142 మంది మందుబాబులకు 5రోజులు జైలు శిక్ష


Ens Balu
22
Visakhapatnam
2023-02-21 11:30:02

విశాఖ నగర పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో కేసులు నమోదైన వారికి భీమిలి కోర్టు ఐదు రోజులు జైలుశిక్ష, జరిమానా కూడా విధించిందని పోలీస్ కమిషనర్  సిహెచ్ శ్రీకాంత్ తెలియజేశారు. మరో 52 మందికి బీచ్ లో పరిశుభ్రత శిక్ష, మరికొందరికి వివిధ ట్రాఫిక్ జంక్షన్ లలో ట్రాఫిక్ రూల్స్ ప్లకార్డు పట్టుకునే శిక్ష విధించారని పేర్కొన్నారు. ఎవరైనా తాగి వాహనాలు నడిపితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు కోర్టుముందు హాజరు పరుస్తామని హెచ్చరించారు. ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో మందుబాబులకు కోర్టు శిక్షవిధించడం చర్చనీయాంశం అవుతోంది. కాగా ప్రతీరోజూ ట్రాఫిక్ పోలీసులు వందలాది మంది మందుబాబులను డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుకొని కేసులు రాస్తున్నారు.  పోలీసులతోపాటు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఉన్న కెమెరాలు సైతం జీబ్రా లైన్ క్రాసింగ్ కేసులు నమోదు చేస్తూ వాహదారులకు దడ పుట్టిస్తున్నాయి.