అన్నవరం స్టేషన్ ఎస్ఐ శోభన్ కుమార్ సస్పెండ్..!


Ens Balu
64
Annavaram
2023-05-19 13:58:21

కాకినాడజిల్లా అన్నవరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ పి.శోభన్ కుమార్ ను జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్  సస్పెండ్ చేశారు. ఈయన సస్పెండ్ వెనుక అవినీతి వ్యవహరాలు, అధిక ఫిర్యాదులే కారణంగా తెలుస్తుంది. అన్నవరం స్టేషన్ లో ఎస్ఐగా ఆయన 2022 ఫిబ్రవరి 25న విధుల్లోకి చేరారు. సరిగ్గా 15నెలలు తిరిగేలోపే సస్పెండ్ కి గురయ్యారు. ఎస్ఐ సస్పెన్షన్ ను జిల్లా ఎస్పీ దృవీకరించారు. ఈయనపై వచ్చిన ఫిర్యాదులపై ఏలూరు రేంజి డిఐజి శాఖాపరమైన విచారణ చేపట్టిన అనంతరం మే18న సస్పెండ్ చేసినట్టు పేర్కొన్నారు. ముఖ్యంగా అన్నవరం స్టేషన్ పరిధిలోని సెటిల్ మెంట్లు, గుట్కా మాఫియాతో చేతులు కలిపి భారీ ఎత్తున అమ్మకాలకు ప్రోత్సహిస్తున్నారనే ఫిర్యాదులు అత్యధికంగా వెళ్లినట్టు తెలుస్తుంది. కాగా స్టేషన్ పరిధిలో ని పలువురు ప్రజాప్రతినిధులు ఇప్పటికే గుర్రుగా ఉన్నారు. తమ ఫిర్యాదులు పట్టించుకోవడం లేదని, పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడుతున్నారని బహిరంగంగానే ఎమ్మెల్యే లు, మం త్రులు, ఎంపీల వద్ద తమగోడును వెళ్లబోస్తూ వచ్చారు. గత కొద్ది రోజులుగా వస్తున్న ఫిర్యాదులపై సత్వరమే స్పందించిన జిల్లా పోలీసు యంత్రాంగం విచారణ చేపట్టడం అనతి కాలంలోనే సస్పెండ్ చేయడం రెండూ జరిగిపోయాయి. అన్నవరం ఎస్ఐ సస్పెన్షన్ తో కాకినాడ జిల్లాలోని అవినీతి పోలీసుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.