అప్పు ఘర్ వద్ద సముద్రంలో గల్లంతయిన ఇద్దరు యువకుల మ్రుతదేహాలు మంగళవారం లభ్యం అయ్యాయి. శివరాత్రి సముద్ర స్నానాల సందర్భంగా బీచ్ గార్డ్ గా వెళ్లి ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయిన అఖిల్,.ప్రవీణ్ ల మ్రుతదేహాలు లభ్యం కావడంతో బంధువులు పెద్ద సంఖ్యలో బీచ్ వద్దకు చేరుకున్నారు. కాగా ఎక్కడైతే వీరు సముద్రంలో పడిపోయారో అక్కడే ఇద్దరినీ గుర్తించినట్టు స్కూబా డైవర్లు తెలియజేశారు. వారి మ్రుతదేహాలను బయటకు తీసి వారి కుటుంబాలకు అందజేశారు. బాధిత కుటుంబాలను వైజాగ్ ఈస్ట్ సమన్వయకర్త విజయనిర్మల పార్టీ అధ్యక్షులు పంచకర్ల రమేష్ లు స్వయంగా వెళ్లి పరామర్శించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తమ మిత్రుల మ్రుతదేహాలను ఆఖరి చూపు చూసుకోవడానికి పెద్ద ఎత్తున వారి స్నేహితులు, బంధులువులు తరలి వచ్చారు. ఈ ఘటనపై గతంలోనే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు.