2018 సెప్టెంబర్ 23న జరిగిన మాజీ ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలే హత్యకేసులో ప్రధాన నింధితుడిగా ఉన్న మావోయిస్టు రైనోను అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్ట్ పార్టీకి చెందిన డివిజన్ కమిటీ మెంబర్ జనుమూరి శ్రీనుబాబు(రైనో)ను పోలీసులు ఆ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల సందర్భంగా అదుపులోకి తీసుకున్నారు. రైనో దగ్గర నుంచి ఒక ఐఈడీ, తుపాకీ, పేలుడు సామగ్రి, విప్లవ సాహిత్యం, నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు. ఏవోబీ ప్రత్యేక జోన్ డివిజినల్ కమిటీ సభ్యుడిగా ఉన్న రైనో ఏఓబీలో జరిగిన పలు హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నట్టు పోలీసులు ఆ ప్రకటనలో వివరించారు. గత ప్రభుత్వం రైనోపై రూ.5లక్షల రివార్డు ప్రకటించింది కూడా. ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్లో మోస్ట్వాంటెడ్ మావోయిస్టుగా రైనో ఉన్నాడు.