ఫోక్సో కేసులో ఒకరికి నాలుగేళ్ల జైలుశిక్ష..


Ens Balu
0
Dharmavaram
2020-12-25 16:10:37

అనంతపురంజిల్లా ధర్మవరం పట్టణంలో ఆరేళ్ల బాలికపై జరిగిన అత్యాచార యత్నం కేసులో అదే పట్టణానికి చెందిన బాబా ఫకృద్ధీన్ కు 4 సంవత్సరాల జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధిస్తూ అనంతపురం ఫస్ట్ ఏ.డి.జె కోర్టు జడ్జి రమేష్ తీర్పు వెలువరించారు. ఈ ఘటనపై ధర్మవరం పోలీసు స్టేషన్లో 13-05-20 తేదీన క్రైమ్ నంబర్: 269/2020 U/s. 376, R/w 511, 354-B, IPC and Sec. 7 R/w 8 of POCSO Act. 2012 కేసు నమోదయ్యింది.  నిందితుడిని అరెస్టు చేశారు. ధర్మవరం పట్టణ సి.ఐ ఎం.కరుణాకర్ దర్యాప్తు చేపట్టి ఈ కేసులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. అన్ని కోణాల్లో ఈ కేసును సమగ్రంగా విచారించిన జడ్జి నిందితుడికి నాలుగు సంవత్సరాల జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధిస్తూ నిన్న తీర్పు వెలువరించారు. పక్కాగా దరాప్తు చేసిన సి.ఐ ఎం.కరుణాకర్ ను మరియు ప్రాసిక్యూషన్ తరుపున వాదించిన అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజశేఖర్ గౌడు, కోర్టు కానిస్టేబుల్ రాజేష్ లను జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు అభినందించారు.