వైజాగ్ జర్నలిస్టుల ఫోరరం(విజెఎఫ్) అనధికార కార్యవర్గం సభ్యులందరికీ దారుణంగా బురిడీ కొట్టించడంతో మోసం కూడా చేసిందనే విష యం విశాఖలోని జిల్లా ప్రిన్సిపల్ మరియు సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పు తేటతెల్లం చేస్తుంది. వివరాలు తెలుసుకుంటే.. 2015లో బోడపాటి రామరాజు అనే సభ్యుడు విజెఎఫ్ కార్యవర్గసభ్యులు, ఎన్నికల అధికారి అయిన గంట్లశ్రీనుబాబు, ఎస్.దుర్గారావు(ప్రస్తుతం మృతిచెందారు), బి.ప్రభాకరశర్మలపై విశాఖలోని జిల్లా ప్రిన్సిపల్ మరియు సెషన్స్ జడ్జివారి కోర్టులో కేసునెంబరు OP/0000661/2015న కేసు వేశారు. అయితే కేసువేసిన తరువాత, ప్రత్యర్ధులుగానీ, కేసు దారు కానీ ఇద్దరూ కోర్టుకి హాజరు కాకపోవడంతో తేది 03-06-2016న డిఫాల్ట్ గా కేసును డిస్మిస్ చే శారు. ఈ జడ్జిమెంట్ నేరుగా ప్రభుత్వ కోర్టువెబ్ సైట్ ద్వారా బయటకు రావడంతో అసలు విషయం తెలిసింది. అసలు కోర్టుకే వెళ్లకుండా ఈ కేసులో విజెఎఫ్ విజయం సాధించినట్టుగా కార్యవర్గం ప్రకటించుకుంటూ సభ్యులను మోసం చేస్తుంటడం విశేషం.