రౌతులపూడిలో ఏసిబికి చిక్కిన అవినీతి ఎంఈఓ


Ens Balu
67
Rowthulapudi
2023-06-08 14:03:16

రౌతులపూడిలో అవినీతి చేప ఏసిబికి చిక్కింది. ఎంఈఓగా పనిచేస్తున్న ఎస్.వి.నాయుడు. రౌతులపూడిలోని స్వర్ణ భారతి స్కూల్ రికగ్నైజేషన్, రెన్యువల్ కోసం రూ.10వేలు డిమాండ్ చేశాడు. దీనితో నిర్వహకులు రూ.7,500కు ఒప్పందం కుదుర్చుకుని ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో పధకం ప్రకారం స్కూల్ కరస్పాండెంట్ ఈరోజు ఎంఈఓకి డబ్బు లు ఇస్తుండగా రాజమండ్రి అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హేండెడ్ గా పట్టుకున్నారు. ఎంఈఓ వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకొని కేసునమోదు చేశారు. విష యం బయటకు తెలియడంతో కాకినాడ జిల్లా విద్యాశాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.