ఆ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్ధిక సహాయం


Ens Balu
15
Delhi
2023-01-03 14:52:49

ఢిల్లీలో కారుతో ఈడ్చుకెళ్లిన ఘటనలో మృతి చెందిన యువతి కుటుంబానికి సీఎం అరవింద్ కేజ్రీవాల్ రూ.10 లక్షలు ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు. అలాగే ఈ ఘటనలో మృతురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని కూడా కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఈ కేసు వాదించేందుకు ప్రముఖ న్యాయవా దిని నియమిస్తామని ఆమ్ ఆద్మీపార్టీ ప్రకటించింది. యువతిని కారు ఈడ్చుకెళ్లడం వల్లే మరణించిందని, ఆమెపై లైంగిక దాడి జరగలేదని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. కాగా తన కూతురుపై లైంగిక దాడి జరిగిందని తల్లి ఆరోపించారు.