర్తి,డి. హరనాథ్, డి.శివకుమార్ రెడ్డి,గిరి,ఎస్. నారాయణ రావు, కనకారావు తదితరులు పాల్గొన్నారు.