విజెఎఫ్ కాలం చెల్లిన కార్యవర్గంపై ఫైమెన్ కమిటీ విచారణ


Ens Balu
49
Visakhapatnam
2023-05-26 14:00:13

వైజాగ్ జర్నలిస్టుల ఫోరం(విజెఎఫ్)పై విశాఖజిల్లా కలెక్టర్ డా.మల్లిఖార్జున నియమించిన ఫైన్ మెన్ కమిటీ విచారణ ప్రారంభం అయ్యింది.  ఈ కమిటీలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిఐజీ, జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్, డిస్ట్రిట్ ఆడిట్ ఆఫీసర్, ఆర్డీఓ, ఈస్ట్ డివిజన్ ఏసిపిలు ఫిర్యాదులను పరిశీలించారు. తొలుత గురువారం ఆర్డీఓ కార్యాలయంలో తొలి సమావేశం అయిన అధికా రుల బృందం శుక్రవారం సభ్యులు సమర్పించిన ఆధారాలను  క్షుణ్ణంగా పరిశీలించారు. విజెఎఫ్ బైలా ఏం చెబుతుంది.. సర్వసభ్య సమావేశం పెట్టకుండా ఒకే కమిటీ 8ఏళ్లపాటు కమిటీగా కొనసాగవచ్చా.. ఈఫైలింగ్ లేని ఆడిరిపోర్టులు, చేపట్టకుండా చేసినట్టు చూపిన సర్వసభ్య సమావేశాలు.. సొసైటీ నిబంధనల ప్రకారం నేటికూ సభ్యుల ఆమోదం లేకుండా చేసిన సొసైటీ రెవిన్యువల్, విజెఎఫ్ పై నమోదైన 2 కోర్టు కేసుల విషయాన్ని త్రిసభ్య కమిటీకి, సభ్యుల దృష్టికి తీసుకు రాకపోవడంపై విచారించారు. దానికి తోడు సీనియర్ జర్నలిస్టు బంటయ్య ఆధ్వ ర్యంలో 288 పేజిల ఆధారాలను కమిటికి అందించారు.