యర్నగూడెం జాతీయ రహదారి16 తాడిపూడి కాలువ వంతెన వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మ్రుతి చెందగా ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. చిన్నాయగూడెం గ్రామానికి చెందిన 3 వ్యక్తులు కుటుంబ తగాదాల నిమిత్తం దేవరపల్లి పోలీస్ స్టేషన్ వద్దకు మోటార్ సైకిల్ పై రాంగ్ రూట్లో వెళ్తూ ఎదురుగా వస్తున్న అశోక్ లైలాండ్ దోస్త్ వాహనాన్ని ఢీకొట్టడంతో సంఘటనలో బైక్ నడుపుతున్న నీలపాటి శ్రీహరి(40) అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడి అపస్మారక స్థితిలో ఉన్న వీరలక్ష్మి(40) వీర హంస(50) నేషనల్ హైవే అంబులెన్స్ లో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్ గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావులు పరిస్థితి సమీక్ష సమీక్షించారు. సంఘటపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.