ఆంధ్రప్రదేశ్ పోలీస్ బాస్ డిజిపి అఫిషియల్ ట్విట్టర్ అక్కంట్ ను హ్యాక్ చేసిన వారిపై సైబర్ క్రైమ్ లో కేసు నమోదు చేసినట్టు డిఐజి పిహెచ్డీ రామక్రిష్ణ తెలియజేశారు. ఈ మేరకు రాష్ట్ర మీడియాకి ప్రకటన విడుదల చేశారు. 2019 నుంచి వాడుకలోలేకుండా ఉన్న డిజిపి ట్విట్టర్ అకౌంట్ ను కొందరు దుండగులు కావాలనే హ్యాక్ చేసి వాటి ద్వారా ఉద్దేశ్యపూర్వకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్టు గుర్తించినట్టు పేర్కొన్నారు. తప్పుడు ఫోటోలు పెట్టేవారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.