సంక్రాంతి పండుగ ఆఫర్స్ అంటూ నకిలీ ఈకామర్స్ వెబ్ సైట్స్ చేసే మోసపూరిత ప్రకటనలకు ఏఒక్కరూమోస పోకుండా జాగ్రత్తపడాలని కాకినాడ జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు సూచించారు. ఈ మేరకు ఆయన జిల్లా మీడియాకి ఒక ప్రకటన విడుదల చేశారు. ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్న సమయంలో ఖచ్చితంగ సదరు వెబ్ సై ట్ ను అసలైనదా, నకిలీదా గుర్తించాలన్నారు. నకిలీదని అనిపిస్తే వెంటనే 1930 నెంబకు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. లేదా www.cybercrime.gov.in వెబ్ సైట్ లో కంప్లైంట్ ఇవ్వాలన్నారు. ఏ ఒక్కరూ వారి యొక్క ఓటిపీ, పిన్ నెంబర్లు ఇతరులకు షేర్ చేయవద్దని సూచించారు. ఏ ప్రభుత్వ సంస్థ వినియోగదా రులను ఈ వివరాలు అడగదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఎవరైనా నమ్మించేటట్టు మాట్లాడినా కూడా బ్యాంకు, ఓటీపీ, ఆధార్ నెంబరు, బ్యాంకు ఖాతా నెంబర్లు చెప్పకూడదన్నారు.