విశాఖలో కిడ్నాప్ సుఖాంతం..పోలీసుల అదుపులో నిందితులు


Ens Balu
96
Visakhapatnam
2023-06-15 07:29:05

విశాఖ పార్లమెంటు సభ్యుడు ఎంవివి సత్యన్నారాయణ, ఆయన భార్య, ప్రముఖ ఆడిటర్ మాజీ స్మార్ట్ సిటీ చైర్మన్ జివిలు కిడ్నాప్ కావడం..నిందితులను పోలీసులు కొన్ని గంటల వ్యవధిలోనే పట్టుకోవడం రెండూ జరిగిపోయాయి. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడుతోపాటు ప్రముఖ ఆడిటర్ జివిని ఉదయం హేమంత్ అనే మరో నలుగురితో కలిసి కిడ్నాప్ చేశాడు. దీనితో ఎంపి ఫిర్యాదు మేరకు నగర సిపి డా.త్రివిక్రమ వర్మ నగరం నలుచెరగుల 17 బ్రుందాలతో గాలింపు చేపట్టారు. వెంటనే కిడ్నాప్ అయిన వారిని విడిపించి సురక్షితంగా ఇంటికి చేర్చారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో దుండగులు ఉన్నారు. ఒక పార్లమెంటు సభ్యుని కుటుంబ సభ్యులను విశాఖ మహానగరంలో కిడ్నాప్ చేయడం చర్చనీయాంశం అయ్యింది. అయితే విషయం కాస్త గోప్యంగానే ఉంచారు పోలీసులు..విషయం తెలుసుకున్న మీడియా హడావిడి చేయడంతో అప్పటికే నిందితులను పట్టుకున్న పోలీసులు కథ సుఖాంతం అయినట్టు ప్రకటించారు.