విశాఖ ఎంపీ భార్య, కుమారుడు, ఆడిటర్ జివి కిడ్నాప్


Ens Balu
72
Visakhapatnam
2023-06-15 07:16:05

విశాఖ పార్లమెంటు సభ్యుడు ఎంవివి సత్యన్నారాయణ, ఆయన భార్య, ప్రముఖ ఆడిటర్ మాజీ స్మార్ట్ సిటీ చైర్మన్ జివిలు కిడ్నాప్ కావడం విశాఖ మహానగరంలో కలకలం స్రుష్టించింది. విషయాన్ని సీరియస్ గా తీసుకున్న నగర పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. కాగా విశాఖలోని రెండు మూడు చోట్ల ఎంపీ ఎంవివి ఆకాశ నిర్మాణాలు చేపడుతున్నారు. ఆ ప్రాజెక్టులు లక్షల కోట్ల వ్యవయంతో నిర్మిస్తున్నారు. అదేకారణంగా భావించి కిడ్నాప్ జరిగి ఉండవచ్చునని చెబుతున్నారు. అదేసమయంలో ఎంపి భార్య, కొడుకుతో పాటు స్మార్ట్ సిటి చైర్మన్ జివిలు కూడా కిడ్నాప్ కావడంపైనా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఇటీవలే ఎంపి కుమారుడికి వివాహం జరిగింది. విశాఖ మహానగరంలో ఎంవిపిలో నడిరోడ్డుపై కొద్దిరోజుల 2హత్యలు జరిగాయి. ఇపుడు ఏకంగా పార్లమెంటు సభ్యుడి కుటుంబాన్నే కిడ్నాప్ చేయడ.. గత గొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్నట్టు అంర్ రాష్ట్ర సుపారీ పార్టీ నగరంలోకి దిగాయా అనే అనుమానాలు బలపడుతున్నాయి.