కాకినాడ జిల్లాలో 2021తో పోలిస్తే2022లో 5% కేసులు తగ్గుదల


Ens Balu
11
Kakinada
2022-12-30 09:42:55

కాకినాడ జిల్లాలో 2021 ఏడాదితో పోల్చుకుంటే 5% కేసుల తగ్గుదల నమోదూందని జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు తెలియజేశారు. శుక్రవారం ఎస్పీకార్యాలయంలో జిల్లా వార్షిక నివేదిక వివరాలను మీడియాకి వెల్లడించారు. 2021 లో 8,869 కేసులు నమోదు కాగా, 2022లో 8481 కేసులు మాత్రమే నమోదైనవి, 2021 తో పోలిస్తే 2022 లో 388 కేసులు (F.I.R.లు)నమోదై..మొత్తం మీద 5%శాతం కేసులు తగ్గాయన్నారు. జిల్లా పోలీస్ శాఖ  సమర్థవంతంగా  పని చేయడం వల్లే ఈ తగ్గుదల నమోదైందన్నారు. ప్రభుత్వం నుండి పూర్తి సహకారం లభించడం, పోలీసింగ్ లో వినూత్న ఒరవడిని సృష్టించడం, విజబుల్ పోలీసింగ్, అవగాహన కార్యక్రమాలను చేపట్టడం, మహిళా పోలీసు సేవల సమర్థవంతమైన నిర్వహణ, పీడి యాక్ట్ ప్రయోగం, నాటు సారా పై ఉక్కుపాదం మోపడం తదితర చర్యల వల్లనే ఇది సాధ్యమైనదన్నారు.  మరింత ద్విగుణీకృత ఉత్సాహంతో 2023 లో మరింత మెరుగైన పోలీసింగ్, సేవలను అందిస్తామని జిల్లా ఎస్పీ రవీంధ్రనాద్ బాబు మీడియాకి వివరించారు.