మితిమీరిన వేగం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. అతివేగంతో వచ్చిన కారు ద్విచక్రవాహనంపై ఉన్న వ్యక్తిని బలంగా కొట్టగా, వ్యక్తి మృతి చెందగా మరో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఆదివారం దేవరపల్లి జాతీయరహదారి పై జరిగిన రోడ్డు ప్రమాదం లో రెడ్డి అప్పల నాయుడు అనే కాంట్రాక్టర్ మృతి చెందాడు. స్థానికుల సమాచారం ప్రకారం జాతీయ రహదారిపై ఒక కారు మితి మీరిన వేగం తో వచ్చి ద్విచక్ర వాహనాన్ని ధీ కొట్టింది. దీంతో వ్యక్తితో సహా వాహనం సుమారు 15 అడుగుల వరకు ఈడ్చుకొని వెళ్ళి పోయింది. కారు ద్విచక్ర వాహనాన్ని కొట్టడంతోపాటు పక్కనే ఉన్న టీ దుకాణంలోకి దూసుకుపోవడంతో దుకాణం పూర్తిగా ధ్వంసమైంది. దుకాణంలో ఉన్న వ్యక్తుల కు తీవ్ర గాయాలయ్యాయి..కారులోని బెలున్స్ ఓపెన్ అవడం తో కారులోని వ్యక్తి నీ పోలీస్ స్టేషన్ కి తరలించారు. మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రాంతీయ ఆసుప త్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.