వాటర్ ప్లాంట్లలో విజిలెన్స్ తనిఖీలు
Ens Balu
12
Vizianagaram
2023-02-17 14:17:35
రాష్ట్ర వ్యాప్తంగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లపై విజిలెన్స్ శాఖ జరిపిన తనిఖిలలో భాగంగా శ్రీకాకుళం ప్రాంతీయ నిఘా , అమలు అధికారి ఏ. సురేష్ బాబు ఆదేశాల మేరకు శుక్రవారం విజయనగరం జిల్లాలో తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీవారి ఆక్వా ఇండస్ట్రీస్, రవివలస విలేజ్, గంట్యాడ మండలం మరియు శుభకరి ఆక్వా ఇండస్ట్రీ స్ కేఎల్ పురం, విజయనగరం వద్ద ఉన్న ప్లాంట్లను విజిలెన్స్ అధికారులు సి. హెచ్. సత్యన్నారాయణ, డిఇ గారు, బి.సింహాచలం ఇనస్పెక్టర్, అప్పన్నహెచ్ & శేషగిరి కానిస్టేబుల్ మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు డి కె కావ్య రెడ్డి తో పాటు తనిఖీ చేయడమైనది. నిబంధనలు పాటించని కారణంగా సంభందిత యాజమాన్యం పై చర్యలకు సిఫార్సు చేయనున్నారు. ఈ దాడుల్లో విజిలెన్సు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.