అయ్యన్నపై వన్ టౌన్ స్టేషన్ లో కేసు నమోదు..


Ens Balu
3
One Town
2021-09-18 08:17:49

ఏపీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర హోం మంత్రి, దళిత మహిళా నాయకురాలైన మేకతోటి సుచరిత పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టిడిపి నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు విశాఖలోని పైవన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు దాఖలైంది. శనివారం ఈ మేరకు  విశాఖ జిల్లా గ్రంథాలయ చైర్మన్ పర్సన్ కొండా రమాదేవి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ లు ఈ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శుక్రవారం గుంటూరులో జరిగిన ఒక సభలో చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ  సీఎంపైనా, హోమంత్రిపైనా అసభ్యపదజాలంతో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్నారు. దిశా చట్టం పై తప్పుడు ప్రచారాలతో ప్రజలని తప్పుదోవ పట్టిస్తూ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారని ఆరోపించారు. ఆ కారణాలపైనే చింతకాయల అయ్యన్నపాత్రుడు పైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కందుల నాగరాజు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ డైరెక్టర్ కాకి పద్మ , 39వ వార్డు ఇంఛార్జి కొల్లి సింహాచలం, వార్డు అధ్యక్షుడు సురాడ తాతారావు, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి అలమండ్ విజయ్, 36 వ వార్డు అధ్యక్షుడు కోరుకొండ సూర్యప్రసద్, సిటిమోటర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.