4.6 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత..


Ens Balu
5
Kathipudi
2021-08-07 14:15:22

శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 4.6 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు దాడి చేసి  పట్టుకున్నారని పెద్దాపురం డివిజన్ అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ ప్రసాద్ తెలిపారు. శనివారం ముందుగా అందిన సమాచారం మేరకు సివిల్ సప్లైస్ అధికారులతో తనిఖీలు నిర్వహించగా కత్తిపూడి గ్రామంలో ఒక ఇంటిలో  మల్లిపాముల బాబ్జి అనే వ్యక్తి   అక్రమ రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచడాన్ని కనుగొన్నామని ఏఎస్ ఓ తెలిపారు. వీటిని సీజ్ చేసి అతనిపై 6 ఏ కేసు నమోదుచేసినట్టు అధికారులు వివరించారు. అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం విలువ రూ.92 వేలు గా నిర్ధారించామన్నారు. ఈ బియ్యాన్ని సీల్ చేసి  దగ్గర్లో ఉన్న ఎంఎస్ ఓ పాయింట్ కి తరలించినట్టు వివరించారు.ఈ దాడులలో డివిజనల్ అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ ప్రసాద్, తుని , శంఖవరం, జగ్గంపేట సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దార్ లు రామారావు ,ఇస్మాయిల్, కృష్ణ  పాల్గొన్నారు.