187 అనధికార దుకాణాలపై చర్యలు..
Ens Balu
7
విశాఖ సిటీ
2021-07-09 13:44:55
మహావిశాఖ నగర పరిధిలో 187 దుకాణాలలో బినామీలు ఉన్నట్లు గుర్తించామని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన ఒక ప్రకటనలో తెలిపారు. జివిఎంసి చేపట్టిన వివిధ సంస్కరణల్లో భాగంగా, జివిఎంసి ఆదాయం పెంపొందించేందు, సంస్థకు చెందిన వివిధ గుత్తలు ద్వారా వచ్చే ఆదాయ లోపాలను సరి చేసి ఒక ప్రణాళికను సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా 187 దుకాణాలు వాస్తవ గుత్తేదారులు బదులు బినామీలు ఉన్నట్లు గుర్తించి వాస్తవ గుత్తేదారులకు నోటీసులు జారీ చేశామన్నారు. గడువు లోపల ఖాళీ చేయకపోతే బినామీలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే గుత్తకాలం పూర్తయినప్పటికీ లీజు పునరుద్ధరణ చేయకుండా అనధికారికంగా ఉన్న 389 దుకాణాలను గుర్తించామని, ఇందులో నెలసరి అద్దె చెల్లిస్తున్నప్పటికీ, రెన్యువల్ కాకపోవడంతో అనధికారంగా ఉన్నట్లు భావిస్తామని తెలిపారు. జివిఎంసి ఆదాయాన్ని పెంచేందుకు మూడు సంవత్సరాలు లీజు దాటిన దుకాణాలను మరల వేలం నిర్వహిస్తామని, ఇంతకాలం అద్దె చెల్లించని లీజుదారుల నుండి రెవెన్యూ రికవరీ యాక్ట్ ను ఉపయోగించి అద్దె వసూలు చేస్తామని, ఈ చర్యల వలన గుత్తలను క్రమబద్దీకరణ చేయడమే కాకుండా, జివిఎంసికి ఆదాయం వస్తుందని, కావున జివిఎంసి తీసుకున్న చర్యలకు గుత్తేదారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరూ సహకరించాలని కమిషనర్ ఆప్రకటనలో కోరారు.