రైల్వే ఆస్తులు, ప్రయాణీకులు, ప్రయాణ ప్రాంగణాలు, వాటికి సంబంధించిన భద్రత బాధ్యతను చూస్తున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వారిలో భద్రత భావాన్ని పెంచడానికి నెల రోజుల పాటు దేశవ్యాప్త తనిఖీలను ఆర్పీఎఫ్ నిర్వహించింది. ఈ తనిఖీల సమయంలో, మహిళల కోసం రిజర్వ్ చేసిన బోగీల్లో ప్రయాణించిన/ప్రవేశించిన 5100 మందికి పైగా అరెస్టు చేశారు. దివ్యాంగుల కోసం రిజర్వ్ చేసిన బోగీలను ఆక్రమించిన/ప్రవేశించిన 6300 మందికి పైగా అరెస్టు చేశారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై వరుసగా రూ.6.71 లక్షలు, రూ.8.68 లక్షలు జరిమానా విధించారు. రైళ్లలో, ముఖ్యంగా కొంతమంది హిజ్రాల వల్ల ఇబ్బంది, ప్రయాణీకుల పట్ల వారి దురుసు ప్రవర్తనకు సంబంధించి తరచూ చాలా ఫిర్యాదులు వస్తున్నాయి.
ఈ తనిఖీల సమయంలో, ప్రయాణీకులకు ఇబ్బంది కలిగిస్తున్న 1200 మందికి పైగా హిజ్రాలను అరెస్ట్ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.వారి నుంచి రూ.1.28 లక్షలను జరిమానా రూపంలో వసూలు చేశారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలోని సాధారణ బోగీల్లో సీట్లను అనధికారికంగా ఆక్రమిస్తున్న వారిని గుర్తించి 36 మందిపై కేసులు పెట్టారు.భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ఈ తరహా తనిఖీలు కొనసాగించాలని ఆర్పీఎఫ్ క్షేత్ర స్థాయి సిబ్బందికి సూచించనట్టు కేంద్ర రైల్వేశాఖ పేర్కొంది.