హెచ్ పీ సీ ఎల్ రిఫైనరీలో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే ప్లాంట్ లోఇ ఈటీపీ ప్రాంతంలో సోమవారం రాత్రి 11.20 గంటల సమయంలో క్రూడ్ ఆయిల్ ఒక్కసారిగా లీకయ్యింది. వెంటనే మంట లు చెలరేగడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. వాల్వులని కట్టెయ్యడంతో క్రూడ్ ఆయిల్ లీకేజీ నిలువరించారు. హుటాహుటిన హెచ్ పీసీఎల్ అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన లో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తూతం ప్లాంట్ లో పరిస్థితి అదుపులోకి వచ్చిందని.. సాంకేతిక లోపం తలెత్తడం వల్లే ప్రమాదం సంభవించినట్లు ప్రాధమికంగా నిర్థరించినట్లు హెచ్ పీ సీఎల్ అధికారులు వెల్లడించారు.