శంఖవరంలో 2600 కేజిల పిడిఎస్ బియ్యం పట్టివేత


Ens Balu
26
Sankhavaram
2023-06-07 04:25:27

ఏపి ప్రభుత్వ ప్రజా పంపిణీ సంస్థ, చౌక ధరల దుకాణాల లబ్దిదారుల నుంచి బియ్యాన్ని కొని అక్రమంగా మారు వ్యాపారం చేస్తోన్న నుంచి పాఠంశెట్టి కృష్ణ నుంచి  రూ.1,09,000 విలువచేసే 2,600 కేజీల బియ్యాన్ని కాకినాడ జిల్లా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముందుగా అందిన సమాచారం ప్రకారం విజిలెన్స్ సిఐ.రమేష్, తాహసిల్దార్ విజయకుమార్ బృందం ఈ తనిఖీలను నిర్వహించింది. శంఖవరంలోని కుమ్మరివీధిలోని ఇంటి నెం.7-195 లో 50 కేజీల చొప్పున మెత్తం 52 బస్తాల బియ్యాన్ని  అక్రమంగా నిల్వఉంచినట్టు అధికారులు గుర్తించారు. ఇతను గొంధి కొత్తపల్లి, గౌరంపేట, కొత్తపల్లి తదితర గ్రామాల లబ్దిదారుల నుంచి కేజీ బియ్యాన్ని రూ.18లకు కొనుగోలుచేసి, వాటిని తిరిగి శంఖవరం మండలం మండపం, రౌతులపూడి మండలం పల్లపు చామవరం గ్రామాల్లోని ఇటుకల బట్టీ కార్మికులకు రూ.21 లకు విక్రయిస్తున్నాడు. మారుబేరం అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు నిందితుడు కృష్ణ స్వీయ వాంగ్మూలంలో అంగీకరించాడు. అతను, అతని సహకారులపై 420 ఐపిసి సెక్షన్ 7(1) ఈ.సీ.చట్టం 1955 ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేసి మొత్తం బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈదాడుల్లో శంఖవరం ఎమ్ఎస్ఓ ఇస్మాయిల్,  సచివాలయం1 వీఆర్వో టి.సీతారామ్, మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష, సచివాలయం2 వీఆర్వో వీరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.