విశాఖలో మందుబాబులకు వింత శిక్షను అమలు చేసింది మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 52 మంది మందుబాబులకు ఆర్కేబీచ్ లోని వ్యర్ధాలను, చెత్తను పరిశుభ్రం చేయాలని ఆదేశించింది. దీనితో మందుబాబులంతా వరుసగా ఆర్కే బీచ్ లోకి వచ్చి చెత్తను శుభ్రం చేశారు. విశాఖలోని మెట్రోపాలిటిన్ కోర్టు వేసిన శిక్ష ఇపుడు ఉమ్మడి విశాఖజిల్లాలో చర్చనీయాంశం అవుతుంది. సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడితే ఫైన్లు వేస్తారు. ఆతరువాత సీజ్ చేసిన మోటారు వాహనాలను ఫైన్లు కట్టి విడిపించు కుంటారు. కానీ విచిత్రంగా కోర్టు ఈ తరహా శిక్షలు వేయడంతో మందుబాబులకు తాగింది మొత్తం దిగిపోయింది. ప్రస్తుతం ఈ అంశం విశాఖజిల్లాలోపాటు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇలా శిక్షలు పడిన వారంతా బీచ్ లోదర్శనమిచ్చారు. చక్కగా చేతికి గ్లౌజులు వేసుకొని, పోలీసుల పర్యవేక్షణలో బీచ్ లోచెత్తను శుభ్రం చేశారు మందుబాబులు..